Publish Date:Jan 12, 2025
కర్నాటకలో అధికారంలో ఉన్న కాంగ్రెస్ పార్టీలో విభేదాలు రచ్చకెక్కాయా? ప్రభుత్వంలో అత్యంత కీలకంగా ఉన్న ముఖ్యమంత్రి సిద్దరామయ్య, ఉప ముఖ్యమంత్రి డీకే శివకుమార్ ల మధ్య పరిస్థితి ఉప్పూ నిప్పులా తయారైందా? పైకి సయోధ్యగా ఉన్నట్లు కనిపిస్తున్నా అంతర్గతంగా వారి మధ్య విభేదాలు పార్టీ హైకమాండ్ కు తలనొప్పిగా మారాయా? అంటే పరిశీలకుల నుంచి ఔనన్న సమాధానమే వస్తోంది. ఇరువురి మధ్యా విభేదాల కారణంగా పాలన సజావుగా సాగడం లేదన్న అభిప్రాయమూ వ్యక్తం అవుతోంది. వాస్తవానికి కర్నాటక కాంగ్రెస్ లో సిద్దరామయ్య, డీకే శివకుమార్ మధ్య విభేదాలు కొత్తగా వచ్చినమేమీ కావు.
వాస్తవానికి 2023 మేలో కర్నాటక అసెంబ్లీ ఎన్నికల ఫలితాల తర్వాత, సిద్ధరామయ్య, శివకుమార్ మధ్య ముఖ్యమంత్రి పదవి తీవ్ర పోటీ జరిగింది. అధిష్ఠానం జోక్యంతో శివకుమార్ అతి కష్టం మీద ఉప ముఖ్యమంత్రి పదవి చేపట్టేందుకు అంగీకరించారు. వాస్తవానికి రాష్ట్రంలో కాంగ్రెస్ కష్టకాలంలో ఉన్న సమయంలో పార్టీని అన్ని విధాలుగా ఆదుకుని అండగా నిలబడిన డీకే శివకుమార్ నే అధిష్ఠానం ముఖ్యమంత్రిగా ఎంపిక చేస్తుందని అంతా భావించారు. అయితే సామాజిక సమీకరణాల నేపథ్యంలో సిద్ధరామయ్యకు ఆ అవకాశం దక్కింది. అప్పట్లోనే రొటేషన్ పద్ధతిలో సీఎం సీట్ షేరింగ్ అన్న ప్రతిపాదనను అధిష్ఠానం ఇరువురి ముందూ ఉంచిందనీ, అందుకు ఇరువురినీ ఒప్పించిందనీ పార్టీ వర్గాలే చెబుతున్నాయి. ఆ ఒప్పందం ప్రకారం తొలి రెండున్నరేళ్లు సిద్దరామయ్య, ఆ తరువాత రెండున్నరేళ్లు డీకే శివకుమార్ రాష్ట్ర ముఖ్యమంత్రులుగా ఉంటారు. అయితే కాంగ్రెస్ హైకమాండ్ ఈ ఒప్పందం గురించి బాహాటంగా ప్రకటించలేదు.
ఇప్పుడు సిద్దరామయ్య గడువు ముగుస్తుండటంతో డీకేకు సీఎం పదవి అన్న అంశం తెరమీదకు ప్రముఖంగా వచ్చింది. అయితే ఈ విషయంలో ఇటు సిద్దరామయ్య కానీ, డీకే శివకుమార్ కానీ పెదవి విప్పడం లేదు. వారి వారి మద్దతు దారులు మాత్రం ఎవరికి తోచిన విధంగా వారు ప్రకటనలు చేస్తూ విభేదాలను రచ్చకీడుస్తున్నారు. ప్రధానంగా ముడా కుంభకోణంలో సీఎం సిద్ధరామయ్య ఇరుక్కోవడంతో అధిష్టానం ఆయనను తప్పిస్తుందనీ డీకే సీఎం అవుతారనీ ఆయన మద్దతుదారులు గట్టిగా చెబుతున్నారు. హైకమాండ్ ఈ విషయంలో ఎటువంటి స్పష్టతా ఇవ్వలేదు. కానీ డీకే మద్దతుదారులు మాత్రం పదేపదే తమ నాయకుడికి సీఎం పదవి అంటూ ప్రకటనలు గుప్పిస్తున్నారు. ఈ నేపథ్యంలోనే డీకే.. అటువంటి ప్రకటనలు వద్దంటూ తన మద్దతుదారులను వారించారు. తానైనా, సీఎం సిద్దరామయ్య అయినా అధిష్టానం మాటకే కట్టుబడి ఉంటామన్నారు. ఆయన వ్యాఖ్యలతో డీకే అభిమానుల్లో ఆనందం వ్యక్తం అవుతోంది. అధిష్ఠానం సిద్దరామయ్యను తప్పించి డీకేకు సీఎం పదవి కట్టబెడుతుందనీ, డీకే మాటల వెనుక ఉన్న అర్ధం అదేననీ అంటున్నారు.
అయితే మంత్రి కేఎన్ రాజన్న మాత్రం తాజాగా శివకుమార్ ను ఉద్దేశించి చేసిన వ్యాఖ్యలు వివాదాస్పదంగా మారాయి. కర్నాటక కాంగ్రెస్ లో ఆల్ ఈజ్ నాట్ వెల్ అని తేటతెల్లం చేశాయి. కేఎన్ రాజన్న సిద్దరామయ్యకు సన్నిహితుడిగా గుర్తింపు పొందారు ఈ నేపథ్యంలోనే ఆయన వ్యాఖ్యలు వివాదాస్పదంగా మారాయి. ఇంతకీ కేఎన్ రాజన్న ఏమన్నారంటే.. ‘ఉపముఖ్యమంత్రి శివకుమార్ తన దృష్టిని వచ్చే అసెంబ్లీ ఎన్నికలలో పార్టీని విజయపథంలో నడిపించడంపై దృష్టి సారిస్తే మంచిది, అంతే కానీ రెండున్నరేళ్ల ముఖ్యమంత్రి పదవి కోసం ఆలోచించడం వల్ల ప్రయోజనం ఉండదు’. ఆయన ఈ వ్యాఖ్యలతో కాంగ్రెస్ పార్టీలోని డీకే మద్దతుదారులు భగ్గుమంటున్నారు. దీంతో రాష్ట్ర కాంగ్రెస్ లో విభేదాలు రచ్చకెక్కినట్లైంది. ఈ పరిస్థితిని అధిష్ఠానం ఎలా సరిదిద్దుతుందన్న ఆసక్తి సర్వత్రా వ్యక్తమౌతోంది.
By Teluguone
en-us
Political News
http://www.teluguone.com/news/content/conflicts-in-karnataka-congress-25-191227.html
రాజకీయాల్లో నిరంతరం ఉండే సవాళ్లు, మానసిక ఒత్తిడి కారణంగానే తాను దీర్ఘకాలిక వ్యాధుల బారిన పడ్డానన్న రోజా.. తొలిసారి ఎమ్మెల్యేగా గెలిచిన తరువాత తనకు బ్లడ్ ప్రషర్ సమస్య వచ్చిందనీ, ఇక రెండో సారి ఎమ్మెల్యేగా ఎన్నికై, మంత్రిని అయిన తరువాత డయాబెటిస్ అటాక్ అయ్యిందనీ వివరించారు.
కష్టపడిన వారిని గుర్తించాలనేది పార్టీ సిద్ధాంతం అని టీడీపీ జాతీయ ప్రధాన కార్యదర్శి, విద్య, ఐటీ శాఖల మంత్రి నారా లోకేష్ అన్నారు.
మావిగన్ ప్రతిపాదనతో జగన్ నెటిజనులకు ఒక ట్రోల్ మెటీరియల్ గా మారిపోయిన సంగతి తెలిసిందే. ఆ ప్రతిపాదనపై లెక్కలేనన్న మీమ్స్, సెటైర్లు నెట్టింట వెల్లువెత్తాయి. అయినా కూడా జగన్ తాను పట్టిన కుందేటికి మూడేకాళ్లన్న చందంగా మావిగన్ ను మించిన రాజధాని ఉండనే ఉండదన్నట్లు మాట్లాడుతున్నారు. అయితే ఇదే మావిగన్ ను ఆయన అధికారంలో ఉన్న ఐదేళ్ల కాలంలో ఎందుకు ముందుకు తీసుకురాలేదన్న ప్రశ్నకు మాత్రం జగన్ సమాధానం ఇవ్వడం లేదు.
కేరళలోని మొత్తం 140 అసెంబ్లీ స్థానాలకు, పుదుచ్చేరిలోని 30 స్థానాలకు రేపు ఒకేసారి ఓటింగ్ నిర్వహించనున్నారు. అలాగే అస్సాంలో 126 స్థానాలకూ కూడా ఒకే విడతలో పోలింగ్ జరగనుంది. గతంలో బహుళ విడతల్లో ఎన్నికలు జరిగినప్పటికీ, ఈసారి మాత్రం ఒకే విడతలో పోలింగ్ నిర్వహిస్తున్నారు.
సౌత్ కోస్ట్ రైల్వే జోన్ ఏర్పాటు నేపథ్యంలో విజయవాడలోని లోకో పైలట్ల గాలా(సికింద్రాబాద్) డిపోను తరలించకుండా విజయవాడలోనే కొనసాగించేలా తగిన చర్యలు తీసుకోవాలని ఆ డిపో సిబ్బంది మంత్రి నారా లోకేష్ ను కలిసి విజ్ఞప్తి చేశారు. విజయవాడ బోర్డును కొండపల్లి నుంచి మోటమర్రికి పెంచడం వల్ల గత 17 ఏళ్లుగా విజయవాడలో ఉన్న సికింద్రాబాద్(గాలా) డిపో ఉనికి సందిగ్ధంలో పడిందని, డిపోను మోటమర్రికి లేదా డోర్నకల్ కు తరలిస్తారనే ప్రచారంతో సుమారు 500 కుటుంబాలు ఆందోళన చెందుతున్నాయనే విషయాన్ని మంత్రి దృష్టికి తీసుకువచ్చారు.
తమిళనాడు అసెంబ్లీ ఎన్నికల సమరం తుది ఘట్టానికి చేరుకుంది.
సుదీర్ఘ రాజకీయ అనుభవం కలిగిన కిద్వాయ్, గాంధీ కుటుంబానికి అత్యంత సన్నిహితురాలిగా గుర్తింపు పొందారు. మోహ్సినా కిద్వాయ్ అంత్యక్రియలు ఢిల్లీలోని నిజాముద్దీన్ స్మశాన వాటికలో బుధవారం (ఏప్రిల్ 8) సాయంత్రం నిర్వహించనున్నట్లు కుటుంబ సభ్యులు తెలిపారు.
జగన్ చుట్టపుచూపుగా రాష్ట్రానికి వస్తున్నారు. అడపాదడపా పరామర్శలంటూ రోడ్ షోలు నిర్వహిస్తున్నారు. ఆ సమయంలో వినా మిగిలిన సమయంలో రాష్ట్రంలో వైసీపీ పరిస్థితి ఉనికి మాత్రంగానే మారింది. గత ఎన్నికలలో వైసీపీ కేవలం 11 స్థానాలలో మాత్రమే గెలిచిన సంగతి తెలిసిందే. ఆ గెలిచిన స్థానాలలో కూడా వెసీపీ స్తబ్దుగానే ఉంది. అయితే మచిలీపట్నంలో మాత్రం వైసీపీ హడావుడి ఒకింత ఎక్కువగా ఉంది.
ఉభయ గోదావరి జిల్లాలకు చెందిన జనసేన నేతలు ద్వారంపూడిపై చర్యల తీసుకోవాల్సిందే అని ఒత్తిడి తీసుకువస్తున్నారు. ఈ నేపథ్యంలోనే అవినీతి బండారాన్ని బట్టబయలు ప్రభుత్వం పకడ్బందీగా అడుగులు వేస్తున్నదని అంటున్నారు. రాష్ట్ర రైస్ మిల్లర్స్ అసోసియేషన్లో ద్వారంపూడికి ఉన్న పట్టును సడలించడం ద్వారా ఆయన ప్రాభవాన్ని తగ్గించాలని ప్రయత్నిస్తున్నారు.
ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడుపై అంబటి రాంబాబు అనుచిత వ్యాఖ్యలు చేశారన్న ఆరోపణలపై అంబటి రాంబాబును కొద్ది రోజుల కిందట గుంటూరు జిల్లా నల్లపాడు పోలీసులు అరెస్టు చేసి జైలుకు పంపారు. అయితే.. ఆ సమయంలో పోలీసు స్టేషన్లో తనను చిత్రహింసలకు గురిచేశారని ఆరోపిస్తూ అంబటి రాంబాబు తాజాగా హైకోర్టులో పిటిషన్ దాఖలు చేశారు.
మాజీ మంత్రులు హరీశ్ రావు, సబితా ఇంద్రా రెడ్డి, మాజీ ఎమ్మెల్యేలు మహేశ్ రెడ్డి, నరేందర్ రెడ్డి, వికారాబాద్ జిల్లా అధ్యక్షుడు మెతుకు ఆనంద్ వంటి నేతలను అక్రమంగా నిర్బంధించడం ప్రజాస్వామ్య విరుద్ధమని ఆగ్రహం వ్యక్తం చేశారు. రైతుల ఆవేదనను వినాల్సింది పోయి, వారికి మద్దతుగా వస్తున్న విపక్ష నేతలపై ఆంక్షలు విధించడం దారుణమన్నారు.
రిలే దీక్షకు మద్దతుగా గ్రామానికి చేరుకోవాలని ప్రయత్నించిన బీఆర్ఎస్ నేతలు, కార్య కర్తలను పోలీసులు మార్గ మధ్యలోనే నిలిపివేస్తూ వెనక్కి పంపించేశారు. దీంతో పరిగి పరిసర ప్రాంతాల్లో ఉద్రిక్తత నెలకొంది.
ఆంధ్రప్రదేశ్ ప్రజలందరికీ చారిత్రాత్మక విజయం సిద్ధించిన రోజిదని పేర్కొన్నారు. అమరావతి రైతుల త్యాగాలకు దక్కిన న్యాయమన్నారు. అమరావతి ఇప్పుడు కేవలం నగరం కాదు, మన ఆత్మగౌరవానికి ప్రతీక అని బాలకృష్ణ పేర్కొన్నారు.