అధిష్టానం దెబ్బకు సీమంధ్ర కాంగ్రెస్ నేతలు విలవిలా

Publish Date:Sep 30, 2013

Advertisement

 

తెలంగాణా ఉద్యమాలు జోరుగా సాగుతున్న తరుణంలో కాంగ్రెస్ అధిష్టానం తన టీ-కాంగ్రెస్ నేతల రాజకీయ జీవితాలతో చెలగాటమాడుకొంది. ఇప్పుడు తన సీమాంధ్ర నేతల రాజకీయ జీవితాలతో ఆడుకొంటోంది. ఒక రాజకీయ పార్టీ ఎదుట పార్టీ నేతలని దెబ్బతీయడానికి ప్రయత్నించడం సహజమే అయినప్పటికీ, ఇలా స్వంత పార్టీ నేతలనే దెబ్బతీయాలనుకోవడం చాలా ఆశ్చర్యం కలిగిస్తుంది. గత రెండు మూడు దశాబ్దాలుగా పార్టీ కోసం పనిచేస్తున్నతమను కాదని, ఇంతకాలం తనను ఎవరయితే సవాలు చేస్తున్నారో, ఎవరిపై కేసులు మోపి జైలులో నిర్భందించిందో వారికోసమే పార్టీని, నేతలని పణంగా పెట్టాలనుకోవడం సీమాంధ్ర కాంగ్రెస్ నేతలు జీర్ణించుకోలేకపోతున్నారు. ఇప్పటికే రాష్ట్ర విభజన నిర్ణయంతో సగం చచ్చి ఉన్నతమకు, విభజన ప్రక్రియను ముందుకు తీసుకు వెళ్లేందుకు అదే జగన్మోహన్ రెడ్డి సాయం తీసుకొని స్వంత ప్రభుత్వమే కూల్చుకోవాలని ప్రయత్నాలు చేస్తున్న కాంగ్రెస్ అధిష్టానం వైఖరితో వారు నివ్వెర పోయారు. హర్షకుమార్, లగడపాటి, సాయి ప్రతాప్ వంటి నిఖార్సయిన కాంగ్రెస్ నేతలందరూ దీనిని తీవ్రంగా వ్యతిరేఖిస్తున్నారు. ఈ పరిణామాలతో కలత చెందిన అనేక మంది ఇప్పుడు తాము ఏ పార్టీని ఆశ్రయించాలో తెలియక విలవిలలాడుతున్నారు.

 

కాంగ్రెస్ పార్టీ బీసీ, యస్సీ,ఎస్టీ, మైనార్టీ ఓట్ల మీదే ప్రధానంగా ఆధారపడినప్పటికీ, ఆ పార్టీలో ఆధిపత్యం మాత్రం రెడ్డి మరియు కాపు కులస్తుల చేతుల్లోనే ఉందనేది బహిరంగ రహస్యమే. కాంగ్రెస్ ఆడుతున్న ఈ రాజకీయ జూదంలో బలమయిన ఆ రెండు వర్గాల నేతలు తాము ఓడిపోయామనే భావనలో ఉన్నారు. అందువల్ల రెడ్డి కులస్తులు కొందరు వైకాపా గూటికి చేరుకొనే ప్రయత్నాలు చేస్తుంటే, కాపు కులస్తులు మాత్రం తెలుగుదేశం పార్టీ వైపు చూస్తున్నట్లు సమాచారం. ఇక మిగిలిన వారు కొత్త పార్టీ పెట్టడం గురించి ఆలోచనలు చేస్తున్నారు.

 

అయితే కాంగ్రెస్ పార్టీ దీనికి ఎంత మాత్రం భయపడటం లేదు. కారణం తమ పార్టీ నేతలలో ఎక్కువ మంది అంతిమంగా వైకాపా గూటికే చేరుకొంటారని దాని నమ్మకం. వైకాపా కూడా కాంగ్రెస్ చెట్టుకు మొలిచిన మరో కొమ్మే గనుక ఎన్నికల తరువాత వైకాపాతో మళ్ళీ అంటూ కట్టుకోవచ్చుననే దృడ (గుడ్డి)నమ్మకంతోనే కాంగ్రెస్ తన నేతలను వదులుకొనేందుకు సిద్దపడుతోంది. కానీ అది ఊహిస్తున్నట్లుగా రెడ్డి కులస్తులు అందరూ వైకాపాలోనే చేరెందుకు సిద్ధంగా లేరని సమాచారం.

 

అవినీతి ఆరోపణలు ఎదుర్కొంటున్న అతనితో చేతులు కలపడం ఇష్టం లేక కొందరు, ఏ కాంగ్రెస్ పార్టీని కాదనుకొని తాము బయటకి వచ్చేమో మళ్ళీ భవిష్యత్తులో అదే కాంగ్రెస్ పార్టీతో కలిసే అవకాశం ఉన్నకారణంగా వైకాపాలో చేరేందుకు మరికొందరు ఇష్టపడటం లేదు. తెదేపా, వైకాపాలలో చేరలేని పరిస్థితుల్లో ఉన్న అటువంటి వారు తప్పనిసరిగా మరో రాజకీయపార్టీ పెట్టుకోక తప్పదు. కాంగ్రెస్ అధిష్టానం కూడా సరిగ్గా అదే కోరుకొంటోంది. తెలుగుదేశం పార్టీని అధికారం చెప్పట్టకుండా నిలువరించేందుకు నేతలలో, ప్రజలలో కొంత గందరగోళం సృష్టించి ఓట్లు చీల్చడం ద్వారానే తను లాభపడాలని దురాశకు పోతోంది. కానీ కాంగ్రెస్ హస్తంలో గీతలను తెలుగు ప్రజలు గతంలో మార్చిన సంగతిని మరిచిపోతోంది.

By
en-us Political News

  
ఉభయ తెలుగు రాష్ట్రాలలో కలిపి ఇప్పటికే దాదాపు 20 లక్షల మందికి పైగా సభ్యులు జనసేనలో చేరారనీ.. ఈ బలంతో తెలంగాణ రాజకీయాల్లో తమ ఉనికిని గట్టిగా చాటుతామని పవన్ కల్యాణ్ ధీమా వ్యక్తం చేశారు. రాబోయే గ్రేటర్ హైదరాబాద్ మున్సిపల్ కార్పొరేషన్ ఎన్నికలతో పాటు, 2028లో జరగబోయే తెలంగాణ అసెంబ్లీ ఎన్నికల్లో జనసేన పోటీకి దిగుతుందని పవన్ ప్రకటించడం తెలుగు రాష్ట్రాల్లో రాజకీయ ప్రకంపనలు సృష్టిస్తోంది.
ఏపీ రాజకీయాలలో కాపు సామాజికవర్గం ఓటు బ్యాంకుకు ఎన్నికల ఫలితాలను తారుమారు చేయగలిగే సత్తా ఉంది. అటువంటి కాపు సామాజికవర్గం విషయంలో జగన్ అనుసరిస్తున్న వ్యూహం మొదటికే మోసం తెచ్చేలా ఉందన్న ఆందోళన వైసీపీ వర్గాలలో వ్యక్తం అవుతున్నది.
శివసేన ఏక్ నాథ్ షిండే, శివసేన ఉద్ధవ్ థాక్రే వర్గాల మధ్య మాటల యుద్ధం తారస్థాయికి చేరింది. పార్టీ వ్యవస్థాపకుడు బాలాసాహెబ్ థాకరే అసలైన వారసులం తామేనంటూ మహారాష్ట్ర ఉపముఖ్యమంత్రి ఏక్‌నాథ్ షిండే వర్గం, మాజీ ముఖ్యమంత్రి ఉద్ధవ్ థాకరే నేతృత్వంలోని యూబీటీ వర్గం పోటాపోటీగా భారీ బహిరంగ సభలను నిర్వహించడంతో ముంబైలో ఉద్రిక్తతలు పీక్స్ కు వెళ్లాయి.
విజయవాడ కృష్ణలంక ప్రాంతానికి చెందిన సాయికృష్ణ అదృశ్యం కేసు రాష్ట్ర రాజకీయాల్లో తీవ్ర చర్చనీయాంశంగా మారిన సంగతి తెలిసిందే. 2024 ఎన్నికలలో ఘోర పరాజయం తరువాత దిక్కుతోచని స్థితిలో ఉన్న వైసీపీకి సాయికృష్ణ అదృశ్యం ఘటనను అందివచ్చిన అవకాశంగా భావించి.. పొలిటికల్ మైలేజీ గెయిన్ చేయడానికి శతధా ప్రయత్నించింది. అయితే చంద్రబాబు తన చాణక్యంతో ఆ ప్రయత్నాలకు చెక్ పెట్టారు.
తెలంగాణ రాజకీయాల్లో మల్కాజ్‌గిరి నియోజకవర్గం మరోసారి తీవ్ర ఉత్కంఠకు వేదికగా మారింది.
వైసీపీ హయాంలో మంత్రిగా ఉన్న సమయంలో కొడాలి నాని అప్పటి ఎన్నికల కమిషనర్ నిమ్మగడ్డ రమేష్ కుమార్, అప్పటి ప్రతిపక్ష నేత నారా చంద్రబాబు నాయుడు, నారా లోకేష్‌లపై తీవ్రస్థాయిలో వ్యక్తిగత దూషణలు, అనుచిత వ్యాఖ్యలు చేశారనే ఆరోపణలు ఉన్నాయి. ఈ వ్యాఖ్యలు రాజ్యాంగ నిబంధనలకు, చట్టానికి వ్యతిరేకంగా ఉన్నాయంటూ దాఖలైన ఫిర్యాదులపై సుదీర్ఘంగా సమీక్షించిన ప్రభుత్వం.. తాజాగా ప్రాసిక్యూషన్‌కు గ్రీన్ సిగ్నల్ ఇవ్వడం గమనార్హం. దీనితో ఆయన అరెస్టయ్యే అవకాశాలున్నాయని అంటున్నారు.
కేసుకు కులాన్ని ఆపాదిస్తూ వైసీపీ నాయకులు అంబటి రాంబాబు, కొరసాల కన్నబాబు, తోట త్రిమూర్తులు వంటి పెద్దలు కాపు కుల మీటింగ్‌లు పెట్టాలని చూడటంపై తీవ్ర అభ్యంతరం వ్యక్తం చేశారు. సాయికృష్ణపై గతంలో దాదాపు 22 క్రిమినల్ కేసులు, పోక్సో చట్టం కింద కేసులు ఉన్నాయని, సమాజానికి హానికరమైన ఒక నేరచరిత్ర ఉన్న వ్యక్తిని తీసుకువచ్చి కాపు యువకుడిగా ముద్ర వేయడం ద్వారా మొత్తం కులానికి అప్రతిష్ట తెస్తున్నారని మండిపడ్డారు.
ఏపీ రాజకీయాల్లో గత కొన్నేళ్లుగా సాగుతున్న కులాల వ్యూహాలను విశ్లేషించారు. దేశంలో రాజ్యాంగం కల్పించిన రక్షణలు, సామాజిక మార్పుల వల్ల నేడు పల్లెల్లో సైతం కుల వివక్ష దాదాపు అంతరించిపోయిందన్నారు. కానీ.. ఒక వ్యూహం ప్రకారం కొన్ని రాజకీయ పార్టీలు నిర్దిష్ట సామాజిక వర్గాలను టార్గెట్ చేస్తూ, మిగిలిన వర్గాల్లో వారిపై ద్వేషం పెంచేలా వాటిని బూచి గా చూపిస్తూ రాజకీయ పబ్బం గుడుపుకోవాలని చూస్తున్నాయన్నారు.
ప్రముఖ సామాజిక విశ్లేషకుడు అడుసుమిల్లి శ్రీనివాసరావు తెలుగువన్ కు ఇచ్చిన ప్రత్యేక ఇంటర్వ్యూలో రుషికొండ ప్యాలెస్ విషయంలో ప్రభుత్వం తీసుకుంటున్న జాప్యంపై అసహనం వ్యక్తం చేశారు. గత ప్రభుత్వం ప్రజాధనంతో నిర్మించిన ఈ విలాసవంతమైన భవనాన్ని కేవలం ఆలోచనలకే పరిమితం చేయకుండా.. తక్షణమే ప్రజోపయోగంలోకి తీసుకురావాలన్నారు.
సచివాలయ ఉద్యోగాల రాత పరీక్షలో 1 నుంచి 8000 లోపు అత్యుత్తమ ర్యాంకులు సాధించిన అభ్యర్థులకు ఉద్యోగాలు దక్కలేదనీ, 8000 దాటి ఆ పైన దారుణమైన ర్యాంకులు వచ్చిన వారికి ఉద్యోగాలు కేటాయించారనీ, ఈ విషయాన్ని బాధితులే తనతో స్వయంగా చెప్పారనీ రవిశంకర్ అన్నారు.
ఆంధ్రప్రదేశ్ లో సాయి కృష్ణ అనుమానాస్పద లాకప్ డెత్ వ్యవహారం ఇప్పుడు రచ్చ లేపుతోంది. ఇప్పటికే కూటమి ప్రభుత్వం ఈ వ్యవహారంలో చర్యలు తీసుకుంది. కొంతమంది పోలీసులను సస్పెండ్ చేసింది.. విచారణకు ఆదేశించింది. ప్రభుత్వం చర్యలు తీసుకుంటుండగానే.. వైసిపి నాయకులు విమర్శలతో చెలరేగిపోయారు. వైసీపీ సీనియర్ నాయకుడు, మాజీమంత్రి అంబటి రాంబాబు అలవాటుగా తన నోటికి పని చెప్పారు
బీజేపీ, ఎన్‌డీఏ నైతిక మద్దతుతో ఇండిపెండెంట్ గా బరిలోకి దిగిన నత్వానీ.. ఇండియా కూటమికి గట్టి షాక్ ఇచ్చారు. అసెంబ్లీలో ప్రతిపక్షాల కంటే అధికార కూటమికే స్పష్టమైన సంఖ్యాబలం ఉన్నప్పటికీ, కాంగ్రెస్ అభ్యర్థి ప్రణవ్ ఝాను మట్టికరిపించి నత్వానీ విజేతగా నిలవడం హాట్ టాపిక్‌గా మారింది.
2024 ఎన్నికలలో పరాజయం తరువాత రాజకీయాలకు దూరంగా ఉంటానని ప్రకటించిన నాని.. ఇప్పుడు పొలిటికల్ గా యాక్టివ్ అవ్వడం సంచలనంగా మారింది.
 
Disclaimer:
All content included on this TeluguOne.com Portal including text, graphics, images, videos and audio clips, is the property of ObjectOne Information Systems Ltd. or our associates, and protected by copyright laws. The collection, arrangement and assembly of all content on this portal/ related channels is the exclusive property of ObjectOne Information Systems Ltd. or our associates and protected copyright laws.
 
You may not copy, reproduce, distribute, publish, display, perform, modify, create derivative works, transmit, or in any other way exploit any part of copyrighted material without permission from ObjectOne Information Systems Ltd or our associates.