కండ్లకలక వస్తుంది జాగ్రత్త...

Publish Date:Jul 22, 2022

Advertisement

వర్షాకాలం లో కళ్ళకలక ప్రమాదకరమని నిపుణులు హెచ్చరిస్తున్నారు.దీని బారినుండి రక్షించ బడాలంటే 7 అంశాలను దృష్టిలో పెట్టుకోవాలి. వర్షాలు కురవడం తో వాతావరణం అద్భుతంగా ఉంటుంది.అలాగే రోగాలు వచ్చి పడతాయి.చాలా సహజమైన రోగాలలో కళ్ళకలక ఒకటి.దీనిలక్షణాలు ఎలా ఉంటాయో తెలుసుకుందాం. కళ్ళకలక ను సామాన్య పరిభాష లో పింక్ ఐస్ అనికూడా అంటారు.

కళ్ళు ఎర్రబడడం వంటి లక్షణాలు ఉంటాయి.వైద్య పరిభాష లో కన్జేక్టి వైటిస్ అంటే కంటిలో ఇన్ఫెక్షన్ వైరస్ లేదా బ్యాక్టీరియా కారణంగా రావచ్చు.ఇది వర్షాకాలం లో చాలా సహజంగా వచ్చే సాధారణ ఇన్ఫెక్షన్. వర్షాకాలం లో వాతావరణం తడిగా ఉండడం వల్ల కళ్ళకలక వస్తుంది.కళ్ళ కలక అదే కంజక్టి వైటిస్ ఒకరినుండి మరొకరికి సోకేఅవకాసం ఉంది. కంజక్టివైటిస్ ఎలర్జీ లేదా రాసాయనాల రియాక్షన్ కారణంగా వస్తుంది.

కంజక్టి వైటిస్ లక్షణాలు -----

కళ్ళు ఎర్రబడడం.
కంటి చుట్టుపక్కల దురద.
కంటి నుండి నీరు కరడం.
కంట్లో పుసులు కట్టడం.
కంట్లో గుచ్చుకున్నట్లు,నొప్పి కలగడం వంటి లక్షణాలు ఉంటాయి.

కళ్ళకలక సోకకుండా ఎలాంటి జాగ్రత్తలు తీసుకోవాలి...

1)మీచేతులను రోజులో చాలాసార్లు కడగండి...

అన్నిరకాల వైరస్ లు బ్యాక్టీరియా నుండి మనల్ని మనం రక్షించుకోవాలంటే ఎక్కువసార్లు కడగాలి.

2)చేతితో కంటిని తాకకండి----

బ్యాక్టీరియా లేదా వైరస్ మీ చేతికి ఉండవచ్చు. చేతి ద్వారా మనకంటికి ఇన్ఫెక్షన్ ఇన్ఫెక్షన్ చేరే అవకాసం ఉంది. చాలా సులభం కూడా కావాలంటే ప్రతిరోజూ మీ ముఖాన్ని చేతిని ఎన్నిసార్లు కడుగుతారు.అయినాసరే మీచేతిని మీకంట్లో చేయి పెట్టకుండా.మీ కంటిని రక్షించుకోండి. మీ చేయి ముఖాన్ని తాకడం వల్ల కంజేక్టివైటిస్ తో పాటు ఇన్ఫెక్షన్లు సోకే అవకాశం ఉంది.

౩)ముఖం పరిశుభ్రంగా ఉంచేందుకు మెత్తటి టవల్స్ తీసుకోండి...

మీకంటి లోపలికి బ్యాక్టీరియా వైరస్ సులభంగా ప్రవేశిస్తుంది.మన ముఖాన్ని తుడిచినప్పుడు మనకంటిని మెత్తగా ఉన్న టవల్ తువ్వాలు లేదా న్యాప్కీన్ తో శుభ్రంగా తుడవాలి. వర్షాకాలం లో తువ్వాళ్ళు టవల్స్ తడిగా ఉంటాయి.అందులో బ్యాక్టీరియా పెరిగే అవకాశం ఉంది.ఈ సమయంలో ప్రతిరెండు రోజుల కు ఒకసారి టవల్స్ మార్చాలి. 

4)మీ టవల్ ను మరొకరితో పంచుకోకండి....

మీ టవల్ ను లేదా వేరొకరి టవల్ ను వేరొకరు వాడి ఒదిలేసిన టవల్ ను ఎప్పుడు వాడకండి.దీనివల్ల వేరొకరికి సోకినకళ్ళ కలక మరొకరికి సోకుతుంది.మీటవల్ ను వేరొకరికి దూరంగా ఉంచండి.

5) కాలం చెల్లిన మేకప్ సామాగ్రి ని వాడకండి...

చాలామంది మహిళలు అందంగా కనపడడానికి తెగ తాపత్రయ పడుతూఉంటారు.ఈ క్రమంలో కాలం చెల్లిన మేకప్ సామగ్రిని వాడతారు.ఇలా చేయడం వల్ల కళ్ళకలక సోకే అవకాసం ఉందని వీటిపట్ల అప్రమత్తంగా ఉండాలని నిపుణులు సూచిస్తున్నారు.

6) కంటి పరీక్షలు చేయించండి...

సహజంగా చాలామంది కళ్ళు ఎర్రబడగానే కంటి డాక్టర్ వద్ద పరీక్షలు చేయించకుండా సమీపం లో ఉన్న మందుల దుకాణం వారు ఇచ్చిన కొన్నిరకాల డ్రాప్స్ ను వెసెస్థూన్తారు. మేక్అప్ లాగానే కంట్లో వేసే మందుల విషయం లో ఆమందులుకాలం చెల్లిందా కదా ఎన్నిరోజులు సమయం వరకు ఉంది అన్న విషయం  తెలుసుకోకుండా ముఖ్యంగా కంటి లో వచ్చిన ఇన్ఫెక్షన్ కు కారణం ఏమిటి,బ్యాక్టీరియా వల్ల వచ్చిందా లేక ఇన్ఫెక్షన్ కు కారణం అయిన అంశాలు తెలుసుకున్నకే కంట్లో చుక్కలు వేసుకోవాలని అలాకాకుండా డాక్టర్ సలహా లేకుండా ఆకురసాలు లేదా ఇతర చుక్కలు వాడరాదని పరీక్షించకుండా చుక్కలు వేయడం వల్ల చర్మాసంబంద మైన రక్షణ కోసం వాడే ఉత్పత్తులపై అవగాహన అవసరం.మనం వాడే చుక్కల మందుల వల్ల ఇతర ఇన్ఫెక్షన్లు రావచ్చు లేదా ఒక్కోసారి కళ్ళే పోవచ్చు అని వైద్యులు హెచ్చరిస్తున్నారు.

7)తలగడ కవర్లు మార్చడం అవసరం...

మనం పడుకోవాలంటే తలకింద తలగడ అవసరం కొన్ని ప్రాంతాలాలో దిండు అని తకియా అని అంటారు తలకింద దిండు తలగడ లేనిదే కొందరికి నిద్రకూడా పట్టదు.ఇక్కడ కళ్ళ కలక వచ్చిన వ్యక్తి ముఖాన్ని తలగడ పైనే ఉంటుంది.సహజంగా చాలామంది ఇళ్ళలో వారానికి పైగానే తమ దిండు మీద తలగడ మీద కవర్ ను మారుస్తారు కొనరు నెలల తరబడి దిండు కవర్లు మార్చారు. ఈ కారణంగా బ్యాక్టీరియా ఏర్పడి వైరల్ ఇన్ఫెక్షన్ సోకవచ్చు కంటితోపాటు ముక్కు,ముఖం పై ప్రాభావం చూపుతుంది. ఇలా కళ్ళ కలక వచ్చిన వారు జాగ్రత్తలు పాటిస్తే కొంతమేర ఇతరులకు సోకకుండా జాగ్రత్త పడవచ్చు.

By
en-us Political News

  
పండ్లు ఆరోగ్యానికి చాలా మంచివి.  ముఖ్యంగా వేసవి కాలంలో నీటిశాతం అధికంగా ఉన్న పండ్లను ఎంత తీసుకుంటే అంత మంచిదని చెబుతూ ఉంటారు. కానీ చాలామంది వేసవి కాలంలో పండ్ల జ్యూసులు..
నేటి కాలంలో వయసుతో సంబంధం లేకుండా చిన్న పిల్లల నుండి పెద్దల వరకు అందరినీ వేధిస్తున్న ప్రధాన ఆరోగ్య సమస్య కిడ్నీ వ్యాధులు...
తిండి కలిగితే కండ కలదోయ్ అని అంటుంటారు. అలాగే కొందరు ఎంత కారంగా ఉన్న ఆహారం తింటే.. శరీరం అంత దృఢంగా ఉంటుందని కూడా అంటుంటారు.  ముఖ్యంగా గ్రామీణ ప్రాంతాలలో ప్రజలు బాగా కారంగా...
నేటి కాలంలో మారుతున్న జీవనశైలి, ఒత్తిడి మరియు ఆహారపు అలవాట్ల వల్ల వయసుతో సంబంధం లేకుండా చాలా మంది గుండెపోటు (Heart Attack) బారిన పడుతున్నారు. అయితే, గుండెపోటు అకస్మాత్తుగా వచ్చే ప్రమాదమే అయినప్పటికీ, మన శరీరం కొన్ని రోజుల ముందే కొన్ని లక్షణాల ద్వారా మనల్ని హెచ్చరిస్తుంది. ఆ సంకేతాలను సరైన సమయంలో గుర్తిస్తే ప్రాణాపాయం నుండి తప్పించుకోవచ్చు.
భారతీయుల ఆహారంలో పాలు, పాల ఉత్పత్తులకు చాలా ప్రత్యేక స్థానం ఉంటుంది.  పాలు, పెరుగు, వెన్న, నెయ్యి లేకుండా రోజు అస్సలు గడవదు.  ఇక ఇప్పట్లో చాలా మంది పనీర్ కుడా బాగా వినియోగిస్తున్నారు....
మన వంటింట్లో ఉండే వెల్లుల్లి కేవలం రుచికే కాదు, అద్భుతమైన ఔషధ గుణాలకు కూడా మారుపేరు. ముఖ్యంగా గుండె సంబంధిత సమస్యలు, అధిక బరువు మరియు మధుమేహంతో బాధపడేవారికి వెల్లుల్లి ఒక వరప్రసాదం లాంటిది. ప్రముఖ ఆయుర్వేద నిపుణులు డాక్టర్ చిట్టిబొట్ల మధుసూదన శర్మ గారు ఈ వీడియోలో వెల్లుల్లిని ఎలా వాడాలి మరియు దానివల్ల కలిగే ఆరోగ్య ప్రయోజనాల గురించి సవివరంగా వివరించారు...
ఆయుర్వేదంలో అయినా ప్రాచీన ఆరోగ్య చిట్కాలలో అయినా రాగి పాత్రలో నీరు త్రాగడం చాలా ప్రయోజనకరంగా పరిగణించబడుతుంది. ఇది శరీరానికి ఖనిజాలు , విటమిన్లను అందించి, జీర్ణక్రియను మెరుగుపరిచి, రోగనిరోధక శక్తిని పెంచుతుందని నమ్ముతారు. కానీ ఇది అందరికీ మంచిది కాదనే విషయం చాలా కొద్ది మందికి మాత్రమే తెలుసు...
మన భారతీయ సంప్రదాయంలో యోగాకు ఎంతో ప్రాముఖ్యత ఉంది. యోగా కేవలం ఆసనాలకే పరిమితం కాదు, ‘ముద్రలు’ కూడా మన శరీర ఆరోగ్యంలో కీలక పాత్ర పోషిస్తాయి. మన చేతి ఐదు వేళ్లు పంచభూతాలకు (అగ్ని, వాయువు, ఆకాశం, పృథ్వీ, జలం) ప్రతిరూపాలు. ఈ వేళ్లను ఒకదానితో ఒకటి కలిపి ఉంచే పద్ధతినే ‘ముద్ర’ అంటారు.
మన శరీరంలో మెదడు తర్వాత అంతటి ప్రాముఖ్యత కలిగిన అవయవం కాలేయం (Liver). జీర్ణక్రియను మెరుగుపరచడం నుంచి, రక్తాన్ని శుద్ధి చేయడం వరకు కాలేయం సుమారు 500 పైగా పనులను నిర్వహిస్తుంది...
ఈ రోజుల్లో అనారోగ్యకరమైన జీవనశైలి,  ఆహారపు అలవాట్ల కారణంగా గుండె జబ్బుల ప్రమాదం వేగంగా పెరుగుతోంది. భారతదేశంలో కొంతకాలంగా యువతలో గుండెపోటులు సంభవిస్తున్నాయి. గుండెను బలోపేతం..
వేసవి కాలంలో శరీరానికి నీరు చాలా అవసరం. నీటి కొరత ఆరోగ్య సమస్యలకు దారితీస్తుంది. శరీరాన్ని హైడ్రేటెడ్‌గా ఉంచుకోవడానికి రోజుకు 8 నుండి 9 గ్లాసుల నీరు త్రాగమని వైద్యులు తరచుగా సలహా ఇస్తారు. అదనంగా..
వేసవికాలం అంటేనే వేడి గాలులు, వడదెబ్బ, మండే ఎండలు గుర్తొస్తాయి.  ఎండల వేడి గురించి పక్కన పెడితే.. మనుషుల నుండి జంతువుల వరకు.. ప్రతి ఒక్క ప్రాణి వేసవిలో వడదెబ్బకు గురయ్యే అవకాశాలు..
ఆరోగ్యమే మహాభాగ్యం అన్నారు పెద్దలు. ఆరోగ్యం బాగుంటే ఏ పనులైనా చేయవచ్చు, ఎంత డబ్బు అయినా సంపాదించుకోవచ్చు. కానీ నేటికాలంలో డబ్బు...
 
Disclaimer:
All content included on this TeluguOne.com Portal including text, graphics, images, videos and audio clips, is the property of ObjectOne Information Systems Ltd. or our associates, and protected by copyright laws. The collection, arrangement and assembly of all content on this portal/ related channels is the exclusive property of ObjectOne Information Systems Ltd. or our associates and protected copyright laws.
 
You may not copy, reproduce, distribute, publish, display, perform, modify, create derivative works, transmit, or in any other way exploit any part of copyrighted material without permission from ObjectOne Information Systems Ltd or our associates.