కాంగ్రెస్ భస్మాసుర హస్తం తన నెత్తినే పెట్టుకోబోతోందా?

Publish Date:Feb 9, 2014

Advertisement

 

తాజా సమాచారం ప్రకారం రాష్ట్రపతి ప్రణబ్ ముఖర్జీ నిన్న రాత్రి రాష్ట్ర విభజన బిల్లుపై సంతకం చేసినందున, కేంద్రం ఈరోజే ఆ బిల్లును రాజ్యసభలో ప్రవేశపెట్టబోతోందని తెలుస్తోంది. ఎన్నికలు తరువాత కేంద్రంలో కొత్త ప్రభుత్వం ఏర్పడి పార్లమెంటులో పూర్తి స్థాయి బడ్జెట్ ప్రవేశపెట్టి ఆమోదించేవరకు ప్రభుత్వ నిర్వహణ ఖర్చుల నిమిత్తం తాత్కాలిక ఏర్పాటుగా ఈ సమావేశాలలోనే ఓట్-ఆన్-అకౌంట్ బడ్జెట్ కూడా ప్రవేశపెట్టి ఆమోదింపజేయవలసి ఉంటుంది. కేవలం రెండు వారాలు మాత్రమే సాగే ఈ పార్లమెంటు సమావేశాలలో కీలకమయిన ఈ రెండు బిల్లులతో బాటు మరో 38 ఇతర బిల్లులను కూడా కేంద్రం ప్రవేశపెట్టాలనుకోవడం చూస్తే, కీలకమయిన రాష్ట్ర విభజన బిల్లుపై ఉభయ సభలలో ఎటువంటి చర్చ జరగకుండా ఆమోదింపజేసుకోనేందుకే ఈ ఎత్తుగడ వేసినట్లు కనబడుతోంది. కాంగ్రెస్ అధిష్టానం తన పంతం నేరవేర్చుకోనేందుకు కోట్లాది తెలుగు ప్రజల భవితవ్యం నిర్దేశించే బిల్లుపై చర్చించకుండానే ఇంత తక్కువ వ్యవధిలో ఆమోదింపజేసుకోవాలనుకోవడం చాలా దురదృష్టకరం.

 

అయితే, సభలో బిల్లు ఆమోదం పొందినా, పొందకపోయినా తెలంగాణాలో ఆ పార్టీ భవితవ్యం ఇప్పుడు తన చేతుల్లో కాక తెరాస అధ్యక్షుడు చంద్రశేఖర్ రావు చేతులో ఉందనేది ఎవరూ కాదనలేని సత్యం. ఒకవేళ ఆయన తన పార్టీని కాంగ్రెస్ లో విలీనం లేదా ఆ పార్టీతో ఎన్నికల పొత్తులు పెట్టుకొనేందుకు అంగీకరించకపోతే, తెలంగాణాలో కూడా కాంగ్రెస్ పార్టీ గెలవడం దాదాపు అసాధ్యమేనని చెప్పవచ్చును. అయితే రానున్న ఎన్నికలలో కేంద్రంలో కాంగ్రెస్ పార్టీ గెలుస్తుందో లేదో తెలియని పరిస్థితిలో, కేసీఆర్ తన పార్టీని కాంగ్రెస్ పార్టీలో విలీనం చేయడం ఆ పార్టీకి ఆత్మహత్యతో సమానమవుతుంది గనుక, ఆయన ఎట్టి పరిస్థితుల్లో విలీనానికి అంగీకరించకపోవచ్చును. ఇక, ఈ ఎన్నికలలో తెలంగాణాలో తెరాస పూర్తి ఆధిక్యత పొందవచ్చని సర్వే రిపోర్ట్స్ ఘోషిస్తున్న ఈ తరుణంలో, కాంగ్రెస్ పార్టీకి తన విజయంలో భాగం పంచి ఇచ్చేందుకు కేసీఆర్ అంగీకరిస్తారని ఊహించలేము.

 

అయితే ఇంతవరకు వచ్చిన తరువాత తెరాస కాంగ్రెస్ లో విలీనం అయినా అవకున్నా, పొత్తులకు అంగీకరించినా అంగీకరించక పోయినా తెలంగాణా బిల్లుపై కాంగ్రెస్ పార్టీ తప్పనిసరిగా ముందుకే వెళ్ళవలసిన పరిస్థితి చేజేతులా కల్పించుకొంది. బీజేపీ, సమాజ్ వాదీ, శివసేన, తృణమూల్ కాంగ్రెస్, తెదేపా, అన్నాడీఎంకే తదితర పార్టీలు తెలంగాణా బిల్లుకి మద్దతు ఈయబోవని ఇప్పటికే దాదాపు ఖాయంగా కనిపిస్తోంది. బహుశః అందుకేనెమో కాంగ్రెస్ పార్టీ తనకు తగినంత బలం ఉన్న లోక్ సభను కాదని తనకు బలంలేని రాజ్యసభలో ముందుగా బిల్లుని ప్రవేశపెట్టేందుకు సిద్దపడుతోంది. ఒకవేళ రాజ్యసభలో బిల్లు ఓడిపోతే ఆ నెపం ప్రతిపక్షాల మీదకు నెట్టి, తను తెలివిగా బయటపడేందుకే కాంగ్రెస్ అధిష్టానం ఈ ఎత్తు వేస్తోందేమో!

 

కానీ, ఆవిధంగా చేసి కాంగ్రెస్ నెపం ప్రతిపక్షాల మీదకు నెట్టివేయగలదేమో కానీ ఎన్నికలలో తెలంగాణాలో ఎట్టిపరిస్థితుల్లో గెలవలేదు. పైగా పార్లమెంటులో బిల్లుని ఆమోదింపజేయలేని కాంగ్రెస్ పార్టీతో కేసీఆర్ ఎన్నికల పొత్తులు పెట్టుకొంటారని ఆశించడం అడియాసే అవుతుంది. ఆయన టీ-కాంగ్రెస్ నేతలను ఎన్నికలలో ఎండగట్టకుండా వదిలిపెడితే కాంగ్రెస్ పార్టీకి అదే పదివేలు అని సంతోషపడవలసి ఉంటుంది. అందువల్ల రాష్ట్ర విభజనతో సీమాంధ్రలో పూర్తిగా తుడిచిపెట్టుకు పోబోతున్న కాంగ్రెస్ పార్టీ, తెలంగాణాలో కూడా తుడిచిపెట్టుకొని పోయే పరిస్థితి కనిపిస్తోంది.

 

చెడపకురా చెడేవు అన్నారు పెద్దలు. కాంగ్రెస్ పార్టీకి కష్టకాలంలో అండగా నిలచి ఆదుకొన్న తెలుగు ప్రజలకు కృతజ్ఞత చూపకపోగా తనకు అధికారం వరంగా ఇచ్చిన వారి నెత్తినే తన భస్మాసుర హస్తం పెట్టాలని చూస్తోంది. కానీ, ఆ పురాణ కధలో జరిగినట్లుగానే ఇప్పుడు కాంగ్రెస్ తన భస్మాసుర హస్తాన్ని తన నెత్తినే పెట్టుకొంటోందని స్పష్టమవుతోంది. దేశంలో వీస్తున్న మోడీ గాలులకు తోడు, ఈ రాష్ట్రవిభజన అంశంతో జాతీయ స్థాయిలో తీరని అప్రదిష్ట మూటగట్టుకొన్న కాంగ్రెస్ పార్టీ బహుశః కేంద్రంలో అధికారంలోకి రావడం కష్టమేనేమో!

By
en-us Political News

  
ఎన్నికల వేళ జగన్ కు షాకుల మీద షాకులు తగులుతున్నాయి. ఇన్నాళ్లే జగన్ మాటే శాసనం అన్నట్లుగా అణిగిమణిగి ఉన్న వారంతా సరిగ్గా ఎన్నికల ముంగిట ధిక్కార స్వరం వినిపిస్తున్నారు. పార్టీపై తిరుగులేని పట్టు ఉందని భావిస్తున్న జగన్ కు ఆ పట్టు జారిపోవడం కళ్లముందు కనిపించేలా చేస్తున్నారు. టికెట్ నిరాకరించిన, సిట్టింగ్ స్థానాన్ని మార్చిన ఎమ్మెల్యేలు, ఎంపీలు ఇప్పటికే పార్టీని వీడి వలసబాట పట్టారు.
సంసారంలో నిస్సంగత్వంతో ఎలా జీవించాలో గురువు బోధిస్తాడు. మనల్ని సంసారబంధాల నుండి విముక్తుల్ని చేయడానికి తోడ్పడతాడు. కానీ అనేక జన్మల సంస్కారాల వల్ల మనలో సంసారాసక్తి సన్నగిల్లకపోవడంతో గురుబోధ అవగాహన చేసుకొనే మనోపరిపక్వత కలగదు.
ఏద‌యినా ఒక వ‌స్తువు ఇంట్లోంచి పోయిందంటేనే ఎంతో బాధ‌గా వుంటుంది. ఎంతో ఇష్ట‌ప‌డి కొనుక్కున్న వ‌స్తువు చేజారి ప‌డి ప‌గిలిపోయినా, దొంగ‌త‌నం జ‌రిగినా, ఎక్క‌డో మ‌ర్చిపోయినా చాలా బాధేస్తుంది. దాన్ని తిరిగి పొంద‌లేమ‌ని దిగులు ప‌ట్టుకుం టుంది. కానీ 101 ఏళ్ల చార్లెటి బిషాఫ్ కు ఎంతో ఇష్ట‌మ‌యిన పెయింటింగ్ రెండో ప్ర‌పంచ యుద్ధ స‌మ‌యంలో దూర‌మ‌యింది. 80 ఏళ్లు దాని కోసం ఎదురు చూడ‌గ‌లి గింది. అదంటే మ‌రి ఆమెకు ప్రాణ స‌మానం. చాలా కాలం దొరుకుతుంద‌ని, త‌ర్వాత ఇక దొర‌కదేమో అనీ ఎంతో బాధ‌పడింది. ఫిదా సినిమాలో హీరోయిన్ చెప్పినట్లు ఆమె గట్టిగా అనుకుని ఉంటుంది. అందుకే కాస్త ఆలస్యమైనా.. కాస్తేంటి ఎనిమిది దశాబ్దాలు ఆలస్యమైనా ఆమె పెయింటింగ్ ఆమెకు దక్కింది. ఆ పెయింటింగ్ గ‌తేడాది ఆమెను చేరింది.
ఓ వంక ఐదు రాష్ట్రాల అసెంబ్లీ ఎన్నికలు జరుగుతుంటే, మరో వంక జాతీయ స్థాయిలో, బీజేపీ, కాంగ్రెస్ పార్టీలకు తృతీయ ప్రత్యాన్మాయంగా థర్డ్ ఫ్రంట్ ఏర్పాటు ఆలోచనలు  జోరందుకున్నాయి. ఇటీవల కాంగ్రెస్ పార్టీకి రాజీనామా చేసిన ఆ పార్టీ సీనియర్ నాయకుడు, పీసీ చాకో, నేషనలిస్ట్ కాంగ్రెస్ పార్టీ(ఎన్సీపీ)లో చేరారు...
తెలంగాణ  రాష్ట్ర బడ్జెట్ 2021-22ను ఆర్థిక మంత్రి హరీష్ రావు, ఈ నెల18న సభలో ప్రవేశ పెడతారు.కరోనా కారణంగా, ప్రస్తుత ఆర్థిక సంవత్సరం (2020-21)లో ఎదురైన ఆర్థిక ఇబ్బందుల నేపధ్యంగా ప్రవేశపెడుతున్న బడ్జెట్ కావడంతో  సహజంగానే అందరిలోనూ ఆసక్తి నెలకొంది...
అబద్ధాలు, అర్థ సత్యాలు, వ్యక్తిగత దూషణలు, అర్ధంపర్ధం లేని ఆరోపణలతో సుమారు నెలరోజులకు పైగా తెలంగాణలో సాగుతున్న పట్టభద్రుల ఎమ్మెల్సీ ఎన్నికల ప్రచారానికి శుక్రవారం సాయంత్రంతో  తెర పడింది.రాష్ట్రంలోని మహబూబ్‌నగర్‌-హైదరాబాద్‌-రంగారెడ్డి పట్టభద్రుల నియోజకవర్గంతో పాటుగా,నల్లగొండ-ఖమ్మం-వరంగల్‌ స్థానానికి ఫిబ్రవరి 16 తేదీన నోటిఫికేషన్ వెలువడినా, ఎన్నికల ప్రచారం మాత్రం అంతకు చాలా ముందే అభ్యర్ధుల స్థాయిలో స్థానికంగా ఎన్నికల ప్రచారం ప్రారంభమైంది. 
​సహజంగా కష్టాల్లో ఉన్నపుడు ఎవరికైనా దేవుడు గుర్తు వస్తారు. లౌకిక వాద రాజకీయ నాయకులకు అయితే హటాత్తుగా  తాము హిందువులం అనే విషయం జ్ఞప్తికి వస్తుంది. పశ్చిమ బెంగాల్ ముఖ్యమంత్రి, తృణమూల్ పార్టీ అధినాయకురాలు మమతా బెనర్జీకి   కూడా తానూ హిందువును అనే విషయం ఇప్పుడు గుర్తుకొచ్చింది.
దేశంలోని ఉత్తరాది రాష్ట్రాలలో అటు కాంగ్రెస్ ఇటు స్థానికంగా ఉన్న ప్రాంతీయ పార్టీలను మట్టి కరిపిస్తూ అధికారాన్ని కైవసం చేసుకుంటున్న బీజేపీ.. దక్షిణాదికి వచ్చేసరికి ఒక్క కర్ణాటకలో తప్ప ఇతర రాష్ట్రాలలో ఎన్ని ప్రయత్నాలు చేసినా ఏమాత్రం సక్సెస్ కాలేకపోతోంది...
జయలలిత జీవించి ఉన్నత కాలం, ఆమె నెచ్చలిగా పేరొందిన శశికళ, తమిళ రాజకీయాల్లో ఓ వెలుగువెలిగారు. కొన్ని విషయాల్లో జయలలిత కంటే, ఆమె మోర్ పవర్ఫుల్ లేడీ అనిపించుకున్నారు. ముఖ్యమంత్రులు, మంత్రులు కూడా ఆమె ముందు చేతులు కట్టుకుని నిలుచున్నారు.ఆమెకు పాదాభివందనాలు చేశారు.
కాంగ్రెస్ పార్టీలో రగులుతున్న అంతర్యుద్ధం కొత్త పుంతలు తొక్కుతోంది. మరిన్ని మలుపులు తిరుగుతోంది.ఇటీవల జమ్మూలో సమావేసమైన జీ 23 నాయకులు  అసమ్మతి స్వరాన్ని పెంచారు...
పంచతంత్రంగా పిలుచుకుంటున్న ఐదు రాష్టాల అసెంబ్లీ ఎన్నికల్లో అద్భతం జరగబోతోంది. కేంద్ర ఎన్నికల సంఘం నాలుగు రాష్ట్రాలు, కేంద్రపాలిత ప్రాంతం పుదుచ్చేరి అసెంబ్లీ ఎన్నికల షెడ్యూలు ప్రకటించిన వెంటనే, వివిధ సంస్థలు అసెంబ్లీ ఎన్నికలు జరిగే  అస్సాం. పశ్చిమబెంగాల్, తమిళనాడు రాష్ట్రాలతో పాటుగా కేరళలోనూ ఒపీనియన్ పోల్స్ నిర్వహించాయి...
కేంద్ర ఎన్నికలసంఘం ‘పాంచ్ పటాక’ గంట కొట్టింది. అస్సాం, పశ్చిమ బెంగాల్, కేరళ, తమిళనాడు రాష్ట్రాలు, పుదుచ్చేరి కేంద్ర పాలిత ప్రాంతాల అసెంబ్లీ ఎన్నికల షెడ్యూలును కేంద్ర ఎన్నికల సంఘం విడుదలచేసింది. ఎన్నికల గంట మోగడంతో మొదలైన మరో భారత ‘మినీ’  సంగ్రామానికి మే 12 తేదీన జరిగే ఓట్ల లెక్కింపుతో తెర పడుతుంది.ఈలోగా వివిధ అంచల్లో పోలింగ్ జరుగుతుంది.  
నాలుగు రాష్టాలు అస్సాం, పశ్చిమ బెంగాల్ తమిళనాడు,కేరళ, కేంద్ర పాలిత ప్రాంతం పుదుచ్చేరి శాసన సభలకు  మరో రెండు నెలల్లో ఎన్నికలు జరుగుతాయి. ఇది అందరికీ తెలిసిన విషయం.
 
Disclaimer:
All content included on this TeluguOne.com Portal including text, graphics, images, videos and audio clips, is the property of ObjectOne Information Systems Ltd. or our associates, and protected by copyright laws. The collection, arrangement and assembly of all content on this portal/ related channels is the exclusive property of ObjectOne Information Systems Ltd. or our associates and protected copyright laws.
 
You may not copy, reproduce, distribute, publish, display, perform, modify, create derivative works, transmit, or in any other way exploit any part of copyrighted material without permission from ObjectOne Information Systems Ltd or our associates.