కాంగ్రెస్, వైకాపాలకు కలిసివచ్చిన రుణమాఫీ వ్యవహారం

Publish Date:Jul 28, 2014

Advertisement

 

అత్యంత దయనీయ స్థితిలో ఉన్న రైతులను ఆదుకొనేందుకు తెదేపా వ్యవసాయ రుణాలను మాఫీ చేసేందుకు సిద్దపడింది. ఎన్నికల సమయంలో వాగ్దానం చేసినట్లుగానే అన్ని రకాల రుణాలను మాఫీ చేస్తున్నట్లు ప్రభుత్వం అధికారికంగా ప్రకటించింది. కానీ, కేంద్రం కానీ రిజర్వు బ్యాంకు గానీ ఈ విషయంలో రాష్ట్ర ప్రభుత్వానికి ఎటువంటి సహాయము చేసే పరిస్థితి కనబడకపోవడంతో ప్రభుత్వం ప్రత్యామ్నాయ మార్గాల కోసం తీవ్రంగా అన్వేషిస్తోంది. అందువల్ల రుణాల మాఫీలో జాప్యం అనివార్యం అవుతోంది.

 

తెదేపా చేతిలో ఓడిపోయినా కాంగ్రెస్, వైకాపాలకు ఇదొక ఆయచితవరంగా అందివచ్చింది. తను ముఖ్యమంత్రి అయ్యే అవకాశాన్ని గండికొట్టినందుకు చంద్రబాబుపై ప్రతీకార వాంఛతో రగిలిపోతున్న జగన్మోహన్ రెడ్డి అందివచ్చిన ఈ అవకాశాన్ని ఉపయోగించుకొంటూ చంద్రబాబు నాయుడు దిష్టిబొమ్మల దగ్దానికి పిలుపునిచ్చి, రైతుల రుణమాఫీ వ్యవహారాన్ని స్వార్ధ రాజకీయ ప్రయోజనాలకు ఉపయోగించుకొనగా, రాష్ట్ర విభజన చేసి రెండు రాష్ట్రాలలో చేతులు కాల్చుకొన్న కాంగ్రెస్ పార్టీ కూడా అందివచ్చిన ఈ అవకాశాన్ని ఉపయోగించుకొని మళ్ళీ బలం పుంజుకొనేందుకు సిద్దపడుతోంది.

 

వ్యవసాయ రుణాల మాఫీపై రాష్ట్ర ప్రభుత్వ వైఖరిని నిరసిస్తూ ఆగస్ట్ 4న ఆంద్రప్రదేశ్ లో అన్నిజిల్లాలలో కలెక్టర్ కార్యాలయాల ముందు కాంగ్రెస్ నేతలు, కార్యకర్తలు ధర్నాలు నిర్వహించాలని పీసీసీ అధ్యక్షుడు రఘువీరారెడ్డి పిలుపునిచ్చారు. రాష్ట్ర ప్రభుత్వం వ్యవసాయ ఋణాలపై ఎటువంటి షరతులు విదించినా, ఇంకా జాప్యం చేసినా తాము అంగీకరించబోమని, తక్షణమే వ్యవసాయ రుణాలన్నిటినీ మాఫీ చేయాలని ఆయన ప్రభుత్వాన్ని డిమాండ్ చేసారు.

 

రాష్ట్ర విభజన కారణంగా ప్రజాగ్రహానికి గురయ్యి రాష్ట్రంలో కనీసం ఒక్క యంపీ యం.యల్యే సీటు కూడా గెలుచుకోలేక, శాసనసభలో కానీ పార్లమెంటులో గానీ అడుగుపెట్టలేని అవమానకర పరిస్థితులను ఎదుర్కొంటున్న కాంగ్రెస్ పార్టీ, ఈవిధంగానయినా మళ్ళీ పార్టీశ్రేణుల్లో చైతన్యం నింపి ప్రజలకు చేరువవ్వాల్ని ఆరాటపడుతోంది. గత పదేళ్ళ కాంగ్రెస్ పాలనలో వ్యవసాయాన్ని పూర్తిగా నిర్లక్ష్యం చేసిన కారణంగానే నేడు రైతులు ఇటువంటి దీన స్థితిలో ఉన్నారు. కానీ ఆసంగతి మరిచిపోయిన కాంగ్రెస్ పార్టీ రైతుల సంక్షేమం కోసమే ఆరాటపడుతున్నట్లు వ్యవసాయ రుణాల మాఫీపై ఆందోళనలకు సిద్దమవుతోంది.

 

ఈవిధంగా వైకాపాను చూసి కాంగ్రెస్, కాంగ్రెస్ ను చూసి వైకాపాలు పోటాపోటీగా రుణమాఫీపై ఉద్యమాలకు సిద్దమవుతూ సున్నితమయిన ఈ సమస్యను తమ రాజకీయ లబ్ధికి ఉపయోగించుకోవాలని ఆరాటపడుతున్నాయి. కానీ తమ పోరాటం కేవలం రైతుల ప్రయోజనాలు కాపాడేందుకేనని నమ్మబలుకుతున్నాయి. వారి ఉద్యమాలలో నిజాయితీ లేకపోయినప్పటికీ, అవి ప్రభుత్వంపై మరింత ఒత్తిడి పెంచడం ఖాయం గనుక రాష్ట్ర ప్రభుత్వం ఈ రుణమాఫీ వ్యవహారానికి వీలయినంత త్వరగా ఒక పరిష్కారం కనుగొనవలసి ఉంది.

By
en-us Political News

  
ప్రశ్న రావణ్ విషయంలో పూటకోమాట, రోజుకో స్టాండ్ అన్నట్లుగా వ్యవహరించి వరుసగా సెల్ఫ్ గోల్స్ చేసుకుంటూ పోయింది.
దివంగత ముఖ్యమంత్రి, తెలుగుదేశం వ్యవస్థాపకుడు నందమూరి తారకరామారావు మనవడు, మాజీ మంత్రి దగ్గుబాటి వెంకటేశ్వరరావు,  ప్రస్తుత బీజేపీ ఎంపీ పురందేశ్వరిల కుమారుడు దగ్గుబాటి హితేష్ చెంచురాం త్వరలోనే తెలుగుదేశం పార్టీలో చేరబోతున్నట్లు సమాచారం
గతంలో అంటే జగన్ హయాంలో అభివృద్ధి అంటే సచివాలయ భవనాలు, రైతు భరోసా కేంద్రాలు అన్న పరిస్థితి నుంచి ప్రస్తుత తెలుగుదేశం కూటమి ప్రభుత్వం.. పెద్ద ఎత్తున మౌలిక వసతుల కల్పన, రాజధాని అమరావతి నిర్మాణం, పోలవరం ప్రాజెక్టు పనుల పరుగులతో నిజమైన అభివృద్ధి జనం కళ్లకు కనిపించేలా చేస్తోంది.
ఇటీవలి కాలంలో కాపు సామాజికవర్గం కేంద్రంలో పార్టీలో జరుగుతున్న పరిణామాలను ఉదహరిస్తూ.. జగన్ బోత్సనుపక్కన పెట్టడానికి అనారోగ్యం ఒక్కటే కారణం కాదని విశ్లేషిస్తున్నారు. తమ విశ్లేషణకు రుజువుగా, బీజేపీ సీనియర్ నాయకుడు సోము వీర్రాజు ఇటీవల ఒక సందర్భంలో వైసీపీలో కాపు సామాజిక వర్గానికి ప్రాధాన్యత తగ్గుతోందంటూ చేసిన వ్యాఖ్యలను చూపుతున్నారు. ఇక బొత్స స్థానంలో మండలిలో విపక్ష నేత పదవిని ఒక మహిళా నేతకు కట్టబెట్టాలన్న ఉద్దేశంతో జగన్ ఉన్నట్లు వైసీపీ వర్గాలలో టాక్ నడుస్తోంది.
గత అసెంబ్లీ ఎన్నికల్లో వైఎస్సార్సీపీ కేవలం 11 స్థానాలకే పరిమితమై అధికారానికి దూరమవ్వడమే కాకుండా, కనీసం ప్రతిపక్ష హోదాకు కూడా నోచుకోని సంగతి తెలిసిందే. అంతటి ఘోర పరాభవం ఎదురైనా జగన్ తీరులో మార్పు రాలేదన్న అసంతృప్తి వైసీపీ నేతలలో ప్రస్ఫుటంగా కనిపిస్తోంది.
ప్రకృతి గర్భంలో దాగి ఉన్న కొన్ని రహస్యాలు సైన్స్‌కు కూడా సవాల్ విసురుతుంటాయి.
భవిష్యత్ లో జగన్.. సపోజ్ ఫర్ సపోజ్ అధికారంలోకి వస్తే.. అమరావతిలో ప్రస్తుత ప్రభుత్వం నిర్మించిన భవనాలను వినియోగంలోకి తీసుకువచ్చే అవకాశాలు లేవని విశ్లేషిస్తున్నారు.
మచిలీపట్నం, విజయవాడ, గుంటూరు ప్రాంతాలను కలుపుతూ ఈ సరికొత్త రాజధాని నమూనాను ఆయన తొలిసారి ప్రస్తావించినప్పుడు.. అన్ని వర్గాల నుంచీ తీవ్ర వ్యతిరేకత రావడమే కాకుండా, నెటిజనులు జనగ్ ను ఓ రేంజ్ లో ట్రోల్ చేశారు. అయినా తాను పట్టిన కుందేటికి మూడేకాళ్లన్నట్లుగా జగన్ మావిగన్ ను వదల లేదు.
పెద్దిరెడ్డి కి వ్యతిరేకంగా చెవిరెడ్డి పావులు కదుపుతున్నట్లు వైసీపీలోనే ప్రచారం నడుస్తోంది. కుప్పంలో చంద్రబాబుని, హిందూపురంలో బాలకృష్ణని ఓడించడానికి అప్పట్లో పెద్దిరెడ్డి చేయని ప్రయత్నం లేదు. జగన్ ఫుల్ సపోర్ట్ ఆయనకి ఉండటంతో అప్పట్లో జిల్లా నేతల్లో ఎవరూ అయన్నివ్యతిరేకించే సాహసం చేయలేకపోయారు.
తాజాగా కిషన్ రెడ్డి చేసిన వ్యాఖ్యలు రాజకీయంగా అత్యంత ప్రాధాన్యత సంతరించుకున్నాయి. మోడీ కేబినెట్ ప్రక్షాళనలో డీకే అరుణకు మంత్రివర్గంలో స్థానం దక్కే అవకాశం ఉందని కిషన్ రెడ్డి అన్నారు.
ఆంధ్రప్రదేశ్ రాజకీయాల్లో ఇప్పుడు గవర్నర్ కోటా ఎమ్మెల్సీ స్థానాల భర్తీ అంశం హాట్ టాపిక్‌గా మారింది. ప్రస్తుతం వైసీపీ తరపున గవర్నర్ కోటాలో నామినేట్ అయిన జకియా ఖానం, పందుల రవీంద్రబాబుల పదవీ కాలం నెల రోజుల్లో ముగియనుంది. దీనితో ఖాళీ అవుతున్న ఆ రెండు ఎమ్మెల్సీ స్థానాలను తెలుగుదేశం కూటమి దక్కించుకోనుంది.
ఆంధ్రప్రదేశ్‌లోనే ఎన్నో ఆలయాలు నిధులు లేక, ధూపదీప నైవేద్యాలు కరవై శిథిలావస్థకు చేరుకుంటుంటే.. పక్క రాష్ట్రమైన తెలంగాణలో ఆలయాలకు శ్రీవాణి నిధులు కేటాయించడమేంటన్న విమర్శలు వెల్లువెత్తున్నాయి. గతంలో కొండగట్టు వంటి తెలంగాణ ఆలయాలకు టిటిడి నిధులు ఇవ్వడంపై అక్కడి కొందరు మంత్రులు చేసిన వ్యాఖ్యలను గుర్తుచేస్తూ.. ఇప్పుడు ఏపీ ప్రభుత్వం తెలంగాణ ఆలయాల అభివృద్ధికి ఏపీ నిధులు ఎందుకు కేటాయించాలంటూ సోషల్ మీడియాలో విమర్శలు పెద్ద ఎత్తున వెల్లువెత్తుతున్నాయి.
ముఖ్యంగా తెలుగుదేశం కూటమి భాగస్వామ్య పక్షమైన జనసేన రాష్ట్రంలో మరింత బలోపేతం కావడమే లక్ష్యంగా కార్యాచరణ రూపొందిస్తోంది. ప్రణాళికా బద్ధంగా పావులు కదుపుతోంది. ఇందులో భాగంగానే గత ఎన్నికలలో ఘోర పరాజయంతో కుదేలై ఉన్న వైసీపీని మరింత బలహీన పరిచే దిశగా వ్యూహాలు రచిస్తోంది.
 
Disclaimer:
All content included on this TeluguOne.com Portal including text, graphics, images, videos and audio clips, is the property of ObjectOne Information Systems Ltd. or our associates, and protected by copyright laws. The collection, arrangement and assembly of all content on this portal/ related channels is the exclusive property of ObjectOne Information Systems Ltd. or our associates and protected copyright laws.
 
You may not copy, reproduce, distribute, publish, display, perform, modify, create derivative works, transmit, or in any other way exploit any part of copyrighted material without permission from ObjectOne Information Systems Ltd or our associates.