కాంగ్రెస్ పార్టీని ‘కాపు’ కాయగలవారెవరు?

Publish Date:Feb 25, 2014

Advertisement

 

ప్రజల చేతిలో ఎన్నిమొట్టికాయలు తిన్నపటికీ మన రాజకీయ పార్టీల, ముఖ్యంగా కాంగ్రెస్ పార్టీ ఆలోచనా విధానం ఎన్నటికీ మారకపోవడం చాలా ఆశ్చర్యం కలిగిస్తుంది. పదేళ్ళ పాలనలో ఎన్ని తప్పులు చేసినపటికీ వాటిని మరిపించేందుకు ఎన్నికల ముందు ప్రజలకు ఏవో కొన్ని తాయిలాలు విసిరేస్తే గలగలా ఓట్లు రాలిపోతాయనే అభిప్రాయం కాంగ్రెస్ పార్టీలో చాలా బలంగా నాటుకుపోయుంది.ఈ మూడు నెలలోగా సీమాంధ్రలో మళ్ళీ పార్టీని బలోపేతం చేసుకొని మళ్ళీ అధికారం చేజిక్కించుకోవడం కోసం, కాంగ్రెస్ పార్టీ తన నేతలకి ముఖ్యమంత్రి, పీసీసీ అధ్యక్ష పదవులను ఎరగా వేస్తోంది.

 

ఇంతకాలం పార్టీకి అండగా నిలబడిన రెడ్లు ఇప్పుడు దూరం కావడంతో, కాంగ్రెస్ అధిష్టానం పార్టీలో కాపు సామాజిక వర్గాన్ని దువ్వుతోందిపుడు. వారు కూడా అందివచ్చిన ఈ అవకాశాన్ని ఉపయోగించుకొంటూ తమకే ముఖ్యమంత్రి, పీసీసీ అధ్యక్ష పదవులు ఇచ్చినట్లయితే తమ కులస్తుల ఓట్లను గంపగుత్తగా కాంగ్రెస్ పార్టీకే పడేలా చేయగలమని హామీలివ్వడం విశేషం. ప్రజలను మనుషులుగా కాక కేవలం ఓట్లుగానే చూసే అలవాటు కాంగ్రెస్ పార్టీ నేతలకి ఎన్నడూ పో(లే)దని ఇది స్పష్టం చేస్తోంది. రాష్ట్ర విభజన చేసినందుకు సీమాంధ్రలో తెలుగు ప్రజలందరూ కుల, మతాలకు అతీతంగా ఉద్యమించారు. తెలుగు జాతిని రెండుగా చీల్చిన కాంగ్రెస్ అధిష్టానం ఇప్పుడు సీమాంధ్ర ప్రజలను కులాలవారీగా చీల్చి ప్రలోభపెట్టి తిరిగి అధికారంలోకి రావాలని అర్రులు చాస్తోంది. సదరు కులానికి చెందడమే ప్రధాన అర్హతన్నట్లు భావిస్తున్నముగ్గురు నేతలు ఈ పోటీలో ఉన్నారు. అయితే వారిలో ఏ ఒక్కరయినా , ఇంతకాలంగా వారి కులస్తులకు ఏమయినా మేలు చేసారా? అని ఆలోచిస్తే లేదనే సమాధానం వస్తుంది. వారు రాష్ట్రంలో కాపు కులస్తులందరికీ తామే అసలు సిసలయిన ప్రతినిధులమని భావించవచ్చును. కానీ సదరు కులానికి చెందిన ప్రజలు కూడా ఆవిధంగా భావిస్తున్నారా? అనేదే ప్రశ్న.

 

అయినా కుల, మత, రాగ ద్వేషాలకి అతీతంగా ప్రజలకు సేవ చేస్తామని రాజ్యాంగం మీద ప్రమాణం చేసే ఈ నేతలకు ఆ సంగతి ఎన్నడూ ఎందుకు గుర్తుకు రాదో తెలియదు. కానీ, ఇప్పుడు కేవలం తమ కులస్థుల మీదే అవ్యాజమయిన ప్రేమ ఎందుకు పొంగి పొరలి పోతోందో మాత్రం అందరికీ తెలుసు. తమకు పదవులు ఇస్తే కాంగ్రెస్ పార్టీని కాపాడుతామని, తమ కులాన్ని బీసీ వర్గంలో చేర్చినట్లయితే తమ వాళ్ళను కూడా పడేయగలమని హామీలీయడం ప్రజలంటే వారికి ఎంత చులకనో తెలియజేస్తోంది. నిజంగా తమ కులస్థుల పట్ల సదరు నేతలకి అభిమానమే ఉండి ఉంటే గత పదేళ్లుగా వారికోసం ఏమి చేసారు? వారిని బీసీలలో ఎందుకు చేర్చలేకపోయారు? అని ప్రశ్నించుకొంటే వారి తపన దేనికో అర్ధమవుతుంది. అధికారం తమ కుటుంబసభ్యుల మధ్య తప్ప తమ కులస్థుల మధ్య ఎన్నడూ పంచుకోవడానికి ఇష్టపడని నేతలు ఏ కులానికి చెందిన వారయితే మాత్రం ప్రజలకు ఒరిగేదేమీ ఉంటుంది? అని ఆలోచిస్తే ప్రజలు ఇటువంటి నేతలకు ఓట్లు వేయరు. అప్పడు వారు కూడా ఇటువంటి ఆలోచనలు చేసేందుకు దైర్యం చేయరు.

By
en-us Political News

  
దేశంలో ఎన్నికల ప్రక్రియ అనగానే కేవలం ఓటింగ్, ఫలితాలే గుర్తొస్తాయి.
పార్టీ కార్యకర్తలపై నమోదైన కేసుల విషయంలో ఆయన నేరుగా రంగంలోకి దిగి వారికి భరోసా కల్పించారు. కార్యకర్తల సంక్షేమం కోసం ప్రత్యేక విభాగాన్ని ఏర్పాటు చేయడం ద్వారా, పార్టీ అంటే కేవలం ఎన్నికల యంత్రాంగం మాత్రమే కాదు, ఒక కుటుంబం అనే భావనను ఆయన పాదుకొల్పారు. ఈ నేపథ్యంలోనే ఆయనకు వర్కింగ్ ప్రెసిడెంట్ బాధ్యతలు ఇవ్వడం సరైన నిర్ణయమని పార్టీ వర్గాలు అభిప్రాయపడుతున్నాయి.
అమెరికా-ఇరాన్ మధ్య ఒక చారిత్రాత్మక ఒప్పందం కుదిరేందుకు కేవలం అంగుళాల దూరం మాత్రమే మిగిలి ఉన్న పరిస్థితుల్లో, ఇజ్రాయెల్ ప్రధాని బెంజమిన్ నెతన్యాహు రంగంలోకి దిగడంతో పరిస్థితులు తలకిందులయ్యాయి. అమెరికా ఉపాధ్యక్షుడు జేడీ వాన్స్‌తో నెతన్యాహు జరిపిన టెలిఫోన్ సంభాషణ తర్వాత చర్చల గమనం పూర్తిగా మారిపోయింది.
బీఆర్ఎస్ నుంచి బయటకు వచ్చిన కవిత.. సొంత రాజకీయ పార్టీ ఏర్పాటుకు సన్నాహాలు చేస్తున్న వేళ, ఆమె ప్రారంభించబోయే పార్టీ పేరుపై గత కొంత కాలంగా రాజకీయవర్గాలలో పెద్ద ఎత్తున చర్చ సాగింది. కల్వకుంట్ల కవితకు తెలంగాణ సమాజంలో ప్రత్యేక గుర్తింపు తీసుకువచ్చిన తెలంగాణ జాగృతి పేరునే ఆమె తన కొత్త పార్టీకి పెట్టబోతున్నట్లు మొదట్లో వార్తలు వినవచ్చినా.. కవిత తాజా వ్యాఖ్యలతో ఆమె టీఆర్ఎస్ పేరుతోనే కొత్త పార్టీ ఏర్పాటు చేయనున్నారన్న వాదనకు బలం చేకూరింది.
ఢిల్లీలోని బీజేపీ కేంద్ర కార్యాలయంలో పలు రాష్ట్రాల అధ్యక్షులతో ఆ పార్టీ జాతీయ అధ్యక్షుడు నితిన్ నబీన్ ప్రత్యేక సమావేశం నిర్వహించారు. ఈ భేటీకి ఏపీ బీజేపీ అధ్యక్షుడు మాధవ్, తెలంగాణ బీజేపీ అధ్యక్షుడు రామచంద్రరావుతో పాటు ఇరు రాష్ట్రాల ఇన్‌చార్జ్ కార్యదర్శులు హాజరయ్యారు. పార్లమెంటులో బిల్లు ప్రవేశపెట్టడాని ముందు ఉన్న గడువులో అన్ని రాష్ట్రాలలో మహిళా మోర్చా ఆధ్వర్యంలో కార్యక్రమాలు చేపట్టాలని ఆదేశించారు.
ఆడుదాం ఆంధ్ర కార్యక్రమంలో భారీ ఎత్తున అక్రమాలు జరిగినట్లు ప్రాథమిక విచారణలో స్పష్టమైంది. సుమారు 125 కోట్ల రూపాయల వ్యయంతో చేపట్టిన ఆడుదాం ఆంధ్రలో 40 నుండి 60 కోట్ల రూపాయల మేర అక్రమాలు జరిగాయని అంటున్నారు.
రాష్ట్ర ప్రభుత్వం అత్యంత ప్రతిష్టాత్మకంగా భావిస్తున్న సీ షోర్ హైవే ప్రాజెక్టుతో పాటు, రాజధాని అమరావతిని అనుసంధానిస్తూ కేంద్ర ప్రభుత్వం చేపట్టిన హై-స్పీడ్ రైల్ కారిడార్లు రాష్ట్ర ప్రగతికి కొత్త వేగాన్ని తీసుకువచ్చాయి. తీర ప్రాంత అభివృద్ధిని, రాజధాని రవాణా సౌకర్యాలను ఏకకాలంలో మెరుగుపరచడమే లక్ష్యంగా ఈ భారీ ప్రాజెక్టులు రూపుదిద్దుకుంటున్నాయి.
పొంగులేటి ప్ర‌స్తుతం మంత్రిగా నిర్వహిస్తున్న మైనింగ్ శాఖ‌, గ‌తంలో కేటీఆర్ నిర్వ‌హించ‌గా.. ఆ స‌మ‌యంలో ఎన్ని అక్ర‌మాలు జ‌రిగాయో.. ఎన్నేసి అరాచ‌కాలు న‌డిచాయో.. గ‌త అసెంబ్లీ స‌మావేశాల్లో ముఖ్య‌మంత్రి రేవంత్ రెడ్డి చ‌దివి వినిపించిన సంగ‌తి తెలిసిందే. వీటిపై సీబీసీఐడీ ఎంక్వ‌యిరీ కూడా వేస్తామ‌ని సీఎం ప్ర‌క‌టించిన సంగ‌తీ విదిత‌మే. ఈ అక్ర‌మాల్లో త‌న సోద‌రుడి ప్ర‌మేయం కూడా ఉండ‌టంతో.. ఉలిక్కి ప‌డ్డ హ‌రీష్ రావు, ఈ శాఖామాత్యుడైన‌ పొంగులేటిని త‌న టార్గెట్ గా ఫిక్స్ చేసిన‌ట్టు స‌మాచారం.
ది ఉద్యోగాల కోసం వంద‌లాది మంది ఫీజులు క‌ట్టి మ‌రీ రాస్తుంటే ఆ వ‌చ్చే ప‌ది ఉద్యోగాలు పొందిన వారినుంచి ఫీజు వ‌సూళ్ల‌ వ‌ర‌కూ ఓకే.. మిగిలిన అంద‌రి ఫీజులు వాప‌స్ ఎందుకివ్వ‌ర‌ని ప్రశ్నించారు. అంతే కాదు సామాన్యుడి త‌రఫున కూడా విలక్షణ శైలిలో తన గళమెత్తుతున్నారు. టికెట్ కొని కూడా రైల్లో ఒక సాధార‌ణ ప్ర‌యాణికుడు నిల‌బ‌డి ప్ర‌యాణించాల్సి పరిస్థితి ఏంటి? వంటి ప్ర‌శ్న‌లతో రాఘవ్ చద్దా సోషల్ మీడియాలో తెగ ట్రెండింగ్ అయ్యారు.
గుజరాత్ రాజధాని కోసం లక్షల కోట్లు ఖర్చు చేసిన కేంద్రం, ఆంధ్రప్రదేశ్ రాజధాని విషయంలో 12 ఏళ్లు ఎందుకు తాత్సారం చేసిందంటూ కేంద్రాన్ని నిలదీశారు. అమరావతి బిల్లు ఆమోదం పొందడం అనేది.. ప్రభుత్వ విజయం కాదు, ఐదేళ్ల పాటు రోడ్లపై పోరాడిన అమరావతి రైతులు, మహిళలు సాధించిన విజయంగా అభివర్ణించారు రేణుకా చౌదరి. సభలో అడ్డంకులు కలిగించిన ఇతర ఎంపీలపై తనదైన శైలిలో పంచ్ డైలాగులు విసురుతూ, తెలుగు వారి ఆత్మగౌరవాన్ని ఢిల్లీ వీధుల్లో తాకట్టు పెట్టకండి అని గర్జించారు.
జగన్ రెడ్డి హేతురహిత రాజధాని ప్రతిపాదనపై సర్వత్రా విమర్శలు వెల్లువెత్తుతున్నాయి. అమరావతికి పార్లమెంట్ చట్టబద్ధత కల్పిస్తూ నిర్ణయాలు తీసుకుంటున్న వేళ.. జగన్ రాష్ట్ర అసెంబ్లీలో ఆ చట్టాన్ని సవరించవచ్చంటూ కొత్త రాగం అందుకోవడాన్ని ఆయన అవగాహనా రాహిత్యానికి నిలువెత్తు నిదర్శనంగా పరిశీలకులు అభివర్ణిస్తున్నారు.
అమరావతి విషయంలో సిఎం చంద్రబాబు నాయుడు చాలా తప్పులు చేశారనీ, అవినీతికి పాల్పడుతున్నాననీ గత రెండు రోజులుగా వైసీపీ నాయకులు చేస్తున్న వ్యాఖ్యలకు జగన్ ఈ ప్రెస్ మీట్ లో వంత పాడారు. ఓ పక్క అమరావతికి వ్యతిరేకం కాదంటూనే వైసీపీ నేతలతో శ్రీకాకుళంలో సభ ఏర్పాటు చేయించారు.
2026 బడ్జెట్ ప్రతిపాదనల ప్రకారం, కొత్త పన్ను విధానంలో రూ.7 లక్షల వరకు ఆదాయం ఉన్నవారికి ఎలాంటి పన్ను ఉండదు. సెక్షన్ 87A కింద రిబేట్ కలిపి.. వీరికి వెస‌లుబాటు ఉంటుంది. స్టాండ‌ర్డ్ డిడ‌క్ష‌న్ విష‌యానికి వ‌స్తే.. జీత‌భ‌త్యాలు పొందేవారికి ఇచ్చే స్టాండ‌ర్డ్ డిడ‌క్ష‌న్ ప్ర‌యోజ‌నాలు ఈ కొత్త విధానంలో కూడా కొన‌సాగుతాయి.
 
Disclaimer:
All content included on this TeluguOne.com Portal including text, graphics, images, videos and audio clips, is the property of ObjectOne Information Systems Ltd. or our associates, and protected by copyright laws. The collection, arrangement and assembly of all content on this portal/ related channels is the exclusive property of ObjectOne Information Systems Ltd. or our associates and protected copyright laws.
 
You may not copy, reproduce, distribute, publish, display, perform, modify, create derivative works, transmit, or in any other way exploit any part of copyrighted material without permission from ObjectOne Information Systems Ltd or our associates.