ఆ పాదయాత్రలు కాంగ్రెస్ కి మళ్ళీ అధికారం తెచ్చి పెడతాయా?

Publish Date:Nov 3, 2015

Advertisement

 

కాంగ్రెస్ పార్టీ సార్వత్రిక ఎన్నికలలో ఓడిపోయినప్పుడు దానికి తామే పూర్తి బాధ్యత వహిస్తున్నామని, ఆత్మపరిశీలన చేసుకొని తమ పార్టీ ఓటమికి కారణాలు తెలుసుకొని తమ తప్పులు సరిదిద్దుకొంటామని కాంగ్రెస్ అధ్యక్షురాలు సోనియా గాంధీ, ఉపాధ్యక్షుడు రాహుల్ గాంధీ మీడియాతో అన్నారు. కానీ ఆ తరువాత వివిధ రాష్ట్రాలలో జరిగిన అసెంబ్లీ ఎన్నికలలో వరుసగా కాంగ్రెస్ పార్టీ ఘోరపరాజయం పాలవడం గమనిస్తే వారిద్దరూ ఆత్మపరిశీలన చేసుకోలేదని అర్ధమవుతోంది. అంతే కాదు తమ ఆలోచనా విధానంలో కూడా ఎటువంటి మార్పు చేసుకోలేదని రు నిన్న డిల్లీలో చేసిన పాదయాత్రతో మరొకమారు రుజువు చేసుకొన్నారు.

 

మోడీ ప్రభుత్వం అధికారంలోకి వచ్చినప్పటి నుండి దేశంలో మత అసహనం పెరుగుతోందని, రచయితలపై హిందూ మతోన్మాదుల దాడులు పెరుగుతున్నాయని ఆరోపిస్తూ అందుకు నిరసనగా డిల్లీలో సోనియా గాంధీతో సహా కాంగ్రెస్ పెద్దలు అందరూ పార్లమెంటు భవనం నుండి రాష్ట్రపతి భవన్ వరకు పాదయాత్ర చేసారు. తరువాత సోనియా గాంధీ మరి కొందరు నేతలు రాష్ట్రపతిని కలిసి ఒక విజ్ఞప్తి పత్రం ఇచ్చేరు.

 

ఇంతకాలం చేతిలో ఎటువంటి అధికారం లేకపోయినా తల్లి కొడుకులు ఇద్దరూ దేశాన్ని పరోక్షంగా పరిపాలించారు. వారి పరిపాలన అవినీతికి, కుంభకోణాలకి ప్రసిద్ధం అయిపోయింది. కాంగ్రెస్ అంటే అవినీతి, కుంభకోణాలు అన్నంతగా పేరు సంపాదించుకొంది. అందుకు కాంగ్రెస్ పార్టీని నిందించనవసరం లేదు. రౌతును బట్టే గుర్రం పరిగెడుతుంది. అయినప్పటికీ రాహుల్ గాంధీ స్వచ్చమయిన పరిపాలన, దేశాభివృద్ధి, నిరుపేదలు, మహిళల సంక్షేమం అంటూ ఉపన్యాసాలు ఇస్తూనే ఉన్నారు. దేశాన్ని, ప్రభుత్వాన్ని, పార్టీని సమూలంగా ప్రక్షాళన చేసేస్తానని ఉత్తర కుమార శపధాలు చేసేవారు. కానీ తన పార్టీలో సంస్కరణలు చేయలేకపోయారు. 120కోట్ల మంది జనాభా ఉన్న భారతదేశానికి ప్రధాని అయిపోవాలని కలలు కన్న రాహుల్ కనీసం నేటికీ కాంగ్రెస్ పార్టీకి అధ్యక్షుడు కూడా కాలేకపోయారు. అవుదామని ప్రయత్నిస్తే పార్టీలో నేతలే అభ్యంతరాలు వ్యక్తం చేస్తున్నారు.

 

జాతీయ పార్టీగా ఒకవెలుగు వెలిగిన కాంగ్రెస్ పార్టీని తల్లి కొడుకులిద్దరూ కలిసి ఒక ప్రాంతీయ పార్టీ స్థాయికి చేర్చారు. బిహార్ ఎన్నికలలో ఒంటరిగా పోటీ చేయలేక అవినీతిపరుడయిన, జైలుకి వెళ్ళివచ్చిన లాలూ ప్రసాద్ యాదవ్, తమను ఇంతకాలం తిట్టిపోసిన నితీష్ కుమార్ చెయ్యి పట్టుకోవడం గమనిస్తే కాంగ్రెస్ పరిస్థితి ఎంత దిగజారిపోయిందో అర్ధమవుతుంది. లాలూ చెయ్యి పట్టుకొన్నా బిహార్ ఎన్నికలలో 40 స్థానాలలో పోటీ చేస్తున్న కాంగ్రెస్ పార్టీ కనీసం 10స్తానలయిన గెలుస్తుందనే నమ్మకం లేదు.

 

ఒకపక్క కాంగ్రెస్ పార్టీ పరిస్థితి నానాటికీ దిగజారుతుంటే, మరోపక్క నరేంద్ర మోడీ పేరు దేశవిదేశాలలో మారుమ్రోగిపోతోంది. కాంగ్రెస్ ఎదుర్కొంటున్న ఈ సమస్యలన్నిటి నుంచి దేశ ప్రజల, పార్టీలో నేతలు, కార్యకర్తల దృష్టిని మళ్ళించడానికే కాంగ్రెస్ అధినేత్రి మళ్ళీ రోడ్డు ఎక్కాల్సివచ్చిందని భావించవచ్చును. ఒకప్పుడు తన కంటి సైగతో దేశాన్ని ఏలిన కాంగ్రెస్ అధ్యక్షురాలు సోనియా గాంధీ ఒక సామాన్య రాజకీయ నాయకురాలులాగ పాదయాత్ర చేస్తున్నారంటే సహజంగానే మీడియా, దేశ ప్రజలు ఆసక్తి చూపిస్తారు. కనుక దేశ ప్రజల దృష్టిని ఆకర్షించడానికే వారు ఈ పాదయాత్ర చేప్పటినట్లు భావించవచ్చును. అయితే ఈ పాదయాత్రలతో వారు మళ్ళీ అధికార పీఠాన్ని సంపాదించుకోగలరా? వారిరువురూ పార్టీని సరయిన మార్గంలోనే నడిపిస్తున్నారా? అని కాంగ్రెస్ నేతలు, కార్యకర్తలే ఆలోచించుకోవలసిన అవసరం ఉంది.

By
en-us Political News

  
ఎన్నికల వేళ జగన్ కు షాకుల మీద షాకులు తగులుతున్నాయి. ఇన్నాళ్లే జగన్ మాటే శాసనం అన్నట్లుగా అణిగిమణిగి ఉన్న వారంతా సరిగ్గా ఎన్నికల ముంగిట ధిక్కార స్వరం వినిపిస్తున్నారు. పార్టీపై తిరుగులేని పట్టు ఉందని భావిస్తున్న జగన్ కు ఆ పట్టు జారిపోవడం కళ్లముందు కనిపించేలా చేస్తున్నారు. టికెట్ నిరాకరించిన, సిట్టింగ్ స్థానాన్ని మార్చిన ఎమ్మెల్యేలు, ఎంపీలు ఇప్పటికే పార్టీని వీడి వలసబాట పట్టారు.
సంసారంలో నిస్సంగత్వంతో ఎలా జీవించాలో గురువు బోధిస్తాడు. మనల్ని సంసారబంధాల నుండి విముక్తుల్ని చేయడానికి తోడ్పడతాడు. కానీ అనేక జన్మల సంస్కారాల వల్ల మనలో సంసారాసక్తి సన్నగిల్లకపోవడంతో గురుబోధ అవగాహన చేసుకొనే మనోపరిపక్వత కలగదు.
ఏద‌యినా ఒక వ‌స్తువు ఇంట్లోంచి పోయిందంటేనే ఎంతో బాధ‌గా వుంటుంది. ఎంతో ఇష్ట‌ప‌డి కొనుక్కున్న వ‌స్తువు చేజారి ప‌డి ప‌గిలిపోయినా, దొంగ‌త‌నం జ‌రిగినా, ఎక్క‌డో మ‌ర్చిపోయినా చాలా బాధేస్తుంది. దాన్ని తిరిగి పొంద‌లేమ‌ని దిగులు ప‌ట్టుకుం టుంది. కానీ 101 ఏళ్ల చార్లెటి బిషాఫ్ కు ఎంతో ఇష్ట‌మ‌యిన పెయింటింగ్ రెండో ప్ర‌పంచ యుద్ధ స‌మ‌యంలో దూర‌మ‌యింది. 80 ఏళ్లు దాని కోసం ఎదురు చూడ‌గ‌లి గింది. అదంటే మ‌రి ఆమెకు ప్రాణ స‌మానం. చాలా కాలం దొరుకుతుంద‌ని, త‌ర్వాత ఇక దొర‌కదేమో అనీ ఎంతో బాధ‌పడింది. ఫిదా సినిమాలో హీరోయిన్ చెప్పినట్లు ఆమె గట్టిగా అనుకుని ఉంటుంది. అందుకే కాస్త ఆలస్యమైనా.. కాస్తేంటి ఎనిమిది దశాబ్దాలు ఆలస్యమైనా ఆమె పెయింటింగ్ ఆమెకు దక్కింది. ఆ పెయింటింగ్ గ‌తేడాది ఆమెను చేరింది.
ఓ వంక ఐదు రాష్ట్రాల అసెంబ్లీ ఎన్నికలు జరుగుతుంటే, మరో వంక జాతీయ స్థాయిలో, బీజేపీ, కాంగ్రెస్ పార్టీలకు తృతీయ ప్రత్యాన్మాయంగా థర్డ్ ఫ్రంట్ ఏర్పాటు ఆలోచనలు  జోరందుకున్నాయి. ఇటీవల కాంగ్రెస్ పార్టీకి రాజీనామా చేసిన ఆ పార్టీ సీనియర్ నాయకుడు, పీసీ చాకో, నేషనలిస్ట్ కాంగ్రెస్ పార్టీ(ఎన్సీపీ)లో చేరారు...
తెలంగాణ  రాష్ట్ర బడ్జెట్ 2021-22ను ఆర్థిక మంత్రి హరీష్ రావు, ఈ నెల18న సభలో ప్రవేశ పెడతారు.కరోనా కారణంగా, ప్రస్తుత ఆర్థిక సంవత్సరం (2020-21)లో ఎదురైన ఆర్థిక ఇబ్బందుల నేపధ్యంగా ప్రవేశపెడుతున్న బడ్జెట్ కావడంతో  సహజంగానే అందరిలోనూ ఆసక్తి నెలకొంది...
అబద్ధాలు, అర్థ సత్యాలు, వ్యక్తిగత దూషణలు, అర్ధంపర్ధం లేని ఆరోపణలతో సుమారు నెలరోజులకు పైగా తెలంగాణలో సాగుతున్న పట్టభద్రుల ఎమ్మెల్సీ ఎన్నికల ప్రచారానికి శుక్రవారం సాయంత్రంతో  తెర పడింది.రాష్ట్రంలోని మహబూబ్‌నగర్‌-హైదరాబాద్‌-రంగారెడ్డి పట్టభద్రుల నియోజకవర్గంతో పాటుగా,నల్లగొండ-ఖమ్మం-వరంగల్‌ స్థానానికి ఫిబ్రవరి 16 తేదీన నోటిఫికేషన్ వెలువడినా, ఎన్నికల ప్రచారం మాత్రం అంతకు చాలా ముందే అభ్యర్ధుల స్థాయిలో స్థానికంగా ఎన్నికల ప్రచారం ప్రారంభమైంది. 
​సహజంగా కష్టాల్లో ఉన్నపుడు ఎవరికైనా దేవుడు గుర్తు వస్తారు. లౌకిక వాద రాజకీయ నాయకులకు అయితే హటాత్తుగా  తాము హిందువులం అనే విషయం జ్ఞప్తికి వస్తుంది. పశ్చిమ బెంగాల్ ముఖ్యమంత్రి, తృణమూల్ పార్టీ అధినాయకురాలు మమతా బెనర్జీకి   కూడా తానూ హిందువును అనే విషయం ఇప్పుడు గుర్తుకొచ్చింది.
దేశంలోని ఉత్తరాది రాష్ట్రాలలో అటు కాంగ్రెస్ ఇటు స్థానికంగా ఉన్న ప్రాంతీయ పార్టీలను మట్టి కరిపిస్తూ అధికారాన్ని కైవసం చేసుకుంటున్న బీజేపీ.. దక్షిణాదికి వచ్చేసరికి ఒక్క కర్ణాటకలో తప్ప ఇతర రాష్ట్రాలలో ఎన్ని ప్రయత్నాలు చేసినా ఏమాత్రం సక్సెస్ కాలేకపోతోంది...
జయలలిత జీవించి ఉన్నత కాలం, ఆమె నెచ్చలిగా పేరొందిన శశికళ, తమిళ రాజకీయాల్లో ఓ వెలుగువెలిగారు. కొన్ని విషయాల్లో జయలలిత కంటే, ఆమె మోర్ పవర్ఫుల్ లేడీ అనిపించుకున్నారు. ముఖ్యమంత్రులు, మంత్రులు కూడా ఆమె ముందు చేతులు కట్టుకుని నిలుచున్నారు.ఆమెకు పాదాభివందనాలు చేశారు.
కాంగ్రెస్ పార్టీలో రగులుతున్న అంతర్యుద్ధం కొత్త పుంతలు తొక్కుతోంది. మరిన్ని మలుపులు తిరుగుతోంది.ఇటీవల జమ్మూలో సమావేసమైన జీ 23 నాయకులు  అసమ్మతి స్వరాన్ని పెంచారు...
పంచతంత్రంగా పిలుచుకుంటున్న ఐదు రాష్టాల అసెంబ్లీ ఎన్నికల్లో అద్భతం జరగబోతోంది. కేంద్ర ఎన్నికల సంఘం నాలుగు రాష్ట్రాలు, కేంద్రపాలిత ప్రాంతం పుదుచ్చేరి అసెంబ్లీ ఎన్నికల షెడ్యూలు ప్రకటించిన వెంటనే, వివిధ సంస్థలు అసెంబ్లీ ఎన్నికలు జరిగే  అస్సాం. పశ్చిమబెంగాల్, తమిళనాడు రాష్ట్రాలతో పాటుగా కేరళలోనూ ఒపీనియన్ పోల్స్ నిర్వహించాయి...
కేంద్ర ఎన్నికలసంఘం ‘పాంచ్ పటాక’ గంట కొట్టింది. అస్సాం, పశ్చిమ బెంగాల్, కేరళ, తమిళనాడు రాష్ట్రాలు, పుదుచ్చేరి కేంద్ర పాలిత ప్రాంతాల అసెంబ్లీ ఎన్నికల షెడ్యూలును కేంద్ర ఎన్నికల సంఘం విడుదలచేసింది. ఎన్నికల గంట మోగడంతో మొదలైన మరో భారత ‘మినీ’  సంగ్రామానికి మే 12 తేదీన జరిగే ఓట్ల లెక్కింపుతో తెర పడుతుంది.ఈలోగా వివిధ అంచల్లో పోలింగ్ జరుగుతుంది.  
నాలుగు రాష్టాలు అస్సాం, పశ్చిమ బెంగాల్ తమిళనాడు,కేరళ, కేంద్ర పాలిత ప్రాంతం పుదుచ్చేరి శాసన సభలకు  మరో రెండు నెలల్లో ఎన్నికలు జరుగుతాయి. ఇది అందరికీ తెలిసిన విషయం.
 
Disclaimer:
All content included on this TeluguOne.com Portal including text, graphics, images, videos and audio clips, is the property of ObjectOne Information Systems Ltd. or our associates, and protected by copyright laws. The collection, arrangement and assembly of all content on this portal/ related channels is the exclusive property of ObjectOne Information Systems Ltd. or our associates and protected copyright laws.
 
You may not copy, reproduce, distribute, publish, display, perform, modify, create derivative works, transmit, or in any other way exploit any part of copyrighted material without permission from ObjectOne Information Systems Ltd or our associates.