Publish Date:Jun 23, 2022
దేశంలోని రాజకీయ పార్టీలలో టీఆర్ఎస్ శైలే భిన్నం. ఉద్యమ పార్టీగా ఆవిర్భవించి రాజకీయ పార్టీగా రూపాంతరం చెందిన తెలంగాణ రాష్ట్ర సమితి.. రాజకీయం ఇప్పటి దాకా అందితే జుట్టు.. అందకపోతే కాళ్లు అన్న ధోరణిలోనే సాగుతోంది. ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ విభజన బిల్లు పార్లమెంటు ఆమోదం పొందిన సమయంలో కుటుంబ సమేతంగా సోనియాగాంధీని కలిసి కృతజ్ణతలు తెలిపిన తెరాస అధినేత కేసీఆర్.. ఆ తరువాత ఎన్నికల సమయంలో ఆ పార్టీపైనే తీవ్ర స్థాయిలో విమర్శలు గుప్పించిన సంగతి విదితమే. ఆ తరువాత కూడా ఎప్పుడు అవకాశం వచ్చినా బీజేపీకి బాసటగా నిలిచిన కేసీఆర్ ఇప్పుడు ఆ పార్టీపై కారాలూ, మిరియాలూ నూరుతూ ఘాటు విమర్శలు చేస్తున్న సంగతీ తెలిసిందే. ఆయన కుమారుడు.. తెరాస వ్యవస్థాపక అధ్యక్షుడు, మంత్రి కేటీఆర్ కూడా అదే బాటలో పయనిస్తున్నారు.
తెలంగాణ గడ్డపై బీజేపీపై తీవ్ర విమర్శలు గుప్పిస్తున్న కేటీఆర్ హస్తిన వెళ్లి కేంద్ర మంత్రులకు రాష్ట్రానికి నిథుల కోసం వినతుల మీద వినతులు సమర్పిస్తున్నారు. ఇటీవలి కాలంలో ఈ ధోరణి మరింత ఎక్కువైంది. తెలంగాణ గడ్డపై కేంద్రంలోని మోడీ సర్కార్ తెలంగాణకు ఇచ్చింది శూన్యమంటూ విమర్శలు గుప్పిస్తూ.. ఢిల్లీ వెళ్లి కేంద్రం మంత్రులతో ప్రత్యేక భేటీలు అవుతున్నారు.
మోడీ హయాంలో తెలంగాణకు ప్రతి విషయంలోనూ అన్యాయమే జరిగిందని ఆరోపిస్తున్న ఆయన అవకాశం దొరికితే హస్తినలో వాలిపోయి కేంద్ర మంత్రులతో సమావేశమౌతున్నారు. ఇటీవలే ఆయన ఢిల్లీలో కేంద్ర మంత్రి రాజీవ్ చంద్రశేఖరత్ తో భేటీ అయ్యారు. రాష్ట్రానికి న్యాయం చేయాలని విజ్ణప్తి చేసి వచ్చారు. వచ్చీ రాగానే రాష్ట్రంలో అభివృద్ధి కార్యక్రమాల ప్రారంభంలో బిజీ అయిపోయారు. ఆ ప్రారంభోత్సవ కార్యక్రమాలలో తెలంగాణకు కేంద్రం చేస్తున్న అన్యాయం, నిధులు మంజూరు చేయకపోవడంపై దుమ్మెత్తి పోశారు. ఆ వెంటనే హుటాహుటిన హస్తినలో వాలిపోయిన ఆయన కేంద్ర మంత్రి హరిదీప్ సింగ్ పూరితో భేటీ అయ్యారు. హైదరాబాద్ డ్రైనేజీ సిస్టమ్, రోడ్ల నిర్మాణంకు ఆర్థిక సాయం చేయాలని విజ్ణప్తి చేశారు.
వినతి పత్రం సమర్పించారు. కేంద్రం ఎన్నిసార్లు కోరినా పైసా విదల్చడంలేదని ఒక వైపు విమర్శలు గుప్పిస్తూనే.. మళ్లీ మళ్లీ కోరడం ఎందుకు అని పరిశీలకులు ప్రశ్నిస్తున్నారు.కేటీఆర్ హస్తిన పర్యటనలపై రాజకీయ పరిశీలకులు పలు అనుమానాలు వ్యక్తం చేస్తున్నారు. ఒక వైపు పార్టీ అధినేత, ముఖ్యమంత్రి కేసీఆర్ కనీసం మోడీకి ఎదురు పడటానికి సైతం ఇష్టపడకపోగా, కేంద్రంలోని మోడీ ప్రభుత్వాన్ని గద్దె దింపడమే లక్ష్యంగా జాతీయ పార్టీని ప్రారంభించనున్నారు.
మరో వైపు ఆయన కుమారుడు, పార్టీ కార్యనిర్వాహక అధ్యక్షుడు కేటీఆర్ మాత్రం తరచుగా హస్తిన యాత్రలు చేస్తూ వరుసగా కేంద్ర మంత్రులతో భేటీలు నిర్వహిస్తున్నారు. ఇదేం రాజకీయం తిరుమలేశా అంటే జనం అచ్చెరువొందుతున్నారు. తండ్రీ కొడుకుల భిన్న వైఖరులపై తెరాస శ్రేణుల్లోనే అయోమయం నెలకొంది. ఏం జరుగుతోందో అర్ధం కావడం లేదని పార్టీ శ్రేణులే అంటున్నాయి.
By Teluguone
en-us
Political News
http://www.teluguone.com/news/content/criticising-on-one-side-appeals-on-other-side-ktr-dual-politics-25-138301.html
కరీంనగర్ లోని ఎమ్మెల్యే క్యాంప్ ఆఫీస్ పై జరిగిన దాడిని నిరసిస్తూ బీఆర్ఎస్ నాయకత్వం బంద్ పిలుపునిచ్చిన నేపథ్యంలో . శనివారం ( మే 9) ఉదయం నుండే నగరంలోని ప్రధాన కూడళ్లలో పోలీసులు భారీగా మోహరించారు. ఎమ్మెల్యే గంగుల కమలాకర్ నిరసనలో పాల్గొనకుండా పోలీసులు ఆయన ఇంటి వద్ద బారికేడ్లు ఏర్పాటు చేసి బయటకు రాకుండా అడ్డుకున్నారు. దీనిపై బీఆర్ఎస్ కార్యకర్తలు తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేస్తూ ప్రభుత్వానికి, పోలీసులకు వ్యతిరేకంగా పెద్ద ఎత్తున నినాదాలు చేశారు.
ముఖ్యంగా పార్టీలో అభిషేక్ బెనర్జీ పెత్తనం పెరగడం వల్లే సువేందు అధికారి వంటి బలమైన నేతలు టీఎంసీని వీడారని పరిశీలకులు విశ్లేషిస్తున్నారు. క్షేత్రస్థాయిలో పట్టున్న నాయకులను కాదని, కార్పొరేట్ తరహా రాజకీయాలకు అభిషేక్ బెనర్జీ ప్రాధాన్యత ఇవ్వడం తృణమూల్కు ప్రతికూలంగా మారిందంటున్నారు.
ఆంధ్రోళ్లను తిట్టి ఓట్లు దండుకున్న బీఆర్ఎస్ పదేళ్ల పాలనలో ప్రాజెక్టుల పేరుతో దోపిడీకి పాల్పడిందని సంచలన వ్యాఖ్యలు చేశారు.
ప్రస్తుత ఎన్నికల ఫలితాలు కేరళలో పెను మార్పులకు నాంది పలికాయి. యూడీఎఫ్ స్పష్టమైన మెజారిటీ సాధించడంతో.. కొత్త ప్రభుత్వాన్ని ఏర్పాటు చేసేందుకు సన్నాహాలు మొదలయ్యాయి. ఈ క్రమంలోనే ముఖ్యమంత్రి అభ్యర్థి ఎంపికపై కసరత్తు జరుగుతోంది. కేసీ వేణుగోపాల్ అనుభవం, రాహుల్ గాంధీతో ఉన్న సాన్నిహిత్యం ఆయనకు ప్రధాన బలంగా మారాయి.
టీవీకే అధినేత విజయ్కు కాంగ్రెస్ మద్దతు తెలపడంపై ఆగ్రహంగా ఉన్న డీఎంకే.. కాంగ్రెస్కు కటీఫ్ చెప్పేసింది. మారిన రాజకీయ పరిస్థితుల దృష్ట్యా, లోక్సభలో తమ పార్టీ సభ్యులకు కాంగ్రెస్ ఎంపీలతో కాకుండా విడిగా సీటింగ్ కేటాయించాలని డీఎంకే ఎంపీ కనిమొళి స్పీకర్ ఓం బిర్లాకు లేఖ రాశారు.
తాజా సమాచారం ప్రకారం.. విజయ్ తన పార్టీకి ఉన్న బలానికి తోడుగా మరో మూడు పార్టీల మద్దతును కూడగట్టుకున్నారు. ఆ పార్టీల మద్దతుతో అధికారం చేపట్టడానికి అవసరమైన మ్యాజిక్ ఫిగర్ 118ని ఆయన సాధించారు.
తమిళనాడులో ఇటీవల జరిగిన ఎన్నికల తర్వాత, విజయ్ నేతృత్వంలోని టీవీకే పార్టీ ప్రభుత్వ ఏర్పాటుకు సిద్ధమవ్వగా.. మెజారిటీ నిరూపణ విషయంలో రాజేంద్ర విశ్వనాథ్ అర్లేకర్ కచ్చితమైన నిబంధనలు పాటించాలని పట్టుబడుతున్నారు. విజయ్ కు తన పార్టీ ఎమ్మెల్యేలు 107 మందికి అదనంగా కాంగ్రెస్ నుంచి గెలిచిన ఐదుగురు ఎమ్మెల్యేల మద్దతు కూడా ఉంది.
పదవి నుంచి తొలగించిన అనంతరం ఎస్వీఎస్ఎన్ వర్మ తీవ్ర భావోద్వేగానికి లోనయ్యారు. పార్టీ తీసుకున్న ఈ నిర్ణయం తనకు ముందే తెలుసని, నాయకత్వం నుంచి సమాచారం అందిందని చెప్పారు. అయితే పార్టీ కోసం ఎన్నో ఏళ్లుగా కష్టపడి.. క్షేత్రస్థాయిలో కేడర్ను కాపాడుకుంటూ వచ్చిన తనకు ఈ పరిణామం మనస్తాపానికి గురిచేసిందన్న ఆవేదన కూడా వ్యక్తం చేశారు.
బాబు కూటమిని ఎందుకంత విలువైనదిగా భావిస్తున్నారంటే.. కారణం వైసీపీ. ఆ పార్టీ కూటమి ఎప్పుడెప్పుడు చీలిపోతుందాని కాచుకుని కూర్చుని ఉంది. ఏ అవకాశం వచ్చినా వారు వదిలిపెట్టినట్టే కనిపించదు. మొన్న కోట వినుత ఘటన, నిన్న అరవ శ్రీధర్ వ్యవహారం, ఇవాళ వర్మ ఇష్యూ.. ఇలా సమయం దొరికినపుడల్లా ఆయా అంశాలను బాగా హైలెట్ చేసి.. కూటమిలో ఏదో ఒక చిచ్చు రాజేయాలని చూస్తోంది వైసీపీ అధినాయకత్వం.
అతి కొద్ది మంది నేతలు జగన్ ప్రకటనను సమర్దిస్తూ.. అనుకూల ప్రకటనలు చేస్తుండగా.. మెజారిటీ లీడర్, క్యాడర్ మాత్రం జగన్ నిర్ణయంపై తీవ్ర అసంతృప్తి వ్యక్తం చేస్తున్నారు.
తెలుగువన్ వాస్తవ వేదికలో ప్రస్తుత జాతీయ, ప్రాంతీయ రాజకీయ పరిస్థితులపై విస్తృత చర్చ జరిగింది.
తమిళనాడు అసెంబ్లీ ఎన్నికల ఫలితాలు ఆ రాష్ట్ర రాజకీయాల్లో పెను సంచలనాన్ని సృష్టించాయి.
టీవీకే అధినేత విజయ్తో భేటీ అనంతరం రాజ్ భవన్ ఒక అధికారిక ప్రెస్ నోట్ విడుదల చేసింది. అసెంబ్లీలో ప్రభుత్వం ఏర్పాటు చేయాలంటే ఉండాల్సిన సంఖ్యాబలంపై గవర్నర్.. విజయ్కు మార్గనిర్దేశం చేశారు. కేవలం అతిపెద్ద పార్టీగా ఉండటమే కాకుండా, సభలో తగినంత మంది ఎమ్మెల్యేల మద్దతు ఉన్నట్లు ఆధారాలు చూపాలని సూచించారు.