అధిష్టానం దెబ్బకు సీమంధ్ర కాంగ్రెస్ నేతలు విలవిలా

Publish Date:Sep 30, 2013

Advertisement

 

తెలంగాణా ఉద్యమాలు జోరుగా సాగుతున్న తరుణంలో కాంగ్రెస్ అధిష్టానం తన టీ-కాంగ్రెస్ నేతల రాజకీయ జీవితాలతో చెలగాటమాడుకొంది. ఇప్పుడు తన సీమాంధ్ర నేతల రాజకీయ జీవితాలతో ఆడుకొంటోంది. ఒక రాజకీయ పార్టీ ఎదుట పార్టీ నేతలని దెబ్బతీయడానికి ప్రయత్నించడం సహజమే అయినప్పటికీ, ఇలా స్వంత పార్టీ నేతలనే దెబ్బతీయాలనుకోవడం చాలా ఆశ్చర్యం కలిగిస్తుంది. గత రెండు మూడు దశాబ్దాలుగా పార్టీ కోసం పనిచేస్తున్నతమను కాదని, ఇంతకాలం తనను ఎవరయితే సవాలు చేస్తున్నారో, ఎవరిపై కేసులు మోపి జైలులో నిర్భందించిందో వారికోసమే పార్టీని, నేతలని పణంగా పెట్టాలనుకోవడం సీమాంధ్ర కాంగ్రెస్ నేతలు జీర్ణించుకోలేకపోతున్నారు. ఇప్పటికే రాష్ట్ర విభజన నిర్ణయంతో సగం చచ్చి ఉన్నతమకు, విభజన ప్రక్రియను ముందుకు తీసుకు వెళ్లేందుకు అదే జగన్మోహన్ రెడ్డి సాయం తీసుకొని స్వంత ప్రభుత్వమే కూల్చుకోవాలని ప్రయత్నాలు చేస్తున్న కాంగ్రెస్ అధిష్టానం వైఖరితో వారు నివ్వెర పోయారు. హర్షకుమార్, లగడపాటి, సాయి ప్రతాప్ వంటి నిఖార్సయిన కాంగ్రెస్ నేతలందరూ దీనిని తీవ్రంగా వ్యతిరేఖిస్తున్నారు. ఈ పరిణామాలతో కలత చెందిన అనేక మంది ఇప్పుడు తాము ఏ పార్టీని ఆశ్రయించాలో తెలియక విలవిలలాడుతున్నారు.

 

కాంగ్రెస్ పార్టీ బీసీ, యస్సీ,ఎస్టీ, మైనార్టీ ఓట్ల మీదే ప్రధానంగా ఆధారపడినప్పటికీ, ఆ పార్టీలో ఆధిపత్యం మాత్రం రెడ్డి మరియు కాపు కులస్తుల చేతుల్లోనే ఉందనేది బహిరంగ రహస్యమే. కాంగ్రెస్ ఆడుతున్న ఈ రాజకీయ జూదంలో బలమయిన ఆ రెండు వర్గాల నేతలు తాము ఓడిపోయామనే భావనలో ఉన్నారు. అందువల్ల రెడ్డి కులస్తులు కొందరు వైకాపా గూటికి చేరుకొనే ప్రయత్నాలు చేస్తుంటే, కాపు కులస్తులు మాత్రం తెలుగుదేశం పార్టీ వైపు చూస్తున్నట్లు సమాచారం. ఇక మిగిలిన వారు కొత్త పార్టీ పెట్టడం గురించి ఆలోచనలు చేస్తున్నారు.

 

అయితే కాంగ్రెస్ పార్టీ దీనికి ఎంత మాత్రం భయపడటం లేదు. కారణం తమ పార్టీ నేతలలో ఎక్కువ మంది అంతిమంగా వైకాపా గూటికే చేరుకొంటారని దాని నమ్మకం. వైకాపా కూడా కాంగ్రెస్ చెట్టుకు మొలిచిన మరో కొమ్మే గనుక ఎన్నికల తరువాత వైకాపాతో మళ్ళీ అంటూ కట్టుకోవచ్చుననే దృడ (గుడ్డి)నమ్మకంతోనే కాంగ్రెస్ తన నేతలను వదులుకొనేందుకు సిద్దపడుతోంది. కానీ అది ఊహిస్తున్నట్లుగా రెడ్డి కులస్తులు అందరూ వైకాపాలోనే చేరెందుకు సిద్ధంగా లేరని సమాచారం.

 

అవినీతి ఆరోపణలు ఎదుర్కొంటున్న అతనితో చేతులు కలపడం ఇష్టం లేక కొందరు, ఏ కాంగ్రెస్ పార్టీని కాదనుకొని తాము బయటకి వచ్చేమో మళ్ళీ భవిష్యత్తులో అదే కాంగ్రెస్ పార్టీతో కలిసే అవకాశం ఉన్నకారణంగా వైకాపాలో చేరేందుకు మరికొందరు ఇష్టపడటం లేదు. తెదేపా, వైకాపాలలో చేరలేని పరిస్థితుల్లో ఉన్న అటువంటి వారు తప్పనిసరిగా మరో రాజకీయపార్టీ పెట్టుకోక తప్పదు. కాంగ్రెస్ అధిష్టానం కూడా సరిగ్గా అదే కోరుకొంటోంది. తెలుగుదేశం పార్టీని అధికారం చెప్పట్టకుండా నిలువరించేందుకు నేతలలో, ప్రజలలో కొంత గందరగోళం సృష్టించి ఓట్లు చీల్చడం ద్వారానే తను లాభపడాలని దురాశకు పోతోంది. కానీ కాంగ్రెస్ హస్తంలో గీతలను తెలుగు ప్రజలు గతంలో మార్చిన సంగతిని మరిచిపోతోంది.

By
en-us Political News

  
ప్రస్తుతం ఏపీ రాజ‌కీయాల్లో స‌వాళ్ల ప‌ర్వం స్టార్ట్ అయింది. ప్ర‌చారంలో ప్రధాన పార్టీల నేత‌లు మాట‌ల‌ ప‌దును పెంచుతున్నారు. రాజ‌కీయ స‌వాళ్ళు, ప్ర‌తిస‌వాళ్ళ‌తో నేత‌లు, ఓట‌ర్ల‌ను వినోదాన్ని పంచుతున్నారు. “హాష్ ట్యాగ్ బ్యాండైడ్ ఛాలెంజ్” పేరుతో ట్విట్టర్ లో ఛాలెంజ్ విసురుకుంటున్నారు.
కోడలికి బుద్ధి చెప్పి అత్త మూకుడు నాకిందనే సామెత తెలుగువారందరికీ తెలిసే వుంటుంది.
ఇప్పుడు ఆంధ్రప్రదేశ్‌లో ఏర్పడిన రాజకీయ ఉత్కంఠ, టెన్షన్ భరిత వాతావరణం చాలదన్నట్టుగా సీబీఐ మాజీ జేడీ లక్ష్మీనారాయణ అగ్నిలో ఆజ్యం పోశారు.
వల్లభనేని వంశీ నామినేషన్ దాఖలు చేసిన రోజునే ఓటమిని అంగీకరించేశారా? అంటే పరిశీలకలు ఔననే అంటున్నారు. ఇవే తనకు చివరి ఎన్నికలు అని ప్రకటించడం ద్వారా తనకు గెలుపు ఆశలు ఆవిరి అయిపోయాయని చెప్పకనే చెప్పేశారు.
డోన్ నియోజకవర్గం వైైసీసీ అభ్యర్థి మంత్రి  బుగ్గన నామినేషన్ పెండింగ్లో పడింది.   మంత్రి బుగ్గన రాజేంద్రనాథ నామినేషన్ ను ఆర్వో పెండింగ్ లో ఉంచారు.
ఏపీ ఎన్నికల సందర్భంగా జనసేన అభ్యర్థులు పోటీ చేస్తున్న నియోజకవర్గాల్లో కమెడియన్ హైపర్ ఆది ప్రచారం చేస్తున్నారు.
హిందూపురం తెలుగుదేశం అభ్యర్థిగా బాలకృష్ణ భార్య వసుంధర నామినేషన్! అనంతపురం జిల్లా హిందూపురం అసెంబ్లీ నియోజకవర్గ తెలుగుదేశం అభ్యర్థిగా నందమూరి బాలకృష్ణ భార్య వసుంధర గురువారం నామినేషన్ దాఖలు చేశారు.
ఓ వైపు ప్రజా వ్యతిరేకత, మరో వైపు చెల్లెళ్ల విమర్శలు, ఇంకో వైపు పార్టీ నుంచి పెరిగిపోతున్న వలసలు, వెరసి ఓటమి భయంతో జగన్ వణికి పోతున్నారా? ఆఫ్రస్ట్రేషన్ లో సొంత చెల్లెలిపైనే అనుచిత వ్యాఖ్యలు చేసి తనకు తానే నష్టం చేసుకున్నారా? అంటే పరిశీలకులు ఔననే అంటున్నారు.
ఏంటమ్మా జగనూ... మొన్న చెల్లి షర్మిలమ్మ ఎలక్షన్ కమిషన్ దగ్గర అఫిడవిట్ దాఖలు చేసినప్పుడు చూశాంలే..
కేసీఆర్ ఇప్పుడు లోక్ సభ ఎన్నికల ప్రచారంలో సెంటిమెంట్ ను పండించేందుకు నానా ప్రయత్నాలూ చేస్తున్నారు. గత ఏడాది డిసెంబర్ లో జరిగిన తెలంగాణ అసెంబ్లీ ఎన్నికలలో పరాజయం తరువాత కారణాలేమైతేనేం చాలా రోజుల పాటు ఎక్కడా బహిరంగంగా మాట్లాడని ఆయన ఇప్పుడు సార్వత్రిక ఎన్నికల ముంగిట ప్రజల ముందుకు వచ్చారు.
గుడివాడ, గన్నవరం.. ఈ రెండు అసెంబ్లీ నియోజకవర్గాలపై రాష్ట్ర వ్యాప్తంగా ఆసక్తి నెలకొంది. ఎందుకంటే ఈ రెండు చోట్లా కూడా వైసీపీ అభ్యర్థుల తీరు, భాష పట్ల ఆయా నియోజకవర్గాలలోనే కాకుండా రాష్ట్ర వ్యాప్తంగా ఆగ్రహం వ్యక్తం అవుతోంది. అయినప్పటికీ వైసీపీ గాంభీర్యం పదర్శిస్తూ విజయంపై ధీమా వ్యక్తం చేస్తున్నది.
ఏపీలో భానుడు చండ్ర నిప్పులు చెరుగుతున్నాడు. అత్యధిక ఉష్ణోగ్రతలు నమోదౌతున్నాయి.
 
Disclaimer:
All content included on this TeluguOne.com Portal including text, graphics, images, videos and audio clips, is the property of ObjectOne Information Systems Ltd. or our associates, and protected by copyright laws. The collection, arrangement and assembly of all content on this portal/ related channels is the exclusive property of ObjectOne Information Systems Ltd. or our associates and protected copyright laws.
 
You may not copy, reproduce, distribute, publish, display, perform, modify, create derivative works, transmit, or in any other way exploit any part of copyrighted material without permission from ObjectOne Information Systems Ltd or our associates.