కాంగ్రెస్ సిగ్నల్స్ పట్టించుకోని కేసీఆర్

Publish Date:Mar 15, 2013

Advertisement

 

అడగందే అమ్మయినా అన్నం పెట్టదనట్లు కాంగ్రెస్ ప్రభుత్వం మాత్రం అడగకుండా తెలంగాణా ఎందుకు ఇస్తుంది? తెలంగాణా ఉద్యమాలు పతాక స్థాయికి చేరినప్పుడు తెలంగాణా నేతలను చూస్తేనే ఉలికులికి పడిన కాంగ్రెస్ అధిష్టానం, ఇప్పుడు దోశలు, పెసరట్లు అంటూ వెటకారం చేయగలుగుతున్నారంటే అందుకు కారణం ఎన్నికల (అ)జెండాలు, (అ)విశ్వాస తీర్మానాలను వేసుకొన్న ఉద్యమపార్టీ ఊసరవెల్లిలా రంగులు మార్చుకొంటూ క్రమంగా రాజకీయ పార్టీగా మారడమే ప్రధాన కారణమా? లేక ఈ మిషతో తెలంగాణా ఉద్యమాన్నిపక్కదారి పట్టించిన తెరాస అధ్యక్షుడు కే.చంద్రశేకర్ రావు మాటకి ఇక తెలంగాణా ప్రజలలో విలువలేదని వారు గ్రహించడం వలనే ఈ విధంగా మాట్లాడే దైర్యం చేయగలుగుతున్నారా? లేక మరేదయినా బలమయిన కారణాలు ఉన్నాయా?

 

గులాం నబీ ఆ ‘జాదూ’, హోం మంత్రి సుషీల్ కుమార్ షిండే పెట్టిన ‘నెలరోజుల్లో తెలంగాణా విడుదల’ను అకస్మాత్తుగా ఆఖరి నిమిషంలో తెర మీద ప్రత్యక్షమయ్యి తన మంత్రం దండంతో ఆపేసిన తరువాత, చెలరేగిపోతారనుకొన్న తెరాస, తెలంగాణా జేయేసీ నేతలు కూడా తమ ఉద్యమ జెండాలు పక్కన పడేసి, ఎన్నికల జెండాలు పట్టుకోవడంతో కాంగ్రెస్ అధిష్టానం కూడా ఖంగు తింది.

 

ఈ లోగా తెదేపా అధినేత చంద్రబాబు నాయుడు కూడా తెలంగాణాపై కొత్త పల్లవి అందుకోవడమే కాకుండా, ఆ పాటతో తెలంగాణా ప్రజలను కూడా బాగానే ఆకట్టుకొన్నారు. ఆయన తెలంగాణాలో పాదయాత్ర మొదలుపెట్టక ముందు ఆయనకు తెలంగాణాలో ఉన్నవ్యతిరేఖత తెలంగాణా పల్లవి అందుకొన్నాక పూర్తిగా మారిపోయింది. తెదేపా తెలంగాణా పల్లవి అందుకోవడంతో తెలంగాణా లో అదృశ్యం అయిపోతుందన్న తెదేపా మళ్ళీ బలపడటమే కాకుండా, సహకార ఎన్నికలలో కూడా విజయం సాదించ గలిగింది. ఆయన పార్టీకి తెలంగాణాలో మద్దతు పెరగడానికి మరో కారణం తెలంగాణా ఉద్యమంపట్ల చిత్త శుద్ధిలేని తెరాస అధినేత కేసీఆరే కారణం అని చెప్పవచ్చును.

 

ఆయన తెలంగాణా ఉద్యమాన్ని ఏవిధంగా భ్రష్టు పట్టించేడో గమనించిన తెలంగాణా ప్రజలలో చంద్రబాబు పట్ల అవ్యాజమయిన ప్రేమ ఏది లేకపోయినప్పటికీ, మాట నిలకడలేని కేసీఆర్ ను నమ్ముకోవడం కంటే మంచి పరిపాలనాదక్షుడిగా పేరుతెచ్చుకొన్న చంద్రబాబును నమ్ముకోవడమే మేలనే భావన కలగడం వల్లనే ఆయనను తెలంగాణా ప్రజలు ఆదరించారు. తత్ఫలితంగా తెలంగాణా జిల్లాలలో చంద్రబాబుకు, తెలుగు దేశం పార్టీ కి అనూహ్యంగా మద్దతు పెరిగింది.

 

ఈ పరిణామాలు చూసి మొదట కంగారు పడిన తెరాస నేతలూ, వారి నాయకుడు కేసీఆర్ ‘నైవేద్యం పెడితే మా మహిమ చూపిస్తామనే గ్రామ దేవతల్లాగా,’ మా అభ్యర్ధులను గెలిపిస్తేనే తెలంగాణా సెంటిమెంటు గెలిచినట్లు, లేదంటే మనం ఓడిపోయినట్లే అని ప్రజలకు నచ్చచెప్పుకొని శాసనమండలి ఎన్నికలలో చావు తప్పి కన్ను లొట్టబోయినట్లు బయటపడ్డారు. కేవలం మూడు నాలుగు జిల్లలో పట్టభద్రులకి, ఉపాద్యాయులకే పరిమితమయిన శాసనమండలి ఎన్నికల కోసం రాష్ట్ర ఎన్నికలతో సమానంగా భావించి వారందరూ ఎంత చెమటోడ్చినా తాము నిలబెట్టిన ముగ్గురులో ఇద్దరినీ మాత్రమే గెలిపించుకోగలిగారు. ఇదేమంత చెప్పుకోవలసిన విషయం కానప్పటికీ, అది తెలంగాణా ప్రజలలో తెరాస పట్ల పెరుగుతున్న నిరాసక్తతకు ఒక చిన్న ఉదాహరణగా నిలుస్తుంది.

 

అయినప్పటికీ, ఇంకా పూర్తిగా మేల్కోనని కేసీఆర్ ను చూసి తెరాస కార్యకర్తలే కాకుండా విపక్షాలు కూడా ఆశ్చర్యపోయాయి. ఇక, సాధారణ ఎన్నికలకు కేవలం ఏడాది మాత్రమే గడువు మిగిలి ఉందని అందరూ భావిస్తున్నపటికీ, కాంగ్రెస్ అధిష్టానం మాత్రం రాష్ట్రంలో, దేశంలో తనకు అనుకూల వాతావరణం ఏర్పడగానే ఎన్నికలకు వెళ్లాలని ఆత్రంగా ఎదురు చూస్తోంది. దేశంలో మిగిలిన ప్రాంతాల పరిస్థితుల సంగతి ఎలా ఉన్నపటికీ, 42మంది పార్లమెంటు సభ్యులను అందించే మన రాష్ట్రంలో, తమ పార్టీలో కలిసిపోయెందుకు సిద్ధంగా ఉన్న తెరాస, దాని అధినేత కేసీఆర్, వారి ఉద్యమాలు చప్పగా చల్లారిపోవడంతో ఒకవైపు చంద్రబాబు నాయుడు, మరో వైపు జగన్ మోహన్ రెడ్డి క్రమంగా బలం పుంజుకోవడం గమనించిన కాంగ్రెస్ అధిష్టానం అప్రమత్తమయింది. కానీ, అదే విషయాన్నీ నేరుగా కేసీఆర్ తో చెప్పడం అంటే కొరివితో తల గోక్కోవడమేనని తెలుసు గనుక, వాయలార్ రవి చేత ముందుగా ‘తెలంగాణా దోశలు వేయించి’ తెలంగాణా నేతలలో కొంచెం వేడి పుట్టించింది.

 

గానీ, ఆ వేడి ఏంతో కాలం నిలవకపోవడంతో మళ్ళీ ఇటీవలే హోం మంత్రి సుషీల్ కుమార్ షిండే చేత ‘తెలంగాణా ఇవ్వడం అంత వీజీ కాదు. ఇస్తే దేశంలో విదర్భ, గూర్ఖా ల్యాండ్ వంటి ప్రత్యెక రాష్ట్ర డిమాండులు మళ్ళీ మేము తలకెత్తుకోలేము. అందువల్ల తెలంగాణా గురించి డెడ్లయిన్ లు, ఆశలు పెట్టుకోవద్దు’ అని మరోమారు తెలంగాణావాదులను గిల్లి చూసారు. కానీ, తెరాస నేతలటువంటి మాటలకి, వెటకారానికి స్పందించడం ఎప్పుడో మానేశారు.

 

ప్రస్తుతం వారి దృష్టి అంతా రాబోయే ఎన్నికల మీదే ఉంది. శాసన మండలి ఎన్నికలకే చెమటోడ్చవలసివచ్చిన తెరాస వచ్చే సాధారణ ఎన్నికలలో గెలుస్తుందో లేదో ఖచ్చితంగా చెప్పలేకపోయినా, ఆ పేరుతొ పార్టీ టికెట్ల కేటాయింపు అనే చాల పెద్ద వ్యవహారంలో ఇప్పుడు తలమునకలయి ఉంది. సుదీర్ఘ రాజకీయ అనుభవం ఉన్న ఆజాద్, షిండే, వాయలార్ రవి వంటి వారిచేత కాంగ్రెస్ అధిష్టానం నోరు జార్పించినా తెరాస నేతల్లో మాత్రం ఉలుకుపలుకు లేదు.

 

బహుశః అందువల్లేనేమో నిన్న ముఖ్యమంతి కిరణ్ కుమార్ రెడ్డి కూడా తెలుగుదేశం పార్టీ తో పోలిస్తే తెరాస, వైకాపాలు చిన్న పార్టీలు, ఇంకా స్పష్టంగా చెప్పాలంటే ప్రాంతీయ పార్టీలు అని మరో మారు గిల్లి చూసారు. కానీ, ఇటువంటి మాటలకి ప్రతీసారీ తాత్కాలికంగా స్పందించడమే తప్ప కాంగ్రెస్ అధిష్టానం ఆశిస్తున్న తెలంగాణా వేడి మాత్రం రగలడం లేదు.

 

తెలంగాణాలో మళ్ళీ కొంచెం వేడి రగిలితే, తెలంగాణాపై ఏదోఒక నిర్దిష్టమయిన ప్రకటన చేసేసి, కిరణ్ కుమార్ రెడ్డి చెప్పినట్లు తెరాసను ‘కాంగ్రెస్ గంగలో కలిపేసుకొని’, తమ ‘చేతిలో చేయేసి’ నడిచేందుకు చొరవ చూపుతున్న జగన్ మోహన్ రెడ్డిని ముందు పెట్టుకొని ‘కుడి ఎడమల డాల్ కత్తులు మెరియగా’ అన్నట్లుగా ఎన్నికలకు వెళ్ళినట్లయితే, ఇక ఏ చంద్రబాబు కూడా తమను ఆపలేడని కాంగ్రెస్ భావిస్తోంది. అయితే, కేంద్రం నుండి కాంగ్రెస్ పంపిస్తున్న ఈ 3జీ సిగ్నల్స్ ను తెరాస అధ్యక్షుడు కేసేఆర్ మరెందుకో సరిగ్గా క్యాచ్ చేయలేకపోతున్నట్లు కనిపిస్తోంది.

 

తెలంగాణా కోసం కాంగ్రెస్ గంగలో మునగడం వల్ల, ఇప్పుడు అనుభవిస్తున్న ఈ రాజభోగం పోగొట్టుకోవడం కంటే, ఎన్నికలలో వీలయినన్ని సీట్లు సంపాదించుకొని అందరితో చెలగాటం ఆడుకోవడమే తమకి ఎక్కువ లాభమని కేసీఆర్ లెక్కలు కేసీఆర్ కు ఉండటం వల్లనే బహుశః కాంగ్రెస్ ప్రసారం చేస్తున్న3జీ సిగ్నల్స్ కూడా ఆయన సరిగ్గా క్యాచ్ చేయడం లేదనుకోవాలి.

 

మరిప్పుడు కాంగ్రెస్ అధిష్టానం ఎవరిని ఏవిధంగా గిల్లుతుందోలేక కేసీఆర్ కు ప్రత్యామ్నాయంగా తెలంగాణా లో మరొకరిని పైకి తీసుకువస్తుందో చూడాలి.

By
en-us Political News

  
ఎన్నికల వేళ జగన్ కు షాకుల మీద షాకులు తగులుతున్నాయి. ఇన్నాళ్లే జగన్ మాటే శాసనం అన్నట్లుగా అణిగిమణిగి ఉన్న వారంతా సరిగ్గా ఎన్నికల ముంగిట ధిక్కార స్వరం వినిపిస్తున్నారు. పార్టీపై తిరుగులేని పట్టు ఉందని భావిస్తున్న జగన్ కు ఆ పట్టు జారిపోవడం కళ్లముందు కనిపించేలా చేస్తున్నారు. టికెట్ నిరాకరించిన, సిట్టింగ్ స్థానాన్ని మార్చిన ఎమ్మెల్యేలు, ఎంపీలు ఇప్పటికే పార్టీని వీడి వలసబాట పట్టారు.
సంసారంలో నిస్సంగత్వంతో ఎలా జీవించాలో గురువు బోధిస్తాడు. మనల్ని సంసారబంధాల నుండి విముక్తుల్ని చేయడానికి తోడ్పడతాడు. కానీ అనేక జన్మల సంస్కారాల వల్ల మనలో సంసారాసక్తి సన్నగిల్లకపోవడంతో గురుబోధ అవగాహన చేసుకొనే మనోపరిపక్వత కలగదు.
ఏద‌యినా ఒక వ‌స్తువు ఇంట్లోంచి పోయిందంటేనే ఎంతో బాధ‌గా వుంటుంది. ఎంతో ఇష్ట‌ప‌డి కొనుక్కున్న వ‌స్తువు చేజారి ప‌డి ప‌గిలిపోయినా, దొంగ‌త‌నం జ‌రిగినా, ఎక్క‌డో మ‌ర్చిపోయినా చాలా బాధేస్తుంది. దాన్ని తిరిగి పొంద‌లేమ‌ని దిగులు ప‌ట్టుకుం టుంది. కానీ 101 ఏళ్ల చార్లెటి బిషాఫ్ కు ఎంతో ఇష్ట‌మ‌యిన పెయింటింగ్ రెండో ప్ర‌పంచ యుద్ధ స‌మ‌యంలో దూర‌మ‌యింది. 80 ఏళ్లు దాని కోసం ఎదురు చూడ‌గ‌లి గింది. అదంటే మ‌రి ఆమెకు ప్రాణ స‌మానం. చాలా కాలం దొరుకుతుంద‌ని, త‌ర్వాత ఇక దొర‌కదేమో అనీ ఎంతో బాధ‌పడింది. ఫిదా సినిమాలో హీరోయిన్ చెప్పినట్లు ఆమె గట్టిగా అనుకుని ఉంటుంది. అందుకే కాస్త ఆలస్యమైనా.. కాస్తేంటి ఎనిమిది దశాబ్దాలు ఆలస్యమైనా ఆమె పెయింటింగ్ ఆమెకు దక్కింది. ఆ పెయింటింగ్ గ‌తేడాది ఆమెను చేరింది.
ఓ వంక ఐదు రాష్ట్రాల అసెంబ్లీ ఎన్నికలు జరుగుతుంటే, మరో వంక జాతీయ స్థాయిలో, బీజేపీ, కాంగ్రెస్ పార్టీలకు తృతీయ ప్రత్యాన్మాయంగా థర్డ్ ఫ్రంట్ ఏర్పాటు ఆలోచనలు  జోరందుకున్నాయి. ఇటీవల కాంగ్రెస్ పార్టీకి రాజీనామా చేసిన ఆ పార్టీ సీనియర్ నాయకుడు, పీసీ చాకో, నేషనలిస్ట్ కాంగ్రెస్ పార్టీ(ఎన్సీపీ)లో చేరారు...
తెలంగాణ  రాష్ట్ర బడ్జెట్ 2021-22ను ఆర్థిక మంత్రి హరీష్ రావు, ఈ నెల18న సభలో ప్రవేశ పెడతారు.కరోనా కారణంగా, ప్రస్తుత ఆర్థిక సంవత్సరం (2020-21)లో ఎదురైన ఆర్థిక ఇబ్బందుల నేపధ్యంగా ప్రవేశపెడుతున్న బడ్జెట్ కావడంతో  సహజంగానే అందరిలోనూ ఆసక్తి నెలకొంది...
అబద్ధాలు, అర్థ సత్యాలు, వ్యక్తిగత దూషణలు, అర్ధంపర్ధం లేని ఆరోపణలతో సుమారు నెలరోజులకు పైగా తెలంగాణలో సాగుతున్న పట్టభద్రుల ఎమ్మెల్సీ ఎన్నికల ప్రచారానికి శుక్రవారం సాయంత్రంతో  తెర పడింది.రాష్ట్రంలోని మహబూబ్‌నగర్‌-హైదరాబాద్‌-రంగారెడ్డి పట్టభద్రుల నియోజకవర్గంతో పాటుగా,నల్లగొండ-ఖమ్మం-వరంగల్‌ స్థానానికి ఫిబ్రవరి 16 తేదీన నోటిఫికేషన్ వెలువడినా, ఎన్నికల ప్రచారం మాత్రం అంతకు చాలా ముందే అభ్యర్ధుల స్థాయిలో స్థానికంగా ఎన్నికల ప్రచారం ప్రారంభమైంది. 
​సహజంగా కష్టాల్లో ఉన్నపుడు ఎవరికైనా దేవుడు గుర్తు వస్తారు. లౌకిక వాద రాజకీయ నాయకులకు అయితే హటాత్తుగా  తాము హిందువులం అనే విషయం జ్ఞప్తికి వస్తుంది. పశ్చిమ బెంగాల్ ముఖ్యమంత్రి, తృణమూల్ పార్టీ అధినాయకురాలు మమతా బెనర్జీకి   కూడా తానూ హిందువును అనే విషయం ఇప్పుడు గుర్తుకొచ్చింది.
దేశంలోని ఉత్తరాది రాష్ట్రాలలో అటు కాంగ్రెస్ ఇటు స్థానికంగా ఉన్న ప్రాంతీయ పార్టీలను మట్టి కరిపిస్తూ అధికారాన్ని కైవసం చేసుకుంటున్న బీజేపీ.. దక్షిణాదికి వచ్చేసరికి ఒక్క కర్ణాటకలో తప్ప ఇతర రాష్ట్రాలలో ఎన్ని ప్రయత్నాలు చేసినా ఏమాత్రం సక్సెస్ కాలేకపోతోంది...
జయలలిత జీవించి ఉన్నత కాలం, ఆమె నెచ్చలిగా పేరొందిన శశికళ, తమిళ రాజకీయాల్లో ఓ వెలుగువెలిగారు. కొన్ని విషయాల్లో జయలలిత కంటే, ఆమె మోర్ పవర్ఫుల్ లేడీ అనిపించుకున్నారు. ముఖ్యమంత్రులు, మంత్రులు కూడా ఆమె ముందు చేతులు కట్టుకుని నిలుచున్నారు.ఆమెకు పాదాభివందనాలు చేశారు.
కాంగ్రెస్ పార్టీలో రగులుతున్న అంతర్యుద్ధం కొత్త పుంతలు తొక్కుతోంది. మరిన్ని మలుపులు తిరుగుతోంది.ఇటీవల జమ్మూలో సమావేసమైన జీ 23 నాయకులు  అసమ్మతి స్వరాన్ని పెంచారు...
పంచతంత్రంగా పిలుచుకుంటున్న ఐదు రాష్టాల అసెంబ్లీ ఎన్నికల్లో అద్భతం జరగబోతోంది. కేంద్ర ఎన్నికల సంఘం నాలుగు రాష్ట్రాలు, కేంద్రపాలిత ప్రాంతం పుదుచ్చేరి అసెంబ్లీ ఎన్నికల షెడ్యూలు ప్రకటించిన వెంటనే, వివిధ సంస్థలు అసెంబ్లీ ఎన్నికలు జరిగే  అస్సాం. పశ్చిమబెంగాల్, తమిళనాడు రాష్ట్రాలతో పాటుగా కేరళలోనూ ఒపీనియన్ పోల్స్ నిర్వహించాయి...
కేంద్ర ఎన్నికలసంఘం ‘పాంచ్ పటాక’ గంట కొట్టింది. అస్సాం, పశ్చిమ బెంగాల్, కేరళ, తమిళనాడు రాష్ట్రాలు, పుదుచ్చేరి కేంద్ర పాలిత ప్రాంతాల అసెంబ్లీ ఎన్నికల షెడ్యూలును కేంద్ర ఎన్నికల సంఘం విడుదలచేసింది. ఎన్నికల గంట మోగడంతో మొదలైన మరో భారత ‘మినీ’  సంగ్రామానికి మే 12 తేదీన జరిగే ఓట్ల లెక్కింపుతో తెర పడుతుంది.ఈలోగా వివిధ అంచల్లో పోలింగ్ జరుగుతుంది.  
నాలుగు రాష్టాలు అస్సాం, పశ్చిమ బెంగాల్ తమిళనాడు,కేరళ, కేంద్ర పాలిత ప్రాంతం పుదుచ్చేరి శాసన సభలకు  మరో రెండు నెలల్లో ఎన్నికలు జరుగుతాయి. ఇది అందరికీ తెలిసిన విషయం.
 
Disclaimer:
All content included on this TeluguOne.com Portal including text, graphics, images, videos and audio clips, is the property of ObjectOne Information Systems Ltd. or our associates, and protected by copyright laws. The collection, arrangement and assembly of all content on this portal/ related channels is the exclusive property of ObjectOne Information Systems Ltd. or our associates and protected copyright laws.
 
You may not copy, reproduce, distribute, publish, display, perform, modify, create derivative works, transmit, or in any other way exploit any part of copyrighted material without permission from ObjectOne Information Systems Ltd or our associates.