తెలంగాణలో ఇటీవల సుదీర్ఘ కాలం సాగిన ఆర్టీసీ కార్మికుల సమ్మె పెద్ద ప్రభావమే చూపింది. టీఎస్ ఆర్టీసీ కార్మికుల సమ్మెలో కొందరు కార్మికులు కూడా మరణించారు. ప్రభుత్వం వర్సెస్ ఆర్టీసీ కార్మికులు అన్నట్టుగా ఈ పోరాటం సాగింది. ఒకానొక దశలో కార్మికులు సమ్మెకు ముగింపు పలికారు. దసరాకు ముందు నుంచి మొదలైన సమ్మె కాలంలో తాత్కాలిక సిబ్బంది తోనే బస్సులను నడిపింది ఆర్టీసీ యాజమాన్యం. నాడు చర్యలు కాస్త ఉపశమనం కలిగించినా ఆ మధ్య యూనియన్ల నాయకుల సవాళ్లతో మొదలైంది అసలు కథ. సమ్మె కాలంలో నూటికి నూరుపాళ్లు అవినీతి జరిగిందని వారు బలంగా ఆరోపిస్తున్నారు. కొందరు అధికారులు అందినకాడికి దండుకున్నారుని దీనిపై విచారణ జరిపించాలని యూనియన్ నాయకులు చేసిన డిమాండ్లు ఆర్టీసీలో అంతర్గత చర్చకు దారితీశాయి. బిల్లులూ, రసీదులు అసలు లేకపోవటంతో ఆర్టీసీలో ఆ 52 రోజుల లావాదేవీల లెక్క తేలక పోవడం వారి ఆరోపణలకు బలం చేకూరుస్తోందనే గుసగుసులు వినిపిస్తున్నాయి.
అసలే అప్పుడు దసరా పండుగ సీజన్, ఆపై లెక్కాపత్రం లేని వ్యవహారం, అసలు సమ్మె కాలంలో వచ్చినది ఎంత? పోయింది ఎంత? అనే దానిపై అధికారులకు ఇప్పటికే స్పష్టత లేదు. అందుకే అసలు ఏ డిపోలు ఎంత ఆదాయం వచ్చింది, ఎంత మొత్తం ఖర్చయింది ఆ లెక్కలేమిటీ అనే దానిపై ఆర్టీసీలో ఇంటర్నల్ ఆడిటింగ్ చేశారని తెలిసింది. దాదాపు నెల రోజుల పాటు 15 డిపోలో ఆడిటింగ్ నిర్వహించగా అంతటా లెక్కలూ గజిబిజి కనిపించింది. సమ్మె తొలినాళ్లలో తాత్కాలిక కార్మికులు టికెట్ లెస్ కలెక్షన్ లతో బస్సులు నడిపారు. ఈ కారణంగా అసలు ఎంత ఆదాయం వచ్చిందనే దానిపై స్పష్టత కొరవడిందనే వాదనలు వినిపిస్తున్నాయి. అయితే మిగతా రోజులకు సంబంధించి కొంత క్లారిటీ ఉన్నప్పటికీ మొత్తంగా చూస్తే ఎక్కడో లెక్క తప్పుతుందనే టాక్ అంతర్గతంగా వినిపిస్తోందని సమాచారం. టీఎస్ ఆర్టీసీలో కొందరు అధికారులైతే సమ్మె కాలంలో అసలు ఆదాయం వచ్చిందెంతో పోయింది ఎంతో ఎవరికి తెలుసు అని నిర్లక్ష్య ధోరణిలో వ్యాఖ్యానిస్తున్నారు. పైగా అప్పుడు కార్మికులు ఎవరూ లేక పోయినా తాత్కాలిక సిబ్బందితో తాము కష్ట పడి పనిచేయించామని అధికారులు తమకు తామే కితాబిచ్చుకున్నారు.
మొత్తం 97 డిపోలలో ఆడిటింగ్ జరిగాక అసలు ఎంత డబ్బు పక్కదారి పట్టింది అనే దానిపై క్లారిటీ వచ్చే అవకాశాలున్నాయని ఆర్టీసీ కార్మికులు అనుకుంటున్నారు. అయితే ఈ తతంగ మంతా పూర్తి కావటానికి ఇంకా కొంత కాలం పడుతుందని అయినా అందులో తేలని లెక్కలు జాబితానే ఎక్కువగా ఉంటుందనీ అభిప్రాయపడుతున్నారు. ఇంటర్నల్ ఆడిటింగ్ మొత్తం పూర్తయిన సందట్లో సడేమియాలా ఎవరిదనేది తేలడం కష్టమేనని కూడా భావిస్తున్నారు.మొత్తం మీద ఆర్టీసీ సమ్మె రోజుల్లో నోటి లెక్కల కాలం సాగినందున అసలు లెక్కల ఆధారాల కోసం వెతకటం వృధా అనే అంటున్నారు. ఆడిటింగ్, విచారణల్లో బయటపడుతుందో లేక ఆరోపించినవారే ఆధారాలను బయటపెడతారో తెలియదు కానీ సమ్మె కాలంలో జరిగిన లావాదేవీల్లో అవినీతి అంశం మాత్రం తేలని గజిబిజి లెక్కగానే మిగిలిపోతోంది. పైగా అధికారుల పొంతన లేని మాటలతో ఈ అంశం సమాధానం దొరకని బేతాళ ప్రశ్నలా మిగిలి పోతుందనే వాదనలు ఉన్నాయి.
By Teluguone
en-us
Political News
http://www.teluguone.com/news/content/corruption-in-tsrtc-25-92799.html
రాఘవ్ చద్దా, ఆమ్ ఆద్మీ పార్టీ మధ్య తలెత్తిన అంతర్గత విభేదాలు ఇప్పుడు బహిరంగ యుద్ధంగా మారాయి.
న్ని ఎన్నికలలో విచిత్రాలు జరగవు. ప్రతిసారీ ఒకటే జరిగితే, దాన్ని విచిత్రం అనరు కదా? ఎన్నికలు జరిగి నిండా రెండేళ్లు కాకముందే నెల్లూరు జిల్లాలో తెలుగుదేశం పార్టీకి ఓటి పలుకు వినపడుతున్నది. కొందరు ప్రముఖులు పక్కదారులు చూస్తున్నారని, పక్క పార్టీతో బేరసారాలు జరుపుతున్నారని కూడా వినపడుతున్నది.
అమరావతికి చట్టబద్ధత కల్పిస్తూ కేంద్రం నిర్ణయం తీసుకున్న నేపథ్యంలో.. వైసీపీ అధినేత జగన్మోహన్ రెడ్డి తన పంథాను మార్చుకోలేదనేది స్పష్టమవుతోంది. ఐదేళ్ల పాలనలో మూడు రాజధానుల మంత్రం జపించిన జగన్.. ఇప్పుడు మచిలీపట్నం-విజయవాడ-గుంటూరును కలిపి ఒక మెగా సిటీగా మార్చాలనే సరికొత్త ప్రతిపాదనను ముందుకు తెచ్చారు.
మూడు రాజధానుల అంశం గత ఎన్నికల్లో వైసీపీ ఘోర పరాజయానికి ప్రధాన కారణాలలో ఒకటి అన్న విషయాన్ని విస్మరించి.. మళ్ళీ అదే తరహా ప్రత్యామ్నాయ వాదనలు వినిపించడం పట్ల రాజకీయవర్గాలలో విస్మయం వ్యక్తమౌతోంది. పార్టీ కేడర్ సైతం మావిగన్ ఏంటి అదేదో పంటకు పట్టే తెగుల్లా ఉందని నెత్తీ నోరూ బాదుకుంటోంది.
ఆ రోజు సభలో ఓ మంత్రి తనపై చెయ్యి చేసుకున్నారని పేర్కొన్నారు. మరో మంత్రి ఏకవచనంతో తిట్టిపోశారు, కులం పేరుతో దూషిస్తూ తన పుట్టుకను నిందించారన్నారు. శాసనమండలిలో తన సిబ్బందినీ దగ్గరికి రాకుండా వైసీపీ సభ్యులు అడ్డుపడ్డారని, తన చుట్టూ చేరి బెదిరింపులు, ప్రలోభాలతో రకరకాలుగా ఇబ్బంది పెట్టారన్నారు.
ప్రధాని నరేంద్ర మోడీ, కేంద్ర హోం మంత్రి అమిత్ షాలకు 5 కోట్ల మంది ప్రజల తరఫున కృతజ్ణతలు తెలిపారు. దేశం మొత్తానిది ఒక దారైతే... తమదో దారి అన్నట్లు వైసీపీ వ్యవహరించిందని దుయ్యబట్టారు. రాష్ట్రం, దేశం నాశనమైనా పర్వాలేదు.. మాకు స్వార్థ రాజకీయమే ముఖ్యమన్నట్లుగా వైసీపీ వ్యవహరించిందని విమర్శించారు.
ప్రస్తుతం తెలుగు రాష్ట్రాల్లో డ్రగ్స్ సంస్కృతి ఒక పెను సవాలుగా మారింది. ఇటీవలి కాలంలో రాజకీయ నాయకులు, ప్రముఖుల పేర్లు డ్రగ్స్ కేసుల్లో వినిపిస్తుండటం సమాజంలో తీవ్రసంచలనం సృష్టించిన సంగతి తెలిసిందే. వాస్తవ వేదిక చర్చలో డోలేంద్ర ప్రసాద్, కంఠంనేని రవిశంకర్ లు ఇది కేవలం శాంతిభద్రతల సమస్య మాత్రమే కాదనీ, సమాజ భవిష్యత్తుకు పెనుముప్పుగా పరిణమించిన ఒక సామాజిక రుగ్మత అని పేర్కొన్నారు.
ప్రస్తుతం ఎన్నికల ప్రచారంలో విజయ్ రాష్ట్రంలో విస్తృతంగా పర్యటిస్తున్నారు. ఈ క్రమంలోనే జననాయగన్ సినీమా విడుదలపై నెలకొన్న అనిశ్చితిని ఆయన ప్రజల ముందు ఉంచారు. అలాగే.. కరూర్ ప్రాంతంలో చోటుచేసుకున్న విషాద ఘటనను ప్రస్తావిస్తూ.. అది యాధృచ్ఛికంగా జరిగింది కాదని, దాని వెనుక కూడా లోతైన కుట్ర దాగి ఉందన్న అనుమానాలున్నాయన్నారు.
నిజానికి తాను రాజకీయ సన్యాసం చేసినట్టు చెబుతూనే ఉన్నా.. ఇప్పటికీ ఆయన తన టీం ద్వారా అకౌంట్ సర్వీసెస్ అందిస్తూనే ఉన్నారు. ఆపై జగన్ కి లోపాయికారిగా సహకరించేందుకే ఈ రాజీనామా డ్రామాలని పరిశీలకులు విశ్లేషిస్తున్నారు. బేసిగ్గా విజయసాయిరెడ్డి కామెంట్ చేయాల్సింది ఏదైనా ఉందంటే.. ఇటీవల జగన్ అర్ధంపర్దం లేకుండా చేసిన మావిగన్ అనే ప్రతిపాదన మీదే. కానీ రేణుక చౌదరి సభలో లేవనెత్తిన కమ్మరావతిని పట్టుకుని.. పోస్టులు పెట్టడం సరికాదంటున్నారు.
రాజ్యసభలో అమరావతి చట్టబద్ధత బిల్లుకు కాంగ్రెస్, బీజేపీ, టీడీపీ, టీఎంసీ, ఆప్, బీజేడీ, ఆర్జేడీ, బీఆర్ఎస్, జేడీ(యూ), శివసేన మద్దతు ఇచ్చాయి. రాజ్యసభలో అమరావతి చట్టబద్ధతపై జరిగిన చర్చలో 11 పార్టీలు పాల్గొన్నాయి.
గురువారం సాయంత్రం రాష్ట్ర వ్యాప్తంగా సంబరాలు జరుపుకోవాలని ముఖ్యమంత్రి నారా చంద్రబాబు పిలుపునిచ్చారు. ఇక 2015లో దేశంలోని వివిధ పుణ్యక్షేత్రాల నుంచి తెచ్చిన పవిత్ర జలాలు, మట్టిని ఉంచిన ఉద్దండరాయునిపాలెంలో పర్యటించి, రాజధాని సంకల్పంలో పాల్గొన్నారు.
కేంద్ర హోం శాఖ సహాయ మంత్రి నిత్యానంద రాయ్ ఈ బిల్లును రాజ్యసభలో సభలో ప్రవేశపెట్టారు. ఈ సందర్భంగా ఏపీ రాజధాని విషయంలో ఉన్న చట్టపరమైన అస్పష్టతను తొలగించేందుకు ఈ సవరణ అత్యవసరమని పేర్కొన్నారు. బిల్లుపై జరిగిన చర్చ అనంతరం, సభాపతి సి.పి. రాధాకృష్ణన్ క్లాజ్ వారీగా ఓటింగ్ నిర్వహించగా సభ్యులు అనుకూలంగా ఓటు వేశారు. దీంతో అమరావతిని రాజధానిగా ఖరారు చేస్తూ కేంద్రం తీసుకున్న నిర్ణయానికి రాజ్యసభ ఆమోదం లభించింది.
. తాము అమరావతిని వ్యతిరేకించడం లేదనీ, అయితే రాజధాని పేరుతో సాగుతున్న పరిణామాలు, ఆర్థిక భారాలనే ప్రశ్నిస్తున్నామన్నారు. రైతుల నుంచి భూములు సేకరించి ఇన్నాళ్లు గడుస్తున్నా ఆశించిన స్థాయిలో అభివృద్ధి జరగలేదని ఆయన విమర్శించారు.