కాంగ్రెస్ పార్టీకి మిత్ర లాభం
Publish Date:Jun 28, 2013
Advertisement
మూడు నెలల క్రితం వరుసపెట్టి వెలుగు చూసిన కుంభ కోణాలతో, మంత్రులపై అవినీతి ఆరోపణలతో, సుప్రీంకోర్టు మొట్టికాయలతో పీకలలోతు కష్టాలలోకి కూరుకుపోయిన కాంగ్రెస్ పార్టీకి మళ్ళీ మంచి రోజులు వచ్చినట్లే ఉన్నాయి. కాంగ్రెస్ పార్టీ దాదాపు రెండు దశాబ్దాల తరువాత మళ్ళీ మొన్న కర్ణాటకలో అధికారంలోకి రాగలిగింది. ఇక, మోడీ కారణంగా బీజేపీకి రాం రాం చెప్పేసిన నితీష్ కుమార్ కి శాసనసభలో బల నిరూపణ సమయంలో మద్దతు ప్రకటించి, జేడీ(యు) తో స్నేహ సంబంధాలు చిగురింపజేసుకోగలిగింది. అదే సమయంలో మోడీ కారణంగానే, అద్వానీ పార్టీపై అలిగి రాజీనామా చేయడంతో, ఆ పార్టీలో అంతర్గత కలహాలు ఒక్కసారిగా బయటపడటంతో కాంగ్రెస్ పార్టీలో ఆత్మవిశ్వాసం ఒక్కసారిగా పెరిగిపోయింది. మున్ముందు మోడీ కారణంగానే ఆ పార్టీకి తన చేతిలో ఓటమి తప్పదని కాంగ్రెస్ బలంగా నమ్ముతోందిపుడు. ఇక, నిన్న తమిళనాడులో ఆరు రాజ్యసభ సీట్లకి జరిగిన ఎన్నికలలో, కాంగ్రెస్ తెలివిగా వ్యవహరించి, కొద్ది నెలల క్రితం తనకు కటీఫ్ చెప్పి వెళ్ళిపోయిన కరుణానిధి కుమార్తె కనిమోలికి తమ 5 వోట్లు వేసి ఆమెకు మళ్ళీ రాజ్యసభ యోగం కల్పించడం ద్వారా పెద్దాయనను మంచి చేసుకొనగలిగింది. తద్వారా, మళ్ళీ తమ రెండు పార్టీల మద్య సంబంధాలు సరిచేసుకొని రానున్న ఎన్నికల పొత్తులకి ఇప్పటి నుండే రంగం సిద్దం చేసుకొంది. తరువాత, తెలంగాణా అంశంపై ఆ పార్టీ ప్రస్తుతం ఏదో పెద్ద ఉపాయమే ఆలోచిస్తున్నట్లు అర్ధం అవుతోంది. తద్వారా ఆంద్రప్రదేశ్ లో కూడా విజయపతాకం ఎగురవేయాలని ఉవ్విళ్ళూరుతోంది.
http://www.teluguone.com/news/content/congress-39-23929.html