కాంగ్రెస్‌కు మ‌రో పరీక్ష!.. చేతికి గాయాలు...

Publish Date:Apr 29, 2022

Advertisement

అసెంబ్లీ ఎన్నికలకు ముందు, పంజాబ్ కాంగ్రెస్ పార్టీలో తలెత్తిన అంతర్గత సంక్షోభం ఫలితంగా, కాంగ్రెస్ పార్టీ ఒక కీలక రాష్ట్రాన్ని చేజార్చుకుంది. అప్పటి ముఖ్యమంత్రి కెప్టెన్ అమరీందర సింగ్, పార్టీ సీనియర్ నాయకుకు, మాజీ మంత్రి నవజ్యోతి సింగ్ సిద్దూ మధ్యతలెత్తిన విబేధాలు, చిలికి చిలికి గాలివానగా మారి పార్టీ ప్రతిష్టను పడగొట్టింది. చివరకు సిద్దూ కోరిన విధంగా ముఖ్యమంత్రిని మార్చినా, సిద్దూకే పీసీసీ పగ్గాలు అప్పగించినా, ఎన్నికలో హస్తం పార్టీకి ఓటమి తప్పలేదు. 

ఇప్పుడు రాజస్థాన్’లో మళ్ళీ అదే పరిస్థితి పునరావృతం అవుతోందా? అంటే అవుననే అంటున్నారు, విశ్లేషకులు. నిజానికి, విశ్లేషకులు అనడం కాదు, మూడున్నరేళ్ళుగా అడపా తడ్ఫపా అసమ్మతి రాగం వినిపిస్తున్న, కేంద్ర మాజీ మంత్రి, మాజీ పీసీసీ చీఫ్ సచిన్ పైలట్’ కూడా అధిష్టానానికి అదే హెచ్చరిక చేస్తున్నారు. తక్షణమే రాజస్థాన్ ముఖ్యమంత్రి పగ్గాలు తనకు అప్పగించాలని లేదంటే రాజస్థాన్’లోనూ పంజాబ్ పరాజయం, పరాభవం తప్పవని నేరుగా పార్టీ అధ్యక్షురాలు సోనియా గాంధీకే లేఖ రాసినట్లు విశ్వసనీయంగా తెలుస్తోంది. నిజానికి, చాలా కాలంగా సచిన్ పైలట్’ అధిష్టానంపై ఆగ్రహంతో రగిలి పోతున్నారు.గత అసెంబ్లీ ఎన్నికల్లో పీసీసీ చీఫ్’గా పగలు రాత్రి కష్టపడి పార్టీని తాను గెలిపిస్తే, ఎన్నికల అనంతరం ముఖ్యమంత్రి పదవి అశోక్ గేహ్లోట్’కు కట్ట బెట్టారని, ఆయన అనేక సందర్భాలో బహిరంగంగానే తమ ఆవేదన, ఆగ్రహం వ్యక్త పరిచారు. ఒక దశలో ఆయన తమ వర్గం ఎమ్మెల్ల్యేలతో ఢిల్లీలో మకాం చేసి తాడో పేడో తేల్చుకుంటానని ప్రకటించారు. అలాగే, ఒక దశలో ఆయన బీజేపీలో చేరుతున్నారనే పుకార్లు వినవచ్చాయి. అయితే పైలెట్’ పార్టీని వదలలేదు కానీ, ముఖ్యమంత్రి పీఠం కోసం పోరాటం మాత్రం కొనసాగిస్తూనే ఉన్నారు. 

ఇదే క్రమంలో ఇప్పుడు, అసెంబ్లీ ఎన్నికలు దగ్గర పడుతున్న సమయంలో, అధిష్టానంపై పైలెట్ వత్తిడి పెంచుతున్నారు. రాజస్థాన్‌లో ఎన్నికలకు పట్టుమని 18 నెలల సమయం మాత్రమే వుంది. ఈ పరిస్థితుల్లో పార్టీ తిరిగి అధికారంలోకి రావాలంటే, పంజాబ్’లో చేసిన తప్పు రాజస్థాన్’ లో చేయద్దని, ఎటువంటి జ్యాప్యం లేకుండా తనను  ముఖ్యమంత్రిని చేయాలని, సచిన్ పైలట్ అధిష్ఠానానికి వరసగా వర్తమానం పంపుతున్నట్లు తెలుస్తోంది. ప్రతి నిత్యం అటు సోనియా, ఇటు రాహుల్, ప్రియాంకలకు సచిన్ పైలెట్ ఏదో ఒక రూపంలో తమ డిమాండ్’ను గుర్తు చేస్తున్నారు. పంజాబ్’లో చివరి రోజుల్లో చరణ్‌జిత్ సింగ్ ఛన్నీని ముఖ్యమంత్రిగా నియమించడం వల్ల అసెంబ్లీ ఎన్నికల్లో ఓడిపోయామని, రాజస్థాన్‌లో కూడా అదే జరిగే అవకాశం ఉందని సోనియా గాంధీ, ప్రియాంక గాంధీలకు సచిన్ పైలట్ సూచించినట్టు సమాచారం.

కానీ, కాంగ్రెస్‌లో అత్యంత సీనియర్ నాయకుడైన అశోక్ గెహ్లాట్ తానేంటో ఇప్పటికే నిరూపించుకున్నారు.పైలెట్ పప్పులు తమ వద్ద ఉడకవని ఇప్పటికే అనేక సందర్భాలలో నిరుపించుకున్నారు. మెజార్టీ ఎమ్మెల్యేల మద్దతు ఆయనకు ఉందని నిరుపించుకున్న ఆయన పైలెట్’కు ఎక్కడికక్కడ చెక్ పెడుతూ వచ్చారు. అధిష్ఠానం ఆదేశించినా, పైలెట్ వర్గాన్ని మంత్రి వర్గంలో చేర్చుకునే ముహూర్తాన్ని పలుమార్లు వాయిదా వేసి చివరకు ఏదో అయింది అంటే అయింది అన్నట్లుగా కానిచ్చారు. 

మరోవంక పార్టీ అధ్యక్షురాలు  సోనియా గాంధీ నమ్మకాన్ని కూడా ఆయన నిలబెట్టుకున్నారు.రెండు రోజుల కిందట ఆయన మీడియాతో మాట్లాడుతూ..నా రాజీనామా ఎప్పుడూ సోనియా గాంధీ వద్దే ఉంటుందని వ్యాఖ్యానించారు. నిజానికి, గేహ్లోట్ పార్టీలో సీనియర్ నాయకుడు మాత్రమే కాదు, సోనియా గాంధి వీరవిధేయుల్లో ఒకరు. ఒక దశలో జీ 23 నాయకులు పట్టుపడితే పార్టీ పగ్గాలు తాత్కాలికంగానే అయినా గేహ్లోట్’కు అప్పగించాలని సోనియా గాంధీ అలోచన చేసినట్లు వార్తలొచ్చాయి. అంటే, గేహ్లోట్ పవర్ ఏమిటో వేరే చెప్పనక్కర లేదు. మరో వంక సచిన్ పైలట్‌’  తనకు ముఖ్యమంత్రి పదవి తప్ప మరేది వద్దని, అది ఇస్తారో లేదో తేల్చి చెప్పాలని, రాహుల్, ప్రియాంకల వద్ద పట్టుపడుతున్నారు. ఏఐసీసీ ప్రధాన కార్యదర్శి పదవి ఇస్తామన్నా వద్దన్నారు.రాజస్థాన్ పీసీసీ పగ్గాలు ఇస్తామన్నా అది నాకేమన్నా కొత్తనా, ఐదేళ్లు పీసీసీ అధ్యక్షుడిగా ఉండి, రాజస్థాన్‌లో పార్టీని అధికారంలోకి తీసుకొచ్చింది నేనని అంటున్నారు. ఈ పరిస్థితుల్లో కాంగ్రెస్ అధిష్ఠానం ఇప్పుదు ఎలాంటి నిర్ణయం తీసుకుంటుంది, అనేది ఆసక్తికరంగా మారింది.

By
en-us Political News

  
మాజీ ఎమ్మెల్సీ కల్వకుంట్ల కవిత కొత్త పార్టీ పేరును ఖరారు చేశారు.
ప్రముఖ హీరోయిన్లను వివాదాల్లోకి లాగుతూ, వివాదాల్లోకి లాగుతూ వ్యక్తిగత విమర్శల దిగజారుతున్న తీరు తమిళనాట రాజకీయ ప్రతిష్ఠను దిగజారుస్తున్నది. సీనియర్ హీరోయిన్లు త్రిష, నయనతార లను ఉద్దేశించి తమిళ రాజకీయ నాయకులు కొందరు చేసిన వ్యాఖ్యల పట్ల తమిళనాటే కాకుండా దేశ వ్యప్తంగా నిరసన వ్యక్తం అవుతున్నది.
రాష్ట్రంలో డ్రగ్స్ సంస్కృతిని నిర్మూలిస్తామని ప్రజలకు హామీ ఇచ్చామని, అలాంటిది పార్టీకి చెందిన ప్రజాప్రతినిధే ఇలాంటి వివాదాల్లో చిక్కుకోవడం క్షమించరాని నేరమన్నారు. యువ నాయకుడు, మంచి నేపథ్యం ఉన్న కుటుంబం నుంచి వచ్చాడన్న ఉద్దేశంతో అవకాశం ఇస్తే, పార్టీకి చెడ్డపేరు తీసుకువచ్చారంటూ పుట్టా మహేష్ యాదవ్ పై ఆగ్రహం వ్యక్తం చేసినట్లు తెలిసింది.
ఇప్పటికే తమిళనాడు అసెంబ్లీ ఎన్నికల నోటిఫికేషన్ వెలువడింది. ఓ వైపు డీఎంకే కాంగ్రెస్ కూటమి, మరో వైపు అన్నాడీఎంకే, బీజేపీ కూటములు రాబోయే అసెంబ్లీ ఎన్నికల్లో గెలుపు తమదంటే తమదని ఉధృతంగా ప్రచారం చేస్తున్నాయి. ఇప్పుడు ఆ రెండు కూటములతో పాటు టీవీకే అధినేత విజయ్ సీఎం సీటుపై కన్నేశారు.ఇప్పటికే విజయ్ తమిళనాడు వ్యాప్తంగా సుడిగాలి పర్యటనలతో ఎలక్షన్ క్యాంపెయిన్ హోరెత్తిస్తున్నారు. అంతా సవ్యంగా సాగుతున్న సమయంలో విజయ్‌ నుంచి విడాకులు కోరుతూ ఆయన భార్య కోర్టు గడపతొక్కడంతో ఈ విషయం ఇటు తమిళనాడులోనే కాకుండా దక్షిణాది రాజకీయాల్లో సైతతం హాట్ టాపిక్‌గా నిలిచింది.
పార్టీ వర్గాల సమాచారం ప్రకారం మొయినాబాద్ లోని పైలట్ రోహిత్ రెడ్డికి చెందిన ఫామ్ హౌస్ లో ఆయన సమక్షంలో జరిగిన డగ్ర్స్ పార్టీ వ్యవహారంలో ఈ నోటీసులు జారీ అయ్యాయి. ఈ ఘటనపై స్పష్టత కోరుతూ వారం రోజులలో వివరణ ఇవ్వాలంటూ షోకాజ్ నోటీసు జారీ అయ్యింది.
ముఖ్యంగా ఢిల్లీ హైకోర్టులో ప్రస్తుతం తన కేసును విచారిస్తున్న జస్టిస్ స్వర్ణకాంత శర్మ బెంచ్ నుండి విచారణను వేరే బెంచ్‌కు బదిలీ చేయాలని ఆయన తన పిటిషన్ లో పేర్కొన్నారు. ప్రస్తుత ధర్మాసనం వద్ద విచారణ జరుగుతుందన్న నమ్మకం లేదని పేర్కొన్నారు.
ఈ సందర్భంగా కేటీఆర్ రాజాసింగ్ పై సెటైర్లు వేశారు. రాజాసింగ్, కేటీఆర్ మధ్య రాజకీయ విభేదాలు ఉన్నప్పటికీ వ్యక్తిగత స్థాయిలో ఇలాంటి స్నేహపూర్వక సంభాషణలు సాగడం మంచి వాతావరణానికి నిదర్శనంగా పరిశీలకులు విశ్లేషిస్తున్నారు.
తాజా ఇంటర్వ్యూలో ఆయన చేసిన ఈ వ్యాఖ్యలు జగన్ మోహన్ రెడ్డి వ్యక్తిత్వానికి, పార్టీ ఇమేజ్‌కు నష్టం కలిగించేలా ఉన్నాయని రాజకీయ విశ్లేషకులు భావిస్తున్నారు.
తెలంగాణ రాజకీయాల్లో మరోసారి వందేమాతరం అంశం చర్చనీయాంశంగా మారింది.
2024 ఎన్నికల సమయానికి ఆయన ప్రాతినిథ్యం వహిస్తున్న జనసేన పార్టీ తెలుగుదేశం, బీజేపీలతో పొత్తు పెట్టుకుని ఎన్నికల రంగంలోకి దిగింది. ఆ ఎన్నికలలో నాగబాబు అనకాపల్లి లోక్ సభ స్థానం నుంచి రంగంలోకి దిగుతారని పెద్ద ఎత్తున ప్రచారం అయ్యింది. అయితే పొత్తు ధర్మంలో భాగంగా నాగబాబుకు ఆ ఎన్నికలలో పోటీ చేసే అవకాశమే దక్కలేదు.
తమిళనాడులో బీజేపీ, హీరో విజయ్ సారథ్యంలోని టీవీకేల పొత్తు విషయంలో మరోసారి వార్తలు చక్కర్లు కొడుతున్నాయి.
ఈసీ తీరుపై నమ్మకం లేదని చెబుతున్న పార్టీ, ఇప్పుడు సీఈసీపై అభిసంశన తీర్మానానికి మద్దతుగా నిలబడకుంటే.. ఆ పార్టీ నైతికతే ప్రశ్నార్థకంగా మారుతుంది. ఒక వేళ వైసీపీ ఈ తీర్మానాన్ని వ్యతిరేకిస్తే ఇక ముందు, ఎన్నికల అక్రమాలపై మాట్లాడేందుకు వైసీపీకి అర్హతే ఉండదు. ఇంత వరకూ తెలుగుదేశం కూటమి విజయంపై వారు చేసిన విమర్శలన్నీ దూదిపింజెల్లా ఎగిరిపోతాయి.
బీఆర్ఎస్ హయాంలో ఇదే ఫామ్‌హౌస్ వేదికగా జరిగిన ఎమ్మెల్యేల కొనుగోలు ఉదంతం అప్పట్లో పెను సంచలనం సృష్టించిన సంగతి తెలిసిందే. అప్పట్లో రోహిత్ రెడ్డి ఫిర్యాదుతోనే పోలీసులు అక్కడ సోదాలు నిర్వహించి, ముగ్గురిని అదుపులోకి తీసుకున్నారు. అప్పట్లో ఈ కేసు జాతీయ రాజకీయాల్లో పెను సంచలనం సృష్టించింది.
 
Disclaimer:
All content included on this TeluguOne.com Portal including text, graphics, images, videos and audio clips, is the property of ObjectOne Information Systems Ltd. or our associates, and protected by copyright laws. The collection, arrangement and assembly of all content on this portal/ related channels is the exclusive property of ObjectOne Information Systems Ltd. or our associates and protected copyright laws.
 
You may not copy, reproduce, distribute, publish, display, perform, modify, create derivative works, transmit, or in any other way exploit any part of copyrighted material without permission from ObjectOne Information Systems Ltd or our associates.