ఉచిత హామీలను లంచాలుగా పరిగణించాలంటూ సుప్రీంలో పిటిషన్

Publish Date:Oct 16, 2024

Advertisement

ఎన్నికల సమయంలో రాజకీయపార్టీలు ఉచితాలను ప్రకటించడం సర్వసాధారణంగా మారిపోయింది. అయితే అలా ఉచితాలను ప్రకటించడాన్ని లంచాలుగా ప్రకటించాలంటూ సుప్రీం కోర్టులో పిటిషన్ దాఖలైంది. ఆ పిటిషన్ ను సుప్రీం విచారణకు స్వీకరించింది. రాజకీయపార్టీలు ప్రకటించే ఉచితాలను లంచాలుగా ప్రకటించాలని  బెంగుళూరులో చెందిన శశాంక శ్రీధర ఆ పిటిషన్  దాఖలు చేసారు. ప్రధానన్యాయమూర్తి చంద్రచూడ్ నేతృత్వంలోని త్రిసభ్య ధర్మాసనం ఆ పిటిషన్ ను విచారించనుంది.లోక్ సభ,అసెంబ్లీ ఇతర ఎన్నికల్లో రాజకీయ పార్టీలు ఇచ్చే ఉచితాలను కట్టడి చేసి కఠినచర్యలు తీసుకునేలా ఆదేశాలు ఇవ్వాలని ఆ పిటిషన్ లో శ్రీధర పేర్కొన్నారు. గతంలో ధాఖలైన పిటిషన్లను కూడా పరిగణలోకి తీసుకుని అన్నీ కలిపి విచారణ చేస్తామని ధర్మాసనం తెలిపింది.  ఉచితాలపై అభిప్రాయం తెలియజేయాలని కేంద్ర ప్రభుత్వానికి, ఎన్నికల కమిషన్ కు నోటీసులు జారీ చేసింది.

ఉచితాలపై చాలా కాలం నుంచి విమర్శలువస్తున్నాయి. ఉచితాలు ఓటర్లను ప్రలోభపెట్టే సాధనంగా  పరిశీలకులు విశ్లేషిస్తున్నారు.ఉచితాలపేరుతో ప్రజలను పనిదొంగలుగా ఈ ప్రభుత్వాలు తయారు చేస్తున్నాయని, ఉపాధి కల్పించాల్సి ఉండగా ఉచితాలపేరుతో  వారిని ప్రలోభాలకు గురి చేస్తున్నారు.అలాగే ఈ ఉచిత హామీల అమలు పేరు చెప్పి ప్రభుత్వాలు ఖజానాను ఖాళీ చేస్తున్నాయి. 
గత వైసీపీ హయాంలో రాష్ట్ర ఆదాయం మొత్తం ఈ ఉచితాల అమలుకే సరిపోయిందని,ఫలితంగా అభివృద్ధికి చోటులేకుండా పోయిందన్న విమర్శలు వెల్లువెత్తాయి. రాజకీయ పార్టీలు అధికారంలోకి రావడానికి అలవి కాని హామీలు ఇస్తున్నాయి.ఆ తరువాత వాటిని అమలు జరిపే విషయంలో మీనమేషాలు లెక్కిస్తున్నాయి. తెలంగాణలో కాంగ్రెస్ పార్టీ ఇచ్చిన హామీ రుణమాఫీ అమలు పూర్తిస్థాయిలో జరగలేదని విపక్షాలు ఆందోళనకు దిగిన విషయం విదితమే.

అలాగే ఇంతవరకూ రైతుబంధు ప్రకటించలేదు.  ప్రభుత్వాలు పేదలకుచేయూత ఇవ్వాలి.   ఉచి తాలతో కాకుండా ఉపాధి కల్పిస్తే వారు  వారి కాళ్లమీద వారు నిలబడతారు. అయితే రాజకీయపార్టీలు దొడ్డిదారిని ఎంచుకుని దీర్ఘకాలిక ప్రయోజనాలు వదిలేస్తున్నాయి. గత ప్రభుత్వ హయాంలో రాజధాని నిర్మించడానికి నిధులులేక,కేంద్రాన్ని అడగలేక మూడు రాజధానుల పేరుతో కాలయాపన చేసిన విషయం తెలిసిందే. విద్య,వైద్యం ప్రభుత్వ అధీనంలో ఉండాలని రాజ్యాంగకర్తలు ఆశించారు. ప్రస్తుత పరిస్థితి అందుకు భిన్నంగా ఉంది. ఒక చిన్నారిని ఎల్కేజీ లో చేర్చాలంటే లక్షలు ఖర్చవుతున్నాయి. జ్వరం వస్తే పరీక్షల పేరుతో వేలరూపాయలు ఖర్చవుతున్నాయి.వీటిని తట్టుకునే స్తోమత పేద,మధ్య తరగతి ప్రజలకు ఉండడంలేదు.దిగువ, మధ్యతరగతి వారికి ఉన్నత చదువులు అందని దాక్షగా మారుతున్నాయి. ప్రభుత్వ బడులు, వైద్యశాలలు నామమాత్రంగా మారుతున్నాయి ప్రభుత్వ ఉద్యోగాలు తగ్గిపోతున్నాయి. ఇవన్నీ ప్రభుత్వ ఖర్చు ఉచితాలకే సరిపెట్టడం వల్ల జరుగుతున్నదనే విమర్శలు ఉన్నాయి.ఉచితాలు లేకపోతే రాష్ట్రాల ఆర్ధిక పరిస్థితి ఇంతగా దిగజారదు.  ఉపాధి పెంచే పథకాలు మినహా ఇతర హామీలనూ ప్రలోభాలుగా పరిగణించాలన్న డిమాండ్ జనబాహుల్యంలో వినిపిస్తోంది. 

By
en-us Political News

  
తెలుగు రాష్ట్రాల మధ్య కృష్ణా జలాల పంపిణీకి సంబంధించి ఒక కీలక పరిణామం చోటు చేసుకోనుంది. కృష్ణా నదీ యాజమాన్య బోర్డు (కేఆర్ఎంబీ) ప్రత్యేక సమావేశం ఈ నెల 27వ తేదీన ప్రత్యేకంగా సమావేశం కానుంది.
పాడి పంట. ఈ జంట వ్యవస్థల్లో పశువులు సుభిక్షంగా ఉంటే చాలు.. పంటలు, పల్లెలు, రైతు కుటుంబాలు యథాతథంగా బాగుంటాయి.
అహ్మదాబాద్ విమాన ప్రమాదం నేపథ్యంలో డైరెక్టరేట్ జనరల్ ఆఫ్ సివిల్ ఏవియేషన్ కీలక ఆదేశాలు జారీ చేసింది. భద్రతా లోపానికి కారణమైన ముగ్గురు ఉద్యోగులను తొలిగించాలని ఎయిరిండియాను ఆదేశించింది.
ప్రపంచ యోగా దినోత్సవం సందర్బంగా విశాఖలో నిర్వహించిన యోగాంధ్ర కార్యక్రమం విజయవంతం కావడంతో సీఎం చంద్రబాబు హర్షం వ్యక్తం చేశారు.
హైదరాబాద్ బంజారాహిల్స్‌లో కాసు బ్రహ్మానందరెడ్డి పార్క్ పేరు మార్చాలని ఎమ్మెల్సీ తీన్మార్ మల్లన్న నిరసన వ్యక్తం చేశారు. ఇవాళ కేబీఆర్ పార్కు వద్ద ఆయన ధర్నా చేశారు.
సంగారెడ్డి జిల్లా పటాన్‌చెరులో నిర్వహించిన రైతు ధర్నాలో బీఆర్ఎస్ కార్యకర్తలు పుష్ప మూవీ డైలాగ్ ప్లకార్డులు ప్రదర్శించారు. 2028 లో రప్పా రప్పా 3.0 లోడింగ్" అంటూ మాజీ మంత్రి హారీశ్‌రావు, ఫోటోలతో ప్లకార్డులు రూపోందించారు.
ఏపీ లిక్కర్ స్కాం కేసులో జైలులో రిమాండ్ ఖైదీగా ఉన్న ‌చెవిరెడ్డి భాస్కర్ రెడ్డి అస్వస్థత గురైనట్లు తెలుస్తోంది.ఛాతీలో నొప్పిగా ఉందని చెప్పటంతో ఆయన్ను విజయవాడ ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు.
వరంగల్ జిల్లా కాంగ్రెస్ పార్టీలో వర్గ విభేదాలు ఒక్కసారిగా బయటపడ్డాయి.. స్వయంగా మంత్రి కొండ సురేఖ భర్త మాజీ ఎమ్మెల్సీ కొండా మురళి కాంగ్రెస్ పార్టీ ఇద్దరు ఎమ్మెల్యేలను టార్గెట్ చేస్తూ మాట్లాడిన వివాదాస్పద వాక్యాలు తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా కాంగ్రెస్ పార్టీలో పెను దుమారం లేపుతున్నాయి.
డీఎంకే ఎంపీ ద‌యానిధి మార‌న్, భార‌తీయ కుబేరుల్లో ఒక‌డైన క‌ళానిధి మార‌న్ కి మ‌ధ్య ఆస్తి చిచ్చు మొద‌లైందా? అంటే అవున‌ని తెలుస్తోంది. 2003లో తండ్రి ముర‌సోలి మార‌న్ మ‌ర‌ణించారు. స‌రిగ్గా ఆ టైంలో బీజం వేసుకుందీ ఆస్తి త‌గాదా.
బీఆర్‌ఎస్ హుజూరాబాద్‌ ఎమ్మెల్యే పాడి కౌశిక్‌ రెడ్డిని పోలీసులు అరెస్టు చేశారు. వరంగల్‌ సుబేదారి పోలీసులు ఆయనను శంషాబాద్‌ ఎయిర్‌ఫోర్టులో అదుపులోకి తీసుకున్నారు. అనంతరం వరంగల్‌కి తరలించారు.
హైదరాబాద్ గచ్చిబౌలి స్టేడియంలో ఘనంగా అంతర్జాతీయ యోగా డే వేడుకలను ఆయుష, ఆరోగ్యశాఖ ఆథ్వర్యంలో ఘనంగా నిర్వహించాయి.
విశాఖ ఆర్కే బీచ్‌లో అంతర్జాతీయ యోగా దినోత్సవం అట్టహాసంగా నిర్వహించారు. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా ప్రధాని నరేంద్ర మోదీ హాజరయ్యారు. ప్రధాని ప్రజలతో కలిసి యోగా చేశారు.
ప్ర‌పంచ దేశాలను ఏపీ చూడ‌డం కాదు.. ఏపీని ప్ర‌పంచ దేశాలు చూసేలా చేశారు ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు. ఈ మాట అన్నది ఎవరో కాదు ప్రధాని నరేంద్రమోడీ.
 
Disclaimer:
All content included on this TeluguOne.com Portal including text, graphics, images, videos and audio clips, is the property of ObjectOne Information Systems Ltd. or our associates, and protected by copyright laws. The collection, arrangement and assembly of all content on this portal/ related channels is the exclusive property of ObjectOne Information Systems Ltd. or our associates and protected copyright laws.
 
You may not copy, reproduce, distribute, publish, display, perform, modify, create derivative works, transmit, or in any other way exploit any part of copyrighted material without permission from ObjectOne Information Systems Ltd or our associates.