రాష్ట్ర విభజనపై కాంగ్రెస్ నిర్ణయం ప్రకటించగలదా

Publish Date:Jul 12, 2013

Advertisement

 

ఒక్క కాంగ్రెస్ అధిష్టానం తప్ప మిగిలిన వారందరూ కూడా రాష్ట్ర విభజనపై ప్రకటనకి ఈరోజు సుమూహుర్తమని భావిస్తున్నారు. అయితే, సమైక్యమా లేక విభజనా? అనే రెండే ప్రత్యమ్నాయాలు తమ ముందు ఉన్నాయని దిగ్విజయ్ సింగ్ చెప్పడం చూస్తే, కాంగ్రెస్ పార్టీకి ఇన్నేళ్ళ తరువాత జ్ఞానోదయం అయినట్లే కనిపిస్తోంది. రాష్ట్ర విభజనపై కాంగ్రెస్ అధిష్టానం ఇప్పటికే ఒక నిర్దిష్ట అభిప్రాయానికి వచ్చినప్పటికీ, తను ప్రకటించే నిర్ణయంతో రాష్ట్రంలో తనకే పూర్తి ప్రయోజనం పొందాలనే దురాశాతోనే ఇంత కాలం జాప్యం చేస్తోంది.

 

కాంగ్రెస్ తెరాసను లొంగదీయడానికి ప్రయత్నిస్తుంటే, ఎట్టి పరిస్థితుల్లో దాని గాలానికి చిక్కుకోకూడదనే ఆలోచనతో కేసీఆర్ మళ్ళీ తన మౌనదీక్షను మొదలుపెట్టాడు. ఒకప్పుడు తెరాసను పార్టీలో విలీనం చేసుకొందామని భావించిన కాంగ్రెస్, ఆ తరువాత కేసీఆర్, అతని కుటుంబాన్నిభరించడం కష్టమనుకొంది. మళ్ళీ మనసు మార్చుకొని ఇప్పుడు విలీనం కోసం ఒత్తిడి తెస్తోంది. కాంగ్రెస్ తెలంగాణా ఇచ్చినప్పటికీ, తెరాసను పార్టీలో కలుపుకోకుండా వదిలిపెడితే, మళ్ళీ కేసీఆర్ ఆ క్రెడిట్ మొత్తం ఎక్కడ క్లెయిం చేసుకొంటాడో అనే భయం ఉండటం వలన తెలంగాణ ప్రకటనకి ముందుగానే అతనిని లొంగ దీసుకోవాలని విశ్వప్రయత్నాలు చేస్తోంది. రాష్ట్ర విభజనలో అతిముఖ్యమయిన ‘హైదరాబాద్’ అంశాన్ని అడ్డుపెట్టుకొని అతనిని లొంగదీయాలని ప్రయత్నిస్తునట్లు సమాచారం. ఒకవేళ అప్పటికీ లొంగకపోతే, రాష్ట్ర విభజన చేస్తూ హైదరాబాదును ఉమ్మడి రాజధానిగా చేసి, కేంద్రపాలిత ప్రాంతంగా ప్రకటించాలని కాంగ్రెస్ ఆలోచిస్తోంది.

 

‘యావత్ రాష్ట్ర ప్రజల, దేశ ప్రయోజనాలను దృష్టిలో ఉంచుకొని నిర్ణయం తీసుకొంటామని’ నిన్న దిగ్విజయ్ సింగ్ చెప్పడం బహుశః అదే సూచిస్తోంది. హైదరాబాద్ కోసం పట్టుబడుతున్నసీమంధ్ర నేతలు దానిని ఉమ్మడి రాజధాని చేస్తే, విభజనకు అభ్యంతరం చెప్పకపోవచ్చు. అదే విధంగా సీమంధ్రకు కొత్త రాజధాని ఏర్పాటు చేసుకొనేవరకు హైదరాబాదును ఉమ్మడి రాజధానిగా ఉంచేందుకు తెలంగాణావాదులు కూడా అభ్యంతరం వ్యక్తం చేయకపోవచ్చును. కేసీఆర్ గనుక లొంగకపోతే అందరికీ ‘ఆమోద యోగ్యమయిన ఈ నిర్ణయం’ ప్రకటించి, ఒకవైపు తెలంగాణా ఇచ్చిన క్రెడిట్ తన ఖాతాలో వ్రాసుకొంటూనే, రాజధాని విషయంలో కేసీఆర్ ను దోషిగా నిలబెట్టే ప్రయత్నం చేయవచ్చును.

 

అయితే, దానివల్ల కేసీఆర్ కి పెద్దగా వచ్చే నష్టం ఏమి ఉండదు, పైగా హైదరాబాద్ కోసం మరో ఉద్యమం చేసుకొనే గొప్ప అవకాశం అందిస్తుంది. తద్వారా ఇంత వరకు తెలంగాణా సెంటిమెంటుతో దూసుకుపోతున్న కేసీఆర్ రేపు రానున్నఎన్నికలకి హైదరాబాద్ సెంటిమెంటుతో బరిలోకి దిగవచ్చును.

 

ఇక కాంగ్రెస్ తెలంగాణా ప్రక్రియను మొదలుపెడితే, ఇంత కాలం దానికోసమే ఉద్యమాలు చేస్తున్న తెరాస అది తమ పోరాటాల ఫలితంగానే ఏర్పడుతోందని అందులో కాంగ్రెస్ గొప్పతనం ఏమీ లేదని చాటింపు వేసుకొని ఎన్నికలలో ఓట్లు రాబట్టుకోగలదు.

 

కేసీఆర్ ప్రధాన లక్ష్యం తెలంగాణా రాష్ట్రం ఏర్పాటే గనుక, ఒకసారి అది ఏర్పడిన తరువాత ఇక కొత్త రాష్ట్రంలో నిశ్చింతగా రాజకీయాలు చేసుకొంటూ కాంగ్రెస్ తో సహా అన్నిపార్టీలకు అధికారం దక్కకుండా అడ్డుపడగలడు. అందుకే కాంగ్రెస్ అతనిని ముందుగానే లొంగ దీసుకోవాలని ప్రయత్నిస్తుంటే, కాంగ్రెస్ ను తప్పించుకోవడానికే కేసీఆర్ మౌనవ్రతం కంటిన్యూ చేస్తున్నాడు. తన ప్రమేయం లేకుండా తెలంగాణాపై నిర్ణయం జరుగుతున్నపటికీ ఆయన దూరంగా ఉండటం వలన, ఆ ప్రక్రియలో కాంగ్రెస్ చేసే పొరపాట్లకు అతను బాధ్యుడు కాకుండా తప్పించుకోవడమే కాకుండా, వాటినే తన అస్త్రాలుగా మార్చుకొని రేపు జరిగే ఎన్నికలలో కాంగ్రెస్ పార్టీని డ్డీ కొనవచ్చును.

 

ఈవిధంగా కాంగ్రెస్ తెరాసలు రెండూ కూడా తెలంగాణా అంశంపై పూర్తి ప్రయోజనం పొందాలని తీవ్ర ప్రయత్నాలు చేస్తున్నాయి. మరి ఈ రోజు కాంగ్రెస్ పార్టీ దైర్యం తెచ్చుకొని తెలంగాణాపై సానుకూల ప్రకటన చేస్తుందో లేక కేసీఆర్ తో తన రాజకీయ చదరంగం కొనసాగిస్తుందో చూడాలి.

By
en-us Political News

  
ఎన్నికల వేళ జగన్ కు షాకుల మీద షాకులు తగులుతున్నాయి. ఇన్నాళ్లే జగన్ మాటే శాసనం అన్నట్లుగా అణిగిమణిగి ఉన్న వారంతా సరిగ్గా ఎన్నికల ముంగిట ధిక్కార స్వరం వినిపిస్తున్నారు. పార్టీపై తిరుగులేని పట్టు ఉందని భావిస్తున్న జగన్ కు ఆ పట్టు జారిపోవడం కళ్లముందు కనిపించేలా చేస్తున్నారు. టికెట్ నిరాకరించిన, సిట్టింగ్ స్థానాన్ని మార్చిన ఎమ్మెల్యేలు, ఎంపీలు ఇప్పటికే పార్టీని వీడి వలసబాట పట్టారు.
సంసారంలో నిస్సంగత్వంతో ఎలా జీవించాలో గురువు బోధిస్తాడు. మనల్ని సంసారబంధాల నుండి విముక్తుల్ని చేయడానికి తోడ్పడతాడు. కానీ అనేక జన్మల సంస్కారాల వల్ల మనలో సంసారాసక్తి సన్నగిల్లకపోవడంతో గురుబోధ అవగాహన చేసుకొనే మనోపరిపక్వత కలగదు.
ఏద‌యినా ఒక వ‌స్తువు ఇంట్లోంచి పోయిందంటేనే ఎంతో బాధ‌గా వుంటుంది. ఎంతో ఇష్ట‌ప‌డి కొనుక్కున్న వ‌స్తువు చేజారి ప‌డి ప‌గిలిపోయినా, దొంగ‌త‌నం జ‌రిగినా, ఎక్క‌డో మ‌ర్చిపోయినా చాలా బాధేస్తుంది. దాన్ని తిరిగి పొంద‌లేమ‌ని దిగులు ప‌ట్టుకుం టుంది. కానీ 101 ఏళ్ల చార్లెటి బిషాఫ్ కు ఎంతో ఇష్ట‌మ‌యిన పెయింటింగ్ రెండో ప్ర‌పంచ యుద్ధ స‌మ‌యంలో దూర‌మ‌యింది. 80 ఏళ్లు దాని కోసం ఎదురు చూడ‌గ‌లి గింది. అదంటే మ‌రి ఆమెకు ప్రాణ స‌మానం. చాలా కాలం దొరుకుతుంద‌ని, త‌ర్వాత ఇక దొర‌కదేమో అనీ ఎంతో బాధ‌పడింది. ఫిదా సినిమాలో హీరోయిన్ చెప్పినట్లు ఆమె గట్టిగా అనుకుని ఉంటుంది. అందుకే కాస్త ఆలస్యమైనా.. కాస్తేంటి ఎనిమిది దశాబ్దాలు ఆలస్యమైనా ఆమె పెయింటింగ్ ఆమెకు దక్కింది. ఆ పెయింటింగ్ గ‌తేడాది ఆమెను చేరింది.
ఓ వంక ఐదు రాష్ట్రాల అసెంబ్లీ ఎన్నికలు జరుగుతుంటే, మరో వంక జాతీయ స్థాయిలో, బీజేపీ, కాంగ్రెస్ పార్టీలకు తృతీయ ప్రత్యాన్మాయంగా థర్డ్ ఫ్రంట్ ఏర్పాటు ఆలోచనలు  జోరందుకున్నాయి. ఇటీవల కాంగ్రెస్ పార్టీకి రాజీనామా చేసిన ఆ పార్టీ సీనియర్ నాయకుడు, పీసీ చాకో, నేషనలిస్ట్ కాంగ్రెస్ పార్టీ(ఎన్సీపీ)లో చేరారు...
తెలంగాణ  రాష్ట్ర బడ్జెట్ 2021-22ను ఆర్థిక మంత్రి హరీష్ రావు, ఈ నెల18న సభలో ప్రవేశ పెడతారు.కరోనా కారణంగా, ప్రస్తుత ఆర్థిక సంవత్సరం (2020-21)లో ఎదురైన ఆర్థిక ఇబ్బందుల నేపధ్యంగా ప్రవేశపెడుతున్న బడ్జెట్ కావడంతో  సహజంగానే అందరిలోనూ ఆసక్తి నెలకొంది...
అబద్ధాలు, అర్థ సత్యాలు, వ్యక్తిగత దూషణలు, అర్ధంపర్ధం లేని ఆరోపణలతో సుమారు నెలరోజులకు పైగా తెలంగాణలో సాగుతున్న పట్టభద్రుల ఎమ్మెల్సీ ఎన్నికల ప్రచారానికి శుక్రవారం సాయంత్రంతో  తెర పడింది.రాష్ట్రంలోని మహబూబ్‌నగర్‌-హైదరాబాద్‌-రంగారెడ్డి పట్టభద్రుల నియోజకవర్గంతో పాటుగా,నల్లగొండ-ఖమ్మం-వరంగల్‌ స్థానానికి ఫిబ్రవరి 16 తేదీన నోటిఫికేషన్ వెలువడినా, ఎన్నికల ప్రచారం మాత్రం అంతకు చాలా ముందే అభ్యర్ధుల స్థాయిలో స్థానికంగా ఎన్నికల ప్రచారం ప్రారంభమైంది. 
​సహజంగా కష్టాల్లో ఉన్నపుడు ఎవరికైనా దేవుడు గుర్తు వస్తారు. లౌకిక వాద రాజకీయ నాయకులకు అయితే హటాత్తుగా  తాము హిందువులం అనే విషయం జ్ఞప్తికి వస్తుంది. పశ్చిమ బెంగాల్ ముఖ్యమంత్రి, తృణమూల్ పార్టీ అధినాయకురాలు మమతా బెనర్జీకి   కూడా తానూ హిందువును అనే విషయం ఇప్పుడు గుర్తుకొచ్చింది.
దేశంలోని ఉత్తరాది రాష్ట్రాలలో అటు కాంగ్రెస్ ఇటు స్థానికంగా ఉన్న ప్రాంతీయ పార్టీలను మట్టి కరిపిస్తూ అధికారాన్ని కైవసం చేసుకుంటున్న బీజేపీ.. దక్షిణాదికి వచ్చేసరికి ఒక్క కర్ణాటకలో తప్ప ఇతర రాష్ట్రాలలో ఎన్ని ప్రయత్నాలు చేసినా ఏమాత్రం సక్సెస్ కాలేకపోతోంది...
జయలలిత జీవించి ఉన్నత కాలం, ఆమె నెచ్చలిగా పేరొందిన శశికళ, తమిళ రాజకీయాల్లో ఓ వెలుగువెలిగారు. కొన్ని విషయాల్లో జయలలిత కంటే, ఆమె మోర్ పవర్ఫుల్ లేడీ అనిపించుకున్నారు. ముఖ్యమంత్రులు, మంత్రులు కూడా ఆమె ముందు చేతులు కట్టుకుని నిలుచున్నారు.ఆమెకు పాదాభివందనాలు చేశారు.
కాంగ్రెస్ పార్టీలో రగులుతున్న అంతర్యుద్ధం కొత్త పుంతలు తొక్కుతోంది. మరిన్ని మలుపులు తిరుగుతోంది.ఇటీవల జమ్మూలో సమావేసమైన జీ 23 నాయకులు  అసమ్మతి స్వరాన్ని పెంచారు...
పంచతంత్రంగా పిలుచుకుంటున్న ఐదు రాష్టాల అసెంబ్లీ ఎన్నికల్లో అద్భతం జరగబోతోంది. కేంద్ర ఎన్నికల సంఘం నాలుగు రాష్ట్రాలు, కేంద్రపాలిత ప్రాంతం పుదుచ్చేరి అసెంబ్లీ ఎన్నికల షెడ్యూలు ప్రకటించిన వెంటనే, వివిధ సంస్థలు అసెంబ్లీ ఎన్నికలు జరిగే  అస్సాం. పశ్చిమబెంగాల్, తమిళనాడు రాష్ట్రాలతో పాటుగా కేరళలోనూ ఒపీనియన్ పోల్స్ నిర్వహించాయి...
కేంద్ర ఎన్నికలసంఘం ‘పాంచ్ పటాక’ గంట కొట్టింది. అస్సాం, పశ్చిమ బెంగాల్, కేరళ, తమిళనాడు రాష్ట్రాలు, పుదుచ్చేరి కేంద్ర పాలిత ప్రాంతాల అసెంబ్లీ ఎన్నికల షెడ్యూలును కేంద్ర ఎన్నికల సంఘం విడుదలచేసింది. ఎన్నికల గంట మోగడంతో మొదలైన మరో భారత ‘మినీ’  సంగ్రామానికి మే 12 తేదీన జరిగే ఓట్ల లెక్కింపుతో తెర పడుతుంది.ఈలోగా వివిధ అంచల్లో పోలింగ్ జరుగుతుంది.  
నాలుగు రాష్టాలు అస్సాం, పశ్చిమ బెంగాల్ తమిళనాడు,కేరళ, కేంద్ర పాలిత ప్రాంతం పుదుచ్చేరి శాసన సభలకు  మరో రెండు నెలల్లో ఎన్నికలు జరుగుతాయి. ఇది అందరికీ తెలిసిన విషయం.
 
Disclaimer:
All content included on this TeluguOne.com Portal including text, graphics, images, videos and audio clips, is the property of ObjectOne Information Systems Ltd. or our associates, and protected by copyright laws. The collection, arrangement and assembly of all content on this portal/ related channels is the exclusive property of ObjectOne Information Systems Ltd. or our associates and protected copyright laws.
 
You may not copy, reproduce, distribute, publish, display, perform, modify, create derivative works, transmit, or in any other way exploit any part of copyrighted material without permission from ObjectOne Information Systems Ltd or our associates.