కోవిడ్ నాల్గవ విడత వస్తుందా ?
Publish Date:Apr 27, 2022

Advertisement
ప్రస్తుతం ప్రపంచ వ్యాప్తంగా ముఖ్యంగా కోవిడ్ పుట్టినిల్లు చైనా షాంఘై లో కోరోనా విజ్రుం భిస్తూ ఉండడం తో ప్రభుత్వం కోవిడ్ ఆంక్షలు ఖటినంగా అమలు చేస్తూ ఉండడం తో. ప్రస్తుతం అందుతున్న సమాచారం ప్రకారం 5౦,౦౦౦ కు పైగానే మరణించి ఉండవచ్చని పేర్కొన్నారు. కాగా ఆహారం అందక వైద్యం అందక మరనిస్తున్నా రని సమాచారం. ఇది ఇలా ఉంటె ప్రపంచం లోని ఇతర దేశాలలో ను ఎక్స్ ఇ ఒమైక్రాన్ వేరియంట్ సబ్ వేరియంట్ బి1 బి 2 వేరియంట్ ప్రభావం చూపడం ఖాయమని.ఇప్పటికే భారత్ లో మహారాష్ట్రా ,ఢిల్లీకేరళా,ఎం పి లోనూ కోవిడ్ కేసులు పెరగడం పై కేంద్రం అప్రమత్త మైంది.ఈమేరకు రాష్ట్రాలను అప్రమత్తం చేసింది. కోవిడ్ నాల్గవ వేవ్ భయంకరంగా వ్యాప్తిచెందు తుందని. ఈ సమయం లో మనల్ని మనం స్వయంగా రక్షించుకునేందుకు 5 అంశాలను గుర్తుంచుకోవడం తప్పసరి అని నిపుణులు సూచిస్తున్నారు.వాటిని అనుసరించడం అత్యవసరమని నిపుణులు హెచ్చరిస్తున్నారు.అప్పుడే మనం కోరోనా వైరస్ వ్యాప్తిని నిలువరించగలం ప్రపంచ వ్యాప్తంగా మరోసారి కోవిడ్19 వేరియంట్ లో చాలా రకాల మార్పులు వస్తున్నాయి.ఇందులో భారత్ కూడా చేరింది. కోరోనా వైరస్ సంబంధిత అంశాల పై అప్రమత్తంగా ఉండాలి.అన్న విషయం మరిచిపోవద్దు.వీటిని ఖచ్చితంగా అమలు చేయడం ముఖ్యం మహామ్మారి ప్రా రం భం నుండి వైరస్ నుండి రక్షణ పొందేందుకు మాస్క్ ధరించడం చేయిని పరిశుభ్రంగా ఉంచుకోవడం అంశాలను సూచించారు.
కోరోనా 4వ వేవ్...
నేటికీ ప్రపంచ వ్యాప్తంగా కోరోనా వైరస్ పెరగడానికి ప్రధాన కారణం మన శరీరం కోరోనా వైరస్ కు మన శరీరం ఒక బలమైన స్థావరంగా మారడమే. వైరస్ తీవ్రతను నిలువరించాలంటే ఒకటే పద్ధతి వ్యాప్తిని నిలువరించాలి.మనం ఒక వ్యక్తి నుండి మరో వ్యక్తికి వైరస్ సోక కుండా వైరస్ ను నిలువరించ గలిగితే మన వాతావరణం లో వైరస్ ప్రభావం తగ్గ వచ్చు. మనం అప్రమత్తం గా ఉండాల్సిన అవసరం ఉంది.కోవిడ్ సంభందిత 5 విషయాలు గుర్తుంచుకోవాలి వాటిని అమలు చేయాలి.
మాస్క్...
కోరోనా వైరస్ నుండి రక్షింప బడాలంటే మాస్క్ ధరించడం తప్పనిసరి ఎలాంటి మాస్క్ అంటే ముక్కు,మొఖం చెవులను గట్టిగా పట్టి ఉంచే మాస్క్ ధరించాలి.దాని వల్ల వైరస్ మనశరీరం లోకి చొరబడదు. లేదా వైరస్ బయటికి వెళ్ళలేదు.ఊహాన్ లో మొదటి సారి వైరస్ వ్యాప్తి చెందుతోందన్న విషయం తెలిసినప్పుడు ఆరోగ్యనిపుణులు అందరినీ ముందుగా మాస్క్ ధరించాలని సూచించారు. పరిశోదనలో సైతం బట్ట తో తయారు చేసిన మాస్క్ వైరస్ సంక్రమించకుండా కొంత నియంత్రిస్తుంది.
సమూహం లో పాల్గొనవద్దు....
మాస్క్ ధరించడం తో పాటు మనం జనం ఎక్కువగా ఉన్న సమూహం లో కి వెళ్ళకుండా ఉండటం వల్ల మనల్ని మనం కోవిడ్ బారిన పడకుండా కాపాడుకోవచ్చు. ఇలాంటి ప్రాంతాలలో కోరోనా సోకే అవకాశం ఎక్కువగా ఉంది. ఇది భయకంపితుల్ని చేస్తుంది.అవసరం లేకుంటే ఇంటినుంచి రాకుండా ఉండడం అన్నిటికన్నా ఉత్తమ మైన మార్గం.మనల్ని మనం రక్షించుకోవచ్చు. ఇలాంటి సమూహాల లోనే కోరోనా సోకే అవకాసం ఎక్కువగా ఉందని నిపుణులు పేర్కొన్నారు.ముఖ్యంగా పెళ్ళిళ్ళు,పుట్టిన రోజు పార్టీలు వంటి వాటిలో సమూహలాలో వెళ్ళ వద్దని మీరు తప్పనిసరిగా వెళ్ళాల్సి వస్తే ఒక మీటరు దూరం పాటించాలని మాస్క్ తొలగించవద్దని నిపుణులు సూచిస్తున్నారు.
క్వారన్ టైన్ పాటించండి...
ఒకవేళ మీకు కోరోనా సోకిందన్న అనుమానం విషయాన్ని గమనిస్తే మీకు మీరుగా క్వారన్ టైన్ లోకి వెళ్ళిపోవడం అన్నివిధాలా ఉత్తమం. కోవిడ్ మహమ్మారి ప్రారంభమైనప్పటి నుంచి ఆసమయం లో ఆరోగ్య సేవలు అందించే సంస్థలు.కోరోనా సోకినా వ్యక్తిని క్వారన్ టైన్ చేయడం ద్వారా వైరస్ సోకకుండా నిలువరించవచ్చు.అసలు క్వారన్ టైన్ అంటే యునాని వైద్యులు చెప్పిన వివరాల ప్రకారం దీర్ఘ కాలం యాత్ర చేసివచ్చిన వ్యాపారులను ఊరికి దూరంగా వేరే గదిలో ఉంచేవారని వారిని దాదాపు 4౦ రోజులు క్వారన్ టైన్ లో ఉంచేవారని క్వారన్ టైన్ అంటే 14 రోజులు కాదని యునాని వైద్యులు పేర్కొన్నారు.కోవిడ్ సోకిన వ్యక్తిని వేరొకరికి దూరంగా మరో రూములో ఉండాలని నిపుణులు సూచించారు.
వైరస్ సోకిన వ్యక్తినుండి మరొకరికి సోకకుండా జాగ్రత పడడమే దీనిముఖ్య ఉద్దేశం.ముఖ్యంగా వృద్దులు, చంటి పిల్లలు ఉంటె మీరు ఐసోలేషణ్ అయ్యేందుకు సిద్ధం కావాలని ఈరకంగా మీరు మీకుటుంబం కోరోనా నుండి రక్షించుకోవచ్చు.
చేతులను శుభ్రం చేసుకోవడం...
2౦2౦ లో వచ్చిన కోవిడ్ ప్రారంభ మైన నాటి నుండి చాలా ఎక్కువగా సానిటైజ్ చేసుకునే వారు.మనలో చాలా మంది ఇప్పటికీ సానిటైజ్ చేసుకోవడం దాదాపు మర్చిపోయారు. చేతులు శుభ్రం చేసుకోవడం సానిటైజ్ చేయడం కేవలం కోవిడ్ కోసం కాదు.చాలా రకాల వ్యాధులు విస్తరించకుండా కాపాడుకోవడం లో కీలక పాత్ర పోషిస్తుందని నిపుణులు విశ్లేషించారు.మన చేతిని మనకు తెలియకుండానే ఎక్కడ ఎక్కడో పెడతాం అతరువాత అదే చేతులతో ముఖం కడుక్కోవడం లేదా అలాగే ఆహారం తినడం వైరస్ వ్యాపించే అవకాశాలు ఎక్కువగా ఉన్నాయి.బయటి వెళ్లి వచ్చాక మళ్ళీ మల్లె చేతులను కడుక్కోవడం లేదా సానిటైజ్ ఉపయోగించాలన్న సూచిస్తున్నారు.అన్నం తినేముందు ఆతరువాత చేతిని శుభ్రంగా కడగాలి.
వ్యాక్సినేషన్ బూస్టర్...
ఇప్పటివరకూ కోవిడ్ తీవ్రత కోవిడ్ వ్యాప్తి నిరోధించడం లో కేవలం వ్యాక్సిన్ చాలా విజయ వంతంగా పనిచేస్తోందని నిపుణులు అంచనా వేస్తున్నారు. కాగా భారత్ లో దాదాపు 9౦ % వ్యాక్సినేషన్ పూర్తికావడం తో కొంత మేరా కోవిడ్ విజ్రుం భణ ను కొంత మేర నిలువరించగలిగామని నిపుణులు అభిప్రాయ పడ్డారు.నిపుణుల అంచనా ప్రకారం ఒమైక్రాన్ కారణంగా వచ్చిన కోవిడ్ వల్ల మూడవ వేవ్ చాలా తక్కువ ప్రభావం ఉందని ఆసుపత్రులలో చేరిన వారి సంఖ్య తగ్గిందని కేంద్ర ఆర్గ్యశాఖ వెల్లడించింది.దీనికి కారణం వ్యాక్సినేషన్ వల్ల వ్యాక్సిన్ వైరస్ తో పోరాడే రక్షణ వ్యవస్థను అందించిందని నిపుణులు విశ్లేషిస్తున్నారు.వ్యాక్సినేషన్ అయిన కొన్ని నెలల తరువాత అది బలహీన పడుతుందని సరైన సమయం లో వ్యాక్సిన్ వేయించుకోవడం మర్చిపోరాదని పిల్లలను అంటుకోకుండా జాగ్రతలు తీసుకోవడం తోపాటు చాలా రకాల సందేహాలు తప్పుడు వార్తలు నుండి దూరంగా ఉండాలని
సూచించారు.
http://www.teluguone.com/news/content/covid-4th-wave-concerns-34-135054.html












