పిల్లల్ని ఏడిపించే పోటీలు..

Publish Date:May 23, 2018

Advertisement

ఇంట్లో పసిపిల్లలు ఉన్నారంటే ఆ సందడే వేరు. వాళ్ల ఆటపాటలతో రోజులు ఎలా గడిచిపోతాయో తెలియదు. అంతవరకు బాగానే ఉంది. కానీ అదే పిల్లలు గుక్క తిప్పుకోకుండా ఏడుస్తున్నారనుకోండి... అప్పుడుంటుంది అసలు టెన్షన్‌. పిల్లవాడు ఏడుపు ఆపేవరకు తల్లిదండ్రులకు ఏమీ తోచదు. కానీ జపాన్‌లోని టోక్యోలో సంగతే వేరు. అక్కడ ఏడ్చే పిల్లవాడే విజేతగా నిలుస్తాడు. అదేంటో మీరే చూడండి.

జపాన్‌ రాజధాని టోక్యోలో సెన్‌సోజి అనే బౌద్ధ ఆలయం ఉంది. ఈ ఆలయానికి 1400 ఏళ్లకు పైగా చరిత్ర ఉంది. ఈ గుడి ఎప్పుడూ భక్తులతో కిటకిటలాడుతూనే ఉంటుంది. ఇక వేసవి కాలం మొదలయిందంటే ఆ సందడి ఇంకా పెరిగిపోతుంది. ఇక్కడ జరిగే ఓ పిల్లల పోటీనే ఇందుకు కారణం. ఆ పోటీ పేరు ‘నాకిజుమో’... అంటే ఏడ్చే పిల్లల పోటీ అని అర్థం.

‘ఏడ్చే పిల్లలు బాగా బలంగా ఉంటారు’ అని జపాన్లో ఓ సామెత ఉంది. అంతేకాదు! పిల్లలు ఏడిస్తే... ఆ శబ్దానికి చుట్టుపక్కల ఉన్న దుష్టశక్తులన్నీ పారిపోతాయని కూడా వాళ్లు నమ్ముతారు. అందుకనే ఏటా ఈ పోటీ పెడతారు. నాలుగు నెలల నుంచి రెండు సంవత్సరాల లోపు పిల్లలకి ఈ పోటీలో ప్రవేశం ఉంటుంది. ఈ పోటీలో పాల్గొనే పిల్లలని ఇద్దరు సుమోలు ఎదురెదురుగా పట్టుకుని నిలబడతారు. ఆ ఇద్దరు పిల్లలలో ఎవరు ముందు ఏడుస్తారో వాళ్లనే విజేతగా ప్రకటిస్తారు. ఒకవేళ పిల్లలిద్దరూ ఒకే సమయంలో ఏడిస్తే, వాళ్లలో ఎవరు గట్టిగా ఏడుస్తున్నారో చూస్తారు.

పోటీలో పిల్లలు బాగా ఏడ్చేందుకు రిఫరీలే వాళ్లని భయపెడుతారు. అప్పటికీ పిల్లవాడు ఏడవకపోతే భయపెట్టే మాస్కులు వేసుకుని పిల్లలు జడుసుకునేలా చేస్తారు. ఆ పోటీ చూసేందుకు వచ్చిన జనం కూడా పిల్లల్ని ఏడవమని అరుస్తూ రెచ్చగొడతారు. ఇంత జరిగిన తర్వాత పిల్లలు ఎడవకుండా ఎలా ఉంటారు చెప్పండి!

ఈ ఏడుపు పోటీలు ఇప్పటివి కాదు. దాదాపు నాలుగు వందల ఏళ్ల నుంచీ వీటని నిర్వహిస్తున్నారట. ఏటా దాదాపు రెండు వందల మంది పిల్లల్ని ఈ పోటీలో పాల్గొనేందుకు తీసుకువస్తూ ఉంటారు. వాళ్లకి సుమో బట్టలు వేసి, నిర్వాహకుల చేతిలో పెడుతుంటారు. నిజానికి పిల్లలు అప్పుడప్పుడూ ఏడవటం మంచిదే కావచ్చు. దాని వల్ల వాళ్ల ఊపిరితిత్తులు బలపడతాయి. వాళ్ల ఆకలి, అనారోగ్యాల గురించి పెద్దవాళ్లకి తెలుస్తాయి. కానీ అదేపనిగా గుక్కపట్టి ఏడవటం వల్ల, వాళ్ల మెదడు దెబ్బతింటుందని కొన్ని పరిశోధనలు చెబుతున్నాయి. జపాన్‌వాసులు మాత్రం ఈ మాటని వినేలా లేరు.

- నిర్జర.

By
en-us Political News

  
పెళ్లి ప్రపంచంలో ప్రజలందరూ సాగించే ఒక పవిత్రమైన  బంధం. భారతీయులు పెళ్లికి అధిక ప్రాధాన్యత ఇస్తారు.  సాధారణంగా వయసు రాగానే పెళ్లి వయసు వచ్చింది అని అంటుంటారు.  దానికి తగ్గట్టే పెళ్ళిళ్లు చేస్తుంటారు....
గొడవలు లేని భార్యాభర్తల బంధం అంటూ ఉండదు. వాస్తవానికి భార్యాభర్తల మధ్య  జరిగే గొడవలు చాలా వరకు వారి బంధాన్ని మరింత బలంగా మార్చడంలో సహాయపడతాయి.  భార్యాభర్తల మధ్య జరిగే చిన్న చిన్న గొడవలు  ఒకరి మీద ఒకరికి ఉండే ప్రేమను స్పష్టం చేస్తాయి...
అత్తాకోడలు ఇద్దరూ వేరే ఇంట్లో తమ తల్లిదండ్రుల మధ్య గారాభంగా పెరిగి వివాహం పేరుతో ఒక ఇంటిని చేరే వారు.  అయితే ఏ ఇంట్లో చూసినా అత్తాకోడళ్లు అంటే ఒకానొక శత్రుత్వమే కనిపిస్తుంది, వినిపిస్తుంది...
కష్టాలు, సమస్యలు ఎదురైనప్పుడు, ఇతరుల నుండి అన్యాయాన్ని ఎదుర్కుంటున్నప్పుడు, ఇతరుల తప్పులకు తాము నష్టాన్ని  అనుభవిస్తున్నప్పుడు చాలా మంది న్యాయం కోసం న్యాయ స్థానాన్ని ఆశ్రయిస్తారు.
మోసపోవడం,  మోసం చేయడం,  తప్పు చేయడం,  తప్పించుకు తిరగడం,  చట్టానికి విరుద్దంగా, న్యాయానికి వ్యతిరేకంగా ప్రవర్తించడం..  ఒకటి రెండు కాదు..
ఏ సంబంధానికైనా నమ్మకం పునాది.  కానీ నేటి డిజిటల్ యుగంలో ఈ నమ్మకం కొన్ని విషయాల చుట్టూనే తిరుగుతుంది. వాటిలో ఫోన్ చాలా ముఖ్యమైనది. భార్యాభర్తలు ఒకరి ఫోన్ మరొకరు చెక్ చేయడంలో తప్పేముందని చాలా మంది అంటుంటారు....
జీవితం చాలా విచిత్రమైనది. నిన్న ఉన్నట్టు ఈరోజు ఉండదు,  ఈరోజు ఉన్నట్టు రేపు ఉంటుందో లేదో తెలియదు.  కానీ చాలామంది రేపు ఇలా ఉంటే బాగుంటుంది అనే ఆశాభావంతో ఉంటారు.  ప్రతీది ఇలా జరగాలి, ఇలా జరిగితే బాగుంటుంది అని కొన్ని అంచనాలు కూడా పెట్టుకుంటారు....
ఎమోషన్స్  అనేవి మాటలకు అందని చర్యలు.  మాటల ద్వారా చెప్పలేని ఎన్నో విషయాలను ఎమోషన్స్ ద్వారా వ్యక్తం చేస్తుంటారు.  ఈ ఎమోషన్స్ ద్వారా అనుబంధం ఉన్నంత వరకు ఎవరైనా, ఏ బంధమైనా బాగుంటుంది...
ఆత్మవిశ్వాసం అనేది అన్ని వయసుల వారికి ఎంతో ముఖ్యం.  ఇది జీవితం మెరుగ్గా మలుచుకోవడంలో, ఏదైనా ఒక పనిని చేయడానికి ధైర్యాన్ని ఇవ్వడంలో సహాయపడుతుంది.  ఆత్మవిశ్వాసం లేకపోతే ఎంత సులువైన పని అయినా సరిగా చేయలేరు....
ప్రతి మనిషి రెండు రకాల ఆరోగ్యాల గురించి ఆలోచించాలి.  ఒకటి శారీరక ఆరోగ్యమైతే.. రెండవది మానసిక ఆరోగ్యం. శారీరక  ఆరోగ్యం గురించి చాలామంది ఆలోచన చేస్తారు.  మంచి శారీక ఆరోగ్యం కోసం చాలా రకాల టిప్స్ ఇంకా మంచి జీవనశైలి పాటించడానికి కూడా ప్రయత్నం...
అతి సర్వత్రా వర్జయేత్  అని అన్నారు పెద్దలు.  అంటే అతిగా ఏం చేసినా అది నష్టాన్నే కలిగిస్తుంది అని. అతిగా తినడం, తాగడం, ఏదైనా పని చేయడం,  నిద్రపోవడం.. ఇలా ఒకటని కాదు.. అతిగా ఏం చేసినా దానివల్ల కలిగే లాభం కంటే నష్టమే ఎక్కువ ఉంటుంది...
ప్రపంచంలో ప్రతి మనిషి తన తన పాత్రలతో, బాధ్యతలతో జీవనం కొనసాగిస్తాడు. అందులో పురుషుల పాత్ర ప్రత్యేకం. కుటుంబం, సమాజం, వృత్తి ఈ మూడు రంగాలలోనూ పురుషులు  నిశ్శబ్దంగా, కనిపించని ఒత్తిడులను భరిస్తూ సాగుతుంటారు...
ఈ ప్రపంచంలో చాలా పవిత్రతను,  ప్రత్యేకతను కలిగి ఉండేది వైవాహిక బంధం.  ఇద్దరు వేర్వేరు వ్యక్తులు వివాహంతో ఒక్కటై.. జీవితాంతం కలిసి ఉండటం ఈ బంధానికి చాలా ప్రాధాన్యతను తెచ్చి పెడుతుంది.  సహజంగా పెళ్లి అంటే చాలా హడావిడి జరుగుతుంది....
 
Disclaimer:
All content included on this TeluguOne.com Portal including text, graphics, images, videos and audio clips, is the property of ObjectOne Information Systems Ltd. or our associates, and protected by copyright laws. The collection, arrangement and assembly of all content on this portal/ related channels is the exclusive property of ObjectOne Information Systems Ltd. or our associates and protected copyright laws.
 
You may not copy, reproduce, distribute, publish, display, perform, modify, create derivative works, transmit, or in any other way exploit any part of copyrighted material without permission from ObjectOne Information Systems Ltd or our associates.