డామిట్ ..భారాస ముహూర్తం అడ్డం తిరిగిందా ?

Publish Date:Oct 18, 2022

Advertisement

తెలంగాణ ముఖ్యమంత్రి కల్వకుంట్ల చంద్రశేఖర రావుకు దేవుడంటే భయం, భక్తి  కొంచెం ఎక్కువే. నిజానికి ఆయనే చెప్పుకున్నట్లుగా ఆయన చేసినన్ని యజ్ఞాలు, యాగాలు మరో రాజకీయ నాయకుడు ఎవరూ చేసి ఉండరు. అలాగే, ముహూర్తాలు, శకునాల విషయంలోనూ ఆయనకు గట్టి  విశ్వాసం ఉందని అంటారు. అందుకే మంచి చెడులు చూసుకోకుండా ఆయన ఏ నిర్ణయం తీసుకోరు. ఒక్క చిన్న అడుగు కూడా ముందుకు వేయరు. తెలంగాణ రాష్ట్ర సమితి (తెరాస) పేరును భారత రాష్ట్ర సమితి (భారాస)గా మార్చేందుకు  కూడా  ఆయన సుముహుర్తం చూసుకున్నారు. దసరా పండగ రోజు మధ్యాహ్నం ఒంటిగంట 19 నిమిషాలకు పేరు మార్పు పత్రాలపై సంతకం చేశారు. 

అయితే, అంతగా ముహూర్తం చూసుకుని మరీ  పేరు మార్చినా అనుకున్నదేదీ జరగడం లేదు. ఫలితం కనిపించడం లేదు. ఆ రోజు నుంచి ఈ రోజు వరకు  మరో అడుగు ముందుకు పడలేదు. కేసేఆర్ సంతకం చేసిన పత్రాలను పార్టీ నాయకులు కేంద్ర ఎన్నికల సంఘానికి ఆగమేఘాల మీద అందచేశారు. కానీ, పత్రాలు అందుకుని పది రోజులు పైనే అవుతున్నా  అటు నుంచి ఎలాంటి స్పందన లేదు. దీంతో మునుగోడు నుంచే భారాస,జాతీయ‘జైత్ర’యాత్రకు శ్రీకారం చుట్టాలనే కేసీఆర్ సంకల్పం నెరవేరలేదు .తొలి అడుగులోనే అపశకునం ఎదురైందా అనుమానాలు వ్యక్తమవుతున్నాయి. బారాసాకు ఆదిలోనే హంసపాదు పడిందా అన్న సందేహాలూ వ్యక్తమౌతున్నాయి. మునుగోడు ఉప ఎన్నికలలో గులాబీ పార్టీ అభ్యర్ధి కూసుకుట్ల ప్రభాకర రెడ్డి  తెరాస బీ ఫారం మీదనే నామినేషన్ వేయక తప్పలేదు. ఎంత త్వరగా వీలైతే అంట త్వరగా  తెలంగాణ పేరును వదిలించుకోవాలని కేసీఆర్ తొందరపడుతున్నా  తెలంగాణ మాత్రం ఆయన్ని వదలడం లేదు. 

అదలా ఉంటే  కొందరు జ్యోతిష శాస్త్ర పండితులు  భారాస ముహూర్త ఫలంతో పాటుగా  కేసేఆర్ జాతక ఫలం జాతీయ రాజకీయాలకు ఏమాత్రం అనుకూలంగా లేదని అంటున్నారు. నిజానికి, జూన్ 29 నుచి, నవంబర్ చివరకు ఉన్న శుక్ర మౌఢ్యం (మూఢమి) కాలం  నూతన కార్యం తలపెట్టేందుకు ఎవరికీ, ఏ మాత్రం మంచి కాదని  కేసేఆర్ జాతక చక్రం ప్రకారం చూస్తే అసలే పనికి రాదని  దత్త పీఠం జ్యోతిష పండితులు దామోదర శర్మ వంటి కొందరు పండితులు, ముందు నుంచి హెచ్చరిస్తూనే ఉన్నారు. అంతే కాకుండా  కాదు కూడదని, కేసేఆర్ అదే ముహూర్తానికి తెరాస పేరును బీఆర్ఎస్ గా మారిస్తే ఫలితాలు ప్రతికూలం కావడమే కాకుండా, కేసేఆర్ కుటుంబం మొత్తం కూడా సమస్యలు ఎదుర్కొనక తప్పదని ముందుగానే  చెప్పారు.

ఇప్పుడిక జరుగతున్న పరిణామాలను గమనిస్తే, పండితుల జ్యోస్యం నిజమవుతున్నట్లే ఉందని పార్టీలో ఫామిలీలో చర్చ మొదలైందని అంటున్నారు. మునుగోడు ఉప ఎన్నిక విషయం ఎలా ఉన్నా  ఢిల్లీలో చోటు చేసుకుంటున్న పరిణామాలు కేసీఆర్ ను సైతం కలవరపాటుకు గురి చేస్తున్నాయని అంటున్నారు. ఓ వంక తెరాస పేరును భారాసగా మార్చడం ఇప్పట్లో అయ్యే పనికాదని అర్థమైపోయింది. మునుగోడు సహా మరి కొన్ని రాష్ట్రాలలో ఉప ఎన్నికలు ఆ వెంటనే హిమాచల్ ప్రదేశ్, గుజరాత్ అసెంబ్లీ ఎన్నికలు ఒక దాని వెంట ఒకటి లైన్లో ఉన్న నేపథ్యంలో  మరో మూడు నెలల వరకు కేంద్ర ఎన్నికల సంఘం తెరాస పేరు మార్పు వ్యవహారాన్ని పట్టించుకునే పరిస్థతి లేదని అంటున్నారు. అదీ గాక, పేరు మార్పు పై నిర్ణయం తీసుకోవాలంటే ముగ్గురు కమిషనర్ల ఫుల్ బెంచ్ సమావేశం కావాల్సి ఉంటుంది. ప్రస్తుతం ఒక కమిషనర్ పోస్టు ఖాళీగా ఉంది.

కేంద్ర ప్రభుత్వం ఆ పోస్టును ఎప్పుడు భర్తీ చేస్తుందో ఎవరికీ తెలియదు. సో తెరాస పేరు భారాసగా ఎప్పుడు మారుతుందో  చెప్పలేమని కమిషన్ వర్గాలు చెపుతున్నాయి. పేరు మార్పు  ప్రక్రియ మొదలైన తర్వాత, ఇతరులు ఎవరైనా అదే పేరు కోసం దరఖాస్తు చేసుకుని ఉన్నా  ఇతరత్రా అభ్యంతరాలు వచ్చిన మళ్ళీ కథ మొదటికి వస్తున్నదని అంటున్నారు. చివరకు కమిషన్ తెరాస అభ్యర్ధనను తిరస్కరించినా తిరస్కరించవచ్చని అంటున్నారు. 

ఇవన్నీ ఒకెత్తు అయితే ఢిల్లీ  లిక్కర్ కుంభ కోణం విచారణ ఎప్పుడు ఏ మలుపు తిరిగుతుందో అనే భయం ఒకటి కేసీఆర్ ను వెంటాడు తోందని అంటున్నారు. ఢిల్లీ లిక్కర్ కుంభకోణంలో కేసీఆర్ కుమార్తె కవిత ఆరోపణలు ఎదుర్కుంటున్నారు. ఒకప్పుడు కవిత వ్యక్తిగత కార్యదర్శిగా పనిచేసినట్లు చెపుతున్న బోయినపల్లి అభిషేక్ ను సిబిఐ అరెస్ట్ చేయడంతో సిబిఐ నెక్స్ట్ టార్గెట్ కవిత కావచ్చని ప్రచారం జరుగుతోంది. ఈ నేపధ్యంలోనే ముఖ్యమంత్రి కేసీఆర్ వారం రోజులకు పైగా ఢిల్లీలో మకాం వేసి కుమార్తె కవితను, సేఫ్ గా బయట పడేసేందుకు ప్రయత్నాలు సాగిస్తున్నారని అంటున్నారు. మరో వంక, జ్యోతిష పండితులు చెప్పినట్లుగా ఇటు పార్టీలో, అటు ఫ్యామిలీలో కూడా అంతర్గత కుమ్ములాటలు పతాక స్థాయికి చేరుకున్నట్లు తెలుస్తోంది.

దీంతో  తెరాసలో గుబులు మొదలైందని అంటున్నారు. అలాగే ముందు ముందు తెరాసలో పెను మార్పులు తప్పవనీ అంటున్నారు. అది భారాస నామకరణ ముహూర్త బలమో మరొకటో కానీ  కేసీఆర్ జాతీయ రాజకీయాలు, అసలుకే మోసం తెచ్చేలా ఉన్నాయని అయితే పార్టీ సీనియర్ నాయకులు సైతం ఆందోళన చెందుతున్నారు. ఇటు పార్టీలో, అటు ఫ్యామిలీలో చోటుచేసుకుంటున్న పరిణామాలు కేసీఆర్ చేయి దాటి పోయాయని, ఒక విధంగా  కొండ నాలుకకు మందేస్తే ఉన్న నాలుక ఊడి పడింది అన్నట్లుగా, పరిస్థితులు విషమిస్తున్నాయని పార్టీ నాయకులే అంటున్నారు. అయితే కేసీఆర్ ఏదో చేసి పార్టీని రక్షిస్తారనే విశ్వాసం అయితే ఇంకా మిగిలే ఉందని అంటున్నారు.

By
en-us Political News

  
శాస్త్ర సాంకేతికంగా దేశం అభివృద్ధి చెందడానికి కారణం ఇందిరా గాంధీ, రాజీవ్ గాంధీలేనని టీపీసీసీ చీఫ్ మహేశ్ కుమార్ గౌడ్ అన్నారు.
ఉపాధి హామీ పేరు మార్పుపై రేపు గ్రామ గ్రామాన గాంధీ చిత్రపటాలతో కాంగ్రెస్ నిరసన తెలుపుతున్నట్లు ప్రకటించారు
ప్రస్తుతం రేవంత్ కేబినెట్ లో రెండు ఖాళీలు మాత్రమే ఉన్నాయి. అయితే ఆ రెండు బెర్తులకు తీవ్ర పోటీ ఉంది. కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి, మల్ రెడ్డి రంగారెడ్డి, ఆది శ్రీనివాస్, బాలూనాయక్ ల పేర్లు ప్రముఖంగా వినిపిస్తున్నాయి. వీరిలో గత ఏడాది కాలంగా కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి, మల్ రెడ్డి రంగారెడ్డిలు బహిరంగంగానే తమకు మంత్రిపదవి ఖాయమన్న ప్రకటనలు చేస్తున్నారు. కొండొకచో.. ఎలాంటి దాపరికం లేకుండా తమ అసంతృప్తినీ వ్యక్తం చేస్తున్నారు.
తనను డిప్యూటీ స్పీకర్ పదవి నుంచి తొలగించాలని డిమాండ్ చేయడంపై రఘురామకృష్ణం రాజు మండిపడ్డారు. రాజ్యాంగ పదవిలో ఉన్నందున మౌనంగా ఉన్నానన్న ఆయన.. 11 కేసులున్న వ్యక్తి ముఖ్యమంత్రిగా చేయలేదా? అని ప్రశ్నించారు.
ఇప్పటికే తనను వైసీపీ నుంచి బహిష్కరించారనీ, ఇప్పుడు భౌతికంగా లేకుండా చేయడానికి ప్రయత్నిస్తున్నారంటూ ఆరోపణలు గుప్పించారు.దీన్నంతా ఓ వీడియోగా తీసి సోషల్ మీడియాలో పోస్టు చేశారు.
పరీక్షలకు ఎటువంటి ఆటంకం లేకుండా, అంతకు ముందుగానే మునిసిపల్ ఎన్నికల ప్రక్రయను పూర్తి చేసే ఉద్దేశంతో ముందుకు సాగుతున్నది. ఈ నేపథ్యంలోనే వచ్చే ఏడాది జనవరి మూడో వారం నాటికి ఎన్నికల నిర్వహణకు సంబంధించి అన్ని ఏర్పాట్లు పూర్తి చేసుకోవాలని ఇప్పటికే రేవంత్ సర్కర్ రాష్ట్ర ఎన్నికల కమిషన్ కు సూచించినట్లు విశ్వసనీయంగా తెలిసింది.
ఈ విచారణలో కీలక అంశాలను రాబట్టినట్లు విశ్వసనీయ సమాచారం. ఆరా మస్తాన్ కు పోలీసులు ఇప్పటికే రెండు సార్లు విచారించారు. తాజాగా సిట్ విచారణలో అధికారులు ఆయన గతంలో ఇచ్చిన వాంగ్మూలాల కన్ఫర్మేషన్ కోసం ప్రశ్నించినట్లు తెలుస్తోంది...
ఈ సమావేశాల్లో ప్రాజెక్టులు, నీటి కేటాయింపులు, రాష్ట్ర విభజన తర్వాత ప్రాజెక్టులపై చేసిన వ్యయం తదితర అంశాలపై అధికార, విపక్షాల మధ్య వాడీ వేడి చర్చ జరిగే అవకాశం ఉందంటున్నారు. ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి కూడా ఈ అంశాలపైనే సభలో విస్తృత చర్చ జరగాలని అన్న సంగతి తెలిసిందే.
కేసీఆర్ పేరు చెప్పుకుని కేటీఆర్ బతుకుతున్నారు అన్న సీఎం రేవంత్‌రెడ్డి వ్యాఖ్యలకు కేటీఆర్ కౌంటర్ ఇచ్చారు.
ఈ సారి తెలంగాణ అసెంబ్లీ సమావేశాలు వాడీ వేడిగా సాగే అవకాశాలు కనిపిస్తున్నాయి. ఇటీవల కేసీఆర్ మీడియా సమావేశంలో సీఎం రేవంత్ రెడ్డిపైనా, కాంగ్రెస్ ప్రభుత్వంపైనా విమర్శలు గుప్పించడం, అందుకు దీటుగా రేవంత్ కూడా ప్రతి విమర్శలు చేసిన సంగతి తెలిసిందే. ఈ నేపథ్యంలోనే అసెంబ్లీ వేదికగా అధికార, ప్రతిపక్షాల మధ్య వాడీ వేడి చర్చ జరుగుతుందని పరిశీలకులు విశ్లేషిస్తున్నారు.
రేవంత్ కేటీఆర్ పై చేసిన విమర్శలు జగన్ కు కూడా వర్తిస్తాయంటూ నెటిజనులు వ్యాఖ్యానిస్తున్నారు. రేవంత్ విమర్శలు అటు కేటీఆర్, ఇటు జగన్ లకు దిమ్మదిరిగేలా చేశాయని అంటున్నారు.
ఐటీ రంగం సాధించబోయే అభివృద్ధిని, సాంకేతికత ఆధారంగా సంక్షేమ, అభివృద్ధి పథకాలను ఆయన రెండు దశాబ్దాల కిందటే రూపొందించారు. ఆయన విజన్ ఫలితమే ఇప్పుడు ప్రపంచ వ్యాప్తంగా తెలుగు యువత ఐటీ రంగంలో దూసుకుపోతున్నది. ఆ కారణంగానే చంద్రబాబును దేశం విజనరీ నేతగా గుర్తించింది.
వాజ్ పేయి తొలిసారి ఒక నాన్ కాంగ్రెస్ ప్రధానిగా ఐదేళ్లు కాంగ్రెస్సేతర ప్రభుత్వాన్ని నడిపి చరిత్ర సృష్టిస్తే.. పీవీ నాన్ గాంధీ కాంగ్రెస్ అధ్యక్షుడిగా, ప్రధానిగా ఐదేళ్లు మైనారిటీ ప్రభుత్వాన్ని విజయవంతంగా నడిపి ఏలి రికార్డు సృష్టించారు.
 
Disclaimer:
All content included on this TeluguOne.com Portal including text, graphics, images, videos and audio clips, is the property of ObjectOne Information Systems Ltd. or our associates, and protected by copyright laws. The collection, arrangement and assembly of all content on this portal/ related channels is the exclusive property of ObjectOne Information Systems Ltd. or our associates and protected copyright laws.
 
You may not copy, reproduce, distribute, publish, display, perform, modify, create derivative works, transmit, or in any other way exploit any part of copyrighted material without permission from ObjectOne Information Systems Ltd or our associates.