రాజధానిని ఎవరూ మార్చలేరు.. జగన్ పై సీపీఐ నారాయణ సంచలన వ్యాఖ్యలు

Publish Date:Aug 28, 2019

Advertisement

 

ప్రస్తుతం ఏపీలో ఎక్కడ చూసినా రాజధాని గురించే చర్చ జరుగుతోంది. ఏపీ రాజధానిగా అమరావతి ఎంపిక సరైన నిర్ణయం కాదంటూ మంత్రి బొత్స సత్యనారాయణ చేసిన వ్యాఖ్యలతో మొదలైన ఈ రాజధాని రగడ.. రోజురోజుకి రాజుకుంటుంది. వైఎస్ జగన్ సర్కార్ రాజధానిని మార్చే యోచనలో ఉందన్న ప్రచారం నేపథ్యంలో.. రాజధాని కోసం భూములు త్యాగం చేసిన రైతులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. విపక్షాలు ప్రభుత్వంపై విమర్శలు గుప్పిస్తున్నాయి.

అయితే ఈ రాజధాని రగడ అంశంపై సీపీఐ సీనియర్ నేత నారాయణ తన అభిప్రాయాన్ని పంచుకున్నారు. గత ఏడాది సైకిల్ పై రాజధాని ప్రాంతంలో పర్యటించిన సంగతిని గుర్తు చేసుకుంటూ.. ప్రస్తుత రగడపై స్పందించారు.

"ఊరులో ఇల్లు లేదు, ఊరుబయట చేనులేదు.. నీకెందుకురా పెత్తనం అని రాయలసీమ భూస్వాములు మాట్లాడ్తుంటారు. అలావుంది రాజధాని రగడ. అమరావతి రాజధానిని ఎవరూ మార్చలేరు, కాకపోతే సమయానుకూలంగా కాలాక్షేపం కొరకు చదరంగం ఆడుతున్నారు. దాదాపు సంవత్సరం క్రితం సీపీఐ జాతీయ సమావేశాలు విజయవాడలో జరిగాయి. సమావేశాలు అయిపోయిన మరుసటి రొజు కృష్ణ బ్యారేజ్ వద్దనున్న స్విమ్మింగ్ పూల్ వద్దకు నేను నామిత్రులు వెళ్ళాం. అక్కడ సైకిల్స్ కనబడ్డాయి. వాకింగ్ బదులు ఈమద్య సైకిల్స్ వాడుతున్నామని నామిత్రులు చెప్పారు. అయితే ఈరోజు సైకళ్ళస్వారి చేద్దామనుకుని సైక్లింగ్ చేశాము. పనిలోపనిగా రాజధాని వరకు వెళ్దాం అనుకుని బయలుదేరాము. మంచి విశాలమయిన రోడ్స్ కొంతవేశారు. యింకా నిర్మాణం కొనసాగుతున్నది. ప్రధానంగా మౌలిక సదుపాయం అవసరం. అదిలేనిదే భవననిర్మాణాలుగాని, కార్యాలయాలుగాని నిర్మిచలేం. ఉపరితల నిర్మాణాలకన్నా, పునాదుల నిర్మాణం, దానికన్నా ముందు సమగ్ర పథకానికే ఎక్కువ సమయం పడ్తుంది. పథకం లేకుండా హడావుడి పనుల వలన ప్రయోజనం శూన్యం. ఆ విషయంలో టీడీపీ ప్రభుత్వం పక్కాగానే ప్లాన్ చేసింది. అయితే రాజధాని నిర్మాణాన్ని అంతర్జాతీయ స్థాయికి తీసుకొస్తాం అని, సీఎం ఉత్తర ప్రగల్బాలు పలికే నెత్తికి తెచ్చుకున్నారు. మింగ మెతుకులేకపోయినా మీసాలకు సంపెంగ నూనె అన్నట్టు, చేతిలో పైసాలేకపోయినా ఆకాశానికి నిచ్చెనేశారు. అయినా జయప్రదం అయివుండేవాడేమో ప్రధాని మోడీ సహకరించి వుంటే. మోడీ గారికి రాజకీయలక్షణాలుంటే అదిజరిగేదే. మోడీ గారు చంద్రబాబుని అంత ఈజీగా మర్చిపోతాడా? మోడీ గుజరాత్ సీఎంగా ఉన్న సమయంలో జరిగిన మారణ కాండ అమెరికా మొదలు యావత్ ప్రజానీకం ఖండించింది. ఆనాటి ఉమ్మడి రాష్ట్ర సీఎంగా చంద్రబాబు కూడా మోడీని వ్యతిరేకించాడు. రాజకీయాలలోగాని వ్యక్తిగతంగా కానీ శత్రుశేషాన్ని భరించి, ధరించే వారుకాదు మోడీజి. ఆంధ్రప్రజలేమయినా కానీ చంద్రబాబును రాజకీయంగా బ్రతకనివ్వకూడదని నిర్ణయించుకున్నారు. "రాష్ట్ర హక్కులపై రాజకీయపోరాటం చేయమని సలహాయిస్తే" మీరెపుడూ అరచేవాళ్ళేకదా అరుచుకోండి నేను ఏదోక విధంగా అభివృద్ధికి పనిచేస్తానని వెటకారం చేసారు మమ్మల్ని. "కర్ణుడి చావుకు నూరు కారణాలన్నట్టు" టీడీపీ ఓడిపోయింది.

యువనేత జగన్ మోహన్ రెడ్డి  సీఎంగా ఎన్నిక కావడం, సంవత్సరం లోపు మంచి సీఎంగా నిరూపించుకుంటానని ఆత్మధైర్యంతో ప్రకటించారు. డైనమిక్ సీఎంగా ఊగిసలాట లేకుండా నిర్ణయాలు తీసుకుంటే మంచిదేనని నేను కూడా కితాబిచ్చాను. కానీ ప్రారంభంలోనే ప్రజావేదికను నేలమట్టం చేశారు. అదిప్రభుత్వ ఆస్తి ,చట్టవిరుద్దంగా కట్టివుంటే దాన్ని సీజ్ చేసి, కార్యకలాపాలు నిషేదించి ఉండవచ్చు. అలాంటి అక్రమ నిర్మాణం ప్రభుత్వానిదయినా, ప్రైవేట్ వాళ్ళదయినా ఒక విధానం ప్రకారం నిర్ణయం తీసుకోవాలి. కానీ ఇప్పుడేమైంది? ప్రభుత్వ ఆస్తి మట్టిపాలయింది. మిగతావన్నీ ఆలాగేవున్నాయిగదా.

"తెలంగాణ సీఎం ప్రారంభంలోనే అయ్యప్పసొసైటి లో అప్పటికే నిర్మించుకుని ఉన్న కట్టడాలను కూల్చప్రారంభించారు. నేను, సీపీఐ కార్యదర్శి చాడవెంకట్ రెడ్డి, పల్లవెంకటరెడ్డి వెళ్ళి అభ్యంతరం తెలియజేసి బాదితులకు అండగానిబడ్డాం. అప్పుడు కేసీఆర్ మమ్మల్ని ఆహ్వానించి, అయ్యప్ప సొసైటీ అంతా రాయలసీమ, రాజశేఖరెడ్డి గుంపే ఆక్రమిచుకున్నారన్నా, మీరెందుకు అక్కడపొయి అటకిస్తారు? అన్నారు. మీరుచెప్పింది వాస్తవం కాదు, అయినా నిర్మాణభవనాలను కూల్చితే జాతీయసంపద వృధా కదా అన్నాము.

గీతను చెరపడంకాదు, పెద్దగీతను గీయడానికి ప్రయత్నించాలి. గతప్రభుత్వ విధానాలను బహిర్గతం చేయాలంటే, బండగా వ్యతిరేకించడం గాక ప్రస్తుత ముఖ్యమంత్రి మంచిపనులు చేయడం ద్వారా గతప్రభుత్వ లోపాలను ప్రజలే తెలుసుకునేట్టు చేయాలి. గతపనులలో లోపాలుంటే వెలికితీయడం లో తప్పులేదు, అయితే కొనసాగే పనులు ఆపించడం వ్యతిరేకదొరణి.

పోలవరం ప్రాజెక్ట్ ప్రతిష్టాత్మకమయింది. ఇప్పటికే నేరపూరిత కాలయాపన జరిగిపోయింది. రివర్స్ టెండర్ పేరుతో పోలవరం పనులు అపించారు. కొత్త టెండర్ల కొరకు ప్రయత్నాలు, దానిలో ఎన్ని సాదకబాదలుంటాయో అనుభవిస్తేగాని తెలియదు. పోలవరం పనులు ఆపించకుండా, దానిలోవున్న అవినీతిని బహిర్గతం చేయడానికి, నిరూపించడానికి తగిన ప్రయత్నం చేసి వుంటే అపుడు తగినచర్యకు అవకాశం వుండేదికదా.

అమరావతి రాజధాని ప్రస్తావన లేనపుడే, ఉమ్మడి రాష్ట్రం లో రెండుమూడేండ్లు వరుసగా వరదలు వచ్చినపుడు ఉండవల్లి చుట్టుపక్కగ్రామాలలో విలువయిన ఉల్లి, తదితర కూరగాయల పంటలు నీటిలో మునిగి పంటనష్టం వచ్చింది. నేనే స్వయంగా పరిశీలనకువెళ్ళాను. కొండవీటి వాగు ప్రవాహం వలన ముంపుకు గురై పంటనష్టం వస్తుందని, ఆ ప్రవాహాన్ని కృష్ణ రివర్ కు మళ్ళిస్తే మంచిదని సూచించడం జరిగింది. రాజధాని నిర్మాణం లో ఇదంతా పరిష్కారం అవుతుంది. ఇప్పుడు రాజదానిపై అంతచర్చ అవసరమా లేక పక్కదారిపట్టించడానికా?.

నేను, మా మిత్ర బృందం సైకిళ్ళపై తిరిగినపుడు నవ్వులూరు మొదలు రాజధాని పరిసర గ్రామాలకు వెళ్ళాము. స్థానికులతో కలిశాము. అంతా సంతృప్తి వ్యక్తపరిచారు. చిన్న చిన్న లోపాలుండవా అంటే వుంటాయి. అది పరిష్కారం కానిది మాత్రం కాదు.

నూతన ముఖ్యమంత్రి కేవలం చంద్రబాబును ద్రుష్టిలో పెట్టుకునే అడుగులువేయడమంటే అది తప్పుటడుగులే అవుతుంది. ఒకసారి నా ఉపన్యాసం విన్న ఓ సైకాలజిస్టు నాతో చెప్పినమాట "నీప్రత్యర్ధి బీజేపీని గురుంచి నూరు మార్లు మాట్లాడి, మీ పార్టి నిగురుంచి పదిమార్లు మాత్రమే మాట్లాడావు. ఒక విధంగా నీవే ప్రత్యర్ది పార్టీకి ప్రచారకర్తగా నీకు తెలియకనే మారిపోయావు అన్నాడు. ప్రస్తుతం జగన్మోహన్ రెడ్డిది కూడా ఇదే తంతు . " ఆపెద్దమనిషి , సిగ్గులేని చంద్రబాబు" అని పదేపదే వుటకించడంద్వారా, ఈప్రభుత్వం చేసే సానుకూల పనులు స్థానే, ప్రత్యర్దులను గురించి కాలం వృధా చేసుకుంటున్నాడు.

రాజశేఖర్ రెడ్డి ముఖ్యమంత్రి అయిన కొత్తల్లో చంద్రబాబునుద్దేశించి ఏకవచనం వాడేవారు. అపుడు సినీ నటులు పచ్చిపులుసు సుబ్రమణ్యం " చంద్రబాబును ఏకవచనంతో సంబోదించకండి సార్" అని సలహా ఇచ్చారు. దానికి వైఎస్సార్ యెందుకు? అలానే అంటాను అని వెళ్ళారు. కానీ ఆ మరునాడు నుండి వైఎస్సార్ వైఖరిలో మార్పుకనపడింది. " ఎంత ఎదిగితే అంతవొదిగి వుండడం" ఉత్తమం. కానీ జగన్ లో దూకుడేతప్ప హుందా తనం లేదు." అంటూ నారాయణ తన గత అనుభవాలను ప్రస్తావిస్తూ, ప్రస్తుత సీఎం వైఎస్ జగన్ వైఖరిపై తన అభిప్రాయాన్ని వ్యక్తం చేసారు. 

By
en-us Political News

  
ఎన్నికల వేళ జగన్ కు షాకుల మీద షాకులు తగులుతున్నాయి. ఇన్నాళ్లే జగన్ మాటే శాసనం అన్నట్లుగా అణిగిమణిగి ఉన్న వారంతా సరిగ్గా ఎన్నికల ముంగిట ధిక్కార స్వరం వినిపిస్తున్నారు. పార్టీపై తిరుగులేని పట్టు ఉందని భావిస్తున్న జగన్ కు ఆ పట్టు జారిపోవడం కళ్లముందు కనిపించేలా చేస్తున్నారు. టికెట్ నిరాకరించిన, సిట్టింగ్ స్థానాన్ని మార్చిన ఎమ్మెల్యేలు, ఎంపీలు ఇప్పటికే పార్టీని వీడి వలసబాట పట్టారు.
సంసారంలో నిస్సంగత్వంతో ఎలా జీవించాలో గురువు బోధిస్తాడు. మనల్ని సంసారబంధాల నుండి విముక్తుల్ని చేయడానికి తోడ్పడతాడు. కానీ అనేక జన్మల సంస్కారాల వల్ల మనలో సంసారాసక్తి సన్నగిల్లకపోవడంతో గురుబోధ అవగాహన చేసుకొనే మనోపరిపక్వత కలగదు.
ఏద‌యినా ఒక వ‌స్తువు ఇంట్లోంచి పోయిందంటేనే ఎంతో బాధ‌గా వుంటుంది. ఎంతో ఇష్ట‌ప‌డి కొనుక్కున్న వ‌స్తువు చేజారి ప‌డి ప‌గిలిపోయినా, దొంగ‌త‌నం జ‌రిగినా, ఎక్క‌డో మ‌ర్చిపోయినా చాలా బాధేస్తుంది. దాన్ని తిరిగి పొంద‌లేమ‌ని దిగులు ప‌ట్టుకుం టుంది. కానీ 101 ఏళ్ల చార్లెటి బిషాఫ్ కు ఎంతో ఇష్ట‌మ‌యిన పెయింటింగ్ రెండో ప్ర‌పంచ యుద్ధ స‌మ‌యంలో దూర‌మ‌యింది. 80 ఏళ్లు దాని కోసం ఎదురు చూడ‌గ‌లి గింది. అదంటే మ‌రి ఆమెకు ప్రాణ స‌మానం. చాలా కాలం దొరుకుతుంద‌ని, త‌ర్వాత ఇక దొర‌కదేమో అనీ ఎంతో బాధ‌పడింది. ఫిదా సినిమాలో హీరోయిన్ చెప్పినట్లు ఆమె గట్టిగా అనుకుని ఉంటుంది. అందుకే కాస్త ఆలస్యమైనా.. కాస్తేంటి ఎనిమిది దశాబ్దాలు ఆలస్యమైనా ఆమె పెయింటింగ్ ఆమెకు దక్కింది. ఆ పెయింటింగ్ గ‌తేడాది ఆమెను చేరింది.
ఓ వంక ఐదు రాష్ట్రాల అసెంబ్లీ ఎన్నికలు జరుగుతుంటే, మరో వంక జాతీయ స్థాయిలో, బీజేపీ, కాంగ్రెస్ పార్టీలకు తృతీయ ప్రత్యాన్మాయంగా థర్డ్ ఫ్రంట్ ఏర్పాటు ఆలోచనలు  జోరందుకున్నాయి. ఇటీవల కాంగ్రెస్ పార్టీకి రాజీనామా చేసిన ఆ పార్టీ సీనియర్ నాయకుడు, పీసీ చాకో, నేషనలిస్ట్ కాంగ్రెస్ పార్టీ(ఎన్సీపీ)లో చేరారు...
తెలంగాణ  రాష్ట్ర బడ్జెట్ 2021-22ను ఆర్థిక మంత్రి హరీష్ రావు, ఈ నెల18న సభలో ప్రవేశ పెడతారు.కరోనా కారణంగా, ప్రస్తుత ఆర్థిక సంవత్సరం (2020-21)లో ఎదురైన ఆర్థిక ఇబ్బందుల నేపధ్యంగా ప్రవేశపెడుతున్న బడ్జెట్ కావడంతో  సహజంగానే అందరిలోనూ ఆసక్తి నెలకొంది...
అబద్ధాలు, అర్థ సత్యాలు, వ్యక్తిగత దూషణలు, అర్ధంపర్ధం లేని ఆరోపణలతో సుమారు నెలరోజులకు పైగా తెలంగాణలో సాగుతున్న పట్టభద్రుల ఎమ్మెల్సీ ఎన్నికల ప్రచారానికి శుక్రవారం సాయంత్రంతో  తెర పడింది.రాష్ట్రంలోని మహబూబ్‌నగర్‌-హైదరాబాద్‌-రంగారెడ్డి పట్టభద్రుల నియోజకవర్గంతో పాటుగా,నల్లగొండ-ఖమ్మం-వరంగల్‌ స్థానానికి ఫిబ్రవరి 16 తేదీన నోటిఫికేషన్ వెలువడినా, ఎన్నికల ప్రచారం మాత్రం అంతకు చాలా ముందే అభ్యర్ధుల స్థాయిలో స్థానికంగా ఎన్నికల ప్రచారం ప్రారంభమైంది. 
​సహజంగా కష్టాల్లో ఉన్నపుడు ఎవరికైనా దేవుడు గుర్తు వస్తారు. లౌకిక వాద రాజకీయ నాయకులకు అయితే హటాత్తుగా  తాము హిందువులం అనే విషయం జ్ఞప్తికి వస్తుంది. పశ్చిమ బెంగాల్ ముఖ్యమంత్రి, తృణమూల్ పార్టీ అధినాయకురాలు మమతా బెనర్జీకి   కూడా తానూ హిందువును అనే విషయం ఇప్పుడు గుర్తుకొచ్చింది.
దేశంలోని ఉత్తరాది రాష్ట్రాలలో అటు కాంగ్రెస్ ఇటు స్థానికంగా ఉన్న ప్రాంతీయ పార్టీలను మట్టి కరిపిస్తూ అధికారాన్ని కైవసం చేసుకుంటున్న బీజేపీ.. దక్షిణాదికి వచ్చేసరికి ఒక్క కర్ణాటకలో తప్ప ఇతర రాష్ట్రాలలో ఎన్ని ప్రయత్నాలు చేసినా ఏమాత్రం సక్సెస్ కాలేకపోతోంది...
జయలలిత జీవించి ఉన్నత కాలం, ఆమె నెచ్చలిగా పేరొందిన శశికళ, తమిళ రాజకీయాల్లో ఓ వెలుగువెలిగారు. కొన్ని విషయాల్లో జయలలిత కంటే, ఆమె మోర్ పవర్ఫుల్ లేడీ అనిపించుకున్నారు. ముఖ్యమంత్రులు, మంత్రులు కూడా ఆమె ముందు చేతులు కట్టుకుని నిలుచున్నారు.ఆమెకు పాదాభివందనాలు చేశారు.
కాంగ్రెస్ పార్టీలో రగులుతున్న అంతర్యుద్ధం కొత్త పుంతలు తొక్కుతోంది. మరిన్ని మలుపులు తిరుగుతోంది.ఇటీవల జమ్మూలో సమావేసమైన జీ 23 నాయకులు  అసమ్మతి స్వరాన్ని పెంచారు...
పంచతంత్రంగా పిలుచుకుంటున్న ఐదు రాష్టాల అసెంబ్లీ ఎన్నికల్లో అద్భతం జరగబోతోంది. కేంద్ర ఎన్నికల సంఘం నాలుగు రాష్ట్రాలు, కేంద్రపాలిత ప్రాంతం పుదుచ్చేరి అసెంబ్లీ ఎన్నికల షెడ్యూలు ప్రకటించిన వెంటనే, వివిధ సంస్థలు అసెంబ్లీ ఎన్నికలు జరిగే  అస్సాం. పశ్చిమబెంగాల్, తమిళనాడు రాష్ట్రాలతో పాటుగా కేరళలోనూ ఒపీనియన్ పోల్స్ నిర్వహించాయి...
కేంద్ర ఎన్నికలసంఘం ‘పాంచ్ పటాక’ గంట కొట్టింది. అస్సాం, పశ్చిమ బెంగాల్, కేరళ, తమిళనాడు రాష్ట్రాలు, పుదుచ్చేరి కేంద్ర పాలిత ప్రాంతాల అసెంబ్లీ ఎన్నికల షెడ్యూలును కేంద్ర ఎన్నికల సంఘం విడుదలచేసింది. ఎన్నికల గంట మోగడంతో మొదలైన మరో భారత ‘మినీ’  సంగ్రామానికి మే 12 తేదీన జరిగే ఓట్ల లెక్కింపుతో తెర పడుతుంది.ఈలోగా వివిధ అంచల్లో పోలింగ్ జరుగుతుంది.  
నాలుగు రాష్టాలు అస్సాం, పశ్చిమ బెంగాల్ తమిళనాడు,కేరళ, కేంద్ర పాలిత ప్రాంతం పుదుచ్చేరి శాసన సభలకు  మరో రెండు నెలల్లో ఎన్నికలు జరుగుతాయి. ఇది అందరికీ తెలిసిన విషయం.
 
Disclaimer:
All content included on this TeluguOne.com Portal including text, graphics, images, videos and audio clips, is the property of ObjectOne Information Systems Ltd. or our associates, and protected by copyright laws. The collection, arrangement and assembly of all content on this portal/ related channels is the exclusive property of ObjectOne Information Systems Ltd. or our associates and protected copyright laws.
 
You may not copy, reproduce, distribute, publish, display, perform, modify, create derivative works, transmit, or in any other way exploit any part of copyrighted material without permission from ObjectOne Information Systems Ltd or our associates.