శ్రీలక్ష్మికి మధ్యంతర బెయిల్

Publish Date:Mar 30, 2013

Advertisement

 

ఓబుళాపురం మైనింగ్ అక్రమాల్లో సీనియర్ ఐ.ఏ.ఎస్. అధికారి శ్రీలక్ష్మికి సిబీఐ కోర్టు  మధ్యంతర బెయిల్ మంజూరు చేసింది. శ్రీలక్ష్మి తనకు తానుగా లేచి నిలబడలేని పరిస్థితి, ఎడమ కాలు పూర్తిగా స్వాధీనం తప్పే స్థితికి వస్తుండటం, ఆరోగ్యం బాగా దెబ్బతినడం, తోటి ఖైదీలు ఆమెకు చేస్తున్న సపర్యలు వీటన్నింటినీ పరిగణలోకి తీసుకుని సిబీఐ కోర్టు మానవతా దృక్పథంతో మధ్యంతర బెయిల్ మంజూరు చేసింది. శ్రీలక్ష్మి పాత్రపై దర్యాప్తు పూర్తయినా, అనారోగ్యంతో అవస్థలు పడుతున్నా బెయిల్ కు అడ్డుపడటం సిబీఐ తీరుకు నిదర్శనమని డిఫెన్స్ లాయర్ వాదనతో ఏకీభవించిన జడ్జి దుర్గాప్రసాద్ తదుపరి ఉత్తర్వులు వచ్చేవరకు శ్రీలక్ష్మికి మధ్యంతర బెయిల్ పొడిగిస్తున్నట్లు తీర్పు నిచ్చారు.

By
en-us Political News

  
ఆంధ్రప్రదేశ్ లో మార్పు ఖాయమని తేలిపోయింది. మార్చి 13న రాష్ట్ర ప్రజలు మొక్కవోని ధైర్యంతో, మార్పు కావాలన్న సంకల్పంతో ఎన్నో అవరోధాలు ఎదుర్కొని మరీ పోలింగ్ బూత్ లకు వచ్చి గంటల తరబడి నిలబడి మరీ ఓటు వేశారు. తమ ఓటు హక్కు వినియోగించుకుని రాష్ట్రాన్ని అభివృద్ధి కాముకుడి చేతుల్లో పెట్టాలన్న పట్టుదలతో రాష్ట్రాలు, దేశాలలో స్థిరపడి కొలువులు చేసుకుంటున్నవారు కూడా స్వస్థలాలకు ఎన్నో వ్యయప్రయాశలకు ఓర్చి మరీ వచ్చారు. దీంతో రాష్ట్రంలో భారీగా పోలింగ్ జరిగింది. ఈ పోలింగ్ సరళి వైసీపీ పెద్దల మైండ్ బ్లాక్ చేసింది.
మధ్యం మత్తులో యువతీ యువకుల అరాచ‌కాల‌కు అడ్డూ అదుపూ లేకుండా పోతోంది. డ్రగ్స్ , గంజాయి తదితర మత్తుపదార్ధాలకు అలవాటుపడి నేషనల్ హైవే రోడ్ పై, ప‌బ్లిక్ ప్లేస్‌ల‌లోనే గొడవపడుతున్నారు.
తెలంగాణ ఎంసెట్ ఫలితాల్లో బాలికలదే పై చేయిగా నిలిచింది. ఈ నేపథ్యంలో  తెలంగాణలో పాలిసెట్ కౌన్సెలింగ్ షెడ్యూల్ విడుదలైంది. రెండు విడుతల్లో కౌన్సెలింగ్ ఉండనుంది. జూన్ 20న పాలిసెట్ కౌన్సెలింగ్ ప్రారంభం కానుంది.
ఆర్మూరు మాజీ ఎమ్మెల్యే జీవన్ రెడ్డి అరాచకాలు అన్నీ ఇన్నీ కావు. ఆయన నేర చరిత్ర ఒక్క ఆర్మూర్ ప్రజలకే కాకుండా హైదరాబాద్ శివారు ప్రాంత వాసులకు కూడా బోధపడింది. ఇప్పటికే ఆర్మూరులో భూ కబ్జా ఆరోపణలు ఎదుర్కొంటున్న జీవన్ రెడ్డి చేవెళ్ల నియోజకవర్గంలో కూడా భూ కబ్జాలు చేసిన ఆరోపణతో  కొత్త చరిత్ర సృష్టించారు. 
ఎపిలో కూటమి ప్రభుత్వం అధికారంలో వస్తుందని కన్ఫర్మ్ అయ్యింది. వచ్చే నెల నాలుగో తేదీన వచ్చే ఫలితాల తర్వాత టిడిపి జాతీయాధ్యక్షుడు చంద్రబాబునాయుడు ముఖ్యమంత్రి పదవి అధిరోహిస్తున్న నేపథ్యంలో తప పరిపాలనలో ఇబ్బందులు లేకుండా జాగ్రత్త పడుతున్నారు.   టీడీపీ అధినేత చంద్రబాబు యూనియన్ పబ్లిక్ సర్వీస్ కమిషన్ (యూపీఎస్సీ)కి లేఖ రాశారు. ఐఏఎస్ కన్ఫర్మేషన్ ప్రక్రియను వాయిదా వేయాలని కోరారు. 
ప్రముఖ పుణ్యక్షత్రం కేదార్‌నాథ్‌లో హెలికాప్టర్ ప్రమాదం జస్ట్ మిస్సయింది.
తిరుమలలో వేసవి రద్దీ విపరీతంగా పెరిగిన నేపథ్యంలో తిరుమల తిరుపతి దేశస్థానం కీలక నిర్ణయం తీసుకుంది. వారాంతాలలో వీఐపీ బ్రేక్ దర్శనాన్ని రద్దు చేసింది. వచ్చే నెల 30వ తేదీ వరకూ శుక్ర, శని, ఆదివారాలలో వీఐపీ బ్రేక్ దర్శనాన్ని రద్దు చేస్తున్నట్లు ప్రకటించింది.
ఆ ఒక్కపదం.. తెలుగువారందరికీ నచ్చుతుంది కానీ, జగన్‌కి మాత్రం ఎంతమాత్రం నచ్చదు.. ఆ ఒక్కపదం మరేదో కాదు... అమరావతి.
సాధారణంగా నాయకులు ఎన్నికలు పూర్తయిన తరువాత కౌంటింగ్ కు మధ్య ఉన్న సమయంలో విదేశాలకు వెళ్లి సేదతీరుతూంటారు. నిర్విరామంగా ప్రచార కార్యక్రమాలలో పాల్గొన్న అలసట నుంచి తేరుకోవడానికి విదేశీ పర్యటనలు పెట్టుకుంటారు. అయితే తెలుగుదేశం నాయకుడు, మాజీ మంత్రి పొంగూరు నారాయణ మాత్రం అటువంటి వారికి భిన్నం.
విజయసాయి.. సామాజిక మాధ్యమంలో ప్రత్యర్థులపై విషం కక్కుతూ, అనుచిత భాషలో పోస్టులు పెట్టడంలో సిద్ధహస్తుడు. విజయసాయి తాజా ఎన్నికలలో తొలి సారిగా పోటీ చేశారు. ఆయన మూడేళ్లకు పైగా విశాఖ పార్లమెంటు నియోజకవర్గ పరిధిలో పని చేశారు. అక్కడ నుంచి పోటీ చేయాలని ఆశించారు. అయితే తానోటి తలిస్తే.. పార్టీ అధినేత మరోటి తలిచి చివరి క్షణంలో ఆయనను నెల్లూరు లోక్ సభ సరిధిలో దింపారు.
  మాజీ ముఖ్యమంత్రి కల్వకుంట్ల చంద్రశేఖర రావు తనయ కవితకు ఇప్పట్లో బెయిల్ లభించే సూచనలు కనిపించడం లేదు 
షామీర్ పేట మండలం బ్రోమాసిపేట చెరువు ఆక్రమణలకు గురైందని ఫిర్యాదులందుతున్న నేపథ్యంలో రెవిన్యూ అధికారులు స్పందించారు. తరచుగా భూ వివాదాలతో వార్తల్లోకెక్కిన మాజీ మంత్రి మల్లారెడ్డి తాజాగా బ్రోమాసిపేట ఫుల్ ట్యాంక్ లెవల్ లో అక్రమ నిర్మాణాలను  చేపట్టారు.
గెలుపు ఆశలు వదిలేసుకుంది. వస్తేగిస్తే ప్రతిపక్ష హోదా వస్తుంది లేకుంటే అదీ లేదని డిసైడైపోయినట్లు కనిపిస్తోంది. దింపుడు కళ్లెం ఆశతో కొందరు వైసీపీ అభ్యర్థులు మాత్రం రీపోలింగ్ కావాలంటున్నారు. ఇందుకోసం కోర్టును కూడా ఆశ్రయించారు. సుదీర్ఘ వాదనల తరువాత రీపోలింగ్ కోరుతూ వైసీపీ ఎమ్మెల్యే అభ్యర్థులు ఇద్దరు దాఖలు చేసిన పిటిషన్లను హైకోర్టు కొట్టివేసింది.
 
Disclaimer:
All content included on this TeluguOne.com Portal including text, graphics, images, videos and audio clips, is the property of ObjectOne Information Systems Ltd. or our associates, and protected by copyright laws. The collection, arrangement and assembly of all content on this portal/ related channels is the exclusive property of ObjectOne Information Systems Ltd. or our associates and protected copyright laws.
 
You may not copy, reproduce, distribute, publish, display, perform, modify, create derivative works, transmit, or in any other way exploit any part of copyrighted material without permission from ObjectOne Information Systems Ltd or our associates.