కాంగ్రెస్-వైకాపా-తెరాసలు రహస్య ఒప్పందం చేసుకోన్నాయా?

Publish Date:May 22, 2013

Advertisement

 

తెలంగాణా విషయం తేల్చమంటూ కాంగ్రెస్ యంపీలు తమ అధిష్టానానికి ఈ నెలాకరు వరకు గడుపు విదించచారు. మరో వైపు తెరాస అధినేత కేసీఆర్ తో మంతనాలు మొదలుపెట్టి, ఆపార్టీలో చేరేందుకు జూన్ 3వ తేదీకి ముహూర్తం కూడా పెట్టేసుకొన్నారు. అయినా, కాంగ్రెస్ అధిష్టానం నుండి కనీస స్పందన కూడా లేదింత వరకు. కానీ, పీసీసీ అధ్యక్షుడు బొత్స సత్యనారాయణ మాత్రం ‘పార్టీని వీడి వెళ్ళేవారిని పట్టుకొని వ్రేలాడలేము కదా’ అని వ్యాక్యానించడం పార్టీ అధిష్టానం అభిప్రాయానికి అద్దం పడుతున్నట్లుంది. తమ యంపీలు పార్టీ వీడి వెళ్లిపోయేందుకు సిద్దంగా ఉన్నారని కాంగ్రెస్ అధిష్టానానికి తెలిసినా అది పట్టించుకోవడం లేదంటే, అది ఉద్దేశ్యపూర్వకంగానే వదులుకొనేందుకు నిర్ణయించుకొనట్లు అర్ధం అవుతుంది.

 

ఇప్పుడు మనం కొంచెం ఫ్లాష్ బ్యాకులోకి వెళితే, కొన్నినెలల క్రితం తెలంగాణా కోసం లాబీయింగ్ చేయడానికని డిల్లీ వెళ్ళిన కేసీఆర్ కనబడతారు. అక్కడ దాదాపు నెలరోజులు మకాం వేసిన ఆయన తమ పార్టీని కాంగ్రెస్ లో విలీనం చేయాడానికి కాంగ్రెస్ అధిష్టానంతో చర్చలు సాగించిన సంగతి కూడా మనకి కనబడుతుంది. కానీ, అవి బెడిసి కొట్టాయని ఆయనే ఆ తరువాత స్వయంగా ప్రకటించారు.

 

ఇదంతా కూడా కాంగ్రెస్-తెరాసల వ్యూహంలో భాగమే అయిఉండవచ్చునేమో! రాబోయే ఎన్నికలలో రాష్ట్రంలో, కేంద్రంలో అధికారంలోకి రావాలంటే కాంగ్రెస్ పార్టీకి తెరాస మద్దతు అత్యవసరమని తెలుసు. ఆ పార్టీ మద్దతు లేనిదే తెలంగాణాలో ఆశించినమేర సీట్లు రావని కూడా తెలుసు. అదేవిధంగా తెలంగాణాలో జగన్ మరియు చంద్రబాబులను నిలువరించాలంటే తప్పని సరిగా తెరాసతో చేతులు కలపాలి. అప్పుడే తెలంగాణాలో ఎన్నికలు ఏకపక్షం అవుతాయి. లేకుంటే ఆ నాలుగు పార్టీలమధ్య ఓట్లు చీలక తప్పదు.

 

కనుక, ఆ పార్టీలు తెర వెనుక చేతులు కలిపినప్పటికీ పైకి ఒకరినొకరు తిట్టుకొంటూ బద్ధ శత్రువులు లాగ ప్రవర్తిస్తుండవచ్చును. ఆ వ్యూహంలో భాగంగానే కేంద్ర కాంగ్రెస్ మంత్రులు అప్పుడప్పుడు అగ్నికి ఆజ్యం పోస్తూ తెలంగాణపై అసందర్భ వ్యాక్యలు చేస్తుండి ఉండవచ్చును.

 

మొన్న కేశవ్ రావు డిల్లీలో సోనియా గాంధీని కలిసి వచ్చిన తరువాత తెలంగాణాతో సహా అన్ని విషయాలపై కూలకుషంగా చర్చించామని, ఆ చర్చలతో తానూ చాలా సంతృప్తి చెందానని చెప్పిన రెండు రోజులకే, ఏఐసీసి ప్రతినిధి పీసీ చాకో ‘తెలంగాణా అంశం అసలు యుపీయే ఎజెండాలోనే లేదని’ ఒక అసందర్భ ప్రకటన చేయడం, వెంటనే తెరాస అధినేత కేసీఆర్ కాంగ్రెస్ యంపీలతో భేటీ అవడం, వారు పార్టీ మారుతారని ప్రకటించడం, అయినా కాంగ్రెస్ అధిష్టానం ఇంతవరకు స్పందించకపోవడం గమనిస్తే ఇదంతా చాలా నాటకీయంగా జరుగుతున్నట్లు అర్ధం అవుతుంది.

 

కాంగ్రెస్, తెరాసలు ప్రస్తుతం బద్ధ శత్రువులుగా నటిస్తూ కత్తులు దూసుకొంటున్నపటికీ, తెలంగాణా ప్రాంతం నుండి తెదేపా, వైయస్సార్ కాంగ్రెస్ పార్టీలను దూరం పెట్టేందుకు తెర వెనుక చేతులు కలుపుతున్నట్లు కనిపిస్తోంది. సరిగ్గా ఎన్నికల ముందుగానో, తరువాతనో కాంగ్రెస్ పార్టీ తెలంగాణా అనుకూలంగా ఒక ప్రకటన చేసి, అప్పటి రాజకీయ పరిస్థితులను బట్టి ఆ రెండు పార్టీలు ఎన్నికల పొత్తులు పెట్టుకోవడమో లేకపోతే తెరాస వెళ్లి కాంగ్రెస్ పార్టీలో కలిసి పోవడమో జరిగినా ఆశ్చర్యం లేదు.

 

తద్వారా తెరాసకు తెలంగాణా సాదించిన ఘనతను కాంగ్రెస్ అప్పగిస్తే, రాష్ట్రంలో, కేంద్రంలో ప్రభుత్వం ఏర్పరచేందుకు తెరాస కాంగ్రెస్ పార్టీకి సహకరించేలా ఆ రెండు పార్టీల మద్య రహస్య ఒప్పదం జరిగి ఉండవచ్చును. ఈ రహస్య ఒప్పందం గురించి మొన్న కేశవ్ రావుకి, అంతకు ముందు తెలంగాణా కాంగ్రెస్ యంపీలకు కాంగ్రెస్ అధిష్టానం వివరించబట్టే వారిలో కొందరు అకస్మాతుగా నిశబ్ధం అయిపోగా మరికొందరు ఆ వ్యూహంలో భాగంగా త్వరలో కాంగ్రెస్ పార్టీని వీడి తెరాసలో చేరుతున్నట్లు చాటింపు వేసుకొంటున్నారేమో.

 

అంతిమంగా కాంగ్రెస్, తెరాసలు రెండూ కలిసిపోయినప్పుడు తెలంగాణా కాంగ్రెస్ యంపీలందరు మళ్ళీ ఎటూ కాంగ్రెస్ సముద్రంలోనే తేలుతారు గనుక, రెండు పార్టీల వ్యూహ ప్రకారం వారు కాంగ్రెస్ లోంచి తెరసలోకి దూకుతున్నట్లు నటిస్తున్నారేమో. ఈ లోగా కేసీఆర్ ‘మనకి ఆంధ్రా పార్టీలు వద్దంటూ’ ప్రచారం మొదలుపెట్టి తెదేపా, వైకాపాలపై ‘సీమాంధ్ర ముద్ర’ వేసి వాటిని తెలంగాణా నుండి బయటకి పంపే ప్రయత్నాలు కూడా చేస్తున్నారు.

 

ఒకవేళ కేసీఆర్ రహస్య ఒప్పందం ప్రకారం నడుచుకోకపోతే కాంగ్రెస్ పార్టీ తన చేతిలో ఉన్న చిలుకలను ఆయనపైకి విడిచే అవకాశం కూడా ఉంది. ఇప్పటికే, తెరాసను వీడిన రఘునందన్ రావు తెరాస నేతల అవినీతి భాగోతాల చిట్టాలను సీబీఐ చేతిలో పెట్టి వచ్చారు గనుక, ఏ కారణం చేతయినా తెరాస నేతలు తోక జాడిస్తే, వారు కూడా చంచల్ గూడా జైలులో తేలే అవకాశం ఉంది.

 

కాంగ్రెస్-తెరాసలు నిజంగా ఈ వ్యూహం అమలుచేస్తున్నట్లయితే తెలంగాణాలో తెదేపా, వైకాపాలు ఇక గెలుపు సంగతి మరిచిపోవలసిందే.

 

ఇక, కొన్ని నెలల క్రితం విజయమ్మ, కొద్ది రోజుల క్రితం షర్మిల, నిన్న భారతి అందరూ కూడా ముక్త కంఠంతో కాంగ్రెస్ పార్టీకే తమ మద్దతు అని ప్రకటిస్తునందున, సీమంద్రా జిల్లాలలో కూడా కాంగ్రెస్-వైయస్సార్ కాంగ్రెస్ పార్టీలు ఇదేరకమయిన వ్యూహం అమలు చేస్తునట్లు కనిపిస్తోంది. జగన్ జైలు నుండి విడుధలవ్వాలంటే కాంగ్రెస్ పార్టీలో చేరక తప్పదు అని రైల్వే మంత్రి కోట్ల సూర్యప్రకాష్ రావు ఇదివరకే స్పష్టం చేసారు.

 

అందువల్ల అక్కడ తెలంగాణా, ఇక్కడ జగన్ విడుదల అనే రెండు అంశాలతో కాంగ్రెస్ పార్టీ రాబోయే ఎన్నికలలో తేదేపాకు చెక్ పెట్టే అవకాశం ఉంది.

By
en-us Political News

  
ఎన్నికల వేళ జగన్ కు షాకుల మీద షాకులు తగులుతున్నాయి. ఇన్నాళ్లే జగన్ మాటే శాసనం అన్నట్లుగా అణిగిమణిగి ఉన్న వారంతా సరిగ్గా ఎన్నికల ముంగిట ధిక్కార స్వరం వినిపిస్తున్నారు. పార్టీపై తిరుగులేని పట్టు ఉందని భావిస్తున్న జగన్ కు ఆ పట్టు జారిపోవడం కళ్లముందు కనిపించేలా చేస్తున్నారు. టికెట్ నిరాకరించిన, సిట్టింగ్ స్థానాన్ని మార్చిన ఎమ్మెల్యేలు, ఎంపీలు ఇప్పటికే పార్టీని వీడి వలసబాట పట్టారు.
సంసారంలో నిస్సంగత్వంతో ఎలా జీవించాలో గురువు బోధిస్తాడు. మనల్ని సంసారబంధాల నుండి విముక్తుల్ని చేయడానికి తోడ్పడతాడు. కానీ అనేక జన్మల సంస్కారాల వల్ల మనలో సంసారాసక్తి సన్నగిల్లకపోవడంతో గురుబోధ అవగాహన చేసుకొనే మనోపరిపక్వత కలగదు.
ఏద‌యినా ఒక వ‌స్తువు ఇంట్లోంచి పోయిందంటేనే ఎంతో బాధ‌గా వుంటుంది. ఎంతో ఇష్ట‌ప‌డి కొనుక్కున్న వ‌స్తువు చేజారి ప‌డి ప‌గిలిపోయినా, దొంగ‌త‌నం జ‌రిగినా, ఎక్క‌డో మ‌ర్చిపోయినా చాలా బాధేస్తుంది. దాన్ని తిరిగి పొంద‌లేమ‌ని దిగులు ప‌ట్టుకుం టుంది. కానీ 101 ఏళ్ల చార్లెటి బిషాఫ్ కు ఎంతో ఇష్ట‌మ‌యిన పెయింటింగ్ రెండో ప్ర‌పంచ యుద్ధ స‌మ‌యంలో దూర‌మ‌యింది. 80 ఏళ్లు దాని కోసం ఎదురు చూడ‌గ‌లి గింది. అదంటే మ‌రి ఆమెకు ప్రాణ స‌మానం. చాలా కాలం దొరుకుతుంద‌ని, త‌ర్వాత ఇక దొర‌కదేమో అనీ ఎంతో బాధ‌పడింది. ఫిదా సినిమాలో హీరోయిన్ చెప్పినట్లు ఆమె గట్టిగా అనుకుని ఉంటుంది. అందుకే కాస్త ఆలస్యమైనా.. కాస్తేంటి ఎనిమిది దశాబ్దాలు ఆలస్యమైనా ఆమె పెయింటింగ్ ఆమెకు దక్కింది. ఆ పెయింటింగ్ గ‌తేడాది ఆమెను చేరింది.
ఓ వంక ఐదు రాష్ట్రాల అసెంబ్లీ ఎన్నికలు జరుగుతుంటే, మరో వంక జాతీయ స్థాయిలో, బీజేపీ, కాంగ్రెస్ పార్టీలకు తృతీయ ప్రత్యాన్మాయంగా థర్డ్ ఫ్రంట్ ఏర్పాటు ఆలోచనలు  జోరందుకున్నాయి. ఇటీవల కాంగ్రెస్ పార్టీకి రాజీనామా చేసిన ఆ పార్టీ సీనియర్ నాయకుడు, పీసీ చాకో, నేషనలిస్ట్ కాంగ్రెస్ పార్టీ(ఎన్సీపీ)లో చేరారు...
తెలంగాణ  రాష్ట్ర బడ్జెట్ 2021-22ను ఆర్థిక మంత్రి హరీష్ రావు, ఈ నెల18న సభలో ప్రవేశ పెడతారు.కరోనా కారణంగా, ప్రస్తుత ఆర్థిక సంవత్సరం (2020-21)లో ఎదురైన ఆర్థిక ఇబ్బందుల నేపధ్యంగా ప్రవేశపెడుతున్న బడ్జెట్ కావడంతో  సహజంగానే అందరిలోనూ ఆసక్తి నెలకొంది...
అబద్ధాలు, అర్థ సత్యాలు, వ్యక్తిగత దూషణలు, అర్ధంపర్ధం లేని ఆరోపణలతో సుమారు నెలరోజులకు పైగా తెలంగాణలో సాగుతున్న పట్టభద్రుల ఎమ్మెల్సీ ఎన్నికల ప్రచారానికి శుక్రవారం సాయంత్రంతో  తెర పడింది.రాష్ట్రంలోని మహబూబ్‌నగర్‌-హైదరాబాద్‌-రంగారెడ్డి పట్టభద్రుల నియోజకవర్గంతో పాటుగా,నల్లగొండ-ఖమ్మం-వరంగల్‌ స్థానానికి ఫిబ్రవరి 16 తేదీన నోటిఫికేషన్ వెలువడినా, ఎన్నికల ప్రచారం మాత్రం అంతకు చాలా ముందే అభ్యర్ధుల స్థాయిలో స్థానికంగా ఎన్నికల ప్రచారం ప్రారంభమైంది. 
​సహజంగా కష్టాల్లో ఉన్నపుడు ఎవరికైనా దేవుడు గుర్తు వస్తారు. లౌకిక వాద రాజకీయ నాయకులకు అయితే హటాత్తుగా  తాము హిందువులం అనే విషయం జ్ఞప్తికి వస్తుంది. పశ్చిమ బెంగాల్ ముఖ్యమంత్రి, తృణమూల్ పార్టీ అధినాయకురాలు మమతా బెనర్జీకి   కూడా తానూ హిందువును అనే విషయం ఇప్పుడు గుర్తుకొచ్చింది.
దేశంలోని ఉత్తరాది రాష్ట్రాలలో అటు కాంగ్రెస్ ఇటు స్థానికంగా ఉన్న ప్రాంతీయ పార్టీలను మట్టి కరిపిస్తూ అధికారాన్ని కైవసం చేసుకుంటున్న బీజేపీ.. దక్షిణాదికి వచ్చేసరికి ఒక్క కర్ణాటకలో తప్ప ఇతర రాష్ట్రాలలో ఎన్ని ప్రయత్నాలు చేసినా ఏమాత్రం సక్సెస్ కాలేకపోతోంది...
జయలలిత జీవించి ఉన్నత కాలం, ఆమె నెచ్చలిగా పేరొందిన శశికళ, తమిళ రాజకీయాల్లో ఓ వెలుగువెలిగారు. కొన్ని విషయాల్లో జయలలిత కంటే, ఆమె మోర్ పవర్ఫుల్ లేడీ అనిపించుకున్నారు. ముఖ్యమంత్రులు, మంత్రులు కూడా ఆమె ముందు చేతులు కట్టుకుని నిలుచున్నారు.ఆమెకు పాదాభివందనాలు చేశారు.
కాంగ్రెస్ పార్టీలో రగులుతున్న అంతర్యుద్ధం కొత్త పుంతలు తొక్కుతోంది. మరిన్ని మలుపులు తిరుగుతోంది.ఇటీవల జమ్మూలో సమావేసమైన జీ 23 నాయకులు  అసమ్మతి స్వరాన్ని పెంచారు...
పంచతంత్రంగా పిలుచుకుంటున్న ఐదు రాష్టాల అసెంబ్లీ ఎన్నికల్లో అద్భతం జరగబోతోంది. కేంద్ర ఎన్నికల సంఘం నాలుగు రాష్ట్రాలు, కేంద్రపాలిత ప్రాంతం పుదుచ్చేరి అసెంబ్లీ ఎన్నికల షెడ్యూలు ప్రకటించిన వెంటనే, వివిధ సంస్థలు అసెంబ్లీ ఎన్నికలు జరిగే  అస్సాం. పశ్చిమబెంగాల్, తమిళనాడు రాష్ట్రాలతో పాటుగా కేరళలోనూ ఒపీనియన్ పోల్స్ నిర్వహించాయి...
కేంద్ర ఎన్నికలసంఘం ‘పాంచ్ పటాక’ గంట కొట్టింది. అస్సాం, పశ్చిమ బెంగాల్, కేరళ, తమిళనాడు రాష్ట్రాలు, పుదుచ్చేరి కేంద్ర పాలిత ప్రాంతాల అసెంబ్లీ ఎన్నికల షెడ్యూలును కేంద్ర ఎన్నికల సంఘం విడుదలచేసింది. ఎన్నికల గంట మోగడంతో మొదలైన మరో భారత ‘మినీ’  సంగ్రామానికి మే 12 తేదీన జరిగే ఓట్ల లెక్కింపుతో తెర పడుతుంది.ఈలోగా వివిధ అంచల్లో పోలింగ్ జరుగుతుంది.  
నాలుగు రాష్టాలు అస్సాం, పశ్చిమ బెంగాల్ తమిళనాడు,కేరళ, కేంద్ర పాలిత ప్రాంతం పుదుచ్చేరి శాసన సభలకు  మరో రెండు నెలల్లో ఎన్నికలు జరుగుతాయి. ఇది అందరికీ తెలిసిన విషయం.
 
Disclaimer:
All content included on this TeluguOne.com Portal including text, graphics, images, videos and audio clips, is the property of ObjectOne Information Systems Ltd. or our associates, and protected by copyright laws. The collection, arrangement and assembly of all content on this portal/ related channels is the exclusive property of ObjectOne Information Systems Ltd. or our associates and protected copyright laws.
 
You may not copy, reproduce, distribute, publish, display, perform, modify, create derivative works, transmit, or in any other way exploit any part of copyrighted material without permission from ObjectOne Information Systems Ltd or our associates.