ఆ పెళ్లికీ ప్రగతిభవన్ కూ లింకేంటి? కేసీఆర్ మీద కత్తులు నూరుతున్న విపక్షాలు

Publish Date:Jan 27, 2022

Advertisement

దాదాపు నాలుగేళ్ల క్రితం హైదరాబాద్ లో ఓ భారీ విందు జరిగింది. బహుశా దాన్ని ఇప్పటికీ ఎవరూ మరచిపోయి ఉండరు. హైలెవల్ ఇంటర్నేషనల్ ప్రొఫైల్ కలిగిన టాప్ అమెరికన్ బ్యూరోక్రాట్స్ కు ప్రధాని హోదాలో నరేంద్ర మోడీ ఓ భారీ ట్రీట్ ఇచ్చారు. ఇప్పుడా హోటల్ పేరు గుర్తొచ్చి ఉంటుంది కదా. అంతర్జాతీయంగా ప్రఖ్యాతికెక్కిన తాజ్ ఫలక్ నుమాలో ఆనాటి భారీ విందు జరిగింది. అప్పటి అమెరికా అధ్యక్షుడైన ట్రంప్ గారాలపట్టి ఇవాంకా ట్రంప్ ముఖ్యఅతిథిగా వచ్చినందుకు భారత ప్రభుత్వం ఆమె తన జీవితంలో మరచిపోలేని విధంగా రాచమర్యాదలు చేసింది. అమెరికా-భారత్ లాంటి రెండు పెద్ద దేశాల మధ్య జరగాల్సిన ఎన్నో కార్యక్రమాలు, అవగాహనలు, ఒప్పందాలు ఉంటాయి కాబట్టి.. ఆ లెవెల్లో అలాంటి ట్రీట్స్ ఇవ్వడం కామన్. అయితే దాదాపుగా అలాంటి భారీ ట్రీటే మన తెలంగాణ సర్కారులో పనిచేస్తున్న ఓ ఉన్నతాధికారి కూడా అదే హోటల్లో ఇవ్వడమే విశేషం. అయితే ఇది దేశాల మధ్యనో, ప్రభుత్వాల మధ్యనో రాచకార్యాలు చక్కదిద్దేందుకు ఉద్దేశించిన విందు కాదు. ఆ సీనియర్ బ్యూరోక్రాట్ కూతురు వివాహం కోసం పలు తాజ్ హోటల్స్ ను బుక్ చేసుకున్నారు. ఆ బుకింగ్ లో అత్యంత ఖరీదైన తాజ్ ఫలక్ నుమా కూడా ఉండడమే ఇప్పుడు చర్చనీయాంశం పరిధిని దాటి సంచలనంగా మారి వివాదాలకూ తావిస్తోంది. ఎటొచ్చీ బంతి అటు తిరిగీ ఇటు తిరిగీ ముఖ్యమంత్రి కేసీఆర్ దగ్గరే ఆగుతుండడంతో విపక్షాలకు మరో అతి ముఖ్యమైన అస్త్రాన్ని అందించినట్లయింది. 

రాష్ట్ర ప్రభుత్వంలో స్పెషల్ చీఫ్ సెక్రటరీగా పనిచేస్తున్న రజత్ కుమార్ కూతురు అంజలి వివాహం మొన్న డిసెంబర్ 17 నుంచి 21 వరకు అంగరంగ వైభవంగా జరిగింది. అత్యంత ఖరీదైన తాజ్ హోటల్స్ లో ఐదు రోజుల పాటు రాజదర్పం ఒలకబోస్తూ జరిగిన ఈ ఈవెంట్ కి  పెద్దమొత్తంలోనే  ఖర్చయింది. అయితే ఆ మొత్తాన్ని ఎవరు చెల్లించారు, ఎలా చెల్లించారు అన్న అనుమానం దగ్గరే  అసలు కథ పురుడు పోసుకుంది. ఎక్కడా కనిపించని, ఏ ప్రాజెక్టులూ పూర్తి చేయని షెల్ కంపెనీ బిగ్ వేవ్ ఇన్ఫ్రా ప్రైవేట్ లిమిటెడ్ పేరు మీద బిల్లుల చెల్లింపు జరగడమే అనుమానాలకు తావిస్తోంది. అంతేకాదు.. మరో మిస్టరీ కంపెనీ అయిన ఇంటరాక్టివ్ డేటా సిస్టమ్స్ పేరు మీద కూడా బిల్లులు జారీ అయ్యాయి. వాటిలో బిగ్ వేవ్ అనే కంపెనీని ఈ వెడ్డింగ్ కి కొద్ది నెలల ముందే క్రియేట్ చేయడం విశేషం. ఇక ఇంటరాక్టివ్ డేటా సిస్టమ్స్ 2010లోనే రిజిస్టర్ అవగా... ఆ రెండు కంపెనీల్లోనూ డైరెక్టర్లుగా ఉన్నవారు  ఎంఈఐఎల్ లోనూ కీలక హోదాల్లో ఉండడం చెప్పుకోవాల్సిన అంశం. హైదరాబాద్ ఓల్డ్ సిటీలోని బహదూర్ పురాలో చాలా రష్ గా ఉండే నివాస గృహాల మధ్య బిగ్ వేవ్ కంపెనీ అడ్రస్ ఉండగా అక్కడ ఆఫీసు గానీ, ఓ కంపెనీ గానీ లేకపోవడం గమనించాల్సిన మరో అంశం. 

తెలంగాణ ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా నిర్వహిస్తున్న కాళేశ్వరం  ప్రాజెక్టు కాంట్రాక్టులు దక్కించుకున్న మేఘా ఇంజినీరింగ్ అండ్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ లిమిటెడ్ (ఎంఈఐఎల్) పేరు మీద రజత్ కుమార్ కూతురి  పెళ్లిఖర్చుల బిల్లులు జెనరేట్ అయ్యాయి. ఎంఈఐఎల్ కి చెందిన మురళితో పాటు టి.ప్రమీలన్ అనే మరో ఉద్యోగి తాజ్ కృష్ణా, తాజ్ దక్కన్, తాజ్ ఫలక్ నుమా వంటి హోటల్స్ లో డిసెంబర్ 17 నుంచి 21 వరకు వివిధ సందర్భాల్లో ఈవెంట్లు బుక్ చేసినట్లు ఆధారాలు లభించాయి. 

ప్రపంచ స్థాయి భారీ ప్రాజెక్టుగా, త్వరితగతిన పూర్తయిన ప్రాజెక్టుగా, అత్యంత పెద్ద ప్రాజెక్టుగా కాళేశ్వరం ప్రాజెక్టుకు పేరుంది. ముఖ్యమంత్రి హోదాలో కాళేశ్వరానికి కేసీఆర్ అత్యధిక ప్రాధాన్యతనిస్తున్నారు. ఈ ప్రాజెక్టుపైనే కేసీఆర్ అత్యంత అవినీతికి పాల్పడ్డారని విపక్షాలు, ప్రజాసంఘాల నాయకులు విమర్శల  మీద విమర్శలు గుప్పిస్తున్నారు. ఈ ప్రాజెక్టును మొదలుపెట్టినప్పుడు 40 వేల కోట్లుగా  అంచనా వ్యయం ఉండగా... అదిప్పుడు లక్షా 15 వేల కోట్లు దాటింది. దాదాపు మూడింతల అంచనా వ్యయాన్ని ఎందుకు పెంచాల్సి వచ్చిందన్న ప్రశ్నలకు ఇప్పటికీ కేసీఆర్ దగ్గర సరైన జవాబు లేకపోవడం గమనించాలి. అలాంటి ప్రాజెక్టుకు ప్రభుత్వ స్పెషల్ చీఫ్ సెక్రటరీగా ఉన్న రజత్ కుమార్ ఇర్రిగేషన్ అండ్ కమాండ్ ఏరియా డెవలప్ మెంట్ శాఖను పర్యవేక్షిస్తున్నారు. అంటే కాళేశ్వరం ప్రాజెక్టు కింద జరిగే అన్ని వ్యవసాయ, విద్యుదుత్పత్తి ప్రాజెక్టుల లావాదేవీలకు ఇంచార్జీ ఆయనే అన్నమాట. అలాంటి ప్రాజెక్టును మేఘా కృష్ణారెడ్డి దక్కించుకున్నారు. ఆ మేఘా కృష్ణారెడ్డి నిర్వహిస్తున్నదే  ఎంఈఐఎల్ కంపెనీ. ఈ ప్రాజెక్టు కింద వ్యవసాయం, వ్యవసాయ భూములకు పరిహారాలు, విద్యుదుత్పత్తి, విద్యుత్ ట్రాన్స్ మిషన్ వంటి అనేక లాభదాయకమైన పనుల బాధ్యతలు నిర్వహిస్తున్న రజత్ కుమార్ కూతురు వివాహానికి అదే కంపెనీ (ఎంఈఐఎల్) బిల్లులు చెల్లించినట్లు సాక్ష్యాధారాలు సహా బయటపడడం రాజకీయ వర్గాల్లో కలకలం రేపుతోంది. 

హోటల్ ఖర్చులకయ్యే కాంట్రాక్టు మొత్తాన్ని ఎంఈఐఎల్ దాదాపుగా రూ. 50 లక్షలకు కుదుర్చుకున్నట్టు  సమాచారం. అయితే ఆ బిల్లులు మాత్రం ఎంఈఐఎల్ పేరు మీద కాకుండా బిగ్ వేవ్, ఇంటరాక్టివ్ డేటా సిస్టమ్స్ అనే కంపెనీల మీద రెయిజ్ చేయాలని సూచించారు. రూ. 23 లక్షలు మాత్రం బిగ్ వేవ్ పేరు మీద చెల్లించినట్లుగా ట్రాన్సాక్షన్ జరిగింది. మరికొంత బిల్లు పెండింగ్ లో కనిపిస్తోంది. ఇక పెళ్లి తరువాత తాజ్ ఫలక్ నుమాలో 101 మంది కూర్చుండే పేద్ద భోజనశాలలో అంజలి అత్తంటి అతిథులు, రజత్ కుమార్ తరఫు బంధువులకు కలిపి మొత్తం 70 మందికి అత్యంత భారీ విందు ఏర్పాటు చేసినట్లు, వారికి ఒక్కో ప్లేటు భోజనానికి 16,520 రూపాయలు ఖర్చు చేసినట్టు బిల్లుల ద్వారా తెలుస్తోంది. అత్యంత ఖరీదైన ఈ వెడ్డింగ్ వార్త బయటికి రావడంతో ఎంఈఐఎల్  లోనే కాక ప్రగతిభవన్ లో సైతం టెన్షన్ వాతావరణం ఏర్పడినట్లు సమాచారం. ఎందుకంటే రజత్ కుమార్ గతంలో చీఫ్ ఎలక్షన్ కమిషనర్ గా కూడా పనిచేశారు. ఆ సమయంలో ఆయన టీఆర్ఎస్ కు లబ్ధి చేకూరేలా వ్యవహరించారని, అందుకు ప్రతిఫలంగా కాళేశ్వరం లాంటి భారీ ప్రాజెక్టు నిర్వహించే అవకాశాన్ని కేసీఆర్ కట్టబెట్టారని ప్రతిపక్షాలు విమర్శించాయి. సోషల్ మీడియాలోనూ  అప్పట్లో కథనాలు వెల్లువెత్తాయి. అయితే వాటిపై రజత్ కుమార్ అప్పట్లో సైబర్ పోలీసుల దగ్గర కంప్లయింట్ చేశారు. అవన్నీ ఫేక్ వార్తలని కొట్టి పడేశారు. తాజాగా ఆయన కూతురు పెళ్లి కోసం ఇంత భారీ ఎత్తున ఖర్చు చేయడం, అందుకు కాళేశ్వరం ప్రాజెక్టు పూర్తి చేస్తున్న ఎంఈఐఎల్ కంపెనీ బిల్లులు చెల్లించడం, పెళ్లికి కొద్ది నెలలు ముందే ఓ షెల్ కంపెనీ ఓపెన్ చేయడం.. ఇలాంటివన్నీ అనుమానాలకు తావిస్తున్నాయి. 

తన కూతురు పెళ్లి ఖర్చుకు ఎంఈఐఎల్ కు ఎలాంటి సంబంధం లేదని రజత్ కుమార్ బుకాయిస్తున్నా... ఎవరైనా అధికారి వ్యక్తిగత హోదాలో చేసుకునే కార్యక్రమాలకు ఎంఈఐఎల్ కు ఎలాంటి సంబంధం లేదని మేఘా ప్రతినిధులు సాకులు వెదుక్కుంటున్నా... వ్యక్తుల ప్రైవేటు కార్యక్రమాల వివరాలను తాము వెల్లడించేది లేదని తాజ్ హోటల్స్ వారు రిప్లయి ఇస్తున్నా... రజత్ కుమార్ కూతురి పెళ్లికి కొద్దిరోజుల ముందు నుంచి చోటు చేసుకున్న పరిణామాలు, లావాదేవీలు అన్నీ కూడా అనుమానాలు పెంచుతున్నాయే తప్ప క్లారిటీ ఇవ్వడం లేదన్న వ్యాఖ్యానాలు పొలిటికల్ సర్కిల్స్ లో వినిపిస్తున్నాయి. మరి దీనిపై విపక్షాలు అడిగే ప్రశ్నలకు కేసీఆర్ అండ్ టీమ్ ఎలా రెస్పాండ్ అవుతుందో చూడాలి. 

By
en-us Political News

  
తెలుగువన్ కు ఇచ్చిన ప్రత్యేక ఇంటర్వ్యూలో ఏబీ వెంకటేశ్వరరావు తమిళనాడులో ఇటీవల జరిగిన రాజకీయ పరిణామాలను.. ముఖ్యంగా విజయ్ నేతృత్వంలోని టీవీకే పార్టీ సాధించిన విజయాలను ఏబీ వెంకటేశ్వరరావు ఆసక్తికరంగా విశ్లేషించారు. ఎవరూ ఊహించని మార్పులు రాజకీయాల్లో సంభవిస్తాయని, ప్రజలు మార్పును కోరుకున్నప్పుడు అసాధ్యం సుసాధ్యం అవుతుందని అన్నారు.
టీవీకే నేత ఆదవ అర్జునకు, వీసీకే అధినేత తిరుమావళవన్ స్వయంగా మద్దతు లేఖను అందజేశారు. ఈ కీలక పరిణామంతో అసెంబ్లీలో టీవీకే కూటమి సంఖ్యా బలం ఇప్పుడు 118కి చేరింది.
అధికారులు సచివాలయంలోని ఏసీ గదులలో కూర్చుని పని చేసే విధానానికి స్వస్థి చెప్పారు. అమరావతిలో జరిగిన కలెక్టర్ల సదస్సులో ప్రసంగిస్తూ.. పౌరుల ఫిర్యాదులను నేరుగా క్షేత్రస్థాయిలో పరిష్కరించడానికి అధికారులు తమ కార్యాలయాలను విడిచిపెట్టి ప్రజల వద్దకు వెళ్లాలని ఆదేశించారు.
సువేందు అధికారి రాజకీయ నేపథ్యాన్ని పరిశీలిస్తే.. కాంగ్రెస్ సంప్రదాయ కుటుంబం నుంచి వచ్చిన సువేందు, రాజకీయ ఓనమాలు అక్కడే నేర్చుకున్నారు. ఆయన తాత కెనరామ్ అధికారి స్వాతంత్ర్య సమరయోధుడు కాగా, తండ్రి శిశిర్ అధికారి కాంగ్రెస్ పార్టీలో సీనియర్ నేతగా రాణించారు. సువేందు అధికారి మమతా బెనర్జీ స్థాపించిన తృణమూల్ కాంగ్రెస్‌లో చేరి ఆ పార్టీలో కీలక నేతగా ఎదిగారు.
కరీంనగర్ లోని ఎమ్మెల్యే క్యాంప్ ఆఫీస్ పై జరిగిన దాడిని నిరసిస్తూ బీఆర్ఎస్ నాయకత్వం బంద్ పిలుపునిచ్చిన నేపథ్యంలో . శనివారం ( మే 9) ఉదయం నుండే నగరంలోని ప్రధాన కూడళ్లలో పోలీసులు భారీగా మోహరించారు. ఎమ్మెల్యే గంగుల కమలాకర్ నిరసనలో పాల్గొనకుండా పోలీసులు ఆయన ఇంటి వద్ద బారికేడ్లు ఏర్పాటు చేసి బయటకు రాకుండా అడ్డుకున్నారు. దీనిపై బీఆర్ఎస్ కార్యకర్తలు తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేస్తూ ప్రభుత్వానికి, పోలీసులకు వ్యతిరేకంగా పెద్ద ఎత్తున నినాదాలు చేశారు.
ముఖ్యంగా పార్టీలో అభిషేక్ బెనర్జీ పెత్తనం పెరగడం వల్లే సువేందు అధికారి వంటి బలమైన నేతలు టీఎంసీని వీడారని పరిశీలకులు విశ్లేషిస్తున్నారు. క్షేత్రస్థాయిలో పట్టున్న నాయకులను కాదని, కార్పొరేట్ తరహా రాజకీయాలకు అభిషేక్ బెనర్జీ ప్రాధాన్యత ఇవ్వడం తృణమూల్‌కు ప్రతికూలంగా మారిందంటున్నారు.
ఆంధ్రోళ్లను తిట్టి ఓట్లు దండుకున్న బీఆర్ఎస్ పదేళ్ల పాలనలో ప్రాజెక్టుల పేరుతో దోపిడీకి పాల్పడిందని సంచలన వ్యాఖ్యలు చేశారు.
ప్రస్తుత ఎన్నికల ఫలితాలు కేరళలో పెను మార్పులకు నాంది పలికాయి. యూడీఎఫ్ స్పష్టమైన మెజారిటీ సాధించడంతో.. కొత్త ప్రభుత్వాన్ని ఏర్పాటు చేసేందుకు సన్నాహాలు మొదలయ్యాయి. ఈ క్రమంలోనే ముఖ్యమంత్రి అభ్యర్థి ఎంపికపై కసరత్తు జరుగుతోంది. కేసీ వేణుగోపాల్ అనుభవం, రాహుల్ గాంధీతో ఉన్న సాన్నిహిత్యం ఆయనకు ప్రధాన బలంగా మారాయి.
టీవీకే అధినేత విజయ్‌కు కాంగ్రెస్ మద్దతు తెలపడంపై ఆగ్రహంగా ఉన్న డీఎంకే.. కాంగ్రెస్‌కు కటీఫ్ చెప్పేసింది. మారిన రాజకీయ పరిస్థితుల దృష్ట్యా, లోక్‌సభలో తమ పార్టీ సభ్యులకు కాంగ్రెస్ ఎంపీలతో కాకుండా విడిగా సీటింగ్ కేటాయించాలని డీఎంకే ఎంపీ కనిమొళి స్పీకర్ ఓం బిర్లాకు లేఖ రాశారు.
తాజా సమాచారం ప్రకారం.. విజయ్ తన పార్టీకి ఉన్న బలానికి తోడుగా మరో మూడు పార్టీల మద్దతును కూడగట్టుకున్నారు. ఆ పార్టీల మద్దతుతో అధికారం చేపట్టడానికి అవసరమైన మ్యాజిక్ ఫిగర్ 118ని ఆయన సాధించారు.
తమిళనాడులో ఇటీవల జరిగిన ఎన్నికల తర్వాత, విజయ్ నేతృత్వంలోని టీవీకే పార్టీ ప్రభుత్వ ఏర్పాటుకు సిద్ధమవ్వగా.. మెజారిటీ నిరూపణ విషయంలో రాజేంద్ర విశ్వనాథ్ అర్లేకర్ కచ్చితమైన నిబంధనలు పాటించాలని పట్టుబడుతున్నారు. విజయ్ కు తన పార్టీ ఎమ్మెల్యేలు 107 మందికి అదనంగా కాంగ్రెస్ నుంచి గెలిచిన ఐదుగురు ఎమ్మెల్యేల మద్దతు కూడా ఉంది.
పదవి నుంచి తొలగించిన అనంతరం ఎస్వీఎస్ఎన్ వర్మ తీవ్ర భావోద్వేగానికి లోనయ్యారు. పార్టీ తీసుకున్న ఈ నిర్ణయం తనకు ముందే తెలుసని, నాయకత్వం నుంచి సమాచారం అందిందని చెప్పారు. అయితే పార్టీ కోసం ఎన్నో ఏళ్లుగా కష్టపడి.. క్షేత్రస్థాయిలో కేడర్‌ను కాపాడుకుంటూ వచ్చిన తనకు ఈ పరిణామం మనస్తాపానికి గురిచేసిందన్న ఆవేదన కూడా వ్యక్తం చేశారు.
బాబు కూటమిని ఎందుకంత విలువైన‌దిగా భావిస్తున్నారంటే.. కారణం వైసీపీ. ఆ పార్టీ కూట‌మి ఎప్పుడెప్పుడు చీలిపోతుందాని కాచుకుని కూర్చుని ఉంది. ఏ అవ‌కాశం వ‌చ్చినా వారు వ‌దిలిపెట్టినట్టే క‌నిపించ‌దు. మొన్న కోట వినుత ఘ‌ట‌న‌, నిన్న అర‌వ శ్రీధ‌ర్ వ్య‌వ‌హారం, ఇవాళ వ‌ర్మ ఇష్యూ.. ఇలా స‌మ‌యం దొరికిన‌పుడ‌ల్లా ఆయా అంశాల‌ను బాగా హైలెట్ చేసి.. కూట‌మిలో ఏదో ఒక చిచ్చు రాజేయాల‌ని చూస్తోంది వైసీపీ అధినాయ‌క‌త్వం.
 
Disclaimer:
All content included on this TeluguOne.com Portal including text, graphics, images, videos and audio clips, is the property of ObjectOne Information Systems Ltd. or our associates, and protected by copyright laws. The collection, arrangement and assembly of all content on this portal/ related channels is the exclusive property of ObjectOne Information Systems Ltd. or our associates and protected copyright laws.
 
You may not copy, reproduce, distribute, publish, display, perform, modify, create derivative works, transmit, or in any other way exploit any part of copyrighted material without permission from ObjectOne Information Systems Ltd or our associates.