Publish Date:Oct 16, 2024
హర్యానా ఫలితాలతో కాంగ్రెస్ కు జ్ణానోదయం అయినట్లుంది. అతి విశ్వాసంతో గెలిచే అవకాశాలు మెండుగా ఉన్న రాష్ట్రాన్ని చేజార్చుకున్న హస్తం పార్టీ ఇప్పుడు హర్యానా, మహారాష్ట్ర అసెంబ్లీ ఎన్నికలలో ముందు జాగ్రత్త పడుతున్నట్లు కనిపిస్తోంది. హర్యానా ఎన్నికలలో నోటిఫికేషన్ విడుదల కు ముందు నుంచీ కూడా సర్వేలన్నీ, చివరాఖరుకు బీజేపీ అనుకూల మీడియా సంస్థలు కూడా హస్తం జయకేతనం ఎగురవేయడం ఖాయమని ఉద్ఘాటించాయి. పోలింగ్ పూర్తయిన తరువాత ఎగ్జిట్ పోల్స్ కూడా కాంగ్రెస్ విజయానికి తిరుగులేదనే చెప్పాయి. అయితే ఓట్ల లెక్కింపు జరిగి ఫలితాలు వెలువడ్డాయి. సర్వేలు, ఎగ్జిట్ పోల్స్ అన్నీ తల్లకిందులయ్యాయి. దరిమిలా ఈసీ కూడా సర్వేలకూ, ఎగ్జిట్ పోల్స్ కు శాస్త్రీయత లేదని చెప్పేసింది. ఇప్పుడు మహారాష్ట్ర, జార్ఖండ్ అసెంబ్లీ ఎన్నికలకు ఈసీ నోటిఫికేషన్ విడుదల చేసింది. వాస్తవానికి ఈ రెండు రాష్ట్రాలకూ కూడా కాశ్మీర్, హర్యానాలతో పాటే ఎన్నికలు జరగాల్సి ఉంది. కారణాలేమైతేనేం.. భద్రత కారణాలు చూపుతూ ఎన్నికల సంఘం ఈ రెండు రాష్ట్రాల ఎన్నికలకు నవంబర్ లో ముహూర్తం నిర్ణయించింది. జార్ఖండ్ లో రెండు విడతలలో నవంబర్ 13, 20 తేదీలలో పోలింగ్ జరుగుతుంది. మహారాష్టరలో ఒకే విడతలో నంబంర్ 20న పోలింగ్ జరుగుతుంది. రెండు రాష్ట్రాల ఎన్నికల ఫలితాలూ నవంబర్ 23న వెలువడతాయి. నవంబర్ 20 సాయంత్రం ఎగ్జిట్ పోల్స్ వెలువడతాయి. అదీ సంగతి. జార్ఖండ్, మహారాష్ట్ర లలో వివిధ సర్వేలు కూడా ఫలితాలు బీజేపీకి ప్రతికూలంగా ఉంటాయనే చెప్పాయి. పీపుల్స్ మూడ్ బీజేపీకి అనుకూలంగా లేదని తమ సర్వేలలో తేలిందని పేర్కొన్నాయి.
అయితే ఈ సారి కాంగ్రెస్ ఆ సర్వేల ఫలితాల ప్రవాహంలో కొట్టుకుపోవడానికి రెడీగా లేదు. అందుకే రెండు రాష్ట్రాలకూ ఏఐసీసీ ఎన్నికల పరిశీలకులను నియమించింది. జార్ఖండ్ కు తెలంగాణ ఉపముఖ్యమంత్రి భట్టి విక్రమార్క, తారిఖ్ అన్వర్, అధిర్ రంజన్ చౌదరిలను, మహారాష్ట్రలోని మరాట్వాడా ప్రాంతానికి తెలంగాణ మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి, సచిన్ పైలట్ లను, ఉత్తర మహారాష్ట్ర ప్రాంతానికి తెలంగాణ మంత్రి సీతక్క, సయ్యద్ నసీర్ హుస్సేన్ లు పరిశీలకులుగా కాంగ్రెస్ అధిష్ఠానం నియమించింది. కేంద్ర ఎన్నికల సంఘం ఎన్నికల షెడ్యూల్ ప్రకటనకు గంటల ముందు వీరి నియామకాలను ప్రకటించింది. హర్యానా ఎన్నికలలోలా గెలుపు ముంగిట బోర్లా పడకుండా ఈ పరిశీలకులు ఏ మేరకు కాంగ్రెస్ ను కాపాడుతారో చూడాల్సిందే.
By Teluguone
en-us
Political News
http://www.teluguone.com/news/content/congress-appoints-observers-to-jarkhand-and-maharashtra-assembly-elections-39-186912.html
కాషాయం పార్టీ రాష్ట్ర నేతలు కొండా బీజేపీ ఎంట్రీపై ఒక్కొక్కరూ ఒక్కోలా మాట్లాడుతున్నారు. వీటికి తోడు సకుటుంబ సపరివార సమేతంగా అయితేనే కాషాయం కండువా కప్పుకుంటానంటూ కొండా సురేఖ కండీషన్లు పెడుతున్నట్లు వస్తున్న వార్తలు ఆమెకు బీజేపీ ఎంట్రీ కూడా మూసుకుపోయిందా అన్న అనుమానాలకు కలిగిస్తున్నాయి.
కొండా సుశ్మీత మీడియా సమావేశం ఏర్పాటు చేసి.. తన వ్యాఖ్యలకు తానే బాధ్యురాలిననీ, తన తల్లిపై వేటు వేయడం సరికాదనీ ఆవేదన వ్యక్తం చేశారు. తన వ్యాఖ్యలకు తన తల్లిని శిక్షించడం సరికాదన్నారు. తెలంగాణ కాంగ్రెస్ పార్టీలో వ్యక్తిగత అభిప్రాయాలకు, స్వతంత్రంగా మాట్లాడే మహిళల గొంతుకకు విలువ లేకుండా పోతోందని ఆవేదన వ్యక్తం చేశారు.
పార్టీ అధిష్టానం సీఎఉం మాటకు ఎంత ప్రాధాన్యత ఇస్తుందో, ఆయనకు వ్యతిరేకంగా అసమ్మతి గళం ఎత్తే సీనియర్ నేతలకూ అంతే ప్రాధాన్యత ఇస్తుంది. దీంతో కాంగ్రెస్ సీఎం ఇబ్బందులు ఎదుర్కొనే పరిస్థితి ఏర్పడుతుంది. కాంగ్రెస్ అధికారంలో ఉన్న పార్టీ సీఎంలు ఎదుర్కొంటున్న ప్రధాన సమస్య ఇదేనని చెప్పాలి.
ఒక్క ఆంధ్రప్రదేశ్ అనే కాదు.. దేశంలోని అన్ని రాష్ట్రాలలోనూ సొంత కాళ్లపై నిలబడాలన్నదే బీజేపీ విధానమని విష్ణువర్ధన్ రెడ్డి చెప్పారు. గతంలో ఏపీలో బీజేపీ మద్దతు వల్లే రాష్ట్రంలో కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిందనీ, ఈ వాస్తవాన్ని సీఎం చంద్రబాబు నాయుడు, డిప్యూటీ సీఎం పవన్ కల్యాణ్ బహిరంగ వేదికలపై స్పష్టంగా చెప్పారని విష్ణువర్ధన్ రెడ్డి గుర్తు చేశారు.
రాయలసీమను హార్టికల్చర్ హబ్గా తీర్చిదిద్దేందుకు, రాష్ట్రంలో ఇరిగేషన్ సదుపాయాలను మెరుగుపరిచేందుకు చంద్రబాబు నాయుడు ప్రభుత్వం పకడ్బందీ ప్రణాళికలతో ముందుకు వెళ్తోందని స్పష్టం చేశారు. రాష్ట్రంలో సాగునీటి ప్రాజెక్టులు ఒక్కొక్కటిగా పూర్తవుతుండటంతో, ఇరిగేషన్ రంగంపై మాట్లాడటానికి ప్రతిపక్షానికి ఎలాంటి అవకాశాలు లేకుండా పోయాయని ఆయన కుండబద్దలు కొట్టారు.
జలయజ్ణం పేరుతో వైఎస్ చేసింది ధనయజ్ణమని విక్రమ్ పూల అన్నారు. ప్రాజెక్టుల అంచనా వ్యయం పెరగడం, ప్రాంతీయ సమతుల్యత లోపించడం, హెడ్ వర్క్స్ కంటే ముందుగా కాలువల తవ్వకం వంటి వాటికే వైఎస్ జలయజ్ణం పరిమితమైందని విక్రమ్ పూల వివరించారు.
కాంగ్రెస్ హైకమాండ్ మీనాక్షీ నటరాజన్ పై వేటు వేయాలని భావిస్తున్నట్లు చెబుతున్నారు. రాహుల్ గాంధీ నేతృత్వంలోని జాతీయ నాయకత్వం రాష్ట్రంలో కాంగ్రెస్ వ్వవహారాలను చక్కదిద్దేందుకు భూపేష్ బగెల్ సమర్ధంగా పని చేయగలరని భావించి ఆ మేరకు నిర్ణయం తీసుకున్నట్లు చెబుతున్నారు.
తాను పూర్తిగా రాజకీయాల నుంచి తప్పుకుంటున్నాననీ, వచ్చే ఎన్నికలలో పోటీ చేయననీ ఆయన చేసిన ప్రకటన పొలిటికల్ సర్కిల్స్ లో హాట్ టాపిక్ గా మారింది. తెలుగుదేశం ఆవిర్భావం నుంచీ కూడా ప్రజా ప్రతినిథిగా, పొలిటికల్ లీడర్ గా సేవలందించిన అయ్యన్న పాత్రుడు హఠాత్తుగా రాజకీయాలకు రిటైర్మెంట్ అంటూ చేసిన ప్రకటన రాజకీయవర్గాలలో సంచలనం సృష్టించింది.
2019 ఎన్నికలలో వైసీపీ విజయంలో అప్పటి జగన్ పాదయాత్ర కీలక పాత్ర పోషించిన సంగతి తెలిసిందే. అయితే అప్పట్లో.. జగన్ వాగ్దానాలపై ప్రజలలో నమ్మకం ఉండేది. ప్రజలతో ఆయన మమేకమయ్యేవారు.
రాష్ట్ర విభజన తరువాత తెలంగాణలో తెలుగుదేశం పార్టీ అధికార రేసులో లేకపోయినప్పటికీ.. రాష్ట్ర రాజకీయాలను ప్రభావితం చేస్తూనే ఉంది. అందుకే రాష్ట్రంలో రాజకీయ వేడ రగిలిన ప్రతి సందర్భంలోనూ తెలుగుదేశం ప్రస్థావన వస్తూనే ఉంటుంది.
తెలంగాణ రాజకీయాల్లో గత కొన్ని రోజులుగా తీవ్ర దుమారం రేపుతున్న పరిణామాలు ఇప్పుడు అత్యంత ఆసక్తికర మలుపు తిరిగాయి.
తాజాగా ఆమె చేసిన వ్యాఖ్యలు ఆమె చూపు బీఆర్ఎస్ వైపు మళ్లిందా అన్న అనుమానాలకు తావిచ్చింది. కేబినెట్ నుంచి తనకు ఉద్వాసన పలికిన తరువాత మీడియాకు వరుస ఇంటర్వ్యూలు ఇస్తూ సంచలన వ్యాఖ్యలు చేస్తున్న కొండా సురేఖ.. తాజాగా బీఆర్ఎస్ అధినేత, మాజీ ముఖ్యమంత్రి కల్వకుంట్ల చంద్రశేఖరరావుపై ప్రశంసల వర్షం కురిపించారు.
పిడిక్కీ బియ్యానికీ ఒకే మంత్రం అన్నట్లుగా ఆమె తన బర్త్ రఫ్ కూ తెలుగుదేశం పార్టీకీ ముడి పెట్టారు. సీఎం రేవంత్ రెడ్డిది తెలుగుదేశం రక్తం కనుకనే తనకు కేబినెట్ నుంచి బర్త్ రఫ్ చేశారంటూ మీడియా సమావేశంలో కొండా సురేఖ చేసి కామెంట్స్ రాజకీయవర్గాలలో సంచలనంగా మారాయి.