ఆ పెళ్లికీ ప్రగతిభవన్ కూ లింకేంటి? కేసీఆర్ మీద కత్తులు నూరుతున్న విపక్షాలు

Publish Date:Jan 27, 2022

Advertisement

దాదాపు నాలుగేళ్ల క్రితం హైదరాబాద్ లో ఓ భారీ విందు జరిగింది. బహుశా దాన్ని ఇప్పటికీ ఎవరూ మరచిపోయి ఉండరు. హైలెవల్ ఇంటర్నేషనల్ ప్రొఫైల్ కలిగిన టాప్ అమెరికన్ బ్యూరోక్రాట్స్ కు ప్రధాని హోదాలో నరేంద్ర మోడీ ఓ భారీ ట్రీట్ ఇచ్చారు. ఇప్పుడా హోటల్ పేరు గుర్తొచ్చి ఉంటుంది కదా. అంతర్జాతీయంగా ప్రఖ్యాతికెక్కిన తాజ్ ఫలక్ నుమాలో ఆనాటి భారీ విందు జరిగింది. అప్పటి అమెరికా అధ్యక్షుడైన ట్రంప్ గారాలపట్టి ఇవాంకా ట్రంప్ ముఖ్యఅతిథిగా వచ్చినందుకు భారత ప్రభుత్వం ఆమె తన జీవితంలో మరచిపోలేని విధంగా రాచమర్యాదలు చేసింది. అమెరికా-భారత్ లాంటి రెండు పెద్ద దేశాల మధ్య జరగాల్సిన ఎన్నో కార్యక్రమాలు, అవగాహనలు, ఒప్పందాలు ఉంటాయి కాబట్టి.. ఆ లెవెల్లో అలాంటి ట్రీట్స్ ఇవ్వడం కామన్. అయితే దాదాపుగా అలాంటి భారీ ట్రీటే మన తెలంగాణ సర్కారులో పనిచేస్తున్న ఓ ఉన్నతాధికారి కూడా అదే హోటల్లో ఇవ్వడమే విశేషం. అయితే ఇది దేశాల మధ్యనో, ప్రభుత్వాల మధ్యనో రాచకార్యాలు చక్కదిద్దేందుకు ఉద్దేశించిన విందు కాదు. ఆ సీనియర్ బ్యూరోక్రాట్ కూతురు వివాహం కోసం పలు తాజ్ హోటల్స్ ను బుక్ చేసుకున్నారు. ఆ బుకింగ్ లో అత్యంత ఖరీదైన తాజ్ ఫలక్ నుమా కూడా ఉండడమే ఇప్పుడు చర్చనీయాంశం పరిధిని దాటి సంచలనంగా మారి వివాదాలకూ తావిస్తోంది. ఎటొచ్చీ బంతి అటు తిరిగీ ఇటు తిరిగీ ముఖ్యమంత్రి కేసీఆర్ దగ్గరే ఆగుతుండడంతో విపక్షాలకు మరో అతి ముఖ్యమైన అస్త్రాన్ని అందించినట్లయింది. 

రాష్ట్ర ప్రభుత్వంలో స్పెషల్ చీఫ్ సెక్రటరీగా పనిచేస్తున్న రజత్ కుమార్ కూతురు అంజలి వివాహం మొన్న డిసెంబర్ 17 నుంచి 21 వరకు అంగరంగ వైభవంగా జరిగింది. అత్యంత ఖరీదైన తాజ్ హోటల్స్ లో ఐదు రోజుల పాటు రాజదర్పం ఒలకబోస్తూ జరిగిన ఈ ఈవెంట్ కి  పెద్దమొత్తంలోనే  ఖర్చయింది. అయితే ఆ మొత్తాన్ని ఎవరు చెల్లించారు, ఎలా చెల్లించారు అన్న అనుమానం దగ్గరే  అసలు కథ పురుడు పోసుకుంది. ఎక్కడా కనిపించని, ఏ ప్రాజెక్టులూ పూర్తి చేయని షెల్ కంపెనీ బిగ్ వేవ్ ఇన్ఫ్రా ప్రైవేట్ లిమిటెడ్ పేరు మీద బిల్లుల చెల్లింపు జరగడమే అనుమానాలకు తావిస్తోంది. అంతేకాదు.. మరో మిస్టరీ కంపెనీ అయిన ఇంటరాక్టివ్ డేటా సిస్టమ్స్ పేరు మీద కూడా బిల్లులు జారీ అయ్యాయి. వాటిలో బిగ్ వేవ్ అనే కంపెనీని ఈ వెడ్డింగ్ కి కొద్ది నెలల ముందే క్రియేట్ చేయడం విశేషం. ఇక ఇంటరాక్టివ్ డేటా సిస్టమ్స్ 2010లోనే రిజిస్టర్ అవగా... ఆ రెండు కంపెనీల్లోనూ డైరెక్టర్లుగా ఉన్నవారు  ఎంఈఐఎల్ లోనూ కీలక హోదాల్లో ఉండడం చెప్పుకోవాల్సిన అంశం. హైదరాబాద్ ఓల్డ్ సిటీలోని బహదూర్ పురాలో చాలా రష్ గా ఉండే నివాస గృహాల మధ్య బిగ్ వేవ్ కంపెనీ అడ్రస్ ఉండగా అక్కడ ఆఫీసు గానీ, ఓ కంపెనీ గానీ లేకపోవడం గమనించాల్సిన మరో అంశం. 

తెలంగాణ ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా నిర్వహిస్తున్న కాళేశ్వరం  ప్రాజెక్టు కాంట్రాక్టులు దక్కించుకున్న మేఘా ఇంజినీరింగ్ అండ్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ లిమిటెడ్ (ఎంఈఐఎల్) పేరు మీద రజత్ కుమార్ కూతురి  పెళ్లిఖర్చుల బిల్లులు జెనరేట్ అయ్యాయి. ఎంఈఐఎల్ కి చెందిన మురళితో పాటు టి.ప్రమీలన్ అనే మరో ఉద్యోగి తాజ్ కృష్ణా, తాజ్ దక్కన్, తాజ్ ఫలక్ నుమా వంటి హోటల్స్ లో డిసెంబర్ 17 నుంచి 21 వరకు వివిధ సందర్భాల్లో ఈవెంట్లు బుక్ చేసినట్లు ఆధారాలు లభించాయి. 

ప్రపంచ స్థాయి భారీ ప్రాజెక్టుగా, త్వరితగతిన పూర్తయిన ప్రాజెక్టుగా, అత్యంత పెద్ద ప్రాజెక్టుగా కాళేశ్వరం ప్రాజెక్టుకు పేరుంది. ముఖ్యమంత్రి హోదాలో కాళేశ్వరానికి కేసీఆర్ అత్యధిక ప్రాధాన్యతనిస్తున్నారు. ఈ ప్రాజెక్టుపైనే కేసీఆర్ అత్యంత అవినీతికి పాల్పడ్డారని విపక్షాలు, ప్రజాసంఘాల నాయకులు విమర్శల  మీద విమర్శలు గుప్పిస్తున్నారు. ఈ ప్రాజెక్టును మొదలుపెట్టినప్పుడు 40 వేల కోట్లుగా  అంచనా వ్యయం ఉండగా... అదిప్పుడు లక్షా 15 వేల కోట్లు దాటింది. దాదాపు మూడింతల అంచనా వ్యయాన్ని ఎందుకు పెంచాల్సి వచ్చిందన్న ప్రశ్నలకు ఇప్పటికీ కేసీఆర్ దగ్గర సరైన జవాబు లేకపోవడం గమనించాలి. అలాంటి ప్రాజెక్టుకు ప్రభుత్వ స్పెషల్ చీఫ్ సెక్రటరీగా ఉన్న రజత్ కుమార్ ఇర్రిగేషన్ అండ్ కమాండ్ ఏరియా డెవలప్ మెంట్ శాఖను పర్యవేక్షిస్తున్నారు. అంటే కాళేశ్వరం ప్రాజెక్టు కింద జరిగే అన్ని వ్యవసాయ, విద్యుదుత్పత్తి ప్రాజెక్టుల లావాదేవీలకు ఇంచార్జీ ఆయనే అన్నమాట. అలాంటి ప్రాజెక్టును మేఘా కృష్ణారెడ్డి దక్కించుకున్నారు. ఆ మేఘా కృష్ణారెడ్డి నిర్వహిస్తున్నదే  ఎంఈఐఎల్ కంపెనీ. ఈ ప్రాజెక్టు కింద వ్యవసాయం, వ్యవసాయ భూములకు పరిహారాలు, విద్యుదుత్పత్తి, విద్యుత్ ట్రాన్స్ మిషన్ వంటి అనేక లాభదాయకమైన పనుల బాధ్యతలు నిర్వహిస్తున్న రజత్ కుమార్ కూతురు వివాహానికి అదే కంపెనీ (ఎంఈఐఎల్) బిల్లులు చెల్లించినట్లు సాక్ష్యాధారాలు సహా బయటపడడం రాజకీయ వర్గాల్లో కలకలం రేపుతోంది. 

హోటల్ ఖర్చులకయ్యే కాంట్రాక్టు మొత్తాన్ని ఎంఈఐఎల్ దాదాపుగా రూ. 50 లక్షలకు కుదుర్చుకున్నట్టు  సమాచారం. అయితే ఆ బిల్లులు మాత్రం ఎంఈఐఎల్ పేరు మీద కాకుండా బిగ్ వేవ్, ఇంటరాక్టివ్ డేటా సిస్టమ్స్ అనే కంపెనీల మీద రెయిజ్ చేయాలని సూచించారు. రూ. 23 లక్షలు మాత్రం బిగ్ వేవ్ పేరు మీద చెల్లించినట్లుగా ట్రాన్సాక్షన్ జరిగింది. మరికొంత బిల్లు పెండింగ్ లో కనిపిస్తోంది. ఇక పెళ్లి తరువాత తాజ్ ఫలక్ నుమాలో 101 మంది కూర్చుండే పేద్ద భోజనశాలలో అంజలి అత్తంటి అతిథులు, రజత్ కుమార్ తరఫు బంధువులకు కలిపి మొత్తం 70 మందికి అత్యంత భారీ విందు ఏర్పాటు చేసినట్లు, వారికి ఒక్కో ప్లేటు భోజనానికి 16,520 రూపాయలు ఖర్చు చేసినట్టు బిల్లుల ద్వారా తెలుస్తోంది. అత్యంత ఖరీదైన ఈ వెడ్డింగ్ వార్త బయటికి రావడంతో ఎంఈఐఎల్  లోనే కాక ప్రగతిభవన్ లో సైతం టెన్షన్ వాతావరణం ఏర్పడినట్లు సమాచారం. ఎందుకంటే రజత్ కుమార్ గతంలో చీఫ్ ఎలక్షన్ కమిషనర్ గా కూడా పనిచేశారు. ఆ సమయంలో ఆయన టీఆర్ఎస్ కు లబ్ధి చేకూరేలా వ్యవహరించారని, అందుకు ప్రతిఫలంగా కాళేశ్వరం లాంటి భారీ ప్రాజెక్టు నిర్వహించే అవకాశాన్ని కేసీఆర్ కట్టబెట్టారని ప్రతిపక్షాలు విమర్శించాయి. సోషల్ మీడియాలోనూ  అప్పట్లో కథనాలు వెల్లువెత్తాయి. అయితే వాటిపై రజత్ కుమార్ అప్పట్లో సైబర్ పోలీసుల దగ్గర కంప్లయింట్ చేశారు. అవన్నీ ఫేక్ వార్తలని కొట్టి పడేశారు. తాజాగా ఆయన కూతురు పెళ్లి కోసం ఇంత భారీ ఎత్తున ఖర్చు చేయడం, అందుకు కాళేశ్వరం ప్రాజెక్టు పూర్తి చేస్తున్న ఎంఈఐఎల్ కంపెనీ బిల్లులు చెల్లించడం, పెళ్లికి కొద్ది నెలలు ముందే ఓ షెల్ కంపెనీ ఓపెన్ చేయడం.. ఇలాంటివన్నీ అనుమానాలకు తావిస్తున్నాయి. 

తన కూతురు పెళ్లి ఖర్చుకు ఎంఈఐఎల్ కు ఎలాంటి సంబంధం లేదని రజత్ కుమార్ బుకాయిస్తున్నా... ఎవరైనా అధికారి వ్యక్తిగత హోదాలో చేసుకునే కార్యక్రమాలకు ఎంఈఐఎల్ కు ఎలాంటి సంబంధం లేదని మేఘా ప్రతినిధులు సాకులు వెదుక్కుంటున్నా... వ్యక్తుల ప్రైవేటు కార్యక్రమాల వివరాలను తాము వెల్లడించేది లేదని తాజ్ హోటల్స్ వారు రిప్లయి ఇస్తున్నా... రజత్ కుమార్ కూతురి పెళ్లికి కొద్దిరోజుల ముందు నుంచి చోటు చేసుకున్న పరిణామాలు, లావాదేవీలు అన్నీ కూడా అనుమానాలు పెంచుతున్నాయే తప్ప క్లారిటీ ఇవ్వడం లేదన్న వ్యాఖ్యానాలు పొలిటికల్ సర్కిల్స్ లో వినిపిస్తున్నాయి. మరి దీనిపై విపక్షాలు అడిగే ప్రశ్నలకు కేసీఆర్ అండ్ టీమ్ ఎలా రెస్పాండ్ అవుతుందో చూడాలి. 

By
en-us Political News

  
దెందులూరు వైసీపీ ఎన్నికల ప్రచారంలో ఘోర అపశృతి చోటుచేసుకుంది. వైసీపీ ప్రచార ఆర్భాటం చిన్నారుల ప్రాణాలను ప్రమాదంలో పడేసింది. ఎన్నికల నిబంధనలను ఏమాత్రం పాటించకుండా చిన్న పిల్లలను ప్రచారంలో భాగం చేసి వారి ప్రాణాలతో చెలగాటమాడారు. పెదపాడు మండలం రాజుపేటలో బుధవారం వైసీపీ ఎమ్మెల్యే అభ్యర్థి అబ్బయ్య చౌదరి ఎన్నికల ప్రచారం చేపట్టారు.
ఎవరూ ఊహించని యువతి ఎన్నికల ప్రచారంలోకి అడుగుపెట్టింది. కాంగ్రెస్ పార్టీకి ఓటెయ్యండి అని ఓటర్లని చిరునవ్వులు చిందిస్తూ అడిగింది.
వైసీపీ అధినేత, ఏపీ సీఎం వైయస్ జగన్ అక్రమాస్తుల కేసు మళ్లీ మొదటికొచ్చింది. సీబీఐ కోర్టు జడ్జి బదిలీ అయ్యారు. దీంతో ఈ కేసు విచారణ మే 15వ తేదీకి వాయిదా పడింది. అయితే సీబీఐ, ఈడీ కేసుల్లో వైయస్ జగన్ సహా 130 పిటిషన్లపై గత 12 ఏళ్లుగా విచారణ కొనసాగుతూనే ఉంది.
తెలుగు ఠీవీ పీవీ నరసింహారావు(కు భారత రత్న ప్రకటించడంతో సర్వత్రా హర్షం వ్యక్తమవుతోంది. అదే టైంలో మరో డిమాండ్ కూడా బలంగా వినిపిస్తోంది. అదే ఎన్టీఆర్‌కు భారత రత్న ఇవ్వాలనే నినాదం. సీనియర్ ఎన్టీఆర్‌ అభిమానులంతా సోషల్ మీడియా వేదికగా ఈ నినాదాన్ని గట్టిగానే వినిపిస్తున్నారు. ఇందులో చాలా మంది ప్రముఖులు కూడా ఉన్నారు. 
పుట్టగానే పరిమళించింది ఓ చిన్నారి గులాబీ... వచ్చేటప్పుడు ఏమీ తీసుకురాము అనే నానుడిని అలవోకగా పక్కకు నెట్టేసింది. ఆనందాలతో పాటు సకల అవసరాలకు భరోసానిచ్చే కలశ ఫౌండేషన్ ని లోకానికి గిఫ్ట్ గా ఇచ్చింది. ఇంతకీ ఆ చిన్నారి ఎవరు? పుట్టుకతో సాధించిన విజయాలు ఏమిటి? ప్రస్తుతం తను సాధించిన విజయాలు, సాధించబోతున్న విజయాలు ఏ దశలో ఉన్నాయో ఒకసారి పరికిద్దాం.
జగన్ హయాంలో ఉద్యోగులు ఎన్ని ఇబ్బందులు పడ్డారో అందరికీ తెలిసిందే. మద్యం దుకాణాల దగ్గర కాపలా విధులు నిర్వర్తించాల్సి రావడం నుంచి రాష్ట్రప్రభుత్వోద్యోగులు, టీచర్లు పడిన బాధలు ఇన్నిన్ని కావయా అన్నట్లుగా ఉంది. చివరకు వారిని నెల మొదటి తారీకున రావాల్సిన వేతనాలకు కూడా విడతల వారీగా విదిల్చి నానా ఇబ్బందులకూ గురి చేశారు.
ప్రపంచంలోనే అతి పెద్ద ప్రజాస్వామ్య దేశమైన మన భారత దేశాన్ని ఏదో పెద్ద శనిగ్రహం పట్టి పీడిస్తోంది.
అందుకే అంటారు.. ఎన్ని సమస్యలు చుట్టుముట్టినా జీవితం మీద ఆశ వదలకూడదని..! ఈ మాటకి తాజా ఉదాహరణ
ఏపీ హైకోర్టులో జనసేన పార్టీకి పాక్షిక ఊరట మాత్రమే లభించింది. గాజు గ్లాసు గుర్తు స్వతంత్య్ర అభ్యర్థులకు కేటాయించడాన్ని జనసేన పార్టీ సవాల్ చేస్తూ హైకోర్టులో మంగళవారం (ఏప్రిల్ 30) పిటిషన్‌ దాఖలు చేసిన సంగతి తెలిసిందే.
వైఎస్ రాజశేఖర రెడ్డి రాజకీయ వారసుడిగా ఎపి రాజకీయాల్లో అడుగు పెట్టి ముఖ్యమంత్రి అయిన వైఎస్ జగన్ కు అడ్డూ అదుపు లేకుండా అరాచకపాలన సాగిస్తున్నట్టు విమర్శ ఉంది.
తెలంగాణ రాష్ట్రంలో భానుడు ప్రతాపం చూపిస్తున్నాడు. ఈ ఏడాది రాష్ట్రంలో తొలిసారిగా ఉష్ణోగ్రతలు 46 డిగ్రీలు దాటాయి. రాష్ట్రంలో మంగళవీరం(ఏప్రిల్26) అత్యధికంగా నల్గొండ మాడుగులపల్లిలో 46.2 డిగ్రీల సెల్సియస్ ఉష్ణోగ్రత నమోదైంది. రాష్ట్రంలో సోమవారం (ఏప్రిల్ 29) ఒక్కరోజే వడదెబ్బకు ఎనిమిది మంది చనిపోయారు.
మే 1వ తేదీ, ఉదయం పది గంటలైంది. ఆంధ్రప్రదేశ్‌లో ప్రభుత్వోద్యోగుల ఫోన్లు మెసేజ్‌ల సౌండ్‌తో మార్మోగిపోయాయి.
సరిగ్గా ఎన్నికల వేళ ఆంధ్రప్రదేశ్ సీఎం జగన్ స్థైర్యం, ధైర్యం జావగారిపోయాయా? స్వయానా చెల్లెలు షర్మిల సూటిగా చేస్తున్న విమర్శలు జగన్ నైతిక స్థైర్యాన్ని దెబ్బతీశాయని పరిశీలకులు విశ్లేషిస్తున్నారు. ఈ ఏడాది ఆరంభంలో వైఎస్ షర్మిల కాంగ్రెస్ గూటికి చేరి ఆ పార్టీ రాష్ట్రపగ్గాలు చేపట్టడంతోనే జగన్ శిబిరంలో ఆందోళన మొదలైంది.
 
Disclaimer:
All content included on this TeluguOne.com Portal including text, graphics, images, videos and audio clips, is the property of ObjectOne Information Systems Ltd. or our associates, and protected by copyright laws. The collection, arrangement and assembly of all content on this portal/ related channels is the exclusive property of ObjectOne Information Systems Ltd. or our associates and protected copyright laws.
 
You may not copy, reproduce, distribute, publish, display, perform, modify, create derivative works, transmit, or in any other way exploit any part of copyrighted material without permission from ObjectOne Information Systems Ltd or our associates.