కాంగ్రెస్ ఓటమి ఖాయమంటున్న జీవన్ రెడ్డి
Publish Date:Mar 10, 2012
Advertisement
హైదరాబాద్: కాంగ్రెస్ పార్టీలో అంతర్గత ప్రజాస్వామ్యం ఎక్కువని ఆపార్టీ నేతలు గొప్పగా చెప్పుకుంటుంటారు. అంతర్గత ప్రజాస్వామ్యంతోపాటు బహిర్గత ప్రజాస్వామ్యం కూడా ఆపార్టీలో చాలా ఎక్కువగానే ఉంది. కాంగ్రెస్ నాయకులు బహిరంగంగానే ఎవరిష్టం వచ్చినట్లు వాళ్ళు ప్రకటనలు చేసేస్తుంటారు. ఆ ప్రకటన పార్టీకి ఎంత నష్టం కలిగించినా వారేమీ భయపడరు. ఇప్పుడు తెలంగాణాలో ఉప ఎన్నికలు జరుగుతున్న తరుణంలో మాజీ మంత్రి టి.జీవన్ రెడ్డి కూడా ఇటువంటి ప్రకటనలే చేస్తున్నారు. వచ్చే ఎన్నికల్లో కాంగ్రెస్ అభ్యర్ధులందరూ పరాజయం పాలవడం ఖాయమని అంటున్నారు. తెలంగాణా సెంటిమెంట్ మాత్రమే ఈ ఎన్నికల్లో గెలుస్తుందని కాంగ్రెస్ పార్టీకి ఈ విషయం అర్ధంకావడం లేదని ఆయన ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. ఎన్నికలకు ఇంకా ఏడేనిమిది రోజులు సమయం ఉన్నందువల్ల కాంగ్రెస్ అధిష్టానం వెంటనే మేల్కొని ప్రత్యేక తెలంగాణా ఇచ్చేస్తామంటూ ప్రకటన చేయాలని ఆయన కోరారు. సోనియాగాంధీ అటువంటి ప్రకటన చేస్తే అన్ని నియోజకవర్గాల్లో కాంగ్రెస్ పార్టీ తప్పక గెలుస్తుందని ఆయన అభిప్రాయపడ్డారు. అయితే జీవన్ రెడ్డి వ్యాఖ్యల పట్ల తెలంగాణా ప్రాంతంలో రంగంలో ఉన్న కాంగ్రెస్ అభ్యర్ధులు మండిపడుతున్నారు. మరో కొద్ది రోజుల్లో ఎన్నికలు జరుగుతుండగా జీవన్ రెడ్డి వంటి వ్యక్తి ఇటువంటి వ్యాఖ్యలు చేయడంవల్ల ఓటర్లలో చులకనైపోతామని వారు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు.
http://www.teluguone.com/news/content/congress-24-12536.html
సుబ్రతో రాయ్ అరెస్ట్ ...
ఖరారైన రాష్ట్రపతి పాలన ...
రాష్ట్రపతి పాలనకే మొగ్గు ...
విఫలమైన 'టి' కాంగ్రెస్
చంద్రబాబు పాదయాత్ర ఈ నెల 31న పునఃప్రారంభ౦ కానుంది. ఫిబ్రవరి నాల్గోతేదీ వరకు విజయవాడలో కోనసాగనుంది. ఆరోగ్య కారణాల రీత్యా చంద్రబాబు 29, 30లలో కూడా విశ్రాంతి తీసుకోనున్నారని తెలుగుదేశం నాయకులు ప్రకటించారు.
తెలంగాణ కాంగ్రెస్ ఎంపీలు కేకే నివాసంలో భేటి అయ్యారు. తెలంగాణపై పార్టీ అధిష్టానం వైఖరిని వ్యతిరేకిస్తూ పార్టీ సభ్యత్వానికి, పదవులకు కూడా రాజీనామా చేసి అధిష్టానం పై ఒత్తిడి పెంచేందుకు రంగం సిద్దం చేస్తున్నారు. రాజీనామా లేఖలను పార్టీ అధ్యక్షురాలు శ్రీమతి సోనియా గాంధి పంపించనున్నారు. భేటి అనంతరం లేఖలను మీడియాకు విడుదల చేయనున్నారు.
తెలుగు సినీ ప్రియులను తన అందచందాలతో, అసమానమయిన నటనతో ఒక ఊపుఊపిన అందాల తార జయప్రద, ఆ తరువాత బాలీవుడ్ లోను ఒక వెలుగు వెలిగింది. తెలుగుదేశంపార్టీలో జేరి రాష్ట్ర రాజకీయాలలో పాల్గొన్నపటికీ, చంద్రబాబుతో పొసగక ఏకంగా డిల్లీ రైలెక్కి ఉత్తర ప్రదేశ్ రాష్ట్రంలో వాలిపోయింది.
జానారెడ్డికి బుద్ది ,జ్ఞానం ఉందా? తెలంగాణ ప్రత్యేక రాష్ట్ర ఏర్పాటు మీద కాంగ్రెస్ ప్రకటన కోసం ఇంకా వేచిచూద్దాం అంటాడా. కాంగ్రెస్ ప్రకటనలో ఇంకా నిజాయితీ ఉందన్న జానారెడ్డి మాటలను తెలంగాణ ప్రజలు విశ్వసించరు. ముఖ్యమంత్రి పదవికోసం జానారెడ్డి గోతికాడ నక్కలా ఎదురు చూస్తున్నాడు.
వైయస్సార్ కాంగ్రెస్ చేపట్టిన కోటి సంతకాల సేకరణపై తెలుగుదేశం పార్టీ తీవ్ర విమర్శలు గుప్పించిన ఆరు నెలలకి ఇప్పుడు తాపీగా ఆ పార్టీ నేతలు స్పందించడం చూస్తుంటే ఆ పార్టీ నాయకత్వలోపం మరోసారి బయట పడుతోంది.
చంద్రబాబు తెలంగాణా జిల్లలో పాదయాత్ర చేస్తునంత కాలం తన వైయస్సార్ కాంగ్రెస్ పార్టీని, తన నాయకుడు జగన్ మోహన్ రెడ్డిని అయన ఎంత తీవ్రంగా విమర్శించినా స్పందించని కొడాలి నాని, చంద్రబాబు ఇప్పుడు తన కృష్ణా జిల్లాలో పాదయాత్ర చేస్తూ అదే విధంగా విమర్శలు చేసినప్పుడు మాత్రం వెంటనే స్పందించారు.
రాష్ట్ర రాజధానిలోఇందిరా పార్క్ వద్ద నేటి నుండి 36గంటల సమరదీక్షను నిర్వహించాలన్న పట్టుదలతో ఉన్న తెలంగాణా జేయేసీ నేతలు, పోలీసు ఆదేశాలను
నిర్విరామంగా సాగుతూ 117వ రోజుకు జేరుకొన్నచంద్రబాబు పాదయాత్ర ఈరోజు కృష్ణా జిల్లాలో పరిటాలకు చేరుకొంది. ముందు అనుకొన్న ప్రకారం అయితే ఈ రోజుతో ఆయన పాదయాత్ర ముగించాల్సి ఉంది. అయన కుటుంబ సభ్యులు, పార్టీ నేతలు మరియు వైద్యులు కూడా పాదయాత్ర ముగించమని కోరినప్పటికీ చంద్రబాబు తన పాదయాత్రను కొనసాగించడానికే నిశ్చయించుకొన్నారు.
తెలంగాణా జేయేసీ అద్వర్యంలో సికిందరాబాద్ లో ఇందిరా పార్క్ వద్ద 36గంటల సమరదీక్షకు అనుమతి కోరుతూ జేయేసీ నేతలు హోంమంత్రి సబితా ఇంద్రరెడ్డికి వినతిపత్రం సమర్పించగా, కొద్దిసేపటిలోనే వారికి అనుమతి నిరాకరిస్తున్నట్లు పోలీసుల నుండి వెంటనే లేఖ అందడంతో తెలంగాణావాదులు కిరణ్ కుమార్ రెడ్డి మీద, పోలీసుల మీద మండిపడ్డారు.





