Publish Date:Dec 28, 2019
అసెంబ్లీ ఎన్నికల్లో ఆ తర్వాత లోకల్ ఎలక్షన్స్ గెలిచిన తర్వాత అధికార పార్టీ లోకి జంప్ కావడం ఫ్యాషన్ గా మారింది. ఒకానొక సమయంలో ఈ జంపింగ్ జపాంగ్ ల ఎఫెక్ట్ తో మున్సిపల్ చైర్మన్ పదవులను కాంగ్రెస్ కోల్పోయింది. దీంతో ఇప్పుడు గోడ దూకే నేతలకు చెక్ పెట్టేందుకు ఆదిలాబాద్ జిల్లాలో కాంగ్రెస్ కొత్త ఫార్ములాను వర్కౌట్ చేయాలని చూస్తుంది. గెలిచిన అభ్యర్థులు పార్టీ జారిపోకుండా కాంగ్రెస్ ఇప్పుడు జాగ్రత్తపడుతోంది. ఇందులో భాగంగా పార్టీ టికెట్ ఇచ్చే ముందే అభ్యర్థుల దగ్గర నుంచి ఓ హామీ తీసుకోవాలనే ఆలోచనతో ఉంది. గెలిచిన అభ్యర్థులు పార్టీ మారబోమని ప్రామిసరీ నోట్ , బ్లాంక్ చెక్కులు అనుమతి పత్రాలపై సంతకం చేశాకనే టికెట్ అంటూ కొత్త రూల్ పాస్ చేసింది. కనీసం ఇలానైనా గెలిచిన నేతలను కాపాడుకోవాలని కాంగ్రెస్ తిప్పలు పడుతుంది. మున్సిపల్ ఎన్నికల్లో కాంగ్రెస్ టికెట్ ఆశించేవారు అఫిడవిట్ ఇవ్వాల్సిందేనని ఉమ్మడి ఆదిలాబాద్ జిల్లాలో కాంగ్రెస్ అధిష్టానం కరాఖండిగా చెప్పినట్లు సమాచారం.
కాంగ్రెస్ బలంగా ఉన్న నిర్మల్ , మంచిర్యాల జిల్లాలో కొత్త మున్సిపాల్టీల్లో ఈ ఫిట్టింగ్ ను అమలు చేస్తోంది. మంచిర్యాల జిల్లాలో ఇప్పటికే కాంగ్రెస్ టికెట్ కోసం వెయ్యి మందికి పైగా నేతలు అప్లికేషన్ పెట్టుకున్నారు. ఇందులో సగం మందికి పైగా నేతలు అఫిడవిట్ ఇచ్చేందుకు రెడీ అయినట్లు తెలుస్తోంది. రిజర్వేషన్లు ఖరారు కావడమే ఆలస్యం అఫిడవిట్ లో బాండ్ పేపర్లు నింపి పార్టీ మారబోమని సంతకాలు చేసి టికెట్ తీసుకునేందుకు నేతలు రెడీ అవుతున్నారు. మొత్తానికి జంపింగ్ అభ్యర్థులకు అడ్డుకట్ట వేయాలంటే ఈ ప్రక్రియ అవసరమనేది కాంగ్రెస్ నేతల వాదన. ఈ బాండ్ల గోల ఏ మేరకు కాంగ్రెస్ కు కలిసొస్తుందో ప్రామిసరీ నోట్లు గెలిచాక జంపింగ్ లను ఎంత మేర పార్టీ మారకుండా ఆపగలుగుతుందో వేచి చూడాలి.
By Teluguone
en-us
Political News
http://www.teluguone.com/news/content/congress-sets-its-eyes-on-municipal-election-25-92646.html
కరీంనగర్ లోని ఎమ్మెల్యే క్యాంప్ ఆఫీస్ పై జరిగిన దాడిని నిరసిస్తూ బీఆర్ఎస్ నాయకత్వం బంద్ పిలుపునిచ్చిన నేపథ్యంలో . శనివారం ( మే 9) ఉదయం నుండే నగరంలోని ప్రధాన కూడళ్లలో పోలీసులు భారీగా మోహరించారు. ఎమ్మెల్యే గంగుల కమలాకర్ నిరసనలో పాల్గొనకుండా పోలీసులు ఆయన ఇంటి వద్ద బారికేడ్లు ఏర్పాటు చేసి బయటకు రాకుండా అడ్డుకున్నారు. దీనిపై బీఆర్ఎస్ కార్యకర్తలు తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేస్తూ ప్రభుత్వానికి, పోలీసులకు వ్యతిరేకంగా పెద్ద ఎత్తున నినాదాలు చేశారు.
ముఖ్యంగా పార్టీలో అభిషేక్ బెనర్జీ పెత్తనం పెరగడం వల్లే సువేందు అధికారి వంటి బలమైన నేతలు టీఎంసీని వీడారని పరిశీలకులు విశ్లేషిస్తున్నారు. క్షేత్రస్థాయిలో పట్టున్న నాయకులను కాదని, కార్పొరేట్ తరహా రాజకీయాలకు అభిషేక్ బెనర్జీ ప్రాధాన్యత ఇవ్వడం తృణమూల్కు ప్రతికూలంగా మారిందంటున్నారు.
ఆంధ్రోళ్లను తిట్టి ఓట్లు దండుకున్న బీఆర్ఎస్ పదేళ్ల పాలనలో ప్రాజెక్టుల పేరుతో దోపిడీకి పాల్పడిందని సంచలన వ్యాఖ్యలు చేశారు.
ప్రస్తుత ఎన్నికల ఫలితాలు కేరళలో పెను మార్పులకు నాంది పలికాయి. యూడీఎఫ్ స్పష్టమైన మెజారిటీ సాధించడంతో.. కొత్త ప్రభుత్వాన్ని ఏర్పాటు చేసేందుకు సన్నాహాలు మొదలయ్యాయి. ఈ క్రమంలోనే ముఖ్యమంత్రి అభ్యర్థి ఎంపికపై కసరత్తు జరుగుతోంది. కేసీ వేణుగోపాల్ అనుభవం, రాహుల్ గాంధీతో ఉన్న సాన్నిహిత్యం ఆయనకు ప్రధాన బలంగా మారాయి.
టీవీకే అధినేత విజయ్కు కాంగ్రెస్ మద్దతు తెలపడంపై ఆగ్రహంగా ఉన్న డీఎంకే.. కాంగ్రెస్కు కటీఫ్ చెప్పేసింది. మారిన రాజకీయ పరిస్థితుల దృష్ట్యా, లోక్సభలో తమ పార్టీ సభ్యులకు కాంగ్రెస్ ఎంపీలతో కాకుండా విడిగా సీటింగ్ కేటాయించాలని డీఎంకే ఎంపీ కనిమొళి స్పీకర్ ఓం బిర్లాకు లేఖ రాశారు.
తాజా సమాచారం ప్రకారం.. విజయ్ తన పార్టీకి ఉన్న బలానికి తోడుగా మరో మూడు పార్టీల మద్దతును కూడగట్టుకున్నారు. ఆ పార్టీల మద్దతుతో అధికారం చేపట్టడానికి అవసరమైన మ్యాజిక్ ఫిగర్ 118ని ఆయన సాధించారు.
తమిళనాడులో ఇటీవల జరిగిన ఎన్నికల తర్వాత, విజయ్ నేతృత్వంలోని టీవీకే పార్టీ ప్రభుత్వ ఏర్పాటుకు సిద్ధమవ్వగా.. మెజారిటీ నిరూపణ విషయంలో రాజేంద్ర విశ్వనాథ్ అర్లేకర్ కచ్చితమైన నిబంధనలు పాటించాలని పట్టుబడుతున్నారు. విజయ్ కు తన పార్టీ ఎమ్మెల్యేలు 107 మందికి అదనంగా కాంగ్రెస్ నుంచి గెలిచిన ఐదుగురు ఎమ్మెల్యేల మద్దతు కూడా ఉంది.
పదవి నుంచి తొలగించిన అనంతరం ఎస్వీఎస్ఎన్ వర్మ తీవ్ర భావోద్వేగానికి లోనయ్యారు. పార్టీ తీసుకున్న ఈ నిర్ణయం తనకు ముందే తెలుసని, నాయకత్వం నుంచి సమాచారం అందిందని చెప్పారు. అయితే పార్టీ కోసం ఎన్నో ఏళ్లుగా కష్టపడి.. క్షేత్రస్థాయిలో కేడర్ను కాపాడుకుంటూ వచ్చిన తనకు ఈ పరిణామం మనస్తాపానికి గురిచేసిందన్న ఆవేదన కూడా వ్యక్తం చేశారు.
బాబు కూటమిని ఎందుకంత విలువైనదిగా భావిస్తున్నారంటే.. కారణం వైసీపీ. ఆ పార్టీ కూటమి ఎప్పుడెప్పుడు చీలిపోతుందాని కాచుకుని కూర్చుని ఉంది. ఏ అవకాశం వచ్చినా వారు వదిలిపెట్టినట్టే కనిపించదు. మొన్న కోట వినుత ఘటన, నిన్న అరవ శ్రీధర్ వ్యవహారం, ఇవాళ వర్మ ఇష్యూ.. ఇలా సమయం దొరికినపుడల్లా ఆయా అంశాలను బాగా హైలెట్ చేసి.. కూటమిలో ఏదో ఒక చిచ్చు రాజేయాలని చూస్తోంది వైసీపీ అధినాయకత్వం.
అతి కొద్ది మంది నేతలు జగన్ ప్రకటనను సమర్దిస్తూ.. అనుకూల ప్రకటనలు చేస్తుండగా.. మెజారిటీ లీడర్, క్యాడర్ మాత్రం జగన్ నిర్ణయంపై తీవ్ర అసంతృప్తి వ్యక్తం చేస్తున్నారు.
తెలుగువన్ వాస్తవ వేదికలో ప్రస్తుత జాతీయ, ప్రాంతీయ రాజకీయ పరిస్థితులపై విస్తృత చర్చ జరిగింది.
తమిళనాడు అసెంబ్లీ ఎన్నికల ఫలితాలు ఆ రాష్ట్ర రాజకీయాల్లో పెను సంచలనాన్ని సృష్టించాయి.
టీవీకే అధినేత విజయ్తో భేటీ అనంతరం రాజ్ భవన్ ఒక అధికారిక ప్రెస్ నోట్ విడుదల చేసింది. అసెంబ్లీలో ప్రభుత్వం ఏర్పాటు చేయాలంటే ఉండాల్సిన సంఖ్యాబలంపై గవర్నర్.. విజయ్కు మార్గనిర్దేశం చేశారు. కేవలం అతిపెద్ద పార్టీగా ఉండటమే కాకుండా, సభలో తగినంత మంది ఎమ్మెల్యేల మద్దతు ఉన్నట్లు ఆధారాలు చూపాలని సూచించారు.