బొత్సపై అధిష్టానం వేటు

Publish Date:Mar 11, 2014

Advertisement

 

సమైక్యరాష్ట్రంలో పీసీసీ అధ్యక్షుడిగా వ్యవహరించిన బొత్ససత్యనారాయణను, ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి పీసీసీ అధ్యక్షుడిగా నియమించబోతోందని వార్తలు వచ్చాయి. కానీ చాలా ఆశ్చర్యకరంగా ఆయన స్థానంలో రఘువీరారెడ్డిని నియమించింది. బొత్ససత్యనారాయణను పీసీసీ అధ్యక్ష పదవిలో నుండి తప్పించడమే కాకుండా ఆయనను, రఘువీరా రెడ్డి క్రింద పనిచేసే ఒక కమిటీలో ఒక సాధారణ సభ్యుడిగా నియమించడం శిక్షగానే భావించాల్సి ఉంటుంది.

 

బహుశః ప్రజలలో బొత్స పట్ల ఉన్న వ్యతిరేఖతను కాంగ్రెస్ అధిష్టానం కూడా గుర్తించినట్లు అర్ధమవుతోంది. అయితే ఆయన ముఖ్యమంత్రి అభ్యర్ధిగా భావించినందునే ఆయనను పీసీసీ అధ్యక్ష పదవి నుండి తప్పించిందని అనుకొన్నా, ఈ ఎన్నికలలో ఆంద్ర ప్రదేశ్ రాష్ట్రంలో కాంగ్రెస్ పార్టీ గెలిచే అవకాశమే కనబడనప్పుడు పదవిలో నుండి తప్పించడం కేవలం శిక్షగానే భావించవలసి ఉంటుంది.

 

ఆయన విభజన సమయంలో సీమాంధ్ర కాంగ్రెస్ నేతలను అదుపుచేసి, అందరినీ ఒక్క త్రాటిపైకి తేవడంలో చాలా ఘోరంగా విఫలమయినందునే నేడు కాంగ్రెస్ పార్టీకి ఈ దుస్థితి దాపురించినదని చెప్పక తప్పదు. సీమాంధ్రలో పార్టీపట్ల ప్రజలలో తీవ్ర వ్యతిరేఖత ఏర్పడినప్పుడు, ముఖ్యమంత్రి కిరణ్ కుమార్ రెడ్డి మరియు ఆయన అనుచరులు ఆ వ్యతిరేఖతను పెంచి పోషిస్తున్నపుడు, దానిని అదుపుచేసి పార్టీని కాపాడే ప్రయత్నం చేయకపోగా, ప్రజలలో తనపట్ల మరింత వ్యతిరేఖత పెరగకుండా ఉండేందుకు జాగ్రత్తపడుతూ ముఖ్యమంత్రితో కలిసి అధిష్టానానికి లేఖలు వ్రాసారు, ధర్నాలలో పాల్గొన్నారు. అయినప్పటికీ ఆయన ప్రజలను కానీ, తన అధిష్టానాన్ని గానీ మెప్పించలేక ఆయన పరిస్థితి ఇప్పుడు రెంటికీ చెడిన రేవడిలా తయారయింది.

 

ఎటువంటి రాజకీయానుభవం లేని చిరంజీవికి కూడా ప్రచార కమిటీ చైర్మన్ పదవిని కట్టబెట్టిన కాంగ్రెస్ అధిష్టానం, సుదీర్గ రాజకీయానుభవం ఉన్న బొత్సకు మాత్రం  ఏ కమిటీ బాధ్యత అప్పగించలేదు. అభ్యర్ధులకు టికెట్స్ కేటాయించే ఈ కీలక సమయంలో ఆయనను పీసీసీ అధ్యక్ష పదవి నుండి తప్పించడం ఆయనకు పెద్ద దెబ్బే కాక ప్రజల దృష్టిలో ఆయన మరింత పలుచనయ్యే అవకాశం ఉంది. అయితే తానే పదవి నుండి స్వయంగా తప్పించమని కోరానని బహుశః ఆయన రేపు సర్దిచెప్పుకొనే ప్రయత్నం చేస్తారేమో!

By
en-us Political News

  
కొత్త జిల్లాల ఏర్పాటుకు ఆమోదం లభించే అవకాశాలున్నాయి. అలాగే కొత్త రెవెన్యూ డివిజన్ల ఏర్పాటుపై కూడా చర్చ జరిపి నిర్ణయం తీసుకునే చాన్స్ ఉంది.
ఒక్కోసినిమాకు వంద కోట్ల రూపాయ‌ల వరకూ పారితోష‌కం తీసుకునే విజయ్ ఆ ఆదాయాన్ని వదులుకుని ప్రజా సేవకే అంకితం కావాలని డిసైడ్ అయ్యారనడానికి ఆయన సినిమాలకు గుడ్ బై చెప్పడమే నిదర్శనం.
2023 అసెంబ్లీ ఎన్నికలలో పార్టీ పరాజయం తరువాత ఆయన ఫామ్ హౌస్ నుంచి బయటకు వచ్చిన సందర్భాలను వేళ్ల పై లెక్కించవచ్చు. ఇక అసెంబ్లీకి అయితే.. కేవలం శాసనసభ్యుడిగా ప్రమాణ స్వీకారం చేయడానికి మాత్రమే హాజర్యారని చెప్పవచ్చు.
ఇటీవలే చంద్రబాబు తన ఢిల్లీ పర్యటనలో నిర్మలా సీతారామన్ తో భేటీ అయిన సంగతి తెలిసిందే. కేంద్ర బడ్జెట్ ముందు స్వల్ప వ్యవధిలో చంద్రబాబు కేంద్ర విత్త మంత్రితో భేటీ కావడం ప్రాధాన్యత సంతరించుకుంది.
శాస్త్ర సాంకేతికంగా దేశం అభివృద్ధి చెందడానికి కారణం ఇందిరా గాంధీ, రాజీవ్ గాంధీలేనని టీపీసీసీ చీఫ్ మహేశ్ కుమార్ గౌడ్ అన్నారు.
ఉపాధి హామీ పేరు మార్పుపై రేపు గ్రామ గ్రామాన గాంధీ చిత్రపటాలతో కాంగ్రెస్ నిరసన తెలుపుతున్నట్లు ప్రకటించారు
ప్రస్తుతం రేవంత్ కేబినెట్ లో రెండు ఖాళీలు మాత్రమే ఉన్నాయి. అయితే ఆ రెండు బెర్తులకు తీవ్ర పోటీ ఉంది. కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి, మల్ రెడ్డి రంగారెడ్డి, ఆది శ్రీనివాస్, బాలూనాయక్ ల పేర్లు ప్రముఖంగా వినిపిస్తున్నాయి. వీరిలో గత ఏడాది కాలంగా కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి, మల్ రెడ్డి రంగారెడ్డిలు బహిరంగంగానే తమకు మంత్రిపదవి ఖాయమన్న ప్రకటనలు చేస్తున్నారు. కొండొకచో.. ఎలాంటి దాపరికం లేకుండా తమ అసంతృప్తినీ వ్యక్తం చేస్తున్నారు.
తనను డిప్యూటీ స్పీకర్ పదవి నుంచి తొలగించాలని డిమాండ్ చేయడంపై రఘురామకృష్ణం రాజు మండిపడ్డారు. రాజ్యాంగ పదవిలో ఉన్నందున మౌనంగా ఉన్నానన్న ఆయన.. 11 కేసులున్న వ్యక్తి ముఖ్యమంత్రిగా చేయలేదా? అని ప్రశ్నించారు.
ఇప్పటికే తనను వైసీపీ నుంచి బహిష్కరించారనీ, ఇప్పుడు భౌతికంగా లేకుండా చేయడానికి ప్రయత్నిస్తున్నారంటూ ఆరోపణలు గుప్పించారు.దీన్నంతా ఓ వీడియోగా తీసి సోషల్ మీడియాలో పోస్టు చేశారు.
పరీక్షలకు ఎటువంటి ఆటంకం లేకుండా, అంతకు ముందుగానే మునిసిపల్ ఎన్నికల ప్రక్రయను పూర్తి చేసే ఉద్దేశంతో ముందుకు సాగుతున్నది. ఈ నేపథ్యంలోనే వచ్చే ఏడాది జనవరి మూడో వారం నాటికి ఎన్నికల నిర్వహణకు సంబంధించి అన్ని ఏర్పాట్లు పూర్తి చేసుకోవాలని ఇప్పటికే రేవంత్ సర్కర్ రాష్ట్ర ఎన్నికల కమిషన్ కు సూచించినట్లు విశ్వసనీయంగా తెలిసింది.
ఈ విచారణలో కీలక అంశాలను రాబట్టినట్లు విశ్వసనీయ సమాచారం. ఆరా మస్తాన్ కు పోలీసులు ఇప్పటికే రెండు సార్లు విచారించారు. తాజాగా సిట్ విచారణలో అధికారులు ఆయన గతంలో ఇచ్చిన వాంగ్మూలాల కన్ఫర్మేషన్ కోసం ప్రశ్నించినట్లు తెలుస్తోంది...
ఈ సమావేశాల్లో ప్రాజెక్టులు, నీటి కేటాయింపులు, రాష్ట్ర విభజన తర్వాత ప్రాజెక్టులపై చేసిన వ్యయం తదితర అంశాలపై అధికార, విపక్షాల మధ్య వాడీ వేడి చర్చ జరిగే అవకాశం ఉందంటున్నారు. ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి కూడా ఈ అంశాలపైనే సభలో విస్తృత చర్చ జరగాలని అన్న సంగతి తెలిసిందే.
కేసీఆర్ పేరు చెప్పుకుని కేటీఆర్ బతుకుతున్నారు అన్న సీఎం రేవంత్‌రెడ్డి వ్యాఖ్యలకు కేటీఆర్ కౌంటర్ ఇచ్చారు.
 
Disclaimer:
All content included on this TeluguOne.com Portal including text, graphics, images, videos and audio clips, is the property of ObjectOne Information Systems Ltd. or our associates, and protected by copyright laws. The collection, arrangement and assembly of all content on this portal/ related channels is the exclusive property of ObjectOne Information Systems Ltd. or our associates and protected copyright laws.
 
You may not copy, reproduce, distribute, publish, display, perform, modify, create derivative works, transmit, or in any other way exploit any part of copyrighted material without permission from ObjectOne Information Systems Ltd or our associates.