హైదరాబాద్ లో మరో ఘోరం జరిగింది. ఫేస్ బుక్ లో పరిచమైన మహిళను నమ్మించి మోసం చేశాడు. మంచివాడిగా నటిస్తూ అత్యాచారం చేశాడు. హైదరాబాద్ కూకట్ పల్లిలో జరిగిన ఈ సంఘటన స్థానికంగా కలకలం రేపింది. నిజాంపేటలో నివాసముండే మామిడి సంజీవరెడ్డికి... అమెరికా నుంచి తిరిగొచ్చి కోకాపేటలో నివాసముంటున్న ఓ మహిళతో ఫేస్ బుక్ లో పరిచయం ఏర్పడింది. 2018 జులైలో సంజీవరెడ్డి నుంచి ఫ్రెండ్ రిక్వెస్ట్ రావడంతో ఆమె అంగీకరించింది. అప్పట్నుంచి ఇద్దరూ ఫేస్ బుక్ లో చాటింగ్ చేసుకునే వారు. ఇద్దరి మధ్య స్నేహం పెరగడంతో ఫోన్ లో మాట్లాడుకోవడం మొదలుపెట్టారు. అయితే, బాధితురాలు ఒకసారి అమెరికా వెళ్లి తిరిగిరాగా... శంషాబాద్ ఎయిర్ పోర్టుకు వెళ్లి రిసీవ్ చేసుకున్న సంజీవరెడ్డి... ఆమె చెల్లెలు ఇంటి దగ్గర వదిలిపెట్టాడు. ఆ తర్వాత హోటల్లో భోజనానికి ఆహ్వానించిన సంజీవరెడ్డి... తన భార్య, మేనల్లుడిని పరిచయం చేశాడు. అయితే, ఆమె భోజనం చేసేందుకు నిరాకరించడంతో ముందుగా వేసుకున్న ప్లాన్ ప్రకారం కూల్ డ్రింక్ లో మత్తు మందు కలిపి ఇచ్చాడు.
అనంతరం అపస్మారస్థితిలోకి వెళ్లిన మహిళను నిజాంపేటలోని తన ఇంటికి తీసుకెళ్లాడు. అయితే, ఆమె దగ్గరున్న డబ్బు, బంగారు నగలపై కన్నేసిన సంజీవరెడ్డి... తన భార్య, మేనల్లుడి సహకారంతో బాధితురాలిపై అత్యాచారం చేశాడు. అత్యాచారం చేస్తుండగా వీడియో తీయించాడు. అప్పట్నుంచి డబ్బు కోసం ఆమెను బెదిరించడం మొదలుపెట్టాడు. డబ్బివ్వకపోతే రేప్ వీడియోను సోషల్ మీడియా పెడతానంటూ 50లక్షల రూపాయలు వసూలు చేశాడు. డబ్బుతోపాటు 30 తులాల బంగారం, చెక్కులు, 6వేల డాలర్లు బలవంతంగా లాక్కున్నాడు. అయితే, రోజురోజుకీ వేధింపులు ఎక్కువ కావడంతో తట్టుకోలేక బాధితురాలు పోలీసులను ఆశ్రయించింది. దాంతో, రంగంలోకి దిగిన పోలీసులు నిందితులు సంజీవరెడ్డి, అతని భార్య కావేరితోపాటు మేనల్లుడు విశాల్ ను అరెస్ట్ చేసి రిమాండ్ కి తరలించారు.
అయితే, సమాజంలో జరుగుతున్న నేరాలు ఘోరాలపై అటు పోలీసులు ఇటు మీడియా అప్రమత్తం చేస్తున్నా... ఉన్నత చదువులు చదువుకున్న మహిళలు... అమెరికాలో ఉండొచ్చిన వాళ్లు కూడా మోసపోవడం ఆందోళన కలిగిస్తోంది. అపరిచితులనే కాదు తెలిసినవాళ్లను, బంధువులను కూడా నమ్మొద్దంటూ పోలీసులు విస్తృతంగా అవేర్ నెస్ కల్పిస్తున్నా... ఫేస్ బుక్ లో పరిచయమైన వ్యక్తిని గుడ్డిగా నమ్మి అతను చెప్పిన చోటికి వెళ్లడం విమర్శలకు తావిస్తోంది. ఇఫ్పుడైనా, ఇలాంటి దారుణ సంఘటనల నుంచి గుణపాఠం నేర్చుకుని ఎవరికివాళ్లు జాగ్రత్తలు తీసుకోకపోతే... మోసగాళ్ల చేతిలో ఇలా అత్యాచారాలకు, మోసాలకు బలైపోతూనే ఉంటారు. అందుకే, బీ కేర్ ఫుల్ అండ్ టేక్ కేర్ లేడీస్.
By Teluguone
en-us
Political News
http://www.teluguone.com/news/content/couple-blackmailed-nri-woman-with-rape-video-in-hyderabad-25-93968.html
తమిళనాడు రాజకీయాల్లో పెను మార్పులు చోటుచేసుకుంటున్న వేళ
బెంగాల్ అసెంబ్లీ ఎన్నికల్లో బీజేపీ అఖండ విజయం సాధించడంలో సువేందు కీ రోల్ పోషించారు. ఆ పార్టీ 206 స్థానాల్లో గెలిచి బెంగాల్లో తొలిసారిగా అధికారం చేపట్టబోతోంది. బీజేపీ తరఫున రెండు స్ధానాల నుంచి బరిలోకి దిగిన సువేందు అధికారి.. మరోసారి మమతా బెనర్జీని ఓడించారు. భవానిపూర్లో దీదీపై గెలిచిన ఆయన.. తన సొంత నియోజకవర్గమైన నందిగ్రామ్లోనూ గెలిచి పట్టు నిలుపుకున్నారు.
ముఖ్యంగా అస్సాం, పశ్చిమబెంగాల్ లో బీజేపీ ఎన్నికల సంఘం సహకారంతో ఫలితాలను చోరీ చేసిందన్నారు.
పశ్చిమబెంగాల్లో మూడున్నర దశాబ్దాల ఏళ్ల సీపీఎం పాలనకు బ్రేక్ వేసి 2011లో అధికార పగ్గాలు చేపట్టిన తృణముల్ కాంగ్రెస్ అధినేత్రి మమతా బెనర్టీ.. 2026 వరకు వరుస విజయాలతో ముఖ్యమంత్రిగా కొనసాగారు. ఆమె 15 ఏళ్ల ఆధిపత్యానికి ఎన్డీఏ తెర దించింది. మమతా సైతం కాంగ్రెస్లో కేంద్రమంత్రిగా, పలు కీలక పదవులు నిర్వహించి, తర్వాత సొంత కుంపటి పెట్టుకున్న నాయకురాలే కావడం గమనార్హం.
ప్రజా సమస్యలపై స్పష్టమైన అజెండాతో ఎన్నికల బరిలోకి దిగిన విజయ్ను తమిళ ప్రజలు ఆదరించడం శుభపరిణామమన్నారు.
తన పార్టీ స్థాపించిన నాటి నుండి నేటి వరకు ఆయన సాగించిన ప్రయాణం ఒక అద్భుతమైన రాజకీయ థ్రిల్లర్ను తలపిస్తుంది. ఎన్నికల ప్రచార సమయంలో విజయ్ అనేక ఆటంకాలను ఎదుర్కొన్నారు. ప్రత్యర్థి పార్టీల నుండి వచ్చిన తీవ్ర విమర్శలు, అధికార యంత్రాంగం విధించిన ఆంక్షలు ఆయనను ఉక్కిరిబిక్కిరి చేశాయి. వ్యక్తిగత జీవితంపై జరిగిన దుష్ప్రచారం విజయ్ ఇమేజ్ను దెబ్బతీస్తుందని అందరూ భావించారు.
తమిళనాడులో టీవీకే పార్టీ విజయాన్నిస్వాగతిస్తూ.. వైసీపీ సోషల్ మీడియా వేదికగా సంబరాలు మొదలు పెట్టింది. విజయ్ సాధించిన ఈ అద్భుత విజయం వెనుక వైసీపీ అధినేత జగన్ సహకారం ఉందంటూ వైసీపీ సోషల్ మీడియాలో పెద్ద ఎత్తున పోస్టులు వెల్లువెత్తుతున్నాయి. ముఖ్యంగా గతంలో ఒక వివాహ వేడుకలో వైఎస్ జగన్, విజయ్ ఇద్దరూ కలిసి దిగిన ఒక ఫోటోను ఇప్పుడు వైసీపీ నెట్టింట వైరల్ చేస్తోంది.
ఈ ఎన్నికల ఫలితాల్లో విజయ్ టవీకే పార్టీ స్పష్టమైన ఆధిక్యత కనబరిచింది. ప్రభుత్వ వ్యతిరేకతతో పాటు, కూటమి పక్షాల మధ్య సరైన సమన్వయం లేకపోవడం కూడా ఈ ఓటమికి ప్రధాన కారణాలుగా కనిపిస్తున్నాయి.
1982లో తెలుగువారి ఆత్మగౌరవం నినాదంతో తెలుగుదేశం పార్టీని స్థాపించిన ఎన్టీఆర్, కేవలం 9 నెలల కాలంలోనే రాష్ట్రమంతటా పర్యటించి ప్రభంజనం సృష్టించారు. 1983 ఎన్నికల్లో కాంగ్రెస్ వంటి బలమైన పార్టీని మట్టికరిపించి, తొలి ప్రయత్నంలోనే ముఖ్యమంత్రి పీఠాన్ని అధిష్టించి రికార్డ్ సృష్టించారు.
భారత రాజకీయ యవనికపై భారతీయ జనతా పార్టీ తన ఉనికిని మరింత శక్తివంతం చేస్తోంది.
చారిత్రాత్మక విజయం ఖాయమని తేలడంతో.. విజయం అభిమానుల సంబరాలు మిన్నంటాయి. అయితే.. ఈ నేపథ్యంలో సినీ నటి త్రిష పేరు సోషల్ మీడియాలో విపరీతంగా ట్రెండ్ అవుతోంది.
ఈ నియోజకవర్గం నుంచిఎన్డీయూ కూటమి అభ్యర్థి మల్లాడి కృష్ణారావు విజయం సాధించారు. తన సమీప ప్రత్యర్థి, కాంగ్రెస్ అభ్యర్థి గొల్లపల్లి అశోక్ పై నాలుగువేల ఐదు వందల ఓట్ల పైచిలుకు మెజారిటీతో గెలుపొందారు.
ఎన్నికల ఫలితాల్లో ఎన్డీయే కూటమి సాధించిన ఘన విజయంపై ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు హర్షం వ్యక్తం చేశారు.