ఏపీపై బీజేపీ మాట మారింది సరే.. మరి తీరు?

Publish Date:Jun 12, 2023

Advertisement

మాట మామిడల్లం.. మనసు పటికబెల్లం.. జగన్ ప్రభుత్వం విషయంలో బీజేపీ తీరు సరిగ్గా ఇలాగే ఉంది. జగన్ పాలన అంతా అవినీతి, కుంభకోణాల మయం అంటూ ఘాటు విమర్శలు గుప్పించే బీజేపీ అగ్రనేతలు.. చేతల్లో మాత్రం అన్ని విధాలుగా సహకరిస్తూ వస్తున్నారు. ఈ నాలుగేళ్లలో కేంద్రంలో అధికారంలో ఉన్న మోడీ సర్కార్ , కుంభకోణాల, అవినీతి జగన్ పాలనకు వత్తాసు పలికింది. ఈ మాటలు వేరే ఎవరో చెప్పాల్సిన అవసరం లేదు.

ఏపీలో తాజాగా పర్యటించిన బీజేపీ జాతీయ అధ్యక్షుడు నడ్డా, అమిత్ షాలు జగన్ పాలనపై చేసిన విమర్శలే ఆ విషయాన్ని చెబుతున్నాయి. ఇష్టారీతిన అప్పులకు అనుమతులు ఇచ్చింది కేంద్రంలోని మోడీ సర్కారే. ఆ అప్పుల చలవతోనే జగన్ సర్కార్ సంక్షేమ పథకాలను అరకొరగానైనా కొనసాగించగలిగింది. ఇప్పుడు అదే బీజేపీ అగ్రనేతలు జగన్ సర్కార్ పై విమర్శల దాడి చేస్తున్నారు. తిరుపతిలో బీజేపీ జాతీయ అధ్యక్షుడు నడ్డా, ఆ తరువాత ఒక్క రోజు వ్యవధిలోనే విశాఖలో కేంద్ర హోంమంత్రి అమిత్ షా  వైసీపీ ప్రభుత్వం నాలుగేళ్లలో అవినీతి, కుంభకోణాలే చేసిందని విమర్శలు గుప్పించారు. విశాఖను అసాంఘిక శక్తులకు అడ్డాగా చేశారని దుయ్యబట్టారు. రైతులకు మాటల్లోనే తప్ప చేతల్లో చేసిందేమీ లేదని కుండబద్దలు కొట్టారు.  మైనింగ్, గంజాయి , మద్యం మాఫియాలకు ఏపీ అడ్డాగా మారిందన్నారు. నాలుగేళ్లో కేంద్రం… ఏపీకి రూ. ఐదు లక్షల కోట్లు ఇచ్చిందని.. ఆ డబ్బులకు తగ్గట్లుగా ఏపీలో అభివృద్ధి అభివృద్ధి కనిపించలేదని అమిత్ షా విరుచుకుపడ్డారు. ఆ నిధులకు లెక్కలు చెప్పాలని నిలదీశారు.

 కేంద్ర పథకాలకు జగన్మోహన్ రెడ్డి తన పేరు .. బొమ్మలు పెట్టుకుంటున్నారని.. చివరికి ఉచితంగా ఇచ్చిన బియ్యానికి కూడా జగన్ తన ఫోటో పెట్టుకున్నారని ఎద్దేవా చేశారు.   తొమ్మిదేళ్ల పాలనలో మోడీ ప్రభుత్వం సాధించిన విజయాల ప్రచారం కోసం ఏర్పాటు చేసిన సభలే అయినప్పటికీ నడ్డా, అమిత్ షాలు ఇద్దరూ కూడా  ఆ విషయం కంటే ఏపీలో వైఎస్ ప్రభుత్వ వైఫల్యాలు, అవినీతి, కుంభకోణాలపై విమర్శలకే ఎక్కువ సమయం కేటాయించారు.  ఆయా సభల్లో  మాట్లాడిన ఇతర బీజేపీ నేతలు కూడా జగన్ సర్కార్ టార్గెట్ గా విమర్శలు గుప్పించారు. అయితే వైసీపీ నేతలు మాత్రం విశాఖ వేదికగా అమిత్ షా తమ ప్రభుత్వంపై చేసిన విమర్శలను పట్టించుకోవడం లేదు. వాటిని అసలు గమనించనట్లుగా గుంభనంగా ఉన్నారు. అయితే తిరుపతి వేదికగా నడ్డా చేసిన విమర్శలపై బూతులతో విరుచుకుపడ్డారు.  

అసలు ఇప్పుడు మనం చెప్పుకోవలసింది బీజేపీ అగ్రనేతలపై జగన్ మంత్రులు, ఎమ్మెల్యేల స్పందన గురించి కాదు.. బీజేపీ అగ్రనేతలు జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వాన్ని విమర్శించడాన్ని.  ఏపీలో నడ్డా, అమిత్ షాల సభల ఉద్దేశం నరేంద్రమోదీ తొమ్మిదేళ్ల పాలనా విజయాలను ప్రజలకు వివరించడానికి .. అయితే వారిరువురూ కూడా  జగన్ సర్కార్ పై విమర్శలకే అధిక సమయం కేటాయించారు.   ఎన్నికలు దగ్గరపడుతున్నాయి కనుక తమ ఆబోరు కాపాడుకోవాలంటే.. తమ స్టాండ్ ఏమిటో తెలియచేయాలనుకున్నారు.

వైసీపీ  ప్రభుత్వంపై విమర్శల తీవ్రత పెంచారు. మొదటి   నడ్డా  ఘాటు విమర్శలు చేస్తే.. ఒక రోజు వ్యవధిలో ఏపీకి వచ్చిన అమిత్ షా దాదాపు వాటినే  మళ్లీ చెప్పారు. ఇదంతా వైసీపీ విషయంలో తాము క్లియర్ గానే ఉన్నామనీ, వైసీపీ వ్యతిరేక స్టాండ్ తీసుకున్నామనీ ఏపీ ప్రజలకు చెప్పడానికే అన్నట్లుగా ఉంది. వారి ఈ వైఖరే.. ఇటీవల చంద్రబాబును హస్తిన పిలిపించుకుని మరీ చర్చించిన అంశాలేమిటన్నది చెప్పకనే చెప్పినట్లైంది.  అయితే నాలుగేళ్ల పాటు ఏపీలో జగన్ సర్కార్ అక్రమాలు, అవినీతి, కుంభకోణాలకు వంత పాడి.. లేకపోతే చూసీ చూడనట్లు వదిలేసి.. ఆ ప్రభుత్వానికి అవసరమైన ప్రతి సందర్భంలోనూ అండగా నిలిచి ఇప్పడు ఎన్నికలు దగ్గరపడేసరికి మాట మార్చి.. విమర్శలు ఎక్కుపెడితే ఏపీ జనం నమ్ముతారా?  మాటలు ఓకే…. మరి చేతల మాటేమిటని నిలదీయరా? అని రాజకీయవర్గాల్లో చర్చ సాగుతోంది.

ఇప్పటికైనా జగన్ సర్కార్ కు కేంద్రంలోని మోడీ సర్కార్ సహకారం ఆగుతుందా? అన్న అనుమానాలు పరిశీలకుల నుంచి వ్యక్తమౌతున్నాయి.  జగన్ సర్కార్ కు అవసరమైన ప్రతి సందర్భంలోనూ  అప్పులో.. నిధులో విడుదల చేసి ఆదుకున్న మోడీ సర్కార్.. ఇప్పుడు ఆ నిధులకు లెక్కలు చెప్పమని అడగి.. మేం జగన్ సర్కార్ ను కడిగేశాం అని చెప్పుకుంటే సరిపోతుందా అని అంటున్నారు.    ఈ నాలుగేళ్లలో ఎన్నడూ లేని విధంగా ఇప్పుడు బీజేపీ అగ్రనేతలు ఘాటు విమర్శలు చేసి చేతులు దులిపేసుకుంటే కుదరదని, ఆ వ్యతిరేకతను చేతల్లోనూ, చర్యల్లోనూ చూపితేనే ఏపీ జనం విశ్వసిస్తారని పరిశీలకులు విశ్లేషిస్తున్నారు.  

By
en-us Political News

  
తెలుగు రాష్ట్రాల్లోనూ పొలిటికల్ పార్టీలకు ఫండ్స్ బాగానే గిట్టుబాటయ్యాయి. అయితే.. ఏపీలో పవర్‌లో ఉన్న టీడీపీ, జనసేన కంటే వైసీపీ కలెక్షన్లే ఎక్కువగా ఉండడం హాట్‌టాపిక్‌గా మారింది.
అంబటి ఏమన్నారంటే.. 2024 ఫలితాలను అర్ధం చేసుకోవడంలో తెలుగుదేశం కూటమి పార్టీలు విఫలమయ్యాయట. చంద్రబాబు మోసపూరిత వాగ్దానాల కారణంగానే కూటమి ఆ ఎన్నికలలో అధికారంలోకి వచ్చిందట.. ఇప్పుడు ఈ ఏడాదిన్న కాలంలో జనానికి తత్వం బోధపడి.. జగన్ పాలన మళ్లీ రావాలని కోరుకుంటున్నారట. అంబటి భాష్యం విన్న వైసీపీయులే ఆశ్చర్యపోతున్నారు.
ఆదివారం తన 53వ పుట్టిన రోజు జరుపుకున్న జగన్ కు చంద్రబాబు, నారా లోకేష్, వైఎస్ షర్మిల తదితరులు సామాజిక మాధ్యమం ద్వారా జన్మదిన శుభాకాంక్షలు తెలియజేశారు. ఇందుకు ప్రతిగా జగన్ కూడా ఒక్క మంత్రి లోకేష్ కు తప్ప మిగిలిన వారందరికీ ధన్యవాదాలు చెబుతూ రిప్లై ఇచ్చారు.
ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి నేతృత్వంలోని కాంగ్రెస్ పాలనలో బీఆర్ఎస్ నాయకుల పరిస్థితి దయనీయంగా మారిందన్న ఆయన గత పదేళ్ల అధికార గర్వంతో విర్రవీగిన నేతల కండలు ఇప్పుడు కరిగిపోయాయని ఎద్దేవా చేశారు.
రాజకీయ ప్రత్యర్థులే కాదు.. ప్రభుత్వ విధానాలు సరిగా లేవన్న సామాన్యులపై కూడా జగన్ పాలనలో దాడులు జరిగాయి. ఇక అవినీతి, అక్రమాలు, దౌర్జన్యాలూ సరే సరి. సరే జనం విషయం గుర్తించి 2019లో తాము కట్టబెట్టిన అధికారాన్ని 2024 ఎన్నికలలో లాగేసుకుని అభివృద్ధికి బ్రాండ్ అంబాసిడర్ అంటూ చంద్రబాబుకు అప్పగించారు.
చంద్రబాబునాయుడు ఉమ్మడి రాష్ట్ర సీఎంగా ఉన్నప్పుడు పేరుకు పాలమూరును దత్తత తీసుకుని, అభివృద్ధి పేరిట శంకుస్థాపన ఫలకాలకే పరిమితమయ్యారనీ, ఆయన హయాంలో శంకుస్థాపన ఫలకాలకు అయిన ఖర్చుతో ఏకంగా ఓ ప్రాజెక్టే కట్టవచ్చంటూ విమర్శలు గుప్పించారు.
ఆదివారం జగన్ పుట్టిన రోజు సందర్భంగా షర్మిల అన్నకు జన్మదిన శుభాకాంక్షలు తెలిపారు. అయితే ఆ తెలపడంలోనూ చిన్న ట్విస్ట్ ఇచ్చారు. చెల్లెలిగా కాకుండా కాంగ్రెస్ ఏపీ అధ్యక్షురాలిగా షర్మిల వైసీపీ అధ్యక్షుడు జగన్ గారికి అని సంబోధిస్తూ శుభాకాంక్షలు తెలిపారు.
తెలంగాణలో గ్రామ పంచాయితీ ఎన్నికల్లో బీఆర్‌ఎస్ మెరుగైన ఫలితాలు సాధించిందని బీఆర్‌ఎస్ అధినేత కేసీఆర్ అన్నారు.
సోషల్ మీడియాలో జగన్ కు జన్మదిన శుభాకాంక్షలు తెలుపుతూ పోస్టులు ఓ రేంజ్ లో కనిపిస్తున్నాయి. అవన్నీ పక్కన పెడితే తాడేపల్లిలోని జగన్ నివాసం వద్ద వెలసిన ఓ భారీ కటౌట్ ఆసక్తి రేకెత్తిస్తోంది.
ప్రముఖ సినీ నటి ఆమని భారతీయ జనతా పార్టీలో చేరారు.
భారతదేశం మత సామరస్యానికి ప్రతీక అన్న విజయసాయి.. అటువంటి దేశంలో ఉంటూ.. బంగ్లాలో హిందువులు లక్ష్యంగా సాగుతున్న దాడులపై స్పందించకపోవడం దారుణమన్నారు. ఈ దాడులకు ఖండించని వారు దేశ భక్తులే కాదని విజయసాయి తన ట్వీట్ లో పేర్కొన్నారు.
మెడికల్ కాలేజీల ప్రైవేటీకరణ అంటూ కోర్టుకు వెడదామా? అంటే..ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం మెడికల్ కాలేజీలను ప్రైవేటుకు అప్పగించలేదు. ప్రభుత్వ, ప్రైవేటు భాగస్వామ్యం అంటూ జీవోలోనే స్పష్టంగా పేర్కొంది. దీంతో ఆ పాయింట్ మీద కోర్టుకు వెళ్లడం ఎలా అన్నది అర్ధం కాక వైసీపీ మల్లగుల్లాలు పడుతోందని పరిశీలకులు అంటున్నారు.
తాను ప్రత్యక్ష ఎన్నికలో పోటీ చేసిన తొలి సారే పరాజయం పాలైన సంగతిని గుర్తు చేసుకున్న ఆయన, ఆ ఓటమి నుంచి గుణపాఠం నేర్చుకుని, ఓడిన చోటే గెలవాలన్న పట్లుదలతో పని చేసి ఫలితం సాధించానని లోకేష్ వివరించారు.
 
Disclaimer:
All content included on this TeluguOne.com Portal including text, graphics, images, videos and audio clips, is the property of ObjectOne Information Systems Ltd. or our associates, and protected by copyright laws. The collection, arrangement and assembly of all content on this portal/ related channels is the exclusive property of ObjectOne Information Systems Ltd. or our associates and protected copyright laws.
 
You may not copy, reproduce, distribute, publish, display, perform, modify, create derivative works, transmit, or in any other way exploit any part of copyrighted material without permission from ObjectOne Information Systems Ltd or our associates.