Publish Date:Jun 20, 2022
చాలాకాలం నిరుపయోగంగా వున్న వస్తువుల్ని పారేస్తాం. దేశంలో పాతనోట్ల స్థానంలో కొత్త కరెన్సీ నోట్లు వచ్చాయి. పాత నోట్లు ఇప్పుడు చెల్లవు. చిత్తు కాగితాలతో సమానం. దేశంలో కాంగ్రెస్ పరిస్థితి కూడా అలాగే తయారైంది. ఇప్పుడు అది చెల్లని నోటు. చాలాకాలం అధికారంలో వుండి అన్ని ప్రాంతాలూ సమాంతరంగా అభివృద్ధిపరిచేందుకు కృషి చేయాల్సిన బాధ్యతను కాంగ్రెస్ విస్మరించడం వల్లే ఈ పరిస్థితికి ఆ పార్టీ చేరుకుంది. కాంగ్రెస్ హయాంలో ఈశాన్య రాష్ట్రాలకు అన్యాయం జరుగుతూనే వుందని, చాలా కాలం అధికారంలో వున్న, పురాతన పార్టీ కేవలం ప్రచారానికి, ఆర్భాటాలకే పాలనా కాలం వెచ్చించింది. ఈశాన్య రాష్ట్రాలకు అందుకే కాంగ్రెస్ పై మండిపాటు. కాంగ్రెస్ పాలనలో అభివృద్ధి పూర్తిగా వెనకంజలో వుండ డం గురించి అనేక సందర్భాల్లో అనేకమంది రాజకీయనాయకులు విమర్శిస్తూనే వున్నారు. ఈ ప్రాంతాల పై ప్రత్యేక దృష్టి కాంగ్రెస్ ఎన్నడూ పెట్టలేదని, కేవలం ఓట్లు అధికారం కోసం ఆకట్టుకునే ప్రచారాలు, ప్రసంగాలు తప్ప వాస్తవంగా చేసిందేమి లేదని అక్కడి ప్రజలు చెబుతూనే వున్నారు. ఇపుడు తాజాగా అస్సాం ముఖ్యమంత్రి హిమాంత బిశ్వ శర్మ కాంగ్రెస్ పార్టీ పాత కరెన్సీనోట్ల వంటిదని ఎద్దేవా చేయడం గమనార్హం.
అధికారంలో వున్ననాళ్లు కనీసం రాజధాని ఎక్స్ప్రెస్ కోరికను కూడా అంగీకరించ లేదని ఘాటుగా విమర్శించడం ఆ ప్రాంత ప్రజల మనోభావాన్ని వ్యక్తం చేస్తుంది. అసలు ఆ పార్టీని ప్రజలు ముట్టడానికి ఇష్టపడని పాత నోట్లుగా మారిపోయిందని, ఆ పార్టీ నిరుపయోగంగా మారిందని బిశ్వశర్మ ఆదివారం అగర్తలా ఉప ఎన్నిక ల ప్రచార సభలో మాట్లాడారు. ఏమాత్రం అభివృ ద్ధిని చేపట్టని కాంగ్రెస్ పాలనన ఒక్క ఈశాన్య రాష్ట్ర పరిస్థితిని చూస్తే తెలుస్తుందని దుయ్యబట్టారు. ఇక్కడ కాంగ్రెస్ అభ్యర్ధి సుదీప్ రాయ్ బర్మన్ పై బిజెపి అభ్యర్ధిగా పార్టీ సీనియర్ నాయకుడు అశోక్ సిన్హా ను ఆ పార్టీ నిలబెట్టింది.
ఈ ప్రాంతంలో అసలు కాంగ్రెస్ 2014 నుంచీ ప్రతీ ఎన్నికల్లోనూ ఓటమినే చవి చూసింది. అందుక్కారణం పార్టీ పట్ల ప్రజల్లో నమ్మకం పూర్తిగా తగ్గడమేనని ఈశాన్య ప్రజాస్వామిక కూట మి (ఎన్ ఇ డి ఏ) నాయకలు ఘాటుగా విమర్శించారు. నరేంద్రమోడీ నాయకత్వంలో బిజెపి విజయాలతో పోలిస్తే సోనియాగాంధీ నాయకత్వంలోని కాంగ్రెస్ కి ఇటీవలి కాలంలో దాదాపు అన్ని రాష్ట్రాల్లోనూ పరా జయమే దక్కిందనేది సీ.ఎం. బిశ్వ శర్మ తన ప్రసంగంలో మరో సారి గుర్తు చేశారు.
By Teluguone
en-us
Political News
http://www.teluguone.com/news/content/congress-situation-like-old-currency-after-demonitisation-39-138017.html
టీవీకే అధినేత విజయ్తో భేటీ అనంతరం రాజ్ భవన్ ఒక అధికారిక ప్రెస్ నోట్ విడుదల చేసింది. అసెంబ్లీలో ప్రభుత్వం ఏర్పాటు చేయాలంటే ఉండాల్సిన సంఖ్యాబలంపై గవర్నర్.. విజయ్కు మార్గనిర్దేశం చేశారు. కేవలం అతిపెద్ద పార్టీగా ఉండటమే కాకుండా, సభలో తగినంత మంది ఎమ్మెల్యేల మద్దతు ఉన్నట్లు ఆధారాలు చూపాలని సూచించారు.
పిఠాపురంలో ఏర్పాటు చేసిన ఫ్లెక్సీలో చంద్రబాబు ఫొటోలేదని ఆరోపిస్తూ.. మాజీ ఎమ్మెల్యే వర్మ అధికారులపై ఆగ్రహం వ్యక్తం చేశారు. ఈ క్రమంలో జనసేన నేత, మాజీ ఎమ్మెల్యే దొరబాబు జోక్యం చేసుకోవడంతో వాగ్వాదం చోటు చేసుకుంది. వర్మ దురుసు వ్యాఖ్యలపై పార్టీలో అంతర్గతంగా చర్చించిన అధిష్టానం.. వర్మ వ్యవహారాన్ని తప్పుబట్టింది. ఇంతలోనే వర్మను ఇంచార్జ్ పదవి నుంచి తొలగించడం చర్చనీయాంశంగా మారింది.
రాష్ట్రంలో కొత్త ప్రభుత్వ ఏర్పాటుకు డీఎంకే ఏ విధంగానూ అడ్డుపడబోదన్నారు. రాష్ట్రంలో మరోసారి ఎన్నికలు రావాలని గానీ, రాజ్యాంగ సంక్షోభం తలెత్తాలనీ కానీ తాము కోరుకోవడం లేదన్నఆయన.. ప్రజాతీర్పునకు అనుగుణంగానే డీఎంకే నడుచుకుంటున్నదన్నారు.
గతంలో విజయ్కు ఉన్న ప్రాణహాని హెచ్చరికలు.. ఆయన పాపులారిటీని దృష్టిలో ఉంచుకుని ప్రభుత్వం సాయుధ పోలీసులతో కూడిన భద్రతను ఏర్పాటు చేసింది. అయితే.. తాజాగా నిర్వహించిన భద్రతా సమీక్షలో భాగంగా ఆయనకు ఇకపై అదనపు సెక్యూరిటీ అవసరం లేదని అధికారులు భావించినట్లు తెలుస్తోంది.
తాజా ఎన్నికల ఫలితాల్లో నటుడు విజయ్ నేతృత్వంలోని తమిళగ వెట్రి కళగం (టీవీకే) 108 స్థానాలతో సింగిల్ లార్జెస్ట్ పార్టీగా అవతరించిన సంగతి తెలిసిందే. అయితే.. ప్రభుత్వ ఏర్పాటుకు అవసరమైన 118 మంది ఎమ్మెల్యేల మద్దతు ఆ పార్టీకి ఇంకా లభించలేదు. కాంగ్రెస్తో కలిపి విజయ్ బలం ప్రస్తుతం 112కు చేరినప్పటికీ.. మేజిక్ ఫిగర్కు ఇంకా ఆరు అడుగుల దూరంలో ఉంది.
తమిళనాడు రాజకీయాల్లో పెను మార్పులు చోటుచేసుకుంటున్న వేళ
బెంగాల్ అసెంబ్లీ ఎన్నికల్లో బీజేపీ అఖండ విజయం సాధించడంలో సువేందు కీ రోల్ పోషించారు. ఆ పార్టీ 206 స్థానాల్లో గెలిచి బెంగాల్లో తొలిసారిగా అధికారం చేపట్టబోతోంది. బీజేపీ తరఫున రెండు స్ధానాల నుంచి బరిలోకి దిగిన సువేందు అధికారి.. మరోసారి మమతా బెనర్జీని ఓడించారు. భవానిపూర్లో దీదీపై గెలిచిన ఆయన.. తన సొంత నియోజకవర్గమైన నందిగ్రామ్లోనూ గెలిచి పట్టు నిలుపుకున్నారు.
ముఖ్యంగా అస్సాం, పశ్చిమబెంగాల్ లో బీజేపీ ఎన్నికల సంఘం సహకారంతో ఫలితాలను చోరీ చేసిందన్నారు.
పశ్చిమబెంగాల్లో మూడున్నర దశాబ్దాల ఏళ్ల సీపీఎం పాలనకు బ్రేక్ వేసి 2011లో అధికార పగ్గాలు చేపట్టిన తృణముల్ కాంగ్రెస్ అధినేత్రి మమతా బెనర్టీ.. 2026 వరకు వరుస విజయాలతో ముఖ్యమంత్రిగా కొనసాగారు. ఆమె 15 ఏళ్ల ఆధిపత్యానికి ఎన్డీఏ తెర దించింది. మమతా సైతం కాంగ్రెస్లో కేంద్రమంత్రిగా, పలు కీలక పదవులు నిర్వహించి, తర్వాత సొంత కుంపటి పెట్టుకున్న నాయకురాలే కావడం గమనార్హం.
ప్రజా సమస్యలపై స్పష్టమైన అజెండాతో ఎన్నికల బరిలోకి దిగిన విజయ్ను తమిళ ప్రజలు ఆదరించడం శుభపరిణామమన్నారు.
తన పార్టీ స్థాపించిన నాటి నుండి నేటి వరకు ఆయన సాగించిన ప్రయాణం ఒక అద్భుతమైన రాజకీయ థ్రిల్లర్ను తలపిస్తుంది. ఎన్నికల ప్రచార సమయంలో విజయ్ అనేక ఆటంకాలను ఎదుర్కొన్నారు. ప్రత్యర్థి పార్టీల నుండి వచ్చిన తీవ్ర విమర్శలు, అధికార యంత్రాంగం విధించిన ఆంక్షలు ఆయనను ఉక్కిరిబిక్కిరి చేశాయి. వ్యక్తిగత జీవితంపై జరిగిన దుష్ప్రచారం విజయ్ ఇమేజ్ను దెబ్బతీస్తుందని అందరూ భావించారు.
తమిళనాడులో టీవీకే పార్టీ విజయాన్నిస్వాగతిస్తూ.. వైసీపీ సోషల్ మీడియా వేదికగా సంబరాలు మొదలు పెట్టింది. విజయ్ సాధించిన ఈ అద్భుత విజయం వెనుక వైసీపీ అధినేత జగన్ సహకారం ఉందంటూ వైసీపీ సోషల్ మీడియాలో పెద్ద ఎత్తున పోస్టులు వెల్లువెత్తుతున్నాయి. ముఖ్యంగా గతంలో ఒక వివాహ వేడుకలో వైఎస్ జగన్, విజయ్ ఇద్దరూ కలిసి దిగిన ఒక ఫోటోను ఇప్పుడు వైసీపీ నెట్టింట వైరల్ చేస్తోంది.
ఈ ఎన్నికల ఫలితాల్లో విజయ్ టవీకే పార్టీ స్పష్టమైన ఆధిక్యత కనబరిచింది. ప్రభుత్వ వ్యతిరేకతతో పాటు, కూటమి పక్షాల మధ్య సరైన సమన్వయం లేకపోవడం కూడా ఈ ఓటమికి ప్రధాన కారణాలుగా కనిపిస్తున్నాయి.