అస్తులు కోట్లలో,వాహనమే సున్నా
Publish Date:Oct 25, 2011
Advertisement
హైదరాబాద్: పిసిసి మాజీ అధ్యక్షుడు డి.శ్రీనివాస్కు కోట్ల రూపాయల్లో ఆస్తులున్నాయి.అయితే,తనకు గానీ తన భార్యకు గానీ వాహనం కూడా లేదని డిఎస్ చెప్పారు. ఎమ్మెల్సీ సీటుకు నామినేషన్ వేసిన డి. శ్రీనివాస్ తన ఆస్తుల వివరాలను వెల్లడించారు. తనకు గానీ తన భార్యకు గానీ వాహనం లేదని, రుణాలు కూడా లేవని ఆయన తన ఎన్నికల అఫిడవిట్లో స్పష్టం చేశారు. రెండు బ్యాంకు ఖాతాల్లో రూ. 10.52 లక్షల రూపాయలు ఉన్నట్లు ఆయన తెలిపారు. రూ. 48,96,000 విలువ చేసే బాండ్స్, డిబెంచర్స్ ఉన్నాయి. రూ. 8,30,000 విలువ చేసే బంగారం ఉంది.డిఎస్కు షంషాబాద్లో ముచెంతలలో 3 ఎకరాల భూమి ఉంది. దాని విలు రూ. 21 లక్షలు ఉంటుంది. మరో మూడు ఎకరాల భూమి నిజామాబాదులో ఉంది. వెంకటేశ్వర హౌసింగ్ సొసైటీలో 250 చదరవు గజాల స్థలం ఉంది. దాని విలువ రూ. 2,50,000. నిజామాబాద్ జిల్లా డిచ్పల్లిలో ఓ ఇల్లు ఉంది. దాని ఖరీదు రూ. 2.9 కోట్లు ఉంటుంది. గచ్చిబౌలిలో 1.86 కోట్ల రూపాయల విలువ చేసే ఇల్లు నిర్మాణంలో ఉంది. అందులోని ఫర్నీచర్ విలువ రూ. 3 లక్షలు ఉంటుంది.
డిఎస్ సతీమణికి వేర్హౌసింగ్ కంపెనీలో రూ.3.8 కోట్ల విలువ చేసే ఈక్విటీ వాటా ఉంది. షంషాబాద్ సమీపంలోని ముచెంతలలో మూడు ఎకరాల స్థలం ఉంది. మేడ్చెల్లో 14 ఎకరాల భూమి ఉంది. ఆమె వద్ద 16 లక్షల రూపాయల విలువ చేసే బంగారం ఉంది. నిజామాబాద్లోని ప్రగతినగర్లో రూ.70 లక్షల విలువ చేసే ఇల్లు ఉంది. నిజాంపేటలో రూ.25 లక్షల ఖరీదు చేసే మరో ఇల్లు ఉంది. టోలీచౌక్లో 30 లక్షల రూపాయల విలువ చేసే స్థలం, హైదరాబాదులోని హైదర్నగర్లో రూ.40 లక్షల విలువ చేసే స్థలం ఉన్నాయి. ఆమె పేర రూ. 3 లక్షల విలువ చేసే ఫర్నీచర్ ఉంది.
http://www.teluguone.com/news/content/d-24-7890.html
సుబ్రతో రాయ్ అరెస్ట్ ...
ఖరారైన రాష్ట్రపతి పాలన ...
రాష్ట్రపతి పాలనకే మొగ్గు ...
విఫలమైన 'టి' కాంగ్రెస్
చంద్రబాబు పాదయాత్ర ఈ నెల 31న పునఃప్రారంభ౦ కానుంది. ఫిబ్రవరి నాల్గోతేదీ వరకు విజయవాడలో కోనసాగనుంది. ఆరోగ్య కారణాల రీత్యా చంద్రబాబు 29, 30లలో కూడా విశ్రాంతి తీసుకోనున్నారని తెలుగుదేశం నాయకులు ప్రకటించారు.
తెలంగాణ కాంగ్రెస్ ఎంపీలు కేకే నివాసంలో భేటి అయ్యారు. తెలంగాణపై పార్టీ అధిష్టానం వైఖరిని వ్యతిరేకిస్తూ పార్టీ సభ్యత్వానికి, పదవులకు కూడా రాజీనామా చేసి అధిష్టానం పై ఒత్తిడి పెంచేందుకు రంగం సిద్దం చేస్తున్నారు. రాజీనామా లేఖలను పార్టీ అధ్యక్షురాలు శ్రీమతి సోనియా గాంధి పంపించనున్నారు. భేటి అనంతరం లేఖలను మీడియాకు విడుదల చేయనున్నారు.
తెలుగు సినీ ప్రియులను తన అందచందాలతో, అసమానమయిన నటనతో ఒక ఊపుఊపిన అందాల తార జయప్రద, ఆ తరువాత బాలీవుడ్ లోను ఒక వెలుగు వెలిగింది. తెలుగుదేశంపార్టీలో జేరి రాష్ట్ర రాజకీయాలలో పాల్గొన్నపటికీ, చంద్రబాబుతో పొసగక ఏకంగా డిల్లీ రైలెక్కి ఉత్తర ప్రదేశ్ రాష్ట్రంలో వాలిపోయింది.
జానారెడ్డికి బుద్ది ,జ్ఞానం ఉందా? తెలంగాణ ప్రత్యేక రాష్ట్ర ఏర్పాటు మీద కాంగ్రెస్ ప్రకటన కోసం ఇంకా వేచిచూద్దాం అంటాడా. కాంగ్రెస్ ప్రకటనలో ఇంకా నిజాయితీ ఉందన్న జానారెడ్డి మాటలను తెలంగాణ ప్రజలు విశ్వసించరు. ముఖ్యమంత్రి పదవికోసం జానారెడ్డి గోతికాడ నక్కలా ఎదురు చూస్తున్నాడు.
వైయస్సార్ కాంగ్రెస్ చేపట్టిన కోటి సంతకాల సేకరణపై తెలుగుదేశం పార్టీ తీవ్ర విమర్శలు గుప్పించిన ఆరు నెలలకి ఇప్పుడు తాపీగా ఆ పార్టీ నేతలు స్పందించడం చూస్తుంటే ఆ పార్టీ నాయకత్వలోపం మరోసారి బయట పడుతోంది.
చంద్రబాబు తెలంగాణా జిల్లలో పాదయాత్ర చేస్తునంత కాలం తన వైయస్సార్ కాంగ్రెస్ పార్టీని, తన నాయకుడు జగన్ మోహన్ రెడ్డిని అయన ఎంత తీవ్రంగా విమర్శించినా స్పందించని కొడాలి నాని, చంద్రబాబు ఇప్పుడు తన కృష్ణా జిల్లాలో పాదయాత్ర చేస్తూ అదే విధంగా విమర్శలు చేసినప్పుడు మాత్రం వెంటనే స్పందించారు.
రాష్ట్ర రాజధానిలోఇందిరా పార్క్ వద్ద నేటి నుండి 36గంటల సమరదీక్షను నిర్వహించాలన్న పట్టుదలతో ఉన్న తెలంగాణా జేయేసీ నేతలు, పోలీసు ఆదేశాలను
నిర్విరామంగా సాగుతూ 117వ రోజుకు జేరుకొన్నచంద్రబాబు పాదయాత్ర ఈరోజు కృష్ణా జిల్లాలో పరిటాలకు చేరుకొంది. ముందు అనుకొన్న ప్రకారం అయితే ఈ రోజుతో ఆయన పాదయాత్ర ముగించాల్సి ఉంది. అయన కుటుంబ సభ్యులు, పార్టీ నేతలు మరియు వైద్యులు కూడా పాదయాత్ర ముగించమని కోరినప్పటికీ చంద్రబాబు తన పాదయాత్రను కొనసాగించడానికే నిశ్చయించుకొన్నారు.
తెలంగాణా జేయేసీ అద్వర్యంలో సికిందరాబాద్ లో ఇందిరా పార్క్ వద్ద 36గంటల సమరదీక్షకు అనుమతి కోరుతూ జేయేసీ నేతలు హోంమంత్రి సబితా ఇంద్రరెడ్డికి వినతిపత్రం సమర్పించగా, కొద్దిసేపటిలోనే వారికి అనుమతి నిరాకరిస్తున్నట్లు పోలీసుల నుండి వెంటనే లేఖ అందడంతో తెలంగాణావాదులు కిరణ్ కుమార్ రెడ్డి మీద, పోలీసుల మీద మండిపడ్డారు.





