సవాళ్ళకు జవాబు.. క్యాడర్ కు ప్రత్యేక శిక్షణ!

Publish Date:May 20, 2025

Advertisement

తెలుగు దేశం  అధినేత, ఆంధ్ర ప్రదేశ్ ముఖ్యమంత్రి నారా చంద్రబాబునాయుడు,  ఓవంక సుపరిపాలన ద్వారా ప్రజాభిమానాన్ని సొంతం చేసుకుంటూనే, మరో వంక పార్టీ పటిష్టతపై దృషి కేంద్రీకరించారు.  గతంలో అధికారంలో ఉన్న ఐదేళ్లలో..  అప్పటి పరిస్థితులు, ముఖ్యంగా రాష్ట్ర విభజన విసిరిన సవాళ్ళను సమర్ధవంతంగా ఎదుర్కునే క్రమంలో ..  చంద్రబాబు, స్టేట్ ఫస్ట్, పార్టీ నెక్స్ట్ నినాదంతో శక్తి యుక్తులు అన్నింటినీ రాష్ట్ర ప్రయోజనాలకే వెచ్చించారు. రాష్ట ప్రయోజనాలకు ఇచ్చిన ప్రాధాన్యత పార్టీకి ఇవ్వలేదు. పార్టీ పటిష్టత పై అంతగా దృష్టి పెట్టలేదు. ఫలితంగా పార్టీనే కాదు, రాష్ట్రం కూడా ఎంతగానో నష్ట పోయింది. వైసీపీ ఐదేళ్ళ సుందర ముదనష్ట పాలనలో..  జగన్ రెడ్డి రాష్ట్రాన్ని దశాబ్దాల కాలం వెనక్కి తీసుకు పోయారు.  

గతంలోనే ఈ వాస్తవాన్ని గుర్తించిన చంద్రబాబు నాయుడు.. మరో మారు అలాంటి అనర్ధం జరగ కుండా ఉండేందుకు, ఇప్పటికే చాల వరకు పట్టాల పైకి తెచ్చిన పరిపాలన పై ప్రత్యేక దృష్టిని కేంద్రీకరిస్తూనే, పార్టీ పటిష్ఠతపై కూడా ప్రత్యేక దృష్టిని కేంద్రీకరించాలని నిర్ణయించారు.  అవును.. కింది స్థాయి నుంచి పార్టీని సంస్థాగతంగా బలోపేతం చేయడంపై చంద్రబాబు దృష్టిని కేంద్రీకరించారు. ఇందులో భాగంగా.. తెలుగు దేశం పార్టీ నాయకులు, కార్యకర్తలకు, నియోజకవర్గాల వారీగా  ప్రత్యేక శిక్షణ కార్యక్రమాన్ని రూపొందించారని పార్టీ నేతలు చెబుతున్నారు.

నిజానికి..  మారుతున్న పరిస్థితులకు, ముఖ్యంగా టెక్నాలజీ పరంగా వస్తున్న మార్పులు, నూతన ఆవిష్కరణలకు  అనుగుణంగా నూతన పద్దతులను అడాప్ట్ చేసుకోవడం, ఆచరణలో పెట్టడం ముఖ్యమంత్రి చంద్రబాబుకు కొట్టినపిండి. అంతే కాదు ఒక్క రాజకీయ, పరిపాలన రంగాలలోనే కాదు, ఏ రంగంలో అయినా  టెక్నాలజీ సమర్ధవంతంగా వినియోగించుకోవడం అభివృద్దికి మూల మంత్రంగా చంద్రబాబు నాయుడు గట్టిగా విశ్వసిస్తారు. అదే విషయాన్ని ఆయన పలు సందర్భాలలో, అనేక వేదికల నుంచి ప్రస్తావించారు. ఆదివారం హైదరాబాద్ లో జరిగిన  తెలుగువన్  రజతోత్సవ వేడుకల్లో ముఖ్య అతిధిగా పాల్గొని చేసిన ప్రసంగంలోనూ.. చంద్రబాబు ఇదే అంశాన్ని ప్రముఖంగా ప్రస్తావించారు. టెక్నాలజీ రంగంలో వచ్చిన మార్పులను ఎప్పటికప్పుడు అడాప్ట్ చేసుకుంటూ పాతికేళ్ళ విజయ ప్రస్థానం సాగించిన, తెలుగు వన్   చైర్మన్ కంఠంనేని రవిశంకర్  ను అభినందిచారు.
అలాగే..  ఇటీవల కాలంలో అన్ని రంగాలకు ఆయువు పట్టుగా మారిన సోషల్ మీడియా సమర్ధ వినియోగం పైనా చంద్రబాబు నాయుడ దృష్టి పెట్టారని పార్టీ వర్గాలు తెలిపాయి. అందుకే..  నియోజకవర్గాల వారీగా నిర్వహించే  శిక్షణ కార్యక్రమంలో నియోజకవర్గ పరిధిలో సంస్థాగత విషయాలు.. రాజకీయ అంశాలతో పాటుగా, సోషల్ మీడియా సద్వినియోగం విషయంలోనూ కార్యకర్తలకు శిక్షణ ఇవ్వడం జరుగుతుందని పార్టీ నేతల తెలిపారు. ఈ శిక్షణ కార్యక్రమం ద్వారా కార్యకర్తలు, నాయకులకు రాజకీయ అవగాహన, రాజకీయ వ్యూహాల పట్ల అవగాహనా కల్పించడంతో పాటుగా..  స్వర్ణాంధ్ర విజన్ – 2047,  పీ – 4 ఇనిషియేటివ్స్ ముఖ్య ఉద్దేశాలపై అవగాహన కల్పిస్తామని నేతలు చెప్పారు. అదే విధంగా బూత్ స్థాయి నుంచి రాష్ట్ర స్థాయి వరకు ప్రతి కార్యకర్త, ప్రతి నాయకుడు పార్టీ కార్యకలాపాల్లో చురుగ్గా పాల్గొనేలా చేయడం జరుగుతుందని తెలిపారు.  

ఇప్పటికే కుప్పం, మంగళగిరి సహా మరి కొన్ని నియోజక వర్గాల్లో నిర్వహించిన శిక్షణ కార్యక్రమాన్ని మహానాడు తర్వాత రాష్ట్ర వ్యాప్తంగా, అన్ని నియోజక వర్గాల్లో నిర్వహించాలని పార్టీ నిర్ణయించింది. ముందుగా.. గత ఎన్నికల్లో ఓడిపోయిన  విశాఖపట్నం నార్త్, చింతలపూడి, తెనాలి, పెనుగొండ,కనిగిరి నియోజక వర్గాల్లో పైలట్ ప్రాజెక్ట్ గా శిక్షణ కార్యక్రమాలు నిర్వహించి, ఈ ఐదు నియోజక వర్గాల్లో శిక్షణ కార్యక్రమం పూర్తయిన తర్వాత మంచి చెడులను సమీక్షించుకుని, రాష్ట్ర వ్యాప్తంగా శిక్షణ కార్యక్రమాలను నిర్వహించాలని నిర్ణయించినట్లు పార్టీ వర్గాలు తెలిపాయి.     

ఈ శిక్షణ కార్యక్రమంలో తెలుగు దేశం పార్టీ సిద్దాంతం, పార్టీ లక్ష్యం, నాయకత్వ లక్షణాలు, సంక్షేమ పథకాల అమలుకు చేపట్టిన కార్యక్రమాలు, సోషల్ మీడియాని సమర్ధవంతంగా వినియోగించుకోవడ్డం వంటి పలు కీలక అంశాలపై ఎంపిక చేసిన క్రియాశీల కార్యకర్తలకు శిక్షణ ఇవ్వడం జరుగుతుందని, పార్టీ సీనియర్ నాయకులు, మంత్రులు, ఎమ్మెల్యేలు ప్రత్యక్షంగా ఈ కార్యక్రమాలలో పాల్గొంటారని పార్టీ వర్గాలు తెలిపాయి. భవిష్యత్ లో  ప్రొఫెసర్లు, ఇతర రంగాలకు చెందిన నిపుణుల సేవలను కూడా వినియోగించుకోవడం జరుగుతుందని అంటున్నారు.  అదే విధంగా   వైసీపీ సోషల్ మీడియా సాగించే ప్రభుత్వ వ్యతిరేక దుష్ప్రచారాన్ని సమర్థవంతంగా తిప్పి కొట్టేందుకు వీలుగా మండల స్థాయి నుంచి కార్యకర్తలకు సోషల్ మీడియా సమర్ధ వినియోగంపై శిక్షణ ఇవ్వడం కూడా శిక్షణలో భాగంగా ఉంటుందని అంటున్నారు.

By
en-us Political News

  
సజ్జల చిక్కుల్లో పడ్డారు. మహిళలపై అనుచిత వ్యాఖ్యలను నిరసిస్తూ ఆందోళనకు దిగిన వారిపై దారుణ వ్యాఖ్యలు చేశారు. పిశాచాలు, రాక్షసులు, సంకరజాతి అంటూ సజ్జల చేసిన వ్యాఖ్యలపై ఆంధ్రప్రదేశ్ అసెంబ్లీ డిప్యూటీ స్పీకర్ రఘురామకృష్ణం రాజు డీజీపీకి ఫిర్యాదు చేశారు. దీంతో వైసీపీ ఇప్పుడు పూర్తి డిఫెన్స్ లో పడిపోయింది.
ఆంధ్రప్రదేశ్ లో సంపద సృష్టించి, ఆ సృష్టించిన సంపదను పేదలకు పంచడమే తన లక్ష్యమని ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి నారా చంద్రబాబునాయుడు పునరుద్ఘాటించారు.
జగన్ హయాంలో అస్తవ్యవస్థంగా తయారైన ప్రజా పంపిణీ వ్యవస్థను ప్రక్షాళన చేసి దారిలో పెట్టేందుకు తెలుగుదేశం కూటమి ప్రభుత్వం ప్రయత్నాలు చేపట్టింది. ఆంధ్రప్రదేశ్ లో రేషన్ సరుకుల పంపిణీని సమూలంగా ప్రక్షాళన చేయడమే లక్ష్యంగా ముందుకు సాగుతోంది.
అమ‌రావ‌తిపై చ‌ర్చ పెట్టి.. అక్క‌డి మ‌హిళ‌ల‌పై అనుచిత వ్యాఖ్యలు చేయడంపై ఆంధ్రప్రదేశ్ కాంగ్రెస్ అధ్యక్షురాలు వైఎస్ షర్మిల మండిపడ్డారు. ఈ విషయంలో వైసీపీ అధినేత, తన సోదరుడు జ‌గ‌న్‌, ఆయ‌న స‌తీమ‌ణి భార‌తి ఇద్ద‌రూ ప్ర‌జ‌ల‌కు క్ష‌మాపణ‌లు చెప్పాలని డిమాండ్ చేశారు.
సీనియర్ ఐపీఎస్ అధికారి, ఆంధ్రప్రదేశ్ ఇంటెలిజెన్స్ మాజీ చీఫ్ పీఎస్సార్ ఆంజనేయులుకు హైకోర్టు షాక్ ఇచ్చింది. ఏపీపీఎస్సీ అక్రమాల కేసులె ఆయన దాఖలు చేసుకున్ని పిటిషన్ ను హైకోర్టు కొట్టివేసింది.
తెలంగాణలో సంచలనం సృష్టించిన ఫోన్‌ ట్యాపింగ్‌ కేసులో ప్రధాన నిందితుడిగా ఉన్న ఎస్‌ఐబీ మాజీ చీఫ్‌ ప్రభాకర్‌ రావు విచారణ ముగింది. దాదాపు సిట్ అధికారులు ఎనిమిది గంటల పాటు విచారించారు.
ఆంధ్రప్రదేశ్ కాంగ్రెస్ కమిటీ అధ్యక్షురాలు వైఎస్ షర్మిల సొంత జిల్లాలో కాంగ్రెస్ పార్టీలో వర్గ విభేదాలు భగ్గుమన్నయి. షర్మిల ఏఐసీసీ సభ్యురాలు సుంకర పద్మశ్రీ వర్గాలుగా వాగ్వాదాలకు దిగారు
జూన్ చివరి వారంలో తెలంగాణలో కేంద్ర హోంశాఖ మంత్రి అమిత్ షా పర్యటించానున్నారు. నిజామాబాద్‌లో జాతీయ పసుపుబోర్డు కార్యాలయం ప్రారంభించనున్నారు.
రిపోర్టర్ కొమ్మినేని శ్రీనివాసరావు అరెస్ట్ పై వైసీపీ రాష్ట్ర కోఆర్డినేటర్ సజ్జల రామకృష్ణారెడ్డి చేసిన వ్యాఖ్యల పట్ల ఏపీ మంత్రి నారా లోకేశ్ తీవ్ర అభ్యంతరం వ్యక్తం చేశారు.
తెలుగుదేశం నాయకురాలు, ఆళ్లగడ్డ ఎమ్మెల్యే భూమా అఖిలప్రియ తీవ్ర అస్వస్థతకు గురయ్యారు. దొర్నిపాడు మండలం డబ్లుగోవిన్నెలో జతరకు హాజరైన అఖిలప్రియ అక్కడ ప్రత్యేక పూజలలో పాల్గొన్నారు. ఆ సందర్భంగా గుడి ఆవరణలోనే ఒక్కసారిగా సొమ్మసిల్లి పడిపోయారు.
ఏపీ రాజధాని అమరావతి లక్ష్యంగా చేసుకొని వ్యాఖ్యలు చేయడం దారుణమని ఏపీ ప్రెస్‌ అకాడమీ ఛైర్మన్‌ ఆలపాటి సురేశ్‌కుమార్‌ అన్నారు. ఆంగ్లపత్రికలో అమరావతి ప్రస్తావ రాకపోయినా కావాలనే చర్చలోకి తీసుకొచ్చినట్లుగా కనిపిస్తోందని తెలిపారు.
బీఆర్ఎస్ అధినేత మాజీ సీఎం కేసీఆర్‌తో మాజీ మంత్రి హరీష్ రావు భేటీ అయ్యారు. ఇవాళ కాళేశ్వరం కమిషన్ విచారణలో కమిషన్ అడిగిన ప్రశ్నలను కేసీఆర్‌కు ఆయన వివరించనున్నారు.
తెలంగాణ వ్యాప్తంగా అన్నిరకాల ఆర్టీసీ బస్ పాస్ ధరలను 20% పెంచుతూ టీజీఎస్ఆర్టీసీ యాజమాన్యం నిర్ణయం తీసుకుంది.
 
Disclaimer:
All content included on this TeluguOne.com Portal including text, graphics, images, videos and audio clips, is the property of ObjectOne Information Systems Ltd. or our associates, and protected by copyright laws. The collection, arrangement and assembly of all content on this portal/ related channels is the exclusive property of ObjectOne Information Systems Ltd. or our associates and protected copyright laws.
 
You may not copy, reproduce, distribute, publish, display, perform, modify, create derivative works, transmit, or in any other way exploit any part of copyrighted material without permission from ObjectOne Information Systems Ltd or our associates.