స్వార్ధ రాజకీయాలు ..సామర్ధ్యం లేని పాలకులు

Publish Date:Jul 1, 2013

Advertisement

....సాయి లక్ష్మీ మద్దాల

 

 

 

తెలంగాణ ఇచ్చేది కాంగ్రెస్ మాత్రమే నని,ఇది 56 సం॥ ల పోరాటమని ఏవేవో చాల వింత ప్రసంగాలు చేశారు మన టి కాంగ్రెస్ నేతలు. తెలంగాణ సాధన సభ ద్వారా వారు, వారి అధిష్టానం ప్రజలకు ఏమి తెలియ జేయాలనుకున్నారో అది ప్రజలకు తెలియటమేమో కాని టి. ఆర్. ఎస్ నేతలకు బాగానే అర్ధమయింది. ఈరోజున అధిష్టానం తెలంగాణ అంశాన్ని ఒకకోలిక్కి తెస్తోంది దేనికోసం?తెలంగాణ ప్రజల మనోభావాలకు విలువనిచ్చా?లేక తన పొలిటికల్ మైలేజ్ కోసమా?కేవలం తన స్వార్ధ ప్రయోజనాలే అని తేట తెల్ల మైంది. అయితే ఇక్కడ సోనియా గాంధి ప్రజలకు ఏమని భరోసా ఇస్తుంది?కాంగ్రెస్ పార్టి ఆధ్వర్యం లో రాష్ట్రం విడిపోయిన,కలిసున్నా ప్రజల సంక్షేమ అభివ్రిద్ది ఎలా సాధ్యం అనేది నేడు దేశ ప్రజలను వేధిస్తున్న సమస్య. ఎందుకంటే నేడు దేశాన్ని పాలిస్తున్నది రాజకీయ నాయకులు కాదు కేవలం అవినీతి మాత్రమే!విపరీతమైన కుంభ కోణాలలో,భయంకరమైన అవినీతిలో కూరుకొని పోయి ఉన్న కాంగ్రెస్ ప్రభుత్వం రానున్న రోజులలో సమగ్రమైన పరిపాలనని ఎలా అందిస్తుంది. కాంగ్రెస్ అంటేనే అవినీతి అని దేశ ప్రజలకు అపారమైన విశ్వాసం. కాని వారి పనికిమాలిన సంక్షేమ పధకాలొ లేక దిక్కుమాలిన కుల సమీకరణాలో వారిని గెలిపిస్తాయనేది వారి ప్రగాఢ నమ్మకం.

 

నేటి ఆధునిక నాగరిక సమాజానికి కావలసింది సమానత్వం మరియు అభివృద్ధి. కాని అలాంటి మెరుగైన పరిపాలనను అందించే సత్త ఈ పాలకులకు ఉందా?ఇది కేవలం తెలంగాణ సమస్య అని తెలంగాణ ప్రజలను మభ్యపెడుతూ వారి రాజకీయ భవిష్యత్తును సరిచేసుకుంటున్నారు. మరి ఇలాంటి రాజకీయ ఎత్తుగడలు ఉన్న నాయకులు రేపు ఇరు ప్రాంతాలకు సమన్యాయం ఎలా చేస్తారు. ఇక్కడ కేవలం తాగు నీరు మాత్రమే సమస్యా?మరి శాంతి భద్రతల పరంగా ఎలాంటి నివారణ చర్యలు చేపడతారు. మెరుగైన విద్య,నాణ్యమైన వైద్యం,అందరికి ఉద్యోగం అంటూ భారి డైలాగులే చెప్తున్నారు కాని ఈ సమస్యలన్నీ కలిసున్న కారణంగానే వచ్చినవా?అన్నిటికి మించి తెలంగాణ వస్తే కె. సి. ఆర్ పరిస్థితి మరో సిబుసోరెన్ లా అవుతుందని కూడా మరో వాదన ఉంది మరి ఈ నేపధ్యం లో ఆయన తన ఉనికిని కూల్పోవటానికి సిద్ధంగా ఉన్నాడా?


 రాష్ట్రం ఉన్న విడిపోయిన ఇక్కడ ఇరు ప్రాంత ప్రజలకు కావలసింది అభివృద్ధి. కాని అది ఏ నాయకుల వల్ల కాదు అని ప్రజలకు అర్ధమై పోయింది. కాని నేడు ప్రజలు కోరుకుంటున్నది ఉన్న ఈ అభివృద్ధి అయిన కనుమరుగవకుండా ఉంటె చాలునని. రాజకీయనేతలందరూ వారి వారి వ్యాపారాలకు ఏది అనువుగా ఉంటుందో అని ఆలోచిస్తున్నారు. చివరకు నేటి పరిస్థితి ఎలా ఉందంటే రాయల తెలంగాణ అని రాయలసీమను రెండు ముక్కలు చేస్తున్నా చంద్రబాబు నాయిడు కూడా ఏమి మాట్లాడలేకున్నాడు. తెలంగాణ సాధన సభలో దామోదర రాజనరసింహ మాట్లాడుతూ 44సం॥ లుగా సీమాంద్ర నేతలే ఆంధ్ర రాష్ట్రాన్ని పాలిస్తున్నారని వ్యాఖ్యానించారు. మరి దేశాన్ని ఎవరు పాలిస్తున్నారు?60సం॥ ల కాలం లో ప్రజాస్వామ్యం ముసుగులో కుటుంబ పరిపాలనే భారత దేశ ప్రజలు చూస్తున్నారు. మరి తెలంగాణ కోసం ఇంత ధైర్యంగా సభ నిర్వహించామని చెప్పుకునే ఈ కాంగ్రెస్ నేతలు గాంధి కుటుంబ పాలనను వ్యతిరేకించ గలరా?కేవలం ప్రజల సంక్షేమం,దేశ అభివృద్ధిని మాత్రమే వీరుకనుక కాంక్షిస్తే,పి.వినరసింహారావు పరిపాలనకు,నేటి సోనియా గాంధీ ఆధ్వర్యంలోని మన్మోహన్ పరిపాలనకు గల వ్యత్యాసాన్ని,దేశ ఆర్ధిక ప్రగతిని విశ్లేషించ గలరా?ఏ మాత్రం పరిపాలన సామర్ధ్యం లేకుండా అమ్మ .... అమ్మ.... అంటూ సోనియా భజన చేసే వీళ్ళా రేపు రాష్ట్రాన్ని ముక్కలు చేసి ప్రజలకు మేలుచేసేది!

By
en-us Political News

  
తిరువూరు టీడీపీ ఎమ్మెల్యే కొలికపూడి శ్రీనివాసరావు మరో వివాదంలో చిక్కున్నారు.
జాగృతి అధ్యక్షురాలు కల్వకుంట్ల కవిత బీజేపీ ఎమ్మెల్యే మహేశ్వరరెడ్డి, బీఆర్ఎస్ ఎమ్మెల్యే మాధవరం కృష్ణారావు, టీ న్యూస్‌లకు లీగల్ నోటీసులు పంపించారు.
తెలంగాణ గ్రామ పంచాయితీ ఎన్నికల్లో మాజీ మంత్రి, ఎమ్మెల్యే జగదీష్ రెడ్డి తండ్రి రామచంద్రారెడ్డి ఘన విజయం సాధించారు.
తాజాగా కోటి సంత‌కాల సేక‌ర‌ణ చేసింది వైసీపీ.
ఇంతకీ రేవంత్ ఢిల్లీ ఎందుకు వెళ్లారంటే.. ఎన్సీపీ అధినేత శరద్ పవార్ జన్మదినం గురువారం. తన 85వ జన్మదినాన్ని పురస్కరించుకుని రాజకీయ ప్రముఖులను బుధవారం రాత్రి విందు ఇచ్చారు. ఆ విందుకు తెలంగాణ సీఎం రేవంత్ హాజర్యారు.
బోరుగడ్డ అనిల్ కు కష్టాలు మొదలయ్యాయి. కేసులు చుట్టుముట్టాయి. అరెస్టై జైలుకు వెళ్లి వచ్చాడు కూడా. జైలుకు వెళ్లిన సమయంలోనూ, ఆ తరువాత బయటకు వచ్చి మీడియాకు ఇచ్చిన ఇంటర్వ్యూలలోనూ కూడా బోరుగడ్డ అనిల్ పదేపదే తనకు జగన్ అండ ఉందని చెప్పుకొచ్చారు.
అమరావతికి నాబార్డు నుంచి రూ.7,380.70 కోట్ల రుణం తీసుకునేందుకు కేబినెట్ ఆమెదం ఇవ్వనుంది. అదే విధంగా రాష్ట్ర పెట్టుబడుల ప్రోత్సాహక మండలి సమావేశంలో తీసుకున్న నిర్ణయాలకు కేబినెట్ ఆమోద ముద్రవేసే అవకాశం ఉంది.
ల్గొండ జిల్లా కొర్లపహాడ్‌ గ్రామంలో పోలింగ్ సందర్భంగా బీఆర్ఎస్, కాంగ్రెస్ కార్యకర్తలు ఘర్షణకు దిగారు. పరస్పరం దాడులు చేసుకున్నారు. ఈ దాడుల్లో పలువురు గాయపడ్డారు.
ఉదయం ఏడుగంటలకు ప్రారంభమైన పోలింగ్, మధ్యాహ్నం ఒంటి గంట వరకూ జరుగుతుంది. ఇందు కోసం 37 వేల 552 పోలింగ్ కేంద్రాలు ఏర్పాటు చేశారు. తొలి విడతలో 56 లక్షల 19 వేల 430 మంది ఓటు హక్కు వినియోగించుకోనున్నారు.
తన ఎన్నికల చిహ్నమైన కత్తెర గుర్తు జెండాను పట్టుకుని అల్లు అర్జున్ చేత ప్రచారం చేయిస్తున్నారు. ఆగండాగండి వాస్త
త్రిపురకుండ్రం ఆరు షణ్ముఖ క్షేత్రాల్లో తొలి క్షేత్రంగా భాసిల్లుతోంది. అయితే ఈ కొండ‌కు ద‌గ్గ‌ర్లో ఒక ద‌ర్గా ఉంటే.. ఆ ద‌ర్గాకి సమీపంలో ఒక రాతి స్తంభం ఉంటుంది. ఆ రాతి స్థంభంపై త‌మిళ కార్తీక దీపం పెట్ట‌డం అనాదిగా వ‌స్తోన్న ఆచారం.
ఈ నెల 11న మొదటి విడత పోలింగ్ జరగనున్న సంగతి తెలిసిందే. దీంతో తొలి విడతలో జరిగే పంచయతీల ఎన్నికల ప్రచార గడువు మంగళవారం సాయంత్రంతో ముగియనుంది.
 
Disclaimer:
All content included on this TeluguOne.com Portal including text, graphics, images, videos and audio clips, is the property of ObjectOne Information Systems Ltd. or our associates, and protected by copyright laws. The collection, arrangement and assembly of all content on this portal/ related channels is the exclusive property of ObjectOne Information Systems Ltd. or our associates and protected copyright laws.
 
You may not copy, reproduce, distribute, publish, display, perform, modify, create derivative works, transmit, or in any other way exploit any part of copyrighted material without permission from ObjectOne Information Systems Ltd or our associates.