నవంబర్ 9న తెలంగాణా ముసాయిదా అసెంబ్లీకి

Publish Date:Oct 30, 2013

Advertisement

 

సీమాంద్రాలో ఊహించిన దాని కంటే త్వరగానే పరిస్థితులు చక్కబడటంతో కాంగ్రెస్ అధిష్టానం దీపం ఉండగానే ఇల్లు చక్కబెట్టుకోవడం మేలని రాష్ట్ర విభజనపై జోరు పెంచి దూసుకు వెళ్తోంది. ఈ రోజు ప్రధాని డా.మన్మోహన్ సింగ్ నివాసంలో తెలంగాణా ఏర్పాటు ప్రక్రియపై చర్చిచేందుకు కోర్ కమిటీ సమావేశం జరుగుతోంది. ఇందులో ప్రధాని డా.మన్మోహన్ సింగ్, సోనియాగాంధీ, అహ్మద్ పటేల్, చిదంబరం పాల్గొనట్లు తెలుస్తోంది.

 

ముఖ్యమంత్రి కిరణ్ కుమార్ రెడ్డి ప్రధానికి, రాష్ట్రపతికి వ్రాసిన లేఖల నేపధ్యంలో రాష్ట్ర శాసనసభకు తెలంగాణా బిల్లు పంపితే ఎదురయ్యే పరిణామాలు,వాటికి నివారణోపాయాలు, బిల్లు పంపేందుకు ముహూర్తం గురించి చర్చిoచినట్లు సమాచారం. ఆ సమాచారం ప్రకారం వచ్చే నెల 9న ముహూర్తం ఖరారు చేసినట్లు తెలుస్తోంది. ఇదే సమయంలో హోం మంత్రి షిండే రాష్ట్రపతి ప్రణబ్ ముఖర్జీని కలిసి మాట్లాడి వచ్చారు. బహుశః ఆయనకి తాము పెట్టిన ముహూర్తం గురించి తెలియజేసి ఉండవచ్చును.

 

ఇక మరో వైపు హోం మంత్రిత్వ శాఖ ఏర్పాటు చేసిన స్పెషల్ టాస్క్ ఫోర్స్ బృందం కూడా హైదరాబాదులో తనపని చకచకా పూర్తి చేస్తోంది. రాష్ట్ర విభజన సందర్భంగా హైదరాబాద్, తెలంగాణా మరియు ఆంధ్రప్రదేశ్ రాష్ట్రాలలో శాంతి భద్రతల పరిస్థితిని ఈ బృందం అధ్యయనం చేయడంతో బాటు, రాష్ట్ర హోం శాఖకు ఉన్న ఆస్తులు, అప్పులను రెండు రాష్ట్రాలకు ఏవిధంగా పంచాలనే అంశంపై వారు చర్చిస్తున్నారు. వీరు వచ్చేనెల 5లోగా తమ నివేదికను హోం శాఖకు అందజేయవలసి ఉంటుంది.

 

వచ్చే రాష్ట్ర విభజన వ్యవహారాన్ని పర్యవేక్షిస్తున్న కేంద్రమంత్రుల బృందం నెల 7న ఆఖరి సమావేశం నిర్వహించి, తన నివేదికను మంత్రి మండలికి సమర్పిస్తుంది. అప్పుడు క్యాబినెట్ దానిపై ఒక ముసాయిదా లేదా తీర్మానం తయారుచేసి రాష్ట్రపతికి పంపితే, దానిని ఆయన రాష్ట్ర శాసనసభకు పంపుతారు. అది మళ్ళీ తనకు చేరగానే దానిని ఆయన క్యాబినెట్ కు పంపుతారు. అప్పుడు క్యాబినెట్ తెలంగాణాపై తుది బిల్లు తయారు చేసి పార్లమెంటులో ఆమోదం కోసం ప్రవేశపెడుతుంది.

 

ఈ ప్రకారం చూస్తే తెలంగాణా ముసాయిదా లేదా వేరొకటి ముందు ఊహించినట్లు నవంబర్ నెలాఖరుకి కాక 9వ తేదీనే పంపే అవకాశం ఉందని అనుకోవచ్చును. ఏ కారణంగానయినా మరో రెండు మూడు రోజులు ఆలస్యమయితే అవవచ్చును. అదే నిజమయితే ముఖ్యమంత్రి కిరణ్ కుమార్ రెడ్డి తన రచ్చబండను పక్కనబెట్టి క్లైమాక్స్ సీన్ కోసం సిద్దం కాక తప్పదు.

By
en-us Political News

  
తాజా జాబితాలో 5.67 కోట్ల మంది ఓటర్లు నమోదు కాగా, వీరిలో 2.77 కోట్ల మంది పురుషులు, 2.89 కోట్ల మంది మహిళలు 7,617 మంది ట్రాన్స్ జెండర్లు ఉన్నారు. క్లెయిమ్‌లు, అబ్జెక్షన్ పీరియడ్‌లో దాఖలు చేసిన దరఖాస్తులను సమీక్షించి మార్పులు చేసినట్టు ఎన్నికల కమిషన్ తెలిపింది.
రాష్ట్రంలో కాపు సామాజికవర్గం బానిస వర్గం కాదన్నారు. అరెస్టులకు భయపడేది లేదని ముద్రగడ ఈ సందర్భంగా చెప్పారు. గతంలో చంద్రబాబు తనను, తన కుటుంబాన్నీ వేధించిన తీరు అందరికీ తెలుసునని చెప్పిన ఆయన మాజీ మంత్రి ఇంటిపై ఏడు గంటల పాటు దాడులు చేయడం, అరెస్టులతో భయపెట్టాలని చూడటం ప్రజాస్వామ్యంలో సరికాదన్నారు.
కల్తీ పాల వల్లే వారు అనారోగ్యం పాలయ్యారని ప్రాథమికంగా నిర్థారణ అయిందన్నారు. అంతకుముందు కలెక్టర్ కీర్తి చేకూరి, ఎస్పీ, వైద్యారోగ్య శాఖ, ఫుడ్ సేఫ్టీ అధికారులతో వర్చువల్ గా చంద్రబాబు సమావేశమైన చంద్రబాబు కల్తీ పాలు తాగి అస్వస్థతకు గురైన వారికి మెరుగైన వైద్యం అందించాలని ఆదేశించారు. పాల శాంపిల్స్ ఫలితాలు వచ్చిన తర్వాత పాలు అమ్మినవారిపై కఠిన చర్యలు తీసుకోవాలన్నారు.
ఇటీవ‌ల కిరాక్ ఆర్పీ.. వైసీపీ ఎమ్మెల్సీ, మండ‌లి ప్ర‌తిప‌క్ష నేత‌ బొత్స స‌త్య‌నారాయ‌ణ‌ను అవ‌హేళ‌న చేస్తూ మాట్లాడారు. ఆ వెంట‌నే కాపుల్లో ఆగ్ర‌హం క‌ట్ట‌లు తెంచుకుంది. దీంతో దిగి వ‌చ్చిన ఆర్పీ క్ష‌మాప‌ణ చెప్పారు కూడా. అలాగ‌ని కాపులంతా వైసీపీకి స‌పోర్ట్ చేయ‌డం అని అర్ధం కాదు క‌దా ? అంటున్నారు వంగవీటి రాధా అభిమానులు.
రాజకీయ ప్రవేశంపై తనకు ఆసక్తి ఉన్న మాట వాస్తవమేననీ, అయితే అందుకు ఇంకా సమయం ఉందన్నారు. ఇప్పటికే ఆమె సోదరుడు వంగవీటి రాధా రాజకీయాల్లో చురుగ్గా ఉన్న సంగతి విదితమే.
తెలంగాణ‌లో కమలం పార్టీ ఎప్ప‌టి నుంచి పుంజుకుంది? రాష్ట్రంలో అధికారం చేప‌ట్టే అవ‌కాశ‌మెంత‌ అన్న‌దొక చ‌ర్చ‌.
తెలుగు రాష్ట్రాల డీసీసీ అధ్యక్షుల శిక్షణా తరగతులను సీఎం రేవంత్ రెడ్డి ప్రారంభించారు.
రాజమహేంద్రవరం రోడ్ కమ్ రైలు బ్రిడ్జిపై నుంచి అధిక సంఖ్యలో కవాహనాలతో వెళ్ల కూడదని ఆ నోటీసుల్లో పేర్కొన్నారు. కానీ అంబడి రాంబాబు, జక్కంపూడి రాజా ఆ నోటీసులను ధిక్కరించి భారీ ర్యాలీ నిర్వహించడమే కాకుండా రైల్ కం రోడ్డ బ్రిడ్జిపై పెద్ద సంఖ్యలో వాహనాలతో వెళ్లడంతో రాజమహేంద్రవరం పోలీసులు కేసు నమోదు చేశారు.
తమిళనాడు రాజకీయాల్లో సంచలన పరిణామం చోటుచేసుకుంది.
గుంటూరులోని తన నివాసంపై తెలుగుదేశం శ్రేణుల దాడి, తనపై హత్యయాత్నం చేయడం తదితర విషయాలను జగన్ కు తెలియజేశారు. ఈ సందర్భంగా జగన్ అంబటికి కేసులకు భయపడవద్దని ధైర్యం చేప్పారు. కేసులను చట్టపరంగా ఎదుర్కొందామని భరోసా ఇచ్చారు.
అప్పట్లో అధికారపార్టీలో ఉన్న అనంతబాబుతో అధికారంలో ఉన్న వై ఉన్న అనంతబాబుతో పోలీసులు కుమ్మక్కయ్యారని వ్యాఖ్యానించింది. డీఫాల్ట్ బెయిల్ వచ్చేలా ఛార్జ్‌షీట్ దాఖలు చేశారని న్యాయస్థానం అసంతృప్తి వ్యక్తం చేసింది.
వైసీపీ సభ్యులు వేంకటేశ్వర స్వామి ఫొటోలు, ప్లకార్డులతో పోడియంను చుట్టుముట్టి నినాదాలు చేశారు. సభలో వైసీపీ సభ్యుల తీరుపై మంత్రి పయ్యావుల కేశవ్ ఆగ్రహం వ్యక్తం చేశారు.
2018 ఎన్నికల ప్రచార సమయంలో కేంద్ర హోంమంత్రి అమిత్ షాపై చేసిన వ్యాఖ్యలకు సంబంధించి బీజేపీ నాయకుడు విజయ్ మిశ్రా ధాఖలు చేసిన పరువునష్టం కేసు సుల్తాన్ పూర్ లోని ప్రజాప్రతినిథుల ప్రత్యేక కోర్టులో విచారణ జరుగుతోంది.
 
Disclaimer:
All content included on this TeluguOne.com Portal including text, graphics, images, videos and audio clips, is the property of ObjectOne Information Systems Ltd. or our associates, and protected by copyright laws. The collection, arrangement and assembly of all content on this portal/ related channels is the exclusive property of ObjectOne Information Systems Ltd. or our associates and protected copyright laws.
 
You may not copy, reproduce, distribute, publish, display, perform, modify, create derivative works, transmit, or in any other way exploit any part of copyrighted material without permission from ObjectOne Information Systems Ltd or our associates.