మునుగోడును ముంచెత్త‌నున్న నోట్లు!

Publish Date:Aug 24, 2022

Advertisement

చిన్న ఊరు దాన్ని ప‌ట్టించుకోలేదు  ఓ కోటీశ్వ‌రుడు.. ఫ‌లితంగా  ఆయ‌న రాజ్యాన్ని ఆ ఊరువాళ్లే  దెబ్బ తీశారు. . ఇదో సినిమా లో భాగం. కానీ మునుగోడు వ్య‌వ‌హారం వేరు.  కోమ‌టిరెడ్డి రాజ‌గోపాల్ రెడ్డి  కాంగ్రెస్ పార్టీకి రాజీనామా చేయ‌డం, బీజేపీ నీడ‌లోకి వెళ్ల‌డంతో మునుగోడు పై రాజ‌కీయ‌పార్టీల దృష్టి ప‌డింది. ఇక్క‌డ కావడానికి ఉప ఎన్నిక‌లే కానీ రాబోయే సాధార‌ణ ఎన్నిక‌ల‌కు దీన్ని సెమీస్‌గా భావించి మ‌రీ  కాం గ్రెస్‌, టీఆర్ ఎస్‌, బీజేపీలు పోటీకి సిద్ధ‌ప‌డుతున్నాయి. ఉప ఎన్నికేగా అనుకోలేదు. ఇది సాధిస్తేనే  పార్టీ ప్ర‌తిష్ట రెండింత‌ల‌వుతుంద‌ని టీఆర్ ఎస్‌, కేసీఆర్  మీద ఆగ్ర‌హంతో ఎలాగ‌యినా మునుగోడు సాధించా ల‌న్న ప‌ట్టుద‌ల‌తో బీజేపీ, ఏది ఏమ‌యినా మునుగోడు మ‌నం సాధించి తీరాల్సిందేనని  కాంగ్రెస్ కంక‌ణం క‌ట్టుకుంది. అయితే  ఈ మూడు పార్టీలూ ప్ర‌జ‌ల్ని పోనీ ఓట‌ర్ల‌ను ఆక‌ట్టుకోవ‌డానికి చేయాల్సిన అన్ని ప్ర‌యత్నాల మీద ప్ర‌త్యేక దృష్టి సారిస్తున్నాయి. ఇందులో కీల‌క‌మైన‌ది ఓట‌ర్ల‌కు నోటు రుచి మ‌రింత చూప‌డం.

ఎన్నిక‌లంటేనే ఖ‌ర్చుతో కూడిన ప‌ని. ఇటీవ‌లి కాలంలో మ‌రింత పెరిగింది. పార్టీ త‌ర‌ఫు నిల‌బెట్టే అభ్య‌ర్ధి మంచివాడా, స‌మ‌ర్దుడా అన్న‌ది అవ‌త‌ల పెడితే ఆయ‌న పార్టీ త‌ర‌ఫున ఎన్నిక‌ల్లో ఎంత పెట్ట‌గ‌ల‌డు, ఓట్ల‌ను ఏమేర‌కు తూకానికి కొనేయ‌గ‌ల‌డ‌న్నదే ధ‌ర్మ‌సూత్రంగా అమ‌లుజ‌రుగుతోంది. అదే పంథాను అన్ని పార్టీల‌ వారూ అనుస‌రిస్తున్నారు. ఇది చాలాకాలం నుంచే ఉన్న ఎన్నిక‌ల సాంప్ర‌దా యం అంటున్నారు విశ్లేష‌కులు. దీనికి అడ్డుక‌ట్ట వేయ‌డం ఎవ‌రివ‌ల్లా కావ‌డం లేదు. పైగా ఖ‌ర్చుల‌తో కూడిన ఎన్నిక‌ల‌కు ఆ మాత్రం పెట్టాల్సి వ‌స్తుంద‌నే స‌మాధానాలే విన‌వ‌ల‌సి వ‌స్తుంది. 

చిత్ర‌మేమంటే, అభ్య‌ర్ధులు ఖ‌ర్చు పెట్ట‌గ‌లిగిన‌వార‌యితేనే వారికి పార్టీ ప్రాధాన్య‌త‌నీయ‌డం. అస‌లా అవ కాశ‌మే లేని బీసీ నేత‌ల‌కు పార్టీలు కేవ‌లం ప్ర‌చారానికి ఉప‌యోగ‌ప‌డే సేన‌గానే చూస్తున్నాయి. మంచి అభ్య‌ర్ధి, జ‌నంలో ప‌లుకుబ‌డి ఉన్న‌ప్ప‌టికీ, కాస్తంత గెలుస్తాడ‌న్న న‌మ్మ‌కం పార్టీకి ఉన్న‌ప్ప‌టికీ, ఎదుటి పార్టీ అభ్య‌ర్ధి, ఆయ‌న త‌ర‌ఫున ఆర్ధిక మ‌ద్ద‌తునిచ్చేవారి స‌త్తా అన్నీలెక్క‌లోకి వ‌స్తుంటాయి క‌నుక బీసీ నేత ల‌కు పార్టీలు ధైర్యం చేసి టికెట్ ఇవ్వ‌డ‌మే లేదు. 

మునుగోడు ఎమ్మెల్యే కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి తన పదవికి, కాంగ్రెస్ పార్టీకి రాజీనామా చేసి బీజేపీ నుంచి బరిలో దిగేందుకు సిద్ధమయ్యారు. దీంతో సిట్టింగ్ స్థానం దక్కించుకునేందుకు కాంగ్రెస్ పార్టీ సర్వ శక్తులు ఒడ్డాల్సిన పరిస్థితి వచ్చింది. విజ‌యం సాధించేందుకు మునుగోడులో కోట్లు కుమ్మ‌రిం చేందుకు పార్టీ వెనుకాడ‌టం లేదు. ప‌రిస్థితులు ఎలా ఉన్నా, కేసీఆర్‌ను భంగ‌ప‌రిచేందుకే బీజేపీ నిర్ణ‌యించుకుంది. అందుకు మునుగోడు విజ‌యం స‌ద‌వ‌కాశంగా క‌మ‌ల‌నాథులు భావిస్తున్నారు. క‌నుక ఖ‌ర్చుతో నిమిత్తం లేకుండా ప్ర‌చారాన్ని భారీగానే సాగించేందుకు సిద్ధ‌ప‌డింది బీజేపీ. ఎంత వ్య‌యం అవుతుంద‌నే  లెక్క‌ల కంటే ఎంత మెజారిటీ వ‌స్తుంద‌న్న ఆలోచ‌న‌కే ప్రాధాన్య‌త‌నీయ‌డం గ‌మ‌నార్హం. 

కాగా, ఎలాగైనా మునుగోడు స్థానాన్ని దక్కించుకొని వచ్చే ఎన్నికల్లో ఆధిపత్యం తమదేనని రుజువు చేసు కునేందుకు అధికార టీఆర్ఎస్ పార్టీ ఈ ఎన్నికను ప్రతిష్ఠాత్మకంగా తీసుకుంది. ఓడితే ముప్పు తప్పదని ఆ పార్టీ భావిస్తోంది. మునుగోడులో బీసీల ఓటింగ్ శాతం అధికంగా ఉన్న‌ప్ప‌టికీ ఉప ఎన్నిక‌లో గెల‌వ‌డం అవ‌స‌రం గ‌నుక ఎన్నిక‌ల ఖ‌ర్చు భ‌రాయించేవారికే టిక్కెట్ ఇవ్వ‌డానికి నిర్ణ‌యించుకుంది.  పార్టీ అభ్య‌ర్ధి కంటే ఈ ఉప ఎన్నిక‌లో ఖ‌ర్చుకు వెనుకాడకూడ‌ద‌న్న నిబంధ‌న పెట్టుకున్న‌ట్టే తోస్తుంది.  

ప్రతిష్ఠాత్మకంగా ముందుకొచ్చిన మునుగోడు ఎన్నికల్లో భారీ ఖర్చుకు మూడు పార్టీలు తెరలేపాయి. బీజేపీకి లేని ఓటింగ్ శాతాన్ని తెచ్చుకునేందుకు రాజగోపాల్ రెడ్డి తన శక్తియుక్తులన్నింటినీ ధారపోయా ల్సిన పరిస్థితి నెలకొంది. ఇప్పటికే ఒక ఎంపీపీతో పాటు పలువురు నాయకులు, ప్రజాప్రతినిధులు కాంగ్రెస్, టీఆర్ఎస్ నుంచి బీజేపీలో చేరారు. వారికి భారీగానే ముడుపులు ముట్టజెప్పారని వైరివర్గాలు ఆరోపిస్తు న్నాయి. ఇంకా నేతల కొనుగోళ్లకు భారీ ఆఫర్ ఇస్తామని ఆశ చూపుతున్నారని ఆరోపణ లున్నాయి.

అధికార టీఆర్ఎస్ పార్టీలో కూడా కాంగ్రెస్ పార్టీ నుంచి పలువురు నేతలు, కొందరు ప్రజాప్రతినిధులు చేరారు. సొంత పార్టీ ప్రజాప్రతినిధులను కాపాడుకునేందుకు అడ్వాన్సులు ఇచ్చి అడ్డుకట్ట వేసే ప్రయ త్నం చేసిందని ప్రచారం. అంటే అధికార పార్టీ కూడా ముడుపుల మూట విప్పిందని గుసగుసలు.

అంతర్గత కుమ్ములాటల కారణంగా, రేవంత్ రెడ్డికి కరోనా కారణంగా కాంగ్రెస్ పార్టీ ఇంకా సర్దుకోకున్నా ఓ అంచనాకు అయితే వచ్చిందని తెలిసింది. ముందు నుంచి ప్రచారం జరుగుతున్నట్టుగానే భారీ ఖర్చు కు వెనుకాడని నేతకే సీటు ఖరారు చేసే అవకాశముందని తెలిసింది. తమకే సీటు కేటాయించా లంటూ అటు కాంగ్రెస్, ఇటు టీఆర్ఎస్ లో మొదట బీసీ నేతలు రాగం అందుకున్నారు. ప్రస్తుతం  ఆ  రాగం నెమ్మదించింది. ఎందుకంటే భారీ ఖర్చు భరించలేరనే విషయం చర్చకు వచ్చింది. టీఆర్ఎస్ పార్టీ అధి ష్ఠానమే ఖర్చు పెట్టుకుంటుందన్న ప్రచారం ఉన్నా అభ్యర్థి కూడా భారీగానే పెట్టుకోవాల్సి ఉందనే ఆలో చన ఉంది. అధిష్ఠానాల వద్దకు వెళ్లిన బీసీ నేతల ముందు ఎన్నికల ఖర్చు విషయం లేవనెత్తినట్లు తెలి సింది. ఎం తంటే సుమారు రూ.100 కోట్లు పెట్టగలరా అంటూ బీసీ నేతలను ఆయా పార్టీల అధి నేతలు ప్రశ్నించారని సమాచారం.

నేతలు, ప్రజాప్రతినిధుల కొనుగోలు, ఓటర్లకు తాయిలాలు, మద్యం, సొంత పార్టీ ప్రచారం తదితర ఖర్చు లు కలుపుకొని అటూ ఇటుగా సుమారు రూ.100 కోట్లవుతుందని ఓ అంచనాకు వచ్చినట్లు భావిస్తున్నారు. అంత ఖర్చు తాము భరించలేమంటూ బీసీ నేతలు మెల్లిగా వెనక్కి తగ్గినట్లు విశ్లేషకులు అంటున్నారు. దీంతోనే టీఆర్ఎస్, కాంగ్రెస్ పార్టీల్లో బీసీ నేతలకు అవకాశం సన్నగిల్లిందని అంటు న్నారు.

దీన్నిబట్టి మూడు పార్టీలు కలిపి మునుగోడు నియోజకవర్గ ఉప ఎన్నికలో సుమారు రూ.300  కోట్లకు పైగా ఖర్చు చేస్తాయన్న మాట. అధికార పార్టీకి అభివృద్ధి, సంక్షేమ కార్యక్రమాలు చేపట్టడానికి అదనంగా ప్రభుత్వ ఖర్చు ఉండటం వేరే విషయం. మునుగోడు ఉప ఎన్నిక తెలంగాణ, ఉమ్మడి రాష్ట్రంలోనే కాదు దేశం లోనే కాస్ట్లీ ఎన్నిక కానుందని విశ్లేషకులు అంచనా వేస్తున్నారు. తాయిలాల విషయానికి వస్తే పండుగే పండుగని ఎక్కువ మంది ఓటర్లు మురిసిపోతున్నారు.

By
en-us Political News

  
భేటీ అనంతరం అంబటి రాంబాబు ముద్రగడపై పొగడ్తల వర్షం కురిపించారు. ఆయన పట్టుదల, రాజకీయాలలో నిజాయితీ, విలువలకు ఆయన ఇచ్చిన ప్రాధాన్యతను ప్రస్తుతించారు. తమ మధ్య జరిగిన ఈ భేటీలో పలు రాజకీయ, సామాజిక అంశాలపై చర్చ జరిగిందని తెలిపారు.
తెలుగువన్ వాస్తవ వేదిక సంచికలో ప్రస్తుత ఏపీ రాజకీయ పరిస్థితులపై విస్తృత చర్చ జరిగింది.
తమిళనాడు అసెంబ్లీ ఎన్నికల నగారా మోగడంతో రాష్ట్ర రాజకీయాలు ఒక్కసారిగా వేడెక్కాయి.
ఈ నేపథ్యంలో జరగనున్న ప్రత్యేక అసెంబ్లీ సమావేశం రాజకీయంగా అత్యంత ప్రాధాన్యత సంతరించుకుంది. ముఖ్యంగా ప్రధాన ప్రతిపక్షమైన వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ ఈ అంశంపై ఎలాంటి వైఖరి తీసుకుంటుందనేది ఇప్పుడు ఆసక్తిగా మారింది.
2026 తమిళనాడులో అసెంబ్లీ ఎన్నికలు ఈసారి ఎవరికీ అంత సులువుగా కనిపించడం లేదు.
అమరావతిని రాజధానిగా గుర్తించాలనే అంశంపై ఇప్పటివరకు చట్టపరమైన స్పష్టత లేదనీ, ఈ లోటును భర్తీ చేసేందుకే ఈ సమావేశాన్ని ఏర్పాటు చేస్తున్నట్లు ఆయన వెల్లడించారు. విజయవాడ-అమరావతి ప్రాంతమే రాష్ట్ర రాజధానిగా ఉండాలని అసెంబ్లీలో ఏకగ్రీవ తీర్మానాన్ని ఆమోదించి దానిని కేంద్ర ప్రభుత్వానికి పంపనున్నట్లు స్పీకర్ వివరించారు.
తమిళనాడు అసెంబ్లీ ఎన్నికల వేళ రాజకీయ సమీకరణాలు వేగంగా మారుతున్నాయి.
భార్య పేరుతో సర్వోన్నత న్యాయస్థానంలో పిటిషన్ వేశారు. చిత్తూరు జిల్లాలో తమ పీఎల్ఆర్ కంపెనీ చేపట్టిన ప్రాజెక్టులకు సంబంధించిన బకాయిలు చెల్లించేలా రాష్ట్ర ప్రభుత్వాన్ని ఆదేశించాలని ఆ పిటిషన్ లో కోరారు. అయితే న్యాయమూర్తి జస్టిస్ దిపాంకర్ దత్తా నేతృత్వంలోని సుప్రీం కోర్టు ధర్మాసం ఈ విషయంలో తాము నేరుగా జోక్యం చేసుకోబోమని విస్పష్టంగా పేర్కొంది.
ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు అధ్యక్షతన ఈ నెల 28 రాష్ట్ర అసెంబ్లీ ప్రత్యేకంగా సమావేశం కానుంది. ఈ సమావేశం ఎజెండా అమరావతిని ఏకైక రాజధానిగా గుర్తిస్తూ తీర్మానం ఆమెదించడమే. ఇది ఏకైక రాజధానిగా అమరావతికి చట్టబద్ధత కల్పించే దిశగా కీలక ముందడుగుగా భావించవచ్చు.
భారతంలో ద్రౌపదిని వివస్త్రను చేయడానికి కౌరవులు ప్రయత్నిస్తే.. రాజధాని లేని రాష్ట్రంగా ఆంధ్రప్రదేశ్ ను మిగల్చడానికి ఆ పార్టీ ప్రయత్నించింది. అందుకే కురుక్షేత్రంలో కౌరవులు ఓడిపోయినట్టుగా.. 2024 ఎన్నికల్లో ఘోర ఓటమిని చూసింది.
కాంగ్రెస్ పార్టీ ప్రాథమిక సభ్యత్వానికి అధికారికంగా రాజీనామా చేస్తున్నట్లు జీవన్ రెడ్డి ప్రకటించారు
1978 నుంచి అంటే గత 48 ఏళ్లుగా కాంగ్రెస్ పార్టీ జాతీయ కార్యకలాపాలకు కేంద్ర బిందువుగా ఉన్న నంబర్ 24, అక్బర్ రోడ్ భవనాన్ని ఈ నెల 28 లోగా అంటే శనివారం లోగా ఖాళీ చేయాలంటూ కేంద్రం నోటీసులు జారీ చేసింది.
జ‌గ‌న్ లెవ‌న్ పై మీమ్స్ గురించి చెప్ప‌న‌క్క‌ర్లేదు. పంజాబ్ కింగ్స్ లెవ‌న్ లాగా.. జ‌గ‌న్స్ లెవ‌న్ అనే పేరు మీద మీమ్స్ వెల్లువెత్తాయి. ఇక తాజాగా కొత్త పార్లమెంట్ భవనంలో వైసీపీ ఎంపీలకు లోక్ సభ స్పీకర్ కేటాయించినది కూడా 11వ నెంబర్ రూమే.
 
Disclaimer:
All content included on this TeluguOne.com Portal including text, graphics, images, videos and audio clips, is the property of ObjectOne Information Systems Ltd. or our associates, and protected by copyright laws. The collection, arrangement and assembly of all content on this portal/ related channels is the exclusive property of ObjectOne Information Systems Ltd. or our associates and protected copyright laws.
 
You may not copy, reproduce, distribute, publish, display, perform, modify, create derivative works, transmit, or in any other way exploit any part of copyrighted material without permission from ObjectOne Information Systems Ltd or our associates.