Publish Date:Jul 20, 2022
బాధితులను ఆదుకోమని బియ్యం మూటలు పంపిస్తే బావమరిది దారి మళ్లించి ఇంటికి చేర్చాడనే మాట విన పడుతూంటుంది. ముఖ్యంగా ఇలాంటి ప్రకృతి వైపరీత్యాల సమయంలోనే. అసలే గూడు, తిండి గింజలు, దుస్తులూ పోయి, బతుకు జీవుడా అని శిబిరాల్లో ఉండేవారి పట్ల దయతో, ప్రేమతో వారి అవసరాలకు కావలసిన వస్తువులను సర్దుబాటు చేయాలి. ఇది ఏ ప్రభుత్వమయినా చేస్తుంది. చేయాలి. కానీ ఇందులో కూడా అస్మదీయులు, తస్మదీయులు అని గీత గీసుకుంటే దానికంటే దారుణం మరోటి ఉండదు. అసలు బాధితులకు అందాల్సినవి వేరే వారికి చేరేస్తే అంతకన్నా దుర్మార్గం మరోటి ఉండదు.
గోదావరి వరద బాధితులకు రాష్ట్ర సర్కారు పదివేల రూపాయల చొప్పున పరిహారం ఇస్తామని ప్రకటిం చింది. ఈ పరిహారం అందు కునే అర్హులు ఎవరన్న జాబితా తయారీలో అధికారులు నిమగ్నమయ్యా రు. అయితే పునరావాస కేంద్రాల్లో ఆశ్రయం పొందిన వారినే అర్హులుగా పరిగణిస్తున్నారని.. స్నేహితులు, బంధువుల ఇళ్లలో ఉన్న బాధితులను పరిగణనలోకి తీసుకోవడం లేదని, పైగా వరద బాధితులు కాని వారి పేర్లనూ జాబితాలో చేరుస్తున్నారంటూ ఆరోపణలు వ్యక్తమవుతున్నాయి.
భద్రాచలంలోని ఆర్యవైశ్య సత్రంలో వరద బాధితుల పేర్లు నమోదు చేస్తున్నారని తెలిసి.. అక్కడికి బాధి తులు పెద్ద సంఖ్యలో వెళ్లారు. తమ పేర్లు రాయాలంటూ ఒత్తిడి తేవడంతో సిబ్బంది అక్కడి నుంచి వెళ్లి పోయారు. అనంతరం పోలీసుల సాయంతో తహసీల్దార్ జాబితా సేకరణ ప్రక్రియను చేపట్టా రు. అలాగే భద్రాచలం నన్నపనేని జిల్లాపరిషత్ ఉన్నత పాఠశాల పునరావాస కేంద్రం, మణుగూరులోని కేంద్రంలో కూడా బాధితులు ధర్నా చేపట్టారు. బూర్గంపాడు మండలం మోరంపల్లి బంజర గ్రామంలో ఏర్పాటు చేసి న పునారావాస కేంద్రాన్ని ఖమ్మం కలెక్టర్ వీపీ గౌతమ్ సందర్శించారు.
ఈ క్రమంలో పరిహారం సర్వేలో అక్రమాలు జరుగుతున్నాయని, తమ లాంటి అసలైన బాధితులకు అన్యాయం జరుగుతోందంటూ భాదితులు ఆయనను చుట్టు ముట్టారు. సర్వే చేసే అధికారులు పేర్ల నమో దులో నిర్లక్ష్యంగా వ్యవహరిస్తున్నారని కలెక్టర్కు వివరించారు. భద్రాద్రి ముంపు ప్రాంతాల్లో రెండు రోజు లుగా బియ్యంతో పాటు నిత్యవసర సామగ్రిని పంపిణీ చేస్తుండగా కొందరికి సన్నబియ్యం, మరికొందరికి దొడ్డు బియ్యం వస్తున్నాయంటూ బాధితులు నిరసన తెలిపారు. బాధితులందరికి సన్నబియ్యమే ఇవ్వా లని డిమాండ్ చేశారు. అన్నారం గ్రామానికి చెందిన కొందరు మహిళలు తమకు బియ్యం అందడం లేదని తహసీల్దార్ కార్యాలయం ఎదుట ఆందోళనకు దిగారు.
By Teluguone
en-us
Political News
http://www.teluguone.com/news/content/corruption-in-flood-relief-also-25-140135.html
ఈ విమానాశ్రయం కోసం పార్లమెంటులో తాను పలుమార్లు గట్టిగా గళమెత్తానని చెప్పుకున్నారు. ఇప్పుడూ విమానాశ్రయం దాదాపుగా పూర్తై.. త్వరలో ఆపరేషన్స్ ప్రారంభం కావడానికి రెడీ అవుతుండటం తనకు చాలా సంతోషంగా ఉందన్నారు. అంతే తప్ప ఈ విమానాశ్రయం విషయంలో జరుగుతున్న రాజకీయ రచ్చ గురించి ఒక్కటంటే ఒక్క మాట మాట్లాడలేదు. అలాగే ఈ విమానాశ్రయానికి రెండో సారి శంకుస్థాపన చేసిన జగన్ ఊసెత్తలేదు.
తెలంగాణలో మరో కొత్త పార్టీ రాబోతోంది.
ఇబ్రహీంపట్నం కాంగ్రెస్ ఎమ్మెల్యే మల్ రెడ్డి రంగారెడ్డి ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు.
ఎలాగైనా అధికారాన్ని నిలబెట్టుకోవాలని అధికార డీఎంకే, బీజేపీతో పొత్తు ఉపయోగించుకుని రాష్ట్రంలో అధికారపగ్గాలు చేజిక్కించుకోవాలని ప్రతిపక్ష అన్నాడీఎంకే వ్యూహాలు రచిస్తున్నాయి. ఇక రాజకీయ పార్టీ స్థాపించి సినీ రంగం నుంచి రాజకీయరంగంలోకి దూకిన హీరో విజయ్ తన టివీకే పార్టీ తరఫున ఒంటరిగా ఎన్నికల రణరంగంలోకి దిగనున్నారు.
రండవాణేలోని కల్మాడీ హౌస్లో ఆయన భౌతికకాయాన్ని ప్రజల సందర్శనార్థం ఉంచుతారు. ఆ తరువాత సాయంత్రం మూడున్నర గంటలకు పుణెలోని వైకుంఠ శ్మశానవాటికలో అంత్యక్రియలు నిర్వహించనున్నారు.
ఫోన్ ట్యాపింగ్ ఎక్విపిమెంట్ కొనుగోలుకు అవసరమైన డబ్బును సమకూర్చింది నవీన్ రావే అని సిట్ విచారణలో తేలింది. అంతే కాకుండా, పాల్ రవి కుమార్ ద్వారా ట్యాపింగ్ ఎక్విపిమెంట్ను సమకూర్చినట్లు సిట్ నిర్ధారణకు వచ్చింది. పోన్ ట్యాపింగ్ కు ఒక ప్రైవేటు వ్యవహారంగా కాకుండా అది వ్యవస్థీకృతంగా పని చేసిందని నవీన్ రావు విచారణలో బయటపడినట్లు తెలుస్తోంది.
ఈ కేసుకు సంబంధించి తెలంగాణ ప్రభుత్వం దాఖలు చేసిన స్పెషల్ లీవ్ పిటిషన్ ను సుప్రీం ధర్మాసనం డిస్మిస్ చేసింది. ఫోన్ ట్యాపింగ్ కేసులో హరీష్ రావును విచారించేందుకు అనుమతి ఇవ్వాలంటూ తెలంగాణ ప్రభుత్వం సుప్రీం కోర్టులో పిటిషన్ దాఖలు చేసింది. ప్రభుత్వం తరఫున సీనియర్ న్యాయవాది సిద్ధార్థ్ లూథ్రా వాదనలు వినిపించారు.
రద్దు చేసిన కమిటీల స్థానంలో నెల రోజుల పాటు ఉండేలా అడ్ హాక్ కమిటీలను నియమిస్తున్నట్లు పేర్కొన్నారు. ఈ కమిటీలు రాష్ట్ర వ్యాప్తంగా క్షేత్రస్థాయిలో పర్యటించి అందజేసే నివేదిక ఆధారంగా కొత్త కమిటీలను ప్రకటించనున్నట్లు పేర్కొన్నారు.
తెలంగాణ జాగృతి అధ్యక్షురాలు, ఎమ్మెల్సీ కవిత మరోసారి హరీష్ రావుపై హాట్ కామెంట్స్ చేశారు.
కొత్త సంవత్సరం చేతినిండా, నోటి నిండా పని పెట్టనుంది. ఎందుకంటే ఈ ఏడాది పలు రాష్ట్రాల అసెంబ్లీలకు ఎన్నికలు జరగనున్నాయి. ఈ నేపథ్యంలోనే జాతీయ, ప్రాంతీయ రాజకీయ పార్టీలన్నీతమతమ వ్యూహాలు, ఎత్తుగడలకు పని చెప్పనున్నాయి. పెద్ద రాష్ట్రాలుగా ఉన్న పశ్చిమ బెంగాల్, తమిళనాడు, కేరళ రాష్ట్రాల అసెంబ్లీలకు 2026 తొలి అర్ధ భాగంలోనే ఎన్నికలు జరగనున్నాయి.
అందె శ్రీ కుటుంబంలో ఒకరికి ఉద్యోగం కల్పించాలని తమ ప్రభుత్వం నిర్ణయించిందనీ, ఇందుకోసం చట్టపరమైన మద్దతు అవసరమని చెప్పుకొచ్చారు. ఈ క్రమంలో 1994పబ్లిక్ సర్వీస్ కమిషన్ చట్టంలోని నిబంధనలు సవరించాల్సి ఉందని తెలిపారు. అందె శ్రీ కుమారుడికి ఉద్యోగ అవకాశం కల్పించడం కోసం చేసిన సవరణ బిల్లును అసెంబ్లీలో ప్రవేశపెట్టామన్నారు.
దేశంలో మోడీ పాలన అంతమవ్వాలంటే.. పొరుగు దేశాలైన శ్రీలంక, బంగ్లాదేశ్, నేపాల్లలో జరిగిన ఉద్యమాల వంటివి ఇక్కడ కూడా రావాలని ఆయన అన్నారు.
ఏపీలో వైసీపీ అసెంబ్లీని బాయ్ కాట్ చేసిన సంగతి తెలిసిందే. ఆ రాష్ట్రంలో ప్రజలు తమకు ఇవ్వని ప్రతిపక్ష హోదా కోసం వైసీపీ అసెంబ్లీని బాయ్ కాట్ చేస్తే.. తెలంగాణలో ప్రతిపక్ష హోదాలో ఉన్న బీఆర్ఎస్ అసెంబ్లీలో కాంగ్రెస్ సభ్యులను దీటుగా ఎదుర్కోవడంలో వైఫల్యం కారణంగా బాయ్ కాట్ చేస్తున్నదన్న చర్చ జరుగుతోంంది.