Publish Date:Oct 24, 2024
ఉత్తర ప్రదేశ్ రాష్ట్రంలో కాంగ్రెస్ అధికారిక చిహ్నం సైకిల్ కదా? యూపీలో 9 అసెంబ్లీ స్థానాలకు ఉప ఎన్నికలు జరగనున్నాయి. ఇడియా కూటమి పొత్తులో భాగంగా అక్కడ కాంగ్రెస్, సమాజ్ వాదీ పార్టీ కలిసి పోటీ చేస్తున్నాయి. పొత్తులో భాగంగా కాంగ్రెస్ రెండు స్థానాలలో పోటీకి దిగుతోంది. అయితే ఆశ్చర్యకరంగా యూపీలో రెండు అసెంబ్లీ స్థానాలలో పోటీ చేసే కాంగ్రెస్ అభ్యర్థులు హస్తం గుర్తుపై కాకుండా సైకిల్ గుర్తుపై పోటీ చేయనున్నారు.
దీంతో కాంగ్రెస్ గుర్తు మారిపోయిందా? హస్తం అచ్చిరావడం లేదని సైకిల్ గుర్తు వైపు మొగ్గు చూపుతోందా అన్న అనుమానాలు సర్వత్రా వ్యక్తం అవుతున్నాయి. అయితే విషయం ఏమిటంటే.. ఉప ఎన్నికలలో పొత్తు, సీట్ల సర్దుబాటు కంటే విజయమే లక్ష్యంగా కాంగ్రెస్, సమాజ్ వాదీ పార్టీలు ముందుకు సాగుతున్నాయి. ఈ నేపథ్యంలోనే గుర్తుల తంపులు లేకుండా, ప్రభుత్వ వ్యతిరేక ఓటు చీలకుండా ఉండేందుకు కాంగ్రెస్ తరఫున ఉప ఎన్నికల బరిలో దిగే ఇద్దరు అభ్యర్థులూ కూడా సమాజ్ వాది పార్టీ చిహ్నమైన సైకిల్ గుర్తుపైనే పోటీ చేయాలని కాంగ్రెస్ సమాజ్ వాదీ పార్టీలు ఒక నిర్ణయానికి వచ్చాయి.
కాంగ్రెస్ సీనియర్ నేత రాహుల్ గాంధీ, సమాజ్ వాదీ పార్టీ నేత అఖిలేష్ యాదవ్ ల మధ్య జరిగిన చర్చలో ఈ మేరకు ఒక అవగాహనకు వచ్చాయి. దీంతో యూపీలో 9 అసెంబ్లీ స్థానాలకు వచ్చే నెలలో జరిగే ఉప ఎన్నికలలో సమాజ్ వాదీ పార్టీ తరఫున పోటీ చేసే ఏడుగురు అభ్యర్థులు, అలాగే కాంగ్రెస్ తరఫున పోటీలో ఉండే ఇద్దరు అభ్యర్థులూ కూడా సైకిల్ గుర్తుపైనే పోటీ చేస్తారు. అంటే ఉత్తర ప్రదేశ్ లో 9 అసెంబ్లీ స్థానాలకు జరిగే ఉప ఎన్నికలో కాంగ్రెస్ అభ్యర్థులు రంగంలో ఉన్నప్పటికీ వారు సమాజ్ వాదీ అభ్యర్థులుగానే పోటీ చేస్తారన్న మాట. అంటే కాంగ్రెస్ పోత్తు ధర్మాన్ని పాటించి పోటీకి దూరంగా ఉండబోతోందని అర్ధం.
By Teluguone
en-us
Political News
http://www.teluguone.com/news/content/congress-to-contest-on-cycle-symbol-39-187352.html
Publish Date:Sep 10, 2026
చంద్రబాబు అక్రమ అరెస్ట్ మూడేళ్లు పూర్తవుతున్న సందర్భంగా ప్రతి ఒక్కరూ తమ ఇళ్ల వద్ద, పార్టీ కార్యాలయాల్లో యాభై మూడు దీపాలను వెలిగించాలని కోరారు.
తెలంగాణ అసెంబ్లీ స్పీకర్ గడ్డం ప్రసాద్ కుమార్పై అనుచిత, అభ్యంతరకర వ్యాఖ్యలు చేశారన్న ఆరోపణలతో అరెస్టయిన ఇద్దరు బీఆర్ఎస్ ఎమ్మెల్సీలకు నాంపల్లి న్యాయస్థానం బెయిల్ మంజూరు చేసింది
టీడీపీ కేంద్ర కార్యాలయంలో రెండో రోజు నిర్వహిస్తున్న లీడర్షిప్ కాంక్లేవ్లో పొలిటికల్ కమ్యూనికేషన్ అండ్ పబ్లిక్ ఓరియంటేషన్ అంశంపై టీడీపీ జాతీయ ప్రధాన కార్యదర్శి, మంత్రి నారా లోకేష్ మాట్లాడారు.
అసలాయన రాజకీయ పార్టీ ఏర్పాటు ఉద్దేశమేంటో? లక్ష్యమేంటో ఆయనకైనా స్పష్టత ఉందా అనిపించేలా ఆయన మీడియా సమావేశం సాగింది.
ఇటు రాష్ట్రంలోనూ, అటు కేంద్రంలోనూ కూడా తెలుగుదేశం పార్టీ ఎన్డీయేలో కీలకమైన భాగస్వామ్య పక్షంగా ఉన్న నేపథ్యంలో తన పోరాటాలకు ఇండియా కూటమి అండ అవసరమని భావిస్తున్నారని చెబుతున్నారు
తన రాజకీయ విజయానికి మహిళలే ప్రధాన కారణమని ఉద్ఘాటించిన విజయ్, మహిళలకు తగిన గౌరవం ఇవ్వాల్సిన బాధ్యత అందరిపై ఉందన్నారు. మన ఇంట్లోనూ తల్లులు, చెల్లెళ్లు ఉంటారు. మహిళలను ఎవరైనా అవమానిస్తే చట్టం చూస్తూ ఊరుకోదని విజయ్ హెచ్చరించారు.
తెలంగాణ వ్యవహారాల ఇన్ చార్జ్ ఆబ్సెన్స్ లో రేవంత్ తన కేబినెట్ పునర్వ్యవస్థాకరణ విషయంలో మరింత స్వేచ్ఛగా నిర్ణయాలు తీసుకునే అవకాశాలుంటాయని పరిశీలకులు అంటున్నారు. పార్టీలో, ప్రభుత్వంలో అసంతృప్తికి చెక్ పెట్టి, తన నిర్ణయాలను అమలు చేయడానికి రేవంత్ కు ఇది అనువైన సమయంగా రాజకీయవర్గాలు చెబుతున్నాయి.
2014 నుంచి ఆంధ్రప్రదేశ్ లో రెండు ప్రధాన రాజకీయ పార్టీల మధ్యే అధికారం మారుతూ వస్తోంది. వైపీపీ, తెలుగుదేశం మధ్య ద్విముఖ పోరే నెలకొని ఉంది. ఈ పరిస్థితుల్లో విజయసాయిరెడ్డి కొత్త పార్టీ రాష్ట్రంలో రాజకీయ సమీకరణాలలో మార్పు తీసుకువచ్చే అవకాశాలు లేకపోలేదని పరిశీలకులు విశ్లేషిస్తున్నారు.
కాషాయం పార్టీ రాష్ట్ర నేతలు కొండా బీజేపీ ఎంట్రీపై ఒక్కొక్కరూ ఒక్కోలా మాట్లాడుతున్నారు. వీటికి తోడు సకుటుంబ సపరివార సమేతంగా అయితేనే కాషాయం కండువా కప్పుకుంటానంటూ కొండా సురేఖ కండీషన్లు పెడుతున్నట్లు వస్తున్న వార్తలు ఆమెకు బీజేపీ ఎంట్రీ కూడా మూసుకుపోయిందా అన్న అనుమానాలకు కలిగిస్తున్నాయి.
కొండా సుశ్మీత మీడియా సమావేశం ఏర్పాటు చేసి.. తన వ్యాఖ్యలకు తానే బాధ్యురాలిననీ, తన తల్లిపై వేటు వేయడం సరికాదనీ ఆవేదన వ్యక్తం చేశారు. తన వ్యాఖ్యలకు తన తల్లిని శిక్షించడం సరికాదన్నారు. తెలంగాణ కాంగ్రెస్ పార్టీలో వ్యక్తిగత అభిప్రాయాలకు, స్వతంత్రంగా మాట్లాడే మహిళల గొంతుకకు విలువ లేకుండా పోతోందని ఆవేదన వ్యక్తం చేశారు.
పార్టీ అధిష్టానం సీఎఉం మాటకు ఎంత ప్రాధాన్యత ఇస్తుందో, ఆయనకు వ్యతిరేకంగా అసమ్మతి గళం ఎత్తే సీనియర్ నేతలకూ అంతే ప్రాధాన్యత ఇస్తుంది. దీంతో కాంగ్రెస్ సీఎం ఇబ్బందులు ఎదుర్కొనే పరిస్థితి ఏర్పడుతుంది. కాంగ్రెస్ అధికారంలో ఉన్న పార్టీ సీఎంలు ఎదుర్కొంటున్న ప్రధాన సమస్య ఇదేనని చెప్పాలి.