వారి దయాదాక్షిణ్యాల వలననే హిందూ మతం సజీవంగా ఉందిట!

Publish Date:Dec 4, 2015

Advertisement

 

కాంగ్రెస్ పార్టీ సీనియర్ నేత దిగ్విజయ్ సింగ్ ‘ద హిందు’ పత్రికకి ఇచ్చిన ఇంటర్వ్యూలో భారతదేశంలో హిందువులు జనాభా పరంగా అభివృద్ధి చెందడానికి ఒకప్పుడు దేశాన్ని పాలించిన మొఘల్ చక్రవర్తుల ఔదార్యమే కారణమని అన్నారు. దేశాన్ని సుమారు 500 ఏళ్ళపాటు పరిపాలించిన మొఘల్ చక్రవర్తులు తలచుకొంటే దేశాన్ని పూర్తిగా ముస్లిం దేశంగా మార్చగలిగేవారని, కానీ వారు ఔదార్యం చూపి హిందువులను, వారి మతాన్ని గౌరవించారని అందుకే నేడు దేశంలో హిందూమతం సజీవంగా ఉందని అన్నారు. అక్బర్ చక్రవర్తి ఆస్థానంలో ఉన్న హిందువులను గమనిస్తే మొఘల్ చక్రవర్తుల మత సహనం ఎంత గొప్పదో అర్ధమవుతుందని దిగ్విజయ్ సింగ్ అన్నారు.

 

"ఒకప్పుడు భారతదేశానికి ముస్లింలు వచ్చేరు. ఆ తరువాత క్రీష్టియన్లు వచ్చేరు. వారందరినీ భారతదేశం తనలో కలుపుకొంది. అన్ని మతాల వారిని భారత్ సమానంగా ఆదరిస్తుంది. అదే భారతదేశానికి ఉన్న గొప్ప లక్షణం. కానీ అదిప్పుడు దెబ్బ తింటోంది. దేశంలో మత అసహనం పెరిగిపోతోంది. ఒకప్పుడు పాకిస్తాన్ జియా ఉల్-హైకోర్టు చేసిన పొరపాటునే ప్రస్తుత ప్రభుత్వం కూడా చేస్తున్నట్లు కనిపిస్తోంది. నేడు పాకిస్తాన్ ఈ దుస్థితిలో ఉండటానికి కారణం మత చంధసవాదులయిన జమ్మత్-ఏ.ఇస్లామీ నేతలను ప్రభుత్వంలోకి తీసుకోవడమే!"

 

"మోడీ ప్రభుత్వం కూడా దేశంలో మతాల మధ్య చిచ్చుపెట్టి రాజకీయ లబ్ది పొందాలని భావిస్తోంది. కానీ మతం అనేది ఒక భూతం వంటిది. దానిని ఒకసారి బయటకు రప్పిస్తే మళ్ళీ బందించడం చాలా కష్టం. దానిని అప్పుడు ఎవరూ నియంత్రించలేరు. అదే ప్రభుత్వాలని శాసించడం మొదలుపెడుతుంది. మైనార్టీ వర్గాల మతతత్వం కంటే మెజార్టీ వర్గాల మతతత్వమే దేశానికి చాలా ప్రమాదమని పండిట్ జవహార్ లాల్ నెహ్రూ ఆనాడే చెప్పారు. అది అక్షరాల నేటికీ వర్తిస్తుంది. అందుకే కాంగ్రెస్ పార్టీ దేశంలో ఏదో ఒక మత ఆధిపత్యాన్ని తీవ్రంగా వ్యతిరేకిస్తుంది. మత సహనం కలిగి ఉండటమే మన దేశానికి అన్ని విధాల మంచిది,” అని అన్నారు.

 

దిగ్విజయ్ సింగ్ వంటి రాజకీయ నాయకులు, దేశంలో మేధావులు ప్రజలు, ప్రభుత్వం ఒక సక్రమమయిన మార్గంలో నడిపించేందుకే తమ మేధస్సును, వాక్చాతుర్యాన్ని ఉపయోగిస్తే అందరూ హర్షిస్తారు. కానీ తమ మేధస్సు, తమకున్న లోక జ్ఞానంతో ప్రజలను తప్పు మార్గం పట్టించడాన్ని ఎవరూ హర్షించలేరు.

 

మోడీ ప్రభుత్వం తన రాజకీయ ప్రయోజనాల కోసమే దేశంలో ప్రజల మధ్య మత భేదాలు సృష్టిస్తోందని వాదిస్తున్న దిగ్విజయ్ సింగ్ వంటి కాంగ్రెస్ నేతలు అందరూ కూడా తమ కాంగ్రెస్ పార్టీని కాపాడుకోవడానికే “ఊహాజనితమయిన మత అసహనం” అనే పదాన్ని సృష్టించి దానికి విస్తృతంగా ఒక పద్ధతి ప్రకారం ప్రచారం చేస్తూ ప్రశాంతంగా జీవిస్తున్న భిన్న మతాల ప్రజల మధ్య చిచ్చుపెట్టే ప్రయత్నాలు చేస్తున్నారు. కాంగ్రెస్ పార్టీ అధికారంలో ఉన్న కర్ణాటకలో జరిగిన సంఘటనకి కాంగ్రెస్ బాధ్యత వహించాలి. కానీ దానికీ మోడీ ప్రభుత్వానిదే బాధ్యత అని కాంగ్రెస్ వాదించడం గమనించినట్లయితే అది ఉదేశ్యపూర్వకంగానే ఈ విష ప్రచారం చేస్తోందని అర్ధమవుతోంది. అందుకోసం దిగ్విజయ్ సింగ్ ఇప్పుడు చరిత్రను కూడా వక్రీకరించడానికి వెనుకాడక పోవడం చాలా శోచనీయం.

 

భారతదేశంపైకి అధికారం చెలాయించిన మొఘలులు ఉదారంగా వ్యహరించడం వలననే హిందువులు, వారి సంస్కృతి ఇంకా బ్రతికి ఉందని దిగ్విజయ్ సింగ్ చెప్పడం చాలా అవమానకరంగా ఉంది. భారతదేశంపై, దేశ సంస్కృతీ సంప్రదాయాలపై విదేశీయులు చేసిన దాడులు ఆయన కళ్ళకి కనబడలేదు. గజనీలు, ఘోరీలు గుళ్ళు గోపురాలను ద్వంసం చేయడం, నలందా వంటి ప్రపంచ ప్రసిద్ధి చెందిన విశ్వవిద్యాలయంలో అమూల్యమయిన గ్రంధాలను తగులపెట్టడం, దేశ సంపదను దశాబ్దాల తరబడి దోపిడీ చేసి తమ దేశాలకు తరలించుకుపోవడం వంటి అనేక అకృత్యాలు భారతీయుడయిన దిగ్విజయ్ సింగ్ కళ్ళకి కనబడకపోవడం చాలా విచిత్రమే.

 

కానీ తమ పార్టీ వాదనలకు పనికివచ్చే వారిలో మంచిని మాత్రం ఆయన స్వీకరించి చరిత్రను కూడా వక్రీకరిస్తున్నారు. మొఘలులు లేదా బ్రిటిష్ వాళ్ళ బారి నుండి దేశాన్ని కాపాడుకోవడానికి ఎన్ని లక్షల మంది ప్రజలు, సైనికులు, వీరులు, రాజులు తమ ప్రాణాలను తృణప్రాయంగా బలిచేసారో ఆయన చెప్పకపోవచ్చును కానీ ప్రజలకు ఆ సంగతి తెలుసు. అలనాడు మహా రాణా ప్రతాప్, చత్రపతి శివాజీ మొదలుకొని తరువాత కాలంలో సుబాష్ చంద్రబోస్, గాంధీ, నెహ్రు, అల్లూరి సీతారామరాజు వరకు ఎందరో మహనీయులు, అనామక ప్రజలు కలిసి చేసిన ఎన్నో పోరాటాల కారణంగానే భారతదేశం, భారతీయ సంస్కృతి సంప్రదాయాలను కాపాడబడ్డాయి తప్ప ఎవరో దయాదర్మాల వలన కాదనే సంగతి బ్రిటిష్ పాలకులను దేశం నుండి తరిమికొట్టిన కాంగ్రెస్ పార్టీలో పనిచేస్తున్న దిగ్విజయ్ సింగ్ వంటి సీనియర్ నేతకు తెలియదనుకోవాలా లేక తెలిసీ ఈవిధంగా మాట్లాడుతున్నారు అంటే తమ పార్టీ ప్రయోజనాల కోసం అవసరం లేని చరిత్రను తవ్వి తీసి చరిత్రను కూడా వక్రీకరిస్తున్నారనుకోవాలా?

 

నిజానికి మత అసహనం పేరిట బీజేపీని, మోడీ ప్రభుత్వాన్ని రాజకీయంగా దెబ్బ తీసి మళ్ళీ దేశంలో తమ పార్టీని నిలబెట్టుకోవాలని కాంగ్రెస్ నేతలు చేస్తున్న ప్రయత్నాల వలననే దేశానికి ఎక్కువ నష్టం జరుగుతోంది. ఒకప్పుడు దేశ స్వాతంత్ర్యం కోసం పోరాడిన కాంగ్రెస్ పార్టీ ఇప్పుడు తన మనుగడ కోసం, తన వారసుడి రాజకీయ భవిష్యత్ ని కాపాడుకోవడం కోసమే ఈ పోరాటం మొదలుపెట్టిందని అందరికీ తెలుసు. కానీ వారు చేస్తున్న ఈ దుష్ప్రచారం వలన ప్రపంచ దేశాలు భారత్ ని అనుమానంగా చూసే పరిస్థితి కలిపిస్తున్నారని దాని వలన అంతర్జాతీయంగా భారత్ ప్రతిష్ట దెబ్బ తింటుందని గ్రహిస్తే బాగుంటుంది. భారత్ కంటే కాంగ్రెస్ పార్టీకి తమ ప్రయోజనాలే ముఖ్యమనుకొంటే అటువంటి పార్టీ భారత్ కి అవసరం లేదని ప్రజలు మరొకమారు తప్పక రుజువు చేస్తారు.

By
en-us Political News

  
ఎన్నికల వేళ జగన్ కు షాకుల మీద షాకులు తగులుతున్నాయి. ఇన్నాళ్లే జగన్ మాటే శాసనం అన్నట్లుగా అణిగిమణిగి ఉన్న వారంతా సరిగ్గా ఎన్నికల ముంగిట ధిక్కార స్వరం వినిపిస్తున్నారు. పార్టీపై తిరుగులేని పట్టు ఉందని భావిస్తున్న జగన్ కు ఆ పట్టు జారిపోవడం కళ్లముందు కనిపించేలా చేస్తున్నారు. టికెట్ నిరాకరించిన, సిట్టింగ్ స్థానాన్ని మార్చిన ఎమ్మెల్యేలు, ఎంపీలు ఇప్పటికే పార్టీని వీడి వలసబాట పట్టారు.
సంసారంలో నిస్సంగత్వంతో ఎలా జీవించాలో గురువు బోధిస్తాడు. మనల్ని సంసారబంధాల నుండి విముక్తుల్ని చేయడానికి తోడ్పడతాడు. కానీ అనేక జన్మల సంస్కారాల వల్ల మనలో సంసారాసక్తి సన్నగిల్లకపోవడంతో గురుబోధ అవగాహన చేసుకొనే మనోపరిపక్వత కలగదు.
ఏద‌యినా ఒక వ‌స్తువు ఇంట్లోంచి పోయిందంటేనే ఎంతో బాధ‌గా వుంటుంది. ఎంతో ఇష్ట‌ప‌డి కొనుక్కున్న వ‌స్తువు చేజారి ప‌డి ప‌గిలిపోయినా, దొంగ‌త‌నం జ‌రిగినా, ఎక్క‌డో మ‌ర్చిపోయినా చాలా బాధేస్తుంది. దాన్ని తిరిగి పొంద‌లేమ‌ని దిగులు ప‌ట్టుకుం టుంది. కానీ 101 ఏళ్ల చార్లెటి బిషాఫ్ కు ఎంతో ఇష్ట‌మ‌యిన పెయింటింగ్ రెండో ప్ర‌పంచ యుద్ధ స‌మ‌యంలో దూర‌మ‌యింది. 80 ఏళ్లు దాని కోసం ఎదురు చూడ‌గ‌లి గింది. అదంటే మ‌రి ఆమెకు ప్రాణ స‌మానం. చాలా కాలం దొరుకుతుంద‌ని, త‌ర్వాత ఇక దొర‌కదేమో అనీ ఎంతో బాధ‌పడింది. ఫిదా సినిమాలో హీరోయిన్ చెప్పినట్లు ఆమె గట్టిగా అనుకుని ఉంటుంది. అందుకే కాస్త ఆలస్యమైనా.. కాస్తేంటి ఎనిమిది దశాబ్దాలు ఆలస్యమైనా ఆమె పెయింటింగ్ ఆమెకు దక్కింది. ఆ పెయింటింగ్ గ‌తేడాది ఆమెను చేరింది.
ఓ వంక ఐదు రాష్ట్రాల అసెంబ్లీ ఎన్నికలు జరుగుతుంటే, మరో వంక జాతీయ స్థాయిలో, బీజేపీ, కాంగ్రెస్ పార్టీలకు తృతీయ ప్రత్యాన్మాయంగా థర్డ్ ఫ్రంట్ ఏర్పాటు ఆలోచనలు  జోరందుకున్నాయి. ఇటీవల కాంగ్రెస్ పార్టీకి రాజీనామా చేసిన ఆ పార్టీ సీనియర్ నాయకుడు, పీసీ చాకో, నేషనలిస్ట్ కాంగ్రెస్ పార్టీ(ఎన్సీపీ)లో చేరారు...
తెలంగాణ  రాష్ట్ర బడ్జెట్ 2021-22ను ఆర్థిక మంత్రి హరీష్ రావు, ఈ నెల18న సభలో ప్రవేశ పెడతారు.కరోనా కారణంగా, ప్రస్తుత ఆర్థిక సంవత్సరం (2020-21)లో ఎదురైన ఆర్థిక ఇబ్బందుల నేపధ్యంగా ప్రవేశపెడుతున్న బడ్జెట్ కావడంతో  సహజంగానే అందరిలోనూ ఆసక్తి నెలకొంది...
అబద్ధాలు, అర్థ సత్యాలు, వ్యక్తిగత దూషణలు, అర్ధంపర్ధం లేని ఆరోపణలతో సుమారు నెలరోజులకు పైగా తెలంగాణలో సాగుతున్న పట్టభద్రుల ఎమ్మెల్సీ ఎన్నికల ప్రచారానికి శుక్రవారం సాయంత్రంతో  తెర పడింది.రాష్ట్రంలోని మహబూబ్‌నగర్‌-హైదరాబాద్‌-రంగారెడ్డి పట్టభద్రుల నియోజకవర్గంతో పాటుగా,నల్లగొండ-ఖమ్మం-వరంగల్‌ స్థానానికి ఫిబ్రవరి 16 తేదీన నోటిఫికేషన్ వెలువడినా, ఎన్నికల ప్రచారం మాత్రం అంతకు చాలా ముందే అభ్యర్ధుల స్థాయిలో స్థానికంగా ఎన్నికల ప్రచారం ప్రారంభమైంది. 
​సహజంగా కష్టాల్లో ఉన్నపుడు ఎవరికైనా దేవుడు గుర్తు వస్తారు. లౌకిక వాద రాజకీయ నాయకులకు అయితే హటాత్తుగా  తాము హిందువులం అనే విషయం జ్ఞప్తికి వస్తుంది. పశ్చిమ బెంగాల్ ముఖ్యమంత్రి, తృణమూల్ పార్టీ అధినాయకురాలు మమతా బెనర్జీకి   కూడా తానూ హిందువును అనే విషయం ఇప్పుడు గుర్తుకొచ్చింది.
దేశంలోని ఉత్తరాది రాష్ట్రాలలో అటు కాంగ్రెస్ ఇటు స్థానికంగా ఉన్న ప్రాంతీయ పార్టీలను మట్టి కరిపిస్తూ అధికారాన్ని కైవసం చేసుకుంటున్న బీజేపీ.. దక్షిణాదికి వచ్చేసరికి ఒక్క కర్ణాటకలో తప్ప ఇతర రాష్ట్రాలలో ఎన్ని ప్రయత్నాలు చేసినా ఏమాత్రం సక్సెస్ కాలేకపోతోంది...
జయలలిత జీవించి ఉన్నత కాలం, ఆమె నెచ్చలిగా పేరొందిన శశికళ, తమిళ రాజకీయాల్లో ఓ వెలుగువెలిగారు. కొన్ని విషయాల్లో జయలలిత కంటే, ఆమె మోర్ పవర్ఫుల్ లేడీ అనిపించుకున్నారు. ముఖ్యమంత్రులు, మంత్రులు కూడా ఆమె ముందు చేతులు కట్టుకుని నిలుచున్నారు.ఆమెకు పాదాభివందనాలు చేశారు.
కాంగ్రెస్ పార్టీలో రగులుతున్న అంతర్యుద్ధం కొత్త పుంతలు తొక్కుతోంది. మరిన్ని మలుపులు తిరుగుతోంది.ఇటీవల జమ్మూలో సమావేసమైన జీ 23 నాయకులు  అసమ్మతి స్వరాన్ని పెంచారు...
పంచతంత్రంగా పిలుచుకుంటున్న ఐదు రాష్టాల అసెంబ్లీ ఎన్నికల్లో అద్భతం జరగబోతోంది. కేంద్ర ఎన్నికల సంఘం నాలుగు రాష్ట్రాలు, కేంద్రపాలిత ప్రాంతం పుదుచ్చేరి అసెంబ్లీ ఎన్నికల షెడ్యూలు ప్రకటించిన వెంటనే, వివిధ సంస్థలు అసెంబ్లీ ఎన్నికలు జరిగే  అస్సాం. పశ్చిమబెంగాల్, తమిళనాడు రాష్ట్రాలతో పాటుగా కేరళలోనూ ఒపీనియన్ పోల్స్ నిర్వహించాయి...
కేంద్ర ఎన్నికలసంఘం ‘పాంచ్ పటాక’ గంట కొట్టింది. అస్సాం, పశ్చిమ బెంగాల్, కేరళ, తమిళనాడు రాష్ట్రాలు, పుదుచ్చేరి కేంద్ర పాలిత ప్రాంతాల అసెంబ్లీ ఎన్నికల షెడ్యూలును కేంద్ర ఎన్నికల సంఘం విడుదలచేసింది. ఎన్నికల గంట మోగడంతో మొదలైన మరో భారత ‘మినీ’  సంగ్రామానికి మే 12 తేదీన జరిగే ఓట్ల లెక్కింపుతో తెర పడుతుంది.ఈలోగా వివిధ అంచల్లో పోలింగ్ జరుగుతుంది.  
నాలుగు రాష్టాలు అస్సాం, పశ్చిమ బెంగాల్ తమిళనాడు,కేరళ, కేంద్ర పాలిత ప్రాంతం పుదుచ్చేరి శాసన సభలకు  మరో రెండు నెలల్లో ఎన్నికలు జరుగుతాయి. ఇది అందరికీ తెలిసిన విషయం.
 
Disclaimer:
All content included on this TeluguOne.com Portal including text, graphics, images, videos and audio clips, is the property of ObjectOne Information Systems Ltd. or our associates, and protected by copyright laws. The collection, arrangement and assembly of all content on this portal/ related channels is the exclusive property of ObjectOne Information Systems Ltd. or our associates and protected copyright laws.
 
You may not copy, reproduce, distribute, publish, display, perform, modify, create derivative works, transmit, or in any other way exploit any part of copyrighted material without permission from ObjectOne Information Systems Ltd or our associates.