ఎన్నికల సమరం ప్రారంభం

Publish Date:Aug 14, 2018

Advertisement

తెలంగాణలో ఎన్నికల సమరం ప్రారంభమైంది. ఇందుకు సంకేతంగా అధికార తెలంగాణ రాష్ట్ర సమితి, ప్రతిపక్ష కాంగ్రెస్ పార్టీలు ఒకే రోజు సమర శంఖం పూరించాయి. కాంగ్రెస్ పార్టీ జాతీయ అధ్యక్షుడు రాహుల్ గాంధీ హైదరాబాద్‌లో మహిళలతో సమావేశం నిర్వహించారు. అది జరిగిన కొద్ది గంటలకే తెలంగాణ రాఫ్ట్ర సమితి అధ్యక్షుడు, ముఖ్యమంత్రి కె.చంద్రశేఖర రావు పార్టీ కార్యవర్గ సమావేశం నిర్వహించారు. అనంతరం జరిగిన విలేకరుల సమావేశంలో తన ఎన్నికల ప్రణాళికను కూడా వెల్లడించారు.  అంతే కాదు... ముందస్తు ఎన్నికలకు వెళ్తున్నామనే సంకేతాలను కూడా ఇచ్చారు. అయితే గడువుకు ఆరు నెలల ముందు ఎన్నికలకు వెళ్తే అవి ముందస్తు ఎన్నికలు కావని కొత్త సూత్రీకరణలకు కూడా తెర తీసారు.

 

 

అంటే నవంబర్, డిసెంబర్ నెలల్లో ఆయన ఎన్నికలకు వెళ్లే యోచనలో ఉన్నట్లు వస్తున్న వార్తలు ని.మయ్యేలా ఉన్నాయి. అంతే కాదు... ఈ సెప్టెంబర్ నెలలోనే తమ అభ్యర్ధులను సైతం ప్రకటిస్తామని ముఖ్యమంత్రి కె.చంద్రశేఖర రావు ప్రకటించారు. తెలంగాణలో వంద స్థానాల్లో విజయం సాధిస్తామని, తిరిగి మళ్లీ తమదే అధికారమనే ధీమాను సైతం వ్యక్తం చేశారు.  ఈ ప్రకటనను ఆయన ఆత్మవిశ్వాసంగా చూడాలా... లేక అతి విశ్వాసంగా చూడాలో పరిశీలకులు లెక్కలు తీస్తున్నారు. ఆత్మ విశ్వాసంగా పరిగణించాలంటే కె.చంద్రశేఖర రావు గడచిన నాలుగేళ్లుగా చేపట్టిన పలు పథకాల అమలును బేరీజు వేయాలి. అలాగే ఆయన చేపట్టిన సంక్షేమ కార్యక్రమాలను కూడా పరిగణలోకి తీసుకోవాలి. రైతులకు ఇచ్చిన పెట్టుబడి పథకం, మహిళలకు ప్రకటించిన కెసీఆర్ కిట్, డబుల్ బెడ్ రూం ఇళ్లు, కల్యాణ లక్ష్మి వంటి పథకాలు ఆయన్ని తిరిగి అధికారంలో కూర్చోపెడతాయని అధికార పార్టీ అంచనా వేస్తోంది. అలాగే మిషన్ భగీరథ, చెరువులు పునరుద్ధరణ, నిరుద్యోగులకు ఉద్యోగ భద్రత వంటివి కూడా కలిసొచ్చే అంశాలుగానే వారు చూస్తున్నారు. అయితే ఇవన్నీ పైకి కనిపించే పథకాలే అయినా... వాటి వెనుక దాగి ఉన్న అవినీతి ప్రతిపక్షాలకు ఈ సారి ఎన్నికల ఆయుదం కానుంది.

 

 

ఇక కాంగ్రెస్ పార్టీ జాతీయ అధ్యక్షుడుగా ఎంపికైన తర్వాత రాహుల్ గాంధీ తెలంగాణకు తొలి సారి వచ్చారు. ఇక నుంచి ప్రతి నెలా ఇక్కడకు వస్తారని కాంగ్రెస్ పార్టీ నాయకులు ప్రకటించారు. హైదరాబాద్‌లో తన తొలి పర్యటన ప్రారంభించిన రాహుల్ గాంధీకి ఇక్కడ మంచి స్వాగతమే లభించిందని చెప్పాలి. ఈమధ్య ఆయన తన ప్రసంగాలలోనూ, లోక్‌సభలోనూ రాహుల్ గాంధీ పరిణితి చెందిన రాజకీయ నాయకుడిలా వ్యవహరించారు. కన్నుకొట్టడం వంటి చిలిపి పనులను మినహాయిస్తే ఏడాది క్రితం రాహుల్ గాంధీకీ... ఈనాటి రాహుల్ గాంధీకి మధ్య తేడాను స్పష్టంగా గమనించవచ్చు. ప్రధానమంత్రిని లోక్‌సభలో తన ప్రసంగం అనంతరం కౌగలించుకున్న రాహుల్ గాంధీ జాతీయ స్ధాయిలో అందరి చూపు తన వైపు తిప్పుకున్నారు. హైదరాబాద్ పర్యటనలో కూడా ఆయన చేసిన ప్రసంగం ఇక్కడి ఏలికలకు కాసింత ఇబ్బందుల పాలు చేసిందనే చెప్పాలి. అందుకే హడావుడిగా... అది కూడా రాహుల్ గాంధీ వచ్చిన రోజే తెలంగాణ రాష్ట్ర సమితి కార్యవర్గ సమావేశం ఏర్పాటు చేయడం అధికార పార్టీలో ఆందోళనను తెలియజేస్తున్నాయి. ఈసారి ఎన్నికల్లో ప్రధాన పాత్ర సెటిలర్లదే. వీరి మద్దతు ఎవరికి ఉంటుందో వారే అధికార పీఠాన్ని కైవసం చేసుకోవచ్చు. అందుకే అటు తెలంగాణ రాష్ట్ర సమితి, ఇటు కాంగ్రెస్ పార్టీ కూడా సెటిలర్లకు వరాల జల్లు కురిపిస్తున్నారు.

 

 

సెటిలర్లను ఆకర్షించేందుకు కాంగ్రెస్ పార్టీ కాసింత ముందుగానే స్పందించింది. విభజనతో తీవ్రంగా నష్టపోయిన ఆంధ్రప్రదేశ్‌కు తాము అధికారంలోకి రాగానే ప్రత్యేక హోదా ఇస్తామని ప్రకటించింది. ఈ ఆయుధాన్ని తెలంగాణలో సెటిల్ అయిన వారిపై ప్రయోగిస్తోంది తెలంగాణ కాంగ్రెస్. ఆంధ్రప్రదేశ్‌కు ప్రత్యేక హోదా ఇస్తే మాకూ ఇవ్వాలని ప్రకటించిన తెలంగాణ రాష్ట్ర సమితి సెటిలర్ల ఓట్లను అడిగే నైతిక హక్కును కోల్పోయింది. ఢిల్లీలోనూ, హైదరాబాద్ లోనూ కూడా టిఆర్ఎస్ నాయకులు ఆంధ్రప్రదేశ్‌కు ప్రత్యేక హోదా ఇస్తామన్నారంటే తెలంగాణకు అన్యాయం చేసినట్లే అని ప్రకటనలు  చేశారు. దీంతో సెటిలర్ల ఆలోచనలు మారే అవకాశం ఉంది. ఈ విషయాన్ని గమనించిన తెరాస అధినేత కె.చంద్రశేఖర రావు దిద్దుబాటు చర్యలకూ ఉపక్రమించారు. ఇందులో భాగంగా దశాబ్దాలుగా ఇక్కడ ఉన్న వారందరూ తెలంగాణ వాసులే అని ప్రకటించారు. అయితే, సెటిలర్లు ఆయన మాటలను నమ్ముతారో... లేక తమ బంధువులు, స్నేహితులు ఉన్న ఆంధ్రప్రదేశ్‌కు ప్రత్యేక హోదా ఇస్తామన్న కాంగ్రెస్‌ పార్టీకి విశ్వసిస్తారో వేచి చూడాలి. మొత్తానికి ఆరు నెలల ముందే తెలంగాణలో ఎన్నికల నగారా మోగనుందని మాత్రం తేటతెల్లం అయ్యింది.

By
en-us Political News

  
ఎన్నికల వేళ జగన్ కు షాకుల మీద షాకులు తగులుతున్నాయి. ఇన్నాళ్లే జగన్ మాటే శాసనం అన్నట్లుగా అణిగిమణిగి ఉన్న వారంతా సరిగ్గా ఎన్నికల ముంగిట ధిక్కార స్వరం వినిపిస్తున్నారు. పార్టీపై తిరుగులేని పట్టు ఉందని భావిస్తున్న జగన్ కు ఆ పట్టు జారిపోవడం కళ్లముందు కనిపించేలా చేస్తున్నారు. టికెట్ నిరాకరించిన, సిట్టింగ్ స్థానాన్ని మార్చిన ఎమ్మెల్యేలు, ఎంపీలు ఇప్పటికే పార్టీని వీడి వలసబాట పట్టారు.
సంసారంలో నిస్సంగత్వంతో ఎలా జీవించాలో గురువు బోధిస్తాడు. మనల్ని సంసారబంధాల నుండి విముక్తుల్ని చేయడానికి తోడ్పడతాడు. కానీ అనేక జన్మల సంస్కారాల వల్ల మనలో సంసారాసక్తి సన్నగిల్లకపోవడంతో గురుబోధ అవగాహన చేసుకొనే మనోపరిపక్వత కలగదు.
ఏద‌యినా ఒక వ‌స్తువు ఇంట్లోంచి పోయిందంటేనే ఎంతో బాధ‌గా వుంటుంది. ఎంతో ఇష్ట‌ప‌డి కొనుక్కున్న వ‌స్తువు చేజారి ప‌డి ప‌గిలిపోయినా, దొంగ‌త‌నం జ‌రిగినా, ఎక్క‌డో మ‌ర్చిపోయినా చాలా బాధేస్తుంది. దాన్ని తిరిగి పొంద‌లేమ‌ని దిగులు ప‌ట్టుకుం టుంది. కానీ 101 ఏళ్ల చార్లెటి బిషాఫ్ కు ఎంతో ఇష్ట‌మ‌యిన పెయింటింగ్ రెండో ప్ర‌పంచ యుద్ధ స‌మ‌యంలో దూర‌మ‌యింది. 80 ఏళ్లు దాని కోసం ఎదురు చూడ‌గ‌లి గింది. అదంటే మ‌రి ఆమెకు ప్రాణ స‌మానం. చాలా కాలం దొరుకుతుంద‌ని, త‌ర్వాత ఇక దొర‌కదేమో అనీ ఎంతో బాధ‌పడింది. ఫిదా సినిమాలో హీరోయిన్ చెప్పినట్లు ఆమె గట్టిగా అనుకుని ఉంటుంది. అందుకే కాస్త ఆలస్యమైనా.. కాస్తేంటి ఎనిమిది దశాబ్దాలు ఆలస్యమైనా ఆమె పెయింటింగ్ ఆమెకు దక్కింది. ఆ పెయింటింగ్ గ‌తేడాది ఆమెను చేరింది.
ఓ వంక ఐదు రాష్ట్రాల అసెంబ్లీ ఎన్నికలు జరుగుతుంటే, మరో వంక జాతీయ స్థాయిలో, బీజేపీ, కాంగ్రెస్ పార్టీలకు తృతీయ ప్రత్యాన్మాయంగా థర్డ్ ఫ్రంట్ ఏర్పాటు ఆలోచనలు  జోరందుకున్నాయి. ఇటీవల కాంగ్రెస్ పార్టీకి రాజీనామా చేసిన ఆ పార్టీ సీనియర్ నాయకుడు, పీసీ చాకో, నేషనలిస్ట్ కాంగ్రెస్ పార్టీ(ఎన్సీపీ)లో చేరారు...
తెలంగాణ  రాష్ట్ర బడ్జెట్ 2021-22ను ఆర్థిక మంత్రి హరీష్ రావు, ఈ నెల18న సభలో ప్రవేశ పెడతారు.కరోనా కారణంగా, ప్రస్తుత ఆర్థిక సంవత్సరం (2020-21)లో ఎదురైన ఆర్థిక ఇబ్బందుల నేపధ్యంగా ప్రవేశపెడుతున్న బడ్జెట్ కావడంతో  సహజంగానే అందరిలోనూ ఆసక్తి నెలకొంది...
అబద్ధాలు, అర్థ సత్యాలు, వ్యక్తిగత దూషణలు, అర్ధంపర్ధం లేని ఆరోపణలతో సుమారు నెలరోజులకు పైగా తెలంగాణలో సాగుతున్న పట్టభద్రుల ఎమ్మెల్సీ ఎన్నికల ప్రచారానికి శుక్రవారం సాయంత్రంతో  తెర పడింది.రాష్ట్రంలోని మహబూబ్‌నగర్‌-హైదరాబాద్‌-రంగారెడ్డి పట్టభద్రుల నియోజకవర్గంతో పాటుగా,నల్లగొండ-ఖమ్మం-వరంగల్‌ స్థానానికి ఫిబ్రవరి 16 తేదీన నోటిఫికేషన్ వెలువడినా, ఎన్నికల ప్రచారం మాత్రం అంతకు చాలా ముందే అభ్యర్ధుల స్థాయిలో స్థానికంగా ఎన్నికల ప్రచారం ప్రారంభమైంది. 
​సహజంగా కష్టాల్లో ఉన్నపుడు ఎవరికైనా దేవుడు గుర్తు వస్తారు. లౌకిక వాద రాజకీయ నాయకులకు అయితే హటాత్తుగా  తాము హిందువులం అనే విషయం జ్ఞప్తికి వస్తుంది. పశ్చిమ బెంగాల్ ముఖ్యమంత్రి, తృణమూల్ పార్టీ అధినాయకురాలు మమతా బెనర్జీకి   కూడా తానూ హిందువును అనే విషయం ఇప్పుడు గుర్తుకొచ్చింది.
దేశంలోని ఉత్తరాది రాష్ట్రాలలో అటు కాంగ్రెస్ ఇటు స్థానికంగా ఉన్న ప్రాంతీయ పార్టీలను మట్టి కరిపిస్తూ అధికారాన్ని కైవసం చేసుకుంటున్న బీజేపీ.. దక్షిణాదికి వచ్చేసరికి ఒక్క కర్ణాటకలో తప్ప ఇతర రాష్ట్రాలలో ఎన్ని ప్రయత్నాలు చేసినా ఏమాత్రం సక్సెస్ కాలేకపోతోంది...
జయలలిత జీవించి ఉన్నత కాలం, ఆమె నెచ్చలిగా పేరొందిన శశికళ, తమిళ రాజకీయాల్లో ఓ వెలుగువెలిగారు. కొన్ని విషయాల్లో జయలలిత కంటే, ఆమె మోర్ పవర్ఫుల్ లేడీ అనిపించుకున్నారు. ముఖ్యమంత్రులు, మంత్రులు కూడా ఆమె ముందు చేతులు కట్టుకుని నిలుచున్నారు.ఆమెకు పాదాభివందనాలు చేశారు.
కాంగ్రెస్ పార్టీలో రగులుతున్న అంతర్యుద్ధం కొత్త పుంతలు తొక్కుతోంది. మరిన్ని మలుపులు తిరుగుతోంది.ఇటీవల జమ్మూలో సమావేసమైన జీ 23 నాయకులు  అసమ్మతి స్వరాన్ని పెంచారు...
పంచతంత్రంగా పిలుచుకుంటున్న ఐదు రాష్టాల అసెంబ్లీ ఎన్నికల్లో అద్భతం జరగబోతోంది. కేంద్ర ఎన్నికల సంఘం నాలుగు రాష్ట్రాలు, కేంద్రపాలిత ప్రాంతం పుదుచ్చేరి అసెంబ్లీ ఎన్నికల షెడ్యూలు ప్రకటించిన వెంటనే, వివిధ సంస్థలు అసెంబ్లీ ఎన్నికలు జరిగే  అస్సాం. పశ్చిమబెంగాల్, తమిళనాడు రాష్ట్రాలతో పాటుగా కేరళలోనూ ఒపీనియన్ పోల్స్ నిర్వహించాయి...
కేంద్ర ఎన్నికలసంఘం ‘పాంచ్ పటాక’ గంట కొట్టింది. అస్సాం, పశ్చిమ బెంగాల్, కేరళ, తమిళనాడు రాష్ట్రాలు, పుదుచ్చేరి కేంద్ర పాలిత ప్రాంతాల అసెంబ్లీ ఎన్నికల షెడ్యూలును కేంద్ర ఎన్నికల సంఘం విడుదలచేసింది. ఎన్నికల గంట మోగడంతో మొదలైన మరో భారత ‘మినీ’  సంగ్రామానికి మే 12 తేదీన జరిగే ఓట్ల లెక్కింపుతో తెర పడుతుంది.ఈలోగా వివిధ అంచల్లో పోలింగ్ జరుగుతుంది.  
నాలుగు రాష్టాలు అస్సాం, పశ్చిమ బెంగాల్ తమిళనాడు,కేరళ, కేంద్ర పాలిత ప్రాంతం పుదుచ్చేరి శాసన సభలకు  మరో రెండు నెలల్లో ఎన్నికలు జరుగుతాయి. ఇది అందరికీ తెలిసిన విషయం.
 
Disclaimer:
All content included on this TeluguOne.com Portal including text, graphics, images, videos and audio clips, is the property of ObjectOne Information Systems Ltd. or our associates, and protected by copyright laws. The collection, arrangement and assembly of all content on this portal/ related channels is the exclusive property of ObjectOne Information Systems Ltd. or our associates and protected copyright laws.
 
You may not copy, reproduce, distribute, publish, display, perform, modify, create derivative works, transmit, or in any other way exploit any part of copyrighted material without permission from ObjectOne Information Systems Ltd or our associates.