మొన్నటి విశ్వవసు నామ సంవత్సర ఉగాది పంచాంగం చదువుతుండగా ఆ పండితుడు చెప్పిందేంటంటే జగన్ కి స్త్రీ మూలక సమస్యలు ఎక్కువగా వస్తాయని. ఆ సరికే ఆయన తన తల్లి చెల్లితో పీక లోతు పోరాటం చేస్తున్నారు. కేసులు గట్రా వ్యవహారాలు నడుస్తున్నాయ్. ఇదే అతి పెద్ద గండం అనుకుంటే ఆయన ఇంటా బయటా కూడా స్త్రీ మూలక సమస్యలను ఎదుర్కుంటున్నట్టుగానే చెప్పాల్సి ఉంటుంది. మొన్నటికి మొన్న వల్లభనేని వంశీ కారణంగా భువనేశ్వరి మాతను అనరాని మాటలని.. ఆపై అది పార్టీకి అతి పెద్ద చేటు తెచ్చిన అంశంగా తయారైంది.
కట్ చేస్తే నేడు ప్రసన్నకుమార్ రెడ్డి అనే ఈ కోవూరు మాజీ ఎమ్మెల్యే తన నియోజకవర్గానికి ప్రస్తుతం ఎమ్మెల్యేగా ఉన్న ప్రశాంతిరెడ్డిని కూడా సరిగ్గా ఇలాంటి మాటలే అని పార్టీకి మమూలు చెడ్డ పేరు తేలేదు. బేసిగ్గా జగన్ తన పథకాలన్నిటిలోనూ మహిళలే ప్రధానంగా ఉండాలని భావించే రకం. ఎందుకంటే మగాళ్ల మూడు, ఓటు ఏ క్షణం ఎలా టర్న్ అవుతుందో తెలీదు. అదే మహిళలు అలాక్కాదు. వారి ఓటు- రూటూ అంతా స్ట్రయిట్ గా ఉంటాయని ఆయన నమ్మకం. అందుకే తన ఇంటి నుంచి తల్లి, చెల్లి దూరమైనా సరే, రాష్ట్రంలో ఇంటింటా ఉన్న మహిళలనే తన తల్లి , చెల్లిగా భావించారాయన.
సరిగ్గా అదే సమయంలో కన్న తల్లి, తోడబుట్టిన చెల్లితో పాటు.. తనకు సోదరి వరస అయ్యే వైయస్ సునీత నుంచి కూడా తీవ్రమైన వ్యతిరేకత ఎదుర్కుంటున్నారు జగన్. అంతే కాదు.. ఇటీవల మాజీ మంత్రి, వైసీపీ మహిళా నేత విడదల రజనీ సైతం జగన్ అంటే వ్యతిరేకత వ్యక్తబరుస్తున్నట్టు కనిపిస్తోంది. తనపై ఇన్ని కేసులు నమోదవుతుంటే పార్టీ నుంచి కనీస మద్ధతు లేదని రజనీ వాపోతున్నట్టు సమాచారం. దీంతో ఆమె జగనన్నను తెగ తిట్టుకుంటున్నట్టు తెలుస్తోంది. ఇక మరో మాజీ మంత్రి రోజా లోలోన ఎన్ని రాజకీయపు ఎత్తుగడలు వేస్తున్నారో ఆ వెంకన్నకే ఎరుక అంటున్నారు. నగరి వైసీపీలోకి గాలి సోదరుడ్ని సాదరంగా ఆహ్వాస్తుండటంతో.. పైకి నవ్వుల మేకప్పు వేసుకున్నా.. లోలోన జగనన్నను తుక్కు తుక్కుగా తిట్టుకుంటున్నారట సదరు మహిళా నేత రోజా సెల్వమణి.
దీంతో జగన్ కి ఎటు చూసినా జడ గండం తప్పేలా లేదని అంటున్నారు. వైసీపీ లీడర్లలో దాదాపు సగానికి సగం మంది మహిళలంటే ఎంత మాత్రం గౌరవం లేని బాపతు. గంజాయి, మద్య సేవనంలో ఆరి తేరిన నిష్ణాతులు కావడం వల్ల.. వారికీ సెన్సిబిలిటీ తెలీక పోవడం వల్ల.. మహిళలపై అకారణంగా నోరు పారేసుకోవడంతో.. జగన్ పని ఇక్కడ తథిగిణతోం అయిపోతోందట.
మొన్న ఎన్నికల ముందు వంశీ చేసిన మహిళా వ్యతిరేక ప్రేలాపనలు ఎంత చేటు తెచ్చాయో.. తెలిసి కూడా ప్రసన్నకుమార్ రెడ్డి అనే ఈ నేత మరోమారు మహిళపై చేసిన కామెంట్లు ప్రస్తుతం జగన్ పార్టీని మరో పతనానికి కారణమయ్యేలా చేస్తున్నాయంటున్నారు. ఇప్పటికే ఒక మహిళను అన్న పాపానికి 11 కి పరిమితమైంది జగన్ పార్టీ. వచ్చే రోజుల్లో ఇదే ఫ్లో కంటిన్యూ అయితే ఆ పక్కనున్న ఒకటి కూడా మాయమవుతుందేమో అన్న టాక్ స్టేట్ వైడ్ గా స్ప్రెడ్ అవుతోంది.
By Teluguone
en-us
Political News
http://www.teluguone.com/news/content/danger-from-women-to-jagan-party-39-201613.html
రేవంత్ ని అంచెలంచెలుగా ఎదిగేలా చేసి ఎంపీగా, ఆ తర్వాత సీఎంగా అవ్వడానికి దారి తీసింది. ఎవరిని ఎమ్మెల్సీ చేయాలని ఆనాడు రేవంత్ భావించారో, అదే వేం నరేందర్ రెడ్డి.. నేడు ఆయన రాజకీయ సలహాదారుగా క్యాబినేట్ ర్యాంకులో ఉంటూనే.. ఇప్పుడు పెద్దల సభలోకి సగర్వంగా అడుగు పెడుతున్నారు.
సీట్ల సర్దుబాటుపై డీఎంకే అధ్యక్షుడు ఎంకే స్టాలిన్తో కాంగ్రెస్ అధ్యక్షుడు మల్లికార్జున్ ఖర్గే ఫోనులో మాట్లాడినట్టు తెలిసింది. తమిళనాడులో 234 అసెంబ్లీ స్థానాలు ఉండగా, డీఎంకేతో కూటిమిలో భాగంగా 30 సీట్లకు తగ్గేది లేదని కాంగ్రెస్ ఇంత వరకూ పట్టుబడుతూ వచ్చింది. దీంతో సీట్ల పంపకాలపై పరిష్కారానికి డీఎంకేతో సంప్రదింపులు జరిపే బాధ్యతను కాంగ్రెస్ సీనియర్ నేత పి.చిదంబరానికి పార్టీ అధిష్ఠానం అప్పగించింది.
హైదరాబాద్, సైబరాబాద్, మల్కాజిగిరి పోలీసు కమిషనరేట్ల పునర్వ్యవస్థీకరణతో పాటు కొత్తగా ఫ్యూచర్ సిటీ కమిషనరేట్ ఏర్పాటు చేసిన విషయాన్నికేంద్ర హోంమంత్రికి వివరించిన సీఎం రేవంత్.. వేగంగా పెరుగుతున్న జనాభా, పట్టణ విస్తరణ, పరిశ్రమల వృద్ధి దృష్ట్యా రాష్ట్రానికి మరిన్ని ఐపీఎస్ అధికారుల అవసరం ఉందని, తెలంగాణ ఐపీఎస్ క్యాడర్ సంఖ్యను పెంచాలని కోరారు.
సంక్రాంతి సంబరాలు నుంచి ఏ కార్యక్రమం చేపట్టినా ఈ రెండు వర్గాల మధ్యా పోటీ కొనసాగుతున్నది. సీతం రాజు సుధాకర్ ఇందిరా ప్రియదర్శిని స్టేడియం వద్ద ముగ్గుల పోటీ నిర్వహిస్తే.. సిట్టింగ్ ఎమ్మెల్యే వంశీకృష్ణ శ్రీనివాస్ కనకమాలక్ష్మి ఆలయం వద్ద ముగ్గుల పోటీ నిర్వహించారు. ఇది ఒక్కటే కాదు, కార్పొరేషన్ పదవుల విషయంలో కూడా తలో దిక్కు అడుగులు వేస్తున్నారు.
కొద్దికాలం కిందట శరద్ పవార్ తాను రాజ్యసభకు పోటీ చేసే ప్రశక్తే లేదని ప్రకటించారు. అయితే ఇటీవల ఆయన అన్న కొడుకు, ఉప ముఖ్యమంత్రి అజిత్ పవార్ మరణించడంతో మనసు మార్చుకున్నట్లు చెబుతున్నారు. మహారాష్ట్ర అసెంబ్లీలో మొత్తం 288 స్థానాలు ఉండగా, ఒక రాజ్యసభ సీటు గెలవాలంటే 37 మంది ఎమ్మెల్యేల ఓట్లు అవసరం.
తెలంగాణలో ఖాళీగా ఉన్న రెండు రాజ్యసభ స్థానాలకు కాంగ్రెస్ పార్టీ తమ అభ్యర్థులను అధికారికంగా ప్రకటించింది.
తెలుగువన్ వాస్తవ వేదికలో ప్రస్తుత ప్రపంచ రాజకీయ పరిణామాలపై ఆసక్తికర చర్చ జరిగింది.
ఎన్టీఆర్ జిల్లా గంపలగూడెం మండలం నెమలి వేణుగోపాలస్వామి వారి కళ్యాణోత్సవం సందర్భంగా సోమవారం (మార్చి 2) దేవుడికి సమర్పించే పట్టువస్త్రాలను సమర్పించే విషయంలో కొలికపూడి దురుసుగా వ్యవహరించారు.
నెమలి వేణుగోపాలస్వామి వారి బ్రహ్మోత్సవాల్లో భాగంగా నిర్వహించిన కల్యాణోత్సవానికి ఎంపీ కేశినేని చిన్ని, ఎమ్మెల్యే కొలికపూడి శ్రీనివాసరావులు కుటుంబాలతో కలిసి హాజరయ్యారు. ఆలయ మర్యాదల ప్రకారం, ప్రోటోకాల్ అనుసరించి అధికారులు స్వామివారికి సమర్పించే పట్టువస్త్రాలను ఎంపీ కేశినేని చిన్ని చేతికి అందించారు.
వాస్తవానికి మల్లు భట్టి విక్రమార్క్ జగన్ ను తన కుమారుడి వివాహానికి జనగ్ ను బెంగళూరు వెళ్లి ఆహ్వానించాల్సి ఉంది. అయితే జగన్ స్వయంగా తాను మంగళవారం తాడేపల్లి వస్తాననీ, అప్పుడు ఆహ్వానిస్తే సరిపోతుందనీ కబురు పంపారు.
ఐదుగురు వైసీపీ ఎమ్మెల్సీలు తమ సభ్యత్వానికి రాజీనామా చేశారు. అయితే మండలి సభ్యత్వానికి వారు చేసిన రాజీనామాలను చైర్మన్ ఇప్పటి వరకూ ఆమోదించలేదు.
మంత్రివర్గ విస్తరణ మాత్రమే అంటే కేబినెట్ లోకి ఒకరిని మాత్రమే తీసుకునే అవకాశం ఉంది. అలా కాకుండా.. రాష్ట్రంలో తెలుగుదేశం కూటమి సర్కార్ కొలువుదీరి రెండేళ్లు కావస్తున్నందున మంత్రివర్గంలో సమూల మార్పులు చేసే దిశగా చంద్రబాబు యోచిస్తున్నట్లు చెబుతున్నారు. తన కేబినెట్ నుంచి కొందరికి ఉద్వాసన పలికి కొత్తవారికి అవకాశం ఇవ్వాలన్న దిశగా చంద్రబాబు యోచిస్తున్నట్లు చెబుతున్నారు.
రాజ్యసభ ఎన్నికలకు 9 మంది అభ్యర్థుల జాబితాను భారతీయ జనతా పార్టీ ప్రకటించింది.
స్వామివారికి సమర్పించే పట్టువస్త్రాలను ఆలయ పురోహితులు ఎంపీ చిన్ని దంపతులకు అందజేశారు. అయితే, తనకు కూడా వస్త్రాలు ఇవ్వాలని ఎమ్మెల్యే పట్టుబట్టారు. అయితే ప్రొటోకాల్ ప్రకారం ఒకరికే ఇస్తారని చెప్పిన ఆలయ అధికారులు, ఆయనకు తలంబ్రాలు అందించారు. దీంతో తీవ్ర అసంతృప్తికి గురైన ఎమ్మెల్యే కొలికపూడి, ఎంపీ చేతిలోని పట్టువస్త్రాలను బలవంతంగా లాక్కుని తన తలపై పెట్టుకున్నారు.