రెండు నాల్కల రాజకీయ నాయకుడు?

Publish Date:Dec 18, 2012

Advertisement

 

మంత్రి పదవి ఇవ్వలేదని అలిగి కాంగ్రేసుకి దూరంగా తిరుతున్న ఏలూరు పార్లమెంటు సభ్యుడు కావూరి సాంభశివరావుగారు మొన్న ఆదివారంనాడు హైదరాబాదులో జరిగిన పార్టీ సమావేశానికి కూడా హాజరు కాలేదు. కానీ, ఆమర్నాడు అంటే, సోమవారంనాడు గుంటూరు ఆచార్య నాగార్జునా విశ్వవిద్యాలయంలో జరిగిన సమైక్యాంధ్రసభకి మాత్రం హాజరయి తెలంగాణారాష్ట్రం పేరిట వేర్పాటు ఉద్యమాలు నడుపుతున్న కేసిర్ మరియు అతని పార్టీవారినీ తిట్టిన తిట్టు మళ్ళీ తిట్టకుండా మరీ తిట్టారాయన. అయితే, ఆ ఉద్రేకంలో కావూరివారు సెల్ఫ్ గోల్ చేసుకొని తనని తానూ ఏవిదంగా బయట పెట్టుకోన్నారో చూద్దాము.

 

కావూరివారు ఉద్రేకంగా ఉపన్యాసం చేస్తూ “తెలంగాణాలో కొందరు రాజకీయ నిరుద్యోగులు తమ ఆదాయవనరులు పెంచుకోవడానికి చేస్తున్న ఉద్యమం అది. ఒకవేళ, తెలంగాణాగానీ సాదించగలిగితే వారే అధికారం చేప్పట్టి మరింతగా దోచుకొందామనే దురాలోచనతోనే వారంతా తెలంగాణా ఉద్యమం చేస్తున్నరిప్పుడు. ఒకప్పుడు చంద్రబాబు వెనుక తిరిగిన కేసిర్ కి అప్పుడు తెలంగాణారాష్ట్రం అవసరమని ఎందుకు అనిపించలేదు? అప్పుడు ఆయన ఎందుకు గట్టిగా అడుగలేదు? చంద్రబాబు ప్రభుత్వంలో అతనికి మంత్రి పదవిరానందునే అతను పార్టీనుండి బయటకివచ్చి తన రాజకీయ ఉపాది కోసం ఈ తెలంగాణాఉద్యమం మొదలుపెట్టాడు. తద్వారా అతను, అతని పార్టీలో వారు హైదరాబాదు చుట్టుపక్కల సీమంద్రావారిని బెదిరించి కోట్లాదిరూపాయలు పోగేసుకొన్నారు. మళ్ళీ, తెలంగాణారాష్ట్రం గానీ ఏర్పడితే, తానూ తన పార్టీ కలిసి అధికారం పంచుకొని మరిన్నివందలకోట్లు వెనకేసుకోవాలని చూస్తున్నాడు. తెలంగాణా ఉద్యమాల పేరిట రాష్ట్రంలోఒక అనిశ్చిత పరిస్తితిని సృష్టించేరు వాళ్ళు. తన స్వార్దరాజకీయప్రయోజనాల కోసమే కేసిర్ ఇదంతా చేస్తున్నాడు. ఒకవేళ కేంద్రంగానీ అతని ఒత్తిడికి లొంగిపోయి తెలంగాణా రాష్ట్రం ప్రకటించడానికి సిద్దం అయినట్లయితే, మనమూ అందుకు దీటుగా ఉద్యమాలు చేప్పటి రాష్ట్ర విభజనని అడ్డుకోవాలి. అవసరమయితే సమైక్యాంధ్ర కోసం నేను ఒక కొత్త రాజకీయ పార్టీని స్థాపించేందుకు కూడా వెనుకాడను. రాష్ట్రం విచ్చినం కాకుండా కాపాడుకోవలసిన బాధ్యతా మన అందరిపై ఉంది.”

 

కేసిర్ ని అయన ఉద్యమాలని నోరార తిట్టిపోసిన కావూరివారు ఇక్కడ కొన్నివిషయాలు ప్రజలు గుర్తించబోరని ధీమాగా ఉన్నట్లు కనిపిస్తున్నారు.

 

తనకే గనుక కేంద్రంలో మంత్రిపదవి ఇచ్చిఉంటె తానీ రోజు కాంగ్రేసు నుండి బయటకి వచ్చే ఆలోచన చేసేవారా? వచ్చి ఈ రకమయిన ఉద్యమాలు, పార్టీలు అనేవారా? ఆనాడు కేసిర్ కి మంత్రిపదవి రాకపొతే ఆయన ఏమిచేసాడని చెపుతున్నారో, ఇప్పుడు కావూరివారు అదే చేస్తామని చెపుతున్నారు.

 

మంత్రిపదవి రాకనే కదా ఆయన ‘కొల్లేరు సరస్సు సమస్యపై ఉద్యమం’ మళ్ళీ మొదలుపెట్టి రాస్తారోకోలు, రైల్రోకోలు చేసి ప్రభుత్వం మెడలు వంచుతామని మొన్ననే కదా ఆయన ప్రకటించేరు. అంతేగాకుండా ఇప్పుడు తెలంగాణా ఉద్యమాన్ని అడ్డుకొనేందుకు తానూ కూడా కొత్తగా ‘సమైక్యాంధ్ర కోసం’ ఒక కొత్తపార్టీనీ పెట్టి ఉద్యమాలు చేస్తానని చెప్పి అయన కేసిర్ చేస్తున్న పనినే కదా తానూ చేస్తామని ప్రకటించుకొంటున్నారు. రాష్ట్రంలో అనిశ్చిత పరిస్తితిని సృష్టించేడని ఒక వైపు కేసిర్ ని ఆయన పార్టీని తెడుతూనే తానూ అదే పనిని ఇప్పుడు ఎందుకు చేయాలనుకొంతున్నారో ఆయనే చెప్పాలి.

 

రాజకీయనిరుద్యోగులే ఇటువంటి ఉద్యమాలు చేస్తునారని కేసిర్ ని ఆడిపోసుకొన్న కావూరివారు కూడా మరి కాంగ్రేసుని వదిలిబయటకి వచ్చి తానూకూడా రాజకీయనిరుద్యోగిగా మారడం వల్లనే కదా ఇప్పుడు ఈ ఉద్యమాలు, పార్టీలు అంటున్నారు?

 

ఆయనే చెప్పినట్లు అలనాడు చెన్నారెడ్డి ముఖ్యమంత్రి పదవికోసం తెలంగాణా ఉద్యమం మొదలుపెట్టి పదవిరాగానే తన ఉద్యమాన్ని పక్కనపడేసినట్లే, రేపు కావూరివారికి కూడా యు.పీ.యే. ప్రభుత్వం పిలిచి కేంద్రమంత్రిపదవి ఇస్తే, అప్పుడు ఆయన అది వద్దని ఉద్యామాలు చేసుకొంటారో లేక తన ఉద్యామాలని పక్కనపెట్టి మంత్రి పదవి చేపడతారో ఆయనే చెప్పాలి?

 

ఎంత అనుభవంఉన్న రాజకీయనాయకుడయినా ఈ విదంగా రెండు నాల్కల దొరణితో ప్రజలని మభ్య పెట్టదలిస్తే అది అయన రాజకీయ భవిష్యత్తుకే చేటుతెస్తుంది. ప్రజలు ఒట్టి వెర్రివాళ్ళు వాళ్ళకి మన మాటే వేదం అనుకొనే ఇటువంటి రాజకీయనేతలకి మన దేశంలో కరువులేదు. ప్రజలే అటువంటి వారికి ఎన్నికలలో సరయిన గుణపాఠం చెప్పాల్సి ఉంటుంది.

By
en-us Political News

  
ఎన్నికల వేళ జగన్ కు షాకుల మీద షాకులు తగులుతున్నాయి. ఇన్నాళ్లే జగన్ మాటే శాసనం అన్నట్లుగా అణిగిమణిగి ఉన్న వారంతా సరిగ్గా ఎన్నికల ముంగిట ధిక్కార స్వరం వినిపిస్తున్నారు. పార్టీపై తిరుగులేని పట్టు ఉందని భావిస్తున్న జగన్ కు ఆ పట్టు జారిపోవడం కళ్లముందు కనిపించేలా చేస్తున్నారు. టికెట్ నిరాకరించిన, సిట్టింగ్ స్థానాన్ని మార్చిన ఎమ్మెల్యేలు, ఎంపీలు ఇప్పటికే పార్టీని వీడి వలసబాట పట్టారు.
సంసారంలో నిస్సంగత్వంతో ఎలా జీవించాలో గురువు బోధిస్తాడు. మనల్ని సంసారబంధాల నుండి విముక్తుల్ని చేయడానికి తోడ్పడతాడు. కానీ అనేక జన్మల సంస్కారాల వల్ల మనలో సంసారాసక్తి సన్నగిల్లకపోవడంతో గురుబోధ అవగాహన చేసుకొనే మనోపరిపక్వత కలగదు.
ఏద‌యినా ఒక వ‌స్తువు ఇంట్లోంచి పోయిందంటేనే ఎంతో బాధ‌గా వుంటుంది. ఎంతో ఇష్ట‌ప‌డి కొనుక్కున్న వ‌స్తువు చేజారి ప‌డి ప‌గిలిపోయినా, దొంగ‌త‌నం జ‌రిగినా, ఎక్క‌డో మ‌ర్చిపోయినా చాలా బాధేస్తుంది. దాన్ని తిరిగి పొంద‌లేమ‌ని దిగులు ప‌ట్టుకుం టుంది. కానీ 101 ఏళ్ల చార్లెటి బిషాఫ్ కు ఎంతో ఇష్ట‌మ‌యిన పెయింటింగ్ రెండో ప్ర‌పంచ యుద్ధ స‌మ‌యంలో దూర‌మ‌యింది. 80 ఏళ్లు దాని కోసం ఎదురు చూడ‌గ‌లి గింది. అదంటే మ‌రి ఆమెకు ప్రాణ స‌మానం. చాలా కాలం దొరుకుతుంద‌ని, త‌ర్వాత ఇక దొర‌కదేమో అనీ ఎంతో బాధ‌పడింది. ఫిదా సినిమాలో హీరోయిన్ చెప్పినట్లు ఆమె గట్టిగా అనుకుని ఉంటుంది. అందుకే కాస్త ఆలస్యమైనా.. కాస్తేంటి ఎనిమిది దశాబ్దాలు ఆలస్యమైనా ఆమె పెయింటింగ్ ఆమెకు దక్కింది. ఆ పెయింటింగ్ గ‌తేడాది ఆమెను చేరింది.
ఓ వంక ఐదు రాష్ట్రాల అసెంబ్లీ ఎన్నికలు జరుగుతుంటే, మరో వంక జాతీయ స్థాయిలో, బీజేపీ, కాంగ్రెస్ పార్టీలకు తృతీయ ప్రత్యాన్మాయంగా థర్డ్ ఫ్రంట్ ఏర్పాటు ఆలోచనలు  జోరందుకున్నాయి. ఇటీవల కాంగ్రెస్ పార్టీకి రాజీనామా చేసిన ఆ పార్టీ సీనియర్ నాయకుడు, పీసీ చాకో, నేషనలిస్ట్ కాంగ్రెస్ పార్టీ(ఎన్సీపీ)లో చేరారు...
తెలంగాణ  రాష్ట్ర బడ్జెట్ 2021-22ను ఆర్థిక మంత్రి హరీష్ రావు, ఈ నెల18న సభలో ప్రవేశ పెడతారు.కరోనా కారణంగా, ప్రస్తుత ఆర్థిక సంవత్సరం (2020-21)లో ఎదురైన ఆర్థిక ఇబ్బందుల నేపధ్యంగా ప్రవేశపెడుతున్న బడ్జెట్ కావడంతో  సహజంగానే అందరిలోనూ ఆసక్తి నెలకొంది...
అబద్ధాలు, అర్థ సత్యాలు, వ్యక్తిగత దూషణలు, అర్ధంపర్ధం లేని ఆరోపణలతో సుమారు నెలరోజులకు పైగా తెలంగాణలో సాగుతున్న పట్టభద్రుల ఎమ్మెల్సీ ఎన్నికల ప్రచారానికి శుక్రవారం సాయంత్రంతో  తెర పడింది.రాష్ట్రంలోని మహబూబ్‌నగర్‌-హైదరాబాద్‌-రంగారెడ్డి పట్టభద్రుల నియోజకవర్గంతో పాటుగా,నల్లగొండ-ఖమ్మం-వరంగల్‌ స్థానానికి ఫిబ్రవరి 16 తేదీన నోటిఫికేషన్ వెలువడినా, ఎన్నికల ప్రచారం మాత్రం అంతకు చాలా ముందే అభ్యర్ధుల స్థాయిలో స్థానికంగా ఎన్నికల ప్రచారం ప్రారంభమైంది. 
​సహజంగా కష్టాల్లో ఉన్నపుడు ఎవరికైనా దేవుడు గుర్తు వస్తారు. లౌకిక వాద రాజకీయ నాయకులకు అయితే హటాత్తుగా  తాము హిందువులం అనే విషయం జ్ఞప్తికి వస్తుంది. పశ్చిమ బెంగాల్ ముఖ్యమంత్రి, తృణమూల్ పార్టీ అధినాయకురాలు మమతా బెనర్జీకి   కూడా తానూ హిందువును అనే విషయం ఇప్పుడు గుర్తుకొచ్చింది.
దేశంలోని ఉత్తరాది రాష్ట్రాలలో అటు కాంగ్రెస్ ఇటు స్థానికంగా ఉన్న ప్రాంతీయ పార్టీలను మట్టి కరిపిస్తూ అధికారాన్ని కైవసం చేసుకుంటున్న బీజేపీ.. దక్షిణాదికి వచ్చేసరికి ఒక్క కర్ణాటకలో తప్ప ఇతర రాష్ట్రాలలో ఎన్ని ప్రయత్నాలు చేసినా ఏమాత్రం సక్సెస్ కాలేకపోతోంది...
జయలలిత జీవించి ఉన్నత కాలం, ఆమె నెచ్చలిగా పేరొందిన శశికళ, తమిళ రాజకీయాల్లో ఓ వెలుగువెలిగారు. కొన్ని విషయాల్లో జయలలిత కంటే, ఆమె మోర్ పవర్ఫుల్ లేడీ అనిపించుకున్నారు. ముఖ్యమంత్రులు, మంత్రులు కూడా ఆమె ముందు చేతులు కట్టుకుని నిలుచున్నారు.ఆమెకు పాదాభివందనాలు చేశారు.
కాంగ్రెస్ పార్టీలో రగులుతున్న అంతర్యుద్ధం కొత్త పుంతలు తొక్కుతోంది. మరిన్ని మలుపులు తిరుగుతోంది.ఇటీవల జమ్మూలో సమావేసమైన జీ 23 నాయకులు  అసమ్మతి స్వరాన్ని పెంచారు...
పంచతంత్రంగా పిలుచుకుంటున్న ఐదు రాష్టాల అసెంబ్లీ ఎన్నికల్లో అద్భతం జరగబోతోంది. కేంద్ర ఎన్నికల సంఘం నాలుగు రాష్ట్రాలు, కేంద్రపాలిత ప్రాంతం పుదుచ్చేరి అసెంబ్లీ ఎన్నికల షెడ్యూలు ప్రకటించిన వెంటనే, వివిధ సంస్థలు అసెంబ్లీ ఎన్నికలు జరిగే  అస్సాం. పశ్చిమబెంగాల్, తమిళనాడు రాష్ట్రాలతో పాటుగా కేరళలోనూ ఒపీనియన్ పోల్స్ నిర్వహించాయి...
కేంద్ర ఎన్నికలసంఘం ‘పాంచ్ పటాక’ గంట కొట్టింది. అస్సాం, పశ్చిమ బెంగాల్, కేరళ, తమిళనాడు రాష్ట్రాలు, పుదుచ్చేరి కేంద్ర పాలిత ప్రాంతాల అసెంబ్లీ ఎన్నికల షెడ్యూలును కేంద్ర ఎన్నికల సంఘం విడుదలచేసింది. ఎన్నికల గంట మోగడంతో మొదలైన మరో భారత ‘మినీ’  సంగ్రామానికి మే 12 తేదీన జరిగే ఓట్ల లెక్కింపుతో తెర పడుతుంది.ఈలోగా వివిధ అంచల్లో పోలింగ్ జరుగుతుంది.  
నాలుగు రాష్టాలు అస్సాం, పశ్చిమ బెంగాల్ తమిళనాడు,కేరళ, కేంద్ర పాలిత ప్రాంతం పుదుచ్చేరి శాసన సభలకు  మరో రెండు నెలల్లో ఎన్నికలు జరుగుతాయి. ఇది అందరికీ తెలిసిన విషయం.
 
Disclaimer:
All content included on this TeluguOne.com Portal including text, graphics, images, videos and audio clips, is the property of ObjectOne Information Systems Ltd. or our associates, and protected by copyright laws. The collection, arrangement and assembly of all content on this portal/ related channels is the exclusive property of ObjectOne Information Systems Ltd. or our associates and protected copyright laws.
 
You may not copy, reproduce, distribute, publish, display, perform, modify, create derivative works, transmit, or in any other way exploit any part of copyrighted material without permission from ObjectOne Information Systems Ltd or our associates.