ప్రభుత్వ ఉద్యోగి విధి నిర్వహణలో మరణిస్తే కారుణ నియామకం కింద అతని కుటుంబంలో ఒకరికి ఉద్యోగం ఇస్తారు. మన దేశంలో ఇది చాలా కాలంగా అమలులో ఉంది. ఇలాంటి ఉద్యోగాల్లో ఎక్కువగా తల్లిదండ్రుల నుంచి కొడుక్కి... కుమారులు లేకపోతే కూతురుకు వస్తుంటాయి. కాని తమిళనాడులో మాత్రం ఓ ప్రభుత్వ ఉద్యోగి అకాల మరణంతో.. కారుణ్య నియామకం కింద వచ్చే ఉద్యోగం కోసం కూతురు, కోడలు పోటీ పడ్డారు. పంచాయితీ ఎటూ తేలకపోవడంతో కోర్టును ఆశ్రయించారు. ఇరువర్గాల వాదనలు విన్న మద్రాసు హైకోర్టు ఎట్టకేలకు ఇద్దరి మధ్య రాజీ కుదిర్చింది.
విలేజ్ అస్టిస్టెంట్గా విధులు నిర్వర్తిస్తున్న అరుముగం అనే వ్యక్తి.. 2019లో రోడ్డు ప్రమాదంలో చనిపోయారు. ఆయన కుమారుడు కూడా గతంలోనే చనిపోయాడు. కూతురు గోమతి భర్త సైతం మృతి చెందగా.. పిల్లలతో సహా ఆమె అరుముగం కుటుంబంతో కలిసి ఉంటోంది. అరుముగం కుమారుడు చనిపోవడంతో.. కోడలు సంగీత జీవనం కూడా కష్టమైపోయింది. దీంతో మామగారి ఉద్యోగాన్ని తనకు ఇప్పించాలని అధికారులను కోరింది. ఇదే సమయంలో తనూ భర్తను కోల్పోయానని కుటుంబ పోషణ భారంగా మారిందని అరుముగం కూతురు కూడా ఈ ఉద్యోగం తనకే కావాలని కోరింది.
అరుముగం ఉద్యోగం కోసం ఒకే కుటుంబంలో వివాదం తలెత్తడంతో అధికారులు ఏమీ చేయలేకపోయారు. ఈ విషయంలో ప్రభుత్వం ఏ నిర్ణయం తీసుకోకపోవడంతో గోమతి, సంగీత వేర్వేరుగా మద్రాసు హైకోర్టును ఆశ్రయించారు. వీరి పిటిషన్లను న్యాయమూర్తి జస్టిస్ ఎక్ వైద్యనాథన్ విచారించారు. ఈ విషయంలో ఇద్దరూ కూర్చొని మాట్లాడుకోవాలని, ఓ ఒప్పందానికి రావాలని సూచించారు. న్యాయమూర్తి సూచనకు ఇద్దరూ అంగీకరించారు.
కోర్టు సూచనతో సంగీతతో ఒప్పందం కుదుర్చుకుంది అరుముగం కూతురు గోమతి. ఉద్యోగం తనకు ఇస్తే.. ప్రతీనెల వేతనంలో 30 శాతం సంగీతకు ఇస్తానని చెప్పింది. అలాగే, ఆమె పిల్లల చదువు కోసం సంవత్సరానికి రూ.20వేలు ఇచ్చేందుకు అంగీకరించింది. ఇద్దరి మధ్య ఆ ఒప్పందాన్ని న్యాయమూర్తి ఆమోదించారు. దీంతో రెండు పిటిషన్లను కొట్టేశారు జస్టిస్ వైద్యనాథన్. ప్రతీనెలా గోమతి వేతనంలో 30 శాతం కట్ చేసి సంగీత బ్యాంకు ఖాతాలో నేరుగా జమ చేయాలని ఆదేశించారు. మూడు నెలల్లో గోమతిని విధుల్లోకి తీసుకోవాలని ధర్మాసనం తమిళనాడు ప్రభుత్వాన్ని ఆదేశించారు. రెండేళ్లుగా నడుస్తున్న ఈ వివాదం సామరస్యపూర్వకంగా ముగియడంతో అధికారులు ఊపిరి పీల్చుకున్నారు.
By Teluguone
en-us
Political News
http://www.teluguone.com/news/content/court-key-judgment-over-daughter-and-sister-in-law-fight-for-job-25-116937.html
ఏపీలో అసెంబ్లీ, పార్లమెంట్ ఎన్నికల వేళ నేతల ప్రచారం హోరెత్తుతోంది. రాష్ట్రం నలుమూలలా అభ్యర్థులు గెలుపుకోసం ప్రజల వద్దకు వెళ్లి ఓట్లు అభ్యర్థిస్తున్నారు. ఏపీ మొత్తం ఒక ఎత్తయితే గుంటూరు పార్లమెంట్ నియోజకవర్గం ఒక్కటీ ఒక ఎత్తు. ఈ నియోజకవర్గ ప్రజల్లో రాజకీయ చైతన్యం ఎక్కువ, మేధావి వర్గమూ ఎక్కువే. అలాంటి పార్లమెంట్ నియోజకవర్గంలో తెలుగుదేశం అభ్యర్థి పెమ్మసాని చంద్రశేఖర్ జెట్ స్పీడ్ తో దూసుకెళ్తున్నారు.
ఆంధ్రప్రదేశ్లో జగన్ పార్టీకి రైతులు ఓట్లు పడే అవకాశాలు ఎంతమాత్రం లేకుండా పోయాయి.. దీని వెనుక ఎన్నో
చిన్నారుల్ని ఎన్నికల ప్రచారానికి వినియోగించటం తప్పుగా పేర్కొన్న నిరంజన్ రెడ్డి ఫిర్యాదుకు ఎన్నికల సంఘం స్పందించింది. జరిగిన సంఘటనపై విచారణ జరిపించాలంటూ హైదరాబాద్ పోలీస్ కమిషనర్ ను ఆదేశించింది. దీంతో హైదరాబాద్ సీపీ కొత్తకోట శ్రీనివాస్ రెడ్డి స్పందిస్తూ.. సౌత్ జోన్ డీసీపీ స్నేహ మెహ్రాకు ఆదేశాలు జారీ చేశారు. అమిత్ షాతో పాటు.. మరో నలుగురిపైనా మొఘల్ పురా పోలీసులు కేసు నమోదు చేసి.. ఎఫ్ఐఆర్ దాఖలు చేశారు.
పదవి ఊడబోతున్న ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి జగన్మోహన్రెడ్డి నవరత్నాల పేరుతో ఏవేవో పథకాలు అనౌన్స్ చేసి 2019లో
తన అన్న, ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి జగన్ మానసిక పరిస్థితి మీద తనకు అనుమానంగా వుందని ఆయన సోదరి,
ఈ ఏడాది దీపావళి పండగ కొద్ది నెలల ముందే రాబోతోంది. ఈ ఏడాది మే 13న నరక చతుర్దశి, జూన్ 4న దీపావళి రానున్నాయి
ఇది ప్రపంచ వింతల్లో ఎన్నో నంబర్ అవుతుందో తెలియదుగానీ, ఇది నిజంగానే ప్రపంచ వింతే! మజ్లిస్ పార్టీ అధినేత,
సోనియా గాంధీ, రాహుల్ గాంధీలు ఇప్పటికే పార్లమెంట్లో ఉన్నారు. ఇప్పుడు తాను కూడా పోటీ చేసి గెలిస్తే. గాంధీ కుటుంబలో ఉన్న ముగ్గురూ. చట్టసభలో కూర్చున్నట్టు అవుతుంది. ఇది బీజేపీకి మరో అస్త్రంగా మారుతుందని ప్రియాంక గాంధీ భయపడ్డారు.
అమెరికాలో నర్సుగా పనిచేసిన 41 ఏళ్ళ హీథర్ ప్రెస్డీ అనే మహిళకు కోర్టు 7 వందల సంవత్సరాల జైలు శిక్ష విధించింది.
గంజాయి వ్యాపారం సామ్రాజ్యాన్ని సృష్టించిన వారిని గుంజీలు తీయిస్తానని పెమ్మసాని హెచ్చరించారు. గుంటూరులో ఎమ్మెల్యే స్థాయి వ్యక్తి గుట్కా, గంజాయి అమ్ముతున్నాడని ఘాటుగా విమర్శించారు. గుంటూరు జిల్లాను గంజాయి మత్తులో ముంచుతారా అంటూ నిలదీస్తున్నారు. గంజాయి మొక్కలను పీకి పారేస్తా అంటూ వార్నింగ్ ఇచ్చారు.
హైదరాబాద్ నుయూటీ చేసే కుట్ర జరుగుతున్నదని,దాన్ని తిప్పి కోట్టాలని బీఆర్ఎస్ అందుకున్న కొత్త పల్లవి కేవలం తెలంగాణ సెంటిమెంట్ ను రెచ్చగొట్టి లోక్ సభ ఎన్నికలలో లబ్ధి పొందే ఎత్తుగడేనని పరిశీలకులు విశ్లేషిస్తున్నారు. హైదరాబాద్ నగరాన్ని యూటీ చేయాలని బీజేపీ కుట్ర చేస్తున్నదని బీఆర్ఎస్ ఎమ్మెల్యే కేటీఆర్ ఇటీవల ఆరోపించారు.
స్త్రీ, పురుషుల వైవాహిక స్థితి ఎలా వున్నప్పటికీ, పరస్పర అంగీకారంతో ఇద్దరు స్త్రీ పురుషులు శారీరక సంబంధం కలిగి వుంటే దాన్ని నేరం
రాజకీయ నాయకులంటే జనం చెవుల్లో పూలు పెట్టకపోతే కుదరదు. తెలంగాణ ప్రజల చెవుల్లో ఇప్పటి వరకు బీఆర్ఎస్ నాయకులు