వలసలతో కాంగ్రెస్ ప్రక్షాళనం

Publish Date:Apr 14, 2013

Advertisement

 

కాంగ్రెస్ యంపీ మందా జగన్నాధం తెరాసా అధినేత కేసీఆర్ తో నిన్న 3గంటలు మంతనాలు చేశారు. ఆయన త్వరలో తెరాసాలో జేరబోతున్నట్లు వార్తలు కూడా వచ్చాయి. ఆయనతో బాటు మరో ముగ్గురు కాంగ్రెస్ యంపీలు వివేక్, రాజయ్య, గుత్తా సుఖేందర్ రెడ్డి మరికొందరు శాసనసభ్యులు కూడా కాంగ్రెస్ పార్టీని వీడి తెరాసలో చేరబోతున్నట్లు వార్తలొస్తున్నాయి. అయితే వారెవరూ ఆ వార్తలను ఇంత వరకు ఖండించకపోవడంతో వారు తెరాసాలోకి మారడం దాదాపు ఖాయమయినట్లే అనుకోవచ్చును. ఈ వార్తల పట్ల కాంగ్రెస్ పార్టీలో కొంత కలవరం మొదలయినప్పటికీ, అది తాత్కాలికమే. త్వరలోనే వారందిరిపైనా కాంగ్రెస్ నాయకులు విమర్శలు గుప్పిస్తూ మీడియా ముందుకి రావడం కూడా మనం చూడబోతున్నాము.

 

రాహుల్ గాంధీ పార్టీలోకి కొత్తరక్తం ఎక్కించాలని ప్రయత్నిస్తున్నఈతరుణంలో, తెలంగాణా అంశంతో పార్టీకి ఇబ్బందులు సృష్టిస్తున్నమందా, కేశవ్ రావు,గుత్తా, రాజయ్య వంటివారు తమంతట తామే పార్టీ వీడుతున్నపుడు దానిని కాంగ్రెస్ పార్టీ స్వాగతిస్తుందే తప్ప అటువంటి వారికోసం ప్రాకులాడకపోవచ్చును. ఈ విషయంలో అందరికంటే ముందే జ్ఞానోదయం పొందిన మధు యాష్కీ, పొన్నం ప్రభాకర్ ఇద్దరూ కూడా బహుశః అందుకే అకస్మాత్తుగా అధిష్టానానికి అనుకూలంగా తమ తెలంగణా పల్లవిలో కూడా మార్పులు చేసుకొన్నారు. ఇక ముందు కూడా, కాంగ్రెస్ తమ పార్టీ నుండి తెరాసాలోకి, వైయస్సార్ కాంగ్రెస్ పార్టీలోకి వెళ్లదలచిన వారిని అడ్డుకొనే ప్రయత్నం చేయకపోవచ్చును.

 

ముఖ్యమంత్రి కిరణ్ కుమార్ చెప్పినట్లు పార్టీను వీడుతున్నవారు తరువాత తీరికగా పశ్చాత్తాపపడతారని చెప్పిన మాటలు మాత్రం నూటికి నూరుపాళ్ళు నిజమని చెప్పవచ్చును. ఎందుకంటే, ప్రస్తుతం కాంగ్రెస్ పార్టీలోవారనుభవిస్తున్నస్వేచ్చాస్వాతంత్ర్యాలు వారికి మరే ఇతర పార్టీలోను లభించవని ఖచ్చితంగా చెప్పవచ్చును.

 

తెరాసలో చేరిన వారు కేసీఆర్ మరియు అతని కుటుంబ సభ్యులకు, వైయస్సార్ కాంగ్రెస్ పార్టీలో చేరినవారు జగన్ మరియు అతని కుటుంబ సభ్యులకు సలాములు చేస్తూ, వారి ముందు చేతులుకట్టుకొని అణిమణిగిఉండక తప్పదు. కాంగ్రెస్ పార్టీలో అవధులు లేని స్వేచ్చా స్వాతంత్రాలు అనుభవించి, తమకంటూ ఒక ప్రత్యేక గౌరవం, ప్రత్యేక వర్గాలు కలిగిఉండే కాంగ్రెస్ నేతలకు ఇప్పుడు సరికొత్త రాజకీయవ్యవస్థలో, సరి కొత్త వాతావరణంలో తప్పనిసరిగా ఇమడవలసి ఉంటుంది. ముఖ్యంగా వైయస్సార్ కాంగ్రెస్ పార్టీలోచేరే కాంగ్రెస్ నాయకులు, వివిదపార్టీల నుండి ఆ పార్టీలోకి వచ్చిచేరుతున్నతమ రాజకీయ ప్రత్యర్దులతోనే చేతులు కలిపి ముందుకు సాగడం చాలా ఇబ్బందికరమయినప్పటికీ తప్పనిసరి అవుతుంది.

 

ఏమయినప్పటికీ ఈ వలసలవల్ల కాంగ్రెస్ పార్టీ తాత్కాలికంగా కొంచెం ఇబ్బందులు పడినప్పటికీ, ఆ పార్టీ అంతర్గతంగా ప్రక్షాళన అవుతుంది. అంతే కాకుండా రాష్ట్రంలో ఆ పార్టీ తనను తానూ పునర్నిర్ముంచుకొనే అవకాశం కూడా ఏర్పడుతుంది. ఈ కార్యక్రమం ఎంత త్వరగా జరిగితే ఆ పార్టీకి అంత మేలు చేస్తుంది.

By
en-us Political News

  
ఈ నిర్ణయం వెలువడిన వెంటనే అంతర్జాతీయ మార్కెట్లో సానుకూల పరిణామాలు కనిపించాయి. ప్రపంచ చమురు వాణిజ్యంలో ఐదో వంతు వాటా కలిగిన ఈ మార్గం గుండా నౌకల రాకపోకలు సాఫీగా సాగడంతో, ముడి చమురు ధరలు 10 శాతం కంటే ఎక్కువగా పడిపోయాయి. అటు అమెరికా స్టాక్ మార్కెట్లు సైతం భారీ లాభాల్లో ముగిశాయి. ఆసియా మరియు యూరోప్ దేశాలకు, ముఖ్యంగా చమురు దిగుమతులపై ఆధారపడే భారత్, చైనా వంటి దేశాలకు ఇది తక్షణ ఆర్థిక ఊపిరిని అందించింది.
బిల్లు ఆమోదం పొందాలంటే కనీసం 352 ఓట్లు అవసరం. ఈ పరిణామంపై స్పందించిన కేంద్ర హోంమంత్రి అమిత్ షా, విపక్షాల తీరును తీవ్రంగా తప్పుబట్టారు. మహిళలకు చట్టసభల్లో 33 శాతం రిజర్వేషన్లు కల్పించాలనే ప్రభుత్వ సంకల్పాన్ని కాంగ్రెస్, తృణమూల్ కాంగ్రెస్, సమాజ్ వాదీ పార్టీ వంటి పార్టీలు అడ్డుకున్నాయన్నారు. నారీ శక్తిని గౌరవించని విపక్షాలకు ప్రజలు తగిన బుద్ధి చెబుతారని హెచ్చరించారు.
సమానహక్కులు, సముచిత ప్రాతినిథ్యం కోరుతున్న కోట్లాది మంది మహిళలకు కాంగ్రెస్ ద్రోహం చేసిందంటూ చంద్రబాబు ఎక్స్ వేదికగా పేర్కొన్నారు.
భారత పార్లమెంటరీ చరిత్రలో ఒక కీలక పరిణామం చోటుచేసుకుంది.
కానీ కూటమి మధ్య అవగాహన రోజు రోజుకూ బలపడుతోందని తెలుగుదేశం జాతీయ కార్యనిర్వాహక అధ్యక్షుడు నారా లోకేష్ చెప్పారు. ఆ విషయం చెబుతూ.. ఇటీవల తాను చేసిన ఒక వ్యాఖ్యను పవన్ కల్యాణ్ ఫోన్ చేసి మరీ సరిదిద్దిన విషయాన్ని వెల్లడించారు.
తెలుగుదేశం పార్టీ జాతీయ, రాష్ట్రస్థాయి కమిటీల్లో పల్నాడు జిల్లా నేతలకు సముచిత ప్రాధాన్యత దక్కింది.
దాదాపు మూడు దశాబ్దాల నిరీక్షణ తర్వాత ఇది చట్టంగా మారింది. ఎప్పటి నుంచి ఇది చట్టసభల్లో నలుగుతోందని చూస్తే.. మహిళా బిల్లు ప్రస్థానం నేటిది కాదు, దీని వెనుక ఏళ్ల పోరాటం ఉంది. ఈ దిశగా తొలి అడుగులు 1996లో పడ్డాయి. హెచ్.డి. దేవెగౌడ ప్రభుత్వం మొదటిసారిగా 81వ రాజ్యాంగ సవరణ బిల్లు రూపంలో దీనిని ప్రవేశపెట్టింది. కానీ లోక్‌సభ రద్దు కావడంతో అది వీగిపోయింది.
పేద అమ్మాయిల వివాహాలకు ఎనిమిది గ్రాముల బంగారం, ఓ పట్టుచీర కానుకగా ఇస్తామన్నారు. ఐదు ఎకరాల కంటే తక్కువ భూమి ఉన్న రైతుల వ్యవసాయ రుణాలను మాఫీ చేస్తామన్నారు. స్వయం సహాయక బృందాలకు రూ.5 లక్షలు వడ్డీ లేని రుణాలు, ప్రభుత్వ, ఎయిడెడ్ పాఠశాలల్లో డ్రాపవుట్‌ లేకుండా చేసేందుకు విద్యార్థుల తల్లులకు ఏడాదికి రూ.15 వేలు ఆర్థిక సహాయం చేస్తామన్నారు.
తెలుగువన్ వాస్తవ వేదికలో ప్రస్తుత జాతీయ రాజకీయ పరిస్థితులపై విస్తృత చర్చ జరిగింది.
నారా లోకేష్ నాయకత్వానికి ఈ ఆమోదం, ఈ అంగీకారం అంత సులభంగా ఏమీ రాలేదు. అసలు నారా లోకేష్ రాజకీయాలలో తొలి అడుగులు పడకముందే ఆయన నడకను ఆపేయాలని చూశారు. రాజకీయాలలో ఓనమాలు దిద్దడానికి ముందే ఆయన ఎదుగుదలను అణచివేయాలన్న ప్రయత్నాలు జరిగాయి.
ఆ పార్టీ ముఖ్య నేత సజ్జల రామకృష్ణారెడ్డి ఈ అంశంపై స్పందిస్తూ.. కేంద్ర ప్రభుత్వం అనుసరిస్తున్న విధానంపై ప్రశంసలు కురిపించారు. పెరుగుతున్న జనాభా ప్రాతిపదికన అసెంబ్లీ మరియు లోక్‌సభ స్థానాలను సుమారు 50 శాతం మేర పెంచాలని కేంద్రం భావించడం అభివృద్ధికి సంకేతంగా అభివర్ణించారు. ఈ ప్రక్రియ కోసం ఒక స్పష్టమైన విధివిధానాన్ని అనుసరిస్తుండటం పట్ల వైసీపీకి ఎలాంటి అభ్యంతరాలూ లేవని వాకృచ్చారు.
మహిళా రిజర్వేషన్ ను డిలిమిటేషన్‌తో లింక్ చేయడం కేంద్రం చేస్తున్న పెద్ద కుట్రగా అభివర్ణించారు. మహిళా బిల్లు, డిలిమిటేషన్ రెండూ వేర్వేరు అంశాలన్న కల్వకుంట్ల కవిత.. ఈ రెంటినీ లింక్ చేసి.. మహిళల భుజాలపై తుపాకీ పెట్టి డిలిమిటేషన్ అంశాన్ని కాల్చాలని కేంద్రం ప్రయత్నిస్తోందన్నారు.
తృణమూల్ నేతల వాహనాలను సోదాలు చేస్తున్న అధికారులు, ప్రధాని నరేంద్ర మోదీ, కేంద్ర హోం మంత్రి అమిత్ షా, ఇతర బీజేపీ కీలక నేతల కాన్వాయ్‌లను ఎందుకు తనిఖీ చేయడం లేదని నిలదీశారు. నిబంధనలు అందరికీ సమానంగా ఉండాలని, కానీ బెంగాల్‌ లో మాత్రం పక్షపాత వైఖరి కనిపిస్తోందన్నారు.
 
Disclaimer:
All content included on this TeluguOne.com Portal including text, graphics, images, videos and audio clips, is the property of ObjectOne Information Systems Ltd. or our associates, and protected by copyright laws. The collection, arrangement and assembly of all content on this portal/ related channels is the exclusive property of ObjectOne Information Systems Ltd. or our associates and protected copyright laws.
 
You may not copy, reproduce, distribute, publish, display, perform, modify, create derivative works, transmit, or in any other way exploit any part of copyrighted material without permission from ObjectOne Information Systems Ltd or our associates.