కమ్యూనిస్టుల వింతధోరణి!
Publish Date:Apr 20, 2012
Advertisement
నిత్యం నిద్రలేచిన దగ్గరనుంచి సిద్ధాంతాల గురించి వల్లెవేసే కమ్యూనిస్టులు ఎన్నికల పొత్తు విషయంలో వారు అవలంభించే విధానాలు, వేసే ఎత్తుగడలు చూసినప్పుడు చాలా వింతగా అనిపిస్తుంది. వారి దృష్టిలో కాంగ్రెస్, తెలుగుదేశంలు బూర్జువాపార్టీలు. అయినా ఎన్నికల్లో వాటితో పొత్తుపెట్టు కొంటారు. ఎన్నికల్లో నాలుగు సీట్లు ఎక్కువ వస్తే ఎంతోగోప్పగా ఎత్తుగడలు వేసినట్టు, ఓడిపోయి సీట్లు తగ్గిపోతే వ్యూహం విఫలమైనట్టు వారు విశ్లేషణలు చేస్తారు. ఒక ఎన్నికల్లో కాంగ్రెస్ తో పొత్తుపెట్టుకుంటారు. మరొక ఎన్నికలకు తెలుగుదేశంపార్టీతో పొత్తుపెట్టుకుంటారు. మరో ఎన్నికల్లో ఎవరితోనూ పోట్టులేకుండా ఉభయ కమ్యూనిస్టులు కలిగి పోటీ చేస్తారు. ఎన్నికలకి ఎన్నికలకి మధ్య ఏమార్పులు జరిగాయో ... ఒప్పందాలు ఎందుకు మార్చుకుంటారో సామా న్యులకు అంతుపట్టవు. ఉభయ కమ్యూనిస్టు నేతలు సభలు, మహాసభల సందర్భంగా వేదికలపై చేతులు కలిపి ఫోటోలు దిగుతారు. కలిసి ఉద్యమాలు చేస్తామని ప్రకటిస్తారు. తర్వాత ఎవరి దుకాణం వారిదే అన్నట్టుగా వ్యవహరిస్తున్నారు. త్వరలోల జరగనున్న ఉప ఎన్నికల నేపథ్యంలో రెండు కమ్యూనిస్టు పార్టీల మధ్య ఎటువంటి చర్చలు జరగలేదు. ఉప ఎన్నికల్లో సిపిఎం విడిగా ఒంటరిగా పోటీ చేయాలని నిర్ణయించింది. అన్ని స్థానాలకు పోటీ చేస్తుందా? లేక తెలంగాణలోని పరకాల, ప్రకాశం జిల్లాలోని స్థానాలకే పరిమితం అవుతుందా? పోటీ చేయని మిగిలిన స్తానాలో ఏ పార్టీకి మద్దతు తెలియచేస్తుంది? అనే అంశాలు నిర్థారణ కాలేదు. సిపీఐ మాత్రం తెలుగుదేశంపార్తీతో పొత్తుపెట్టుకోవాలనే ఆలోచనలో కాదు ... కాదు ... ఎత్తుగడలో వుంది. ఉప ఎన్నికలు జరిగే 18 స్తానాలో అనంతపురం సిపీఐకి కేటాయించే పక్షంలో మిగిలిన అన్ని నియోజకవర్గాలలో తెలుగుదేశంపార్టీకి మద్దతు ప్రకటించే విధంగా ఆ పార్టీ నేత నారాయణ తెలుగుదేశంపార్టీ నాయకుడు చంద్రబాబుతో సంప్రతింపులు జరుపుతున్నారు. కమ్యూనిస్టులతో విసిగిపోయిన కొంతమంది తెలుగుదేశం నేతలు కమ్యూనిస్టులతో పొత్తులు అనవసరం అంటుంటే చంద్రబాబు మాత్రం కీలకంగా భావిస్తున్న ఉప ఎన్నికలలో విజయం సాధించడానికి అందివచ్చిన ప్రతి అవకాశాన్ని సద్వినియోగం చేసుకోవాలని భావిస్తున్నారు.
http://www.teluguone.com/news/content/communist-parties-24-13492.html
సుబ్రతో రాయ్ అరెస్ట్ ...
ఖరారైన రాష్ట్రపతి పాలన ...
రాష్ట్రపతి పాలనకే మొగ్గు ...
విఫలమైన 'టి' కాంగ్రెస్
చంద్రబాబు పాదయాత్ర ఈ నెల 31న పునఃప్రారంభ౦ కానుంది. ఫిబ్రవరి నాల్గోతేదీ వరకు విజయవాడలో కోనసాగనుంది. ఆరోగ్య కారణాల రీత్యా చంద్రబాబు 29, 30లలో కూడా విశ్రాంతి తీసుకోనున్నారని తెలుగుదేశం నాయకులు ప్రకటించారు.
తెలంగాణ కాంగ్రెస్ ఎంపీలు కేకే నివాసంలో భేటి అయ్యారు. తెలంగాణపై పార్టీ అధిష్టానం వైఖరిని వ్యతిరేకిస్తూ పార్టీ సభ్యత్వానికి, పదవులకు కూడా రాజీనామా చేసి అధిష్టానం పై ఒత్తిడి పెంచేందుకు రంగం సిద్దం చేస్తున్నారు. రాజీనామా లేఖలను పార్టీ అధ్యక్షురాలు శ్రీమతి సోనియా గాంధి పంపించనున్నారు. భేటి అనంతరం లేఖలను మీడియాకు విడుదల చేయనున్నారు.
తెలుగు సినీ ప్రియులను తన అందచందాలతో, అసమానమయిన నటనతో ఒక ఊపుఊపిన అందాల తార జయప్రద, ఆ తరువాత బాలీవుడ్ లోను ఒక వెలుగు వెలిగింది. తెలుగుదేశంపార్టీలో జేరి రాష్ట్ర రాజకీయాలలో పాల్గొన్నపటికీ, చంద్రబాబుతో పొసగక ఏకంగా డిల్లీ రైలెక్కి ఉత్తర ప్రదేశ్ రాష్ట్రంలో వాలిపోయింది.
జానారెడ్డికి బుద్ది ,జ్ఞానం ఉందా? తెలంగాణ ప్రత్యేక రాష్ట్ర ఏర్పాటు మీద కాంగ్రెస్ ప్రకటన కోసం ఇంకా వేచిచూద్దాం అంటాడా. కాంగ్రెస్ ప్రకటనలో ఇంకా నిజాయితీ ఉందన్న జానారెడ్డి మాటలను తెలంగాణ ప్రజలు విశ్వసించరు. ముఖ్యమంత్రి పదవికోసం జానారెడ్డి గోతికాడ నక్కలా ఎదురు చూస్తున్నాడు.
వైయస్సార్ కాంగ్రెస్ చేపట్టిన కోటి సంతకాల సేకరణపై తెలుగుదేశం పార్టీ తీవ్ర విమర్శలు గుప్పించిన ఆరు నెలలకి ఇప్పుడు తాపీగా ఆ పార్టీ నేతలు స్పందించడం చూస్తుంటే ఆ పార్టీ నాయకత్వలోపం మరోసారి బయట పడుతోంది.
చంద్రబాబు తెలంగాణా జిల్లలో పాదయాత్ర చేస్తునంత కాలం తన వైయస్సార్ కాంగ్రెస్ పార్టీని, తన నాయకుడు జగన్ మోహన్ రెడ్డిని అయన ఎంత తీవ్రంగా విమర్శించినా స్పందించని కొడాలి నాని, చంద్రబాబు ఇప్పుడు తన కృష్ణా జిల్లాలో పాదయాత్ర చేస్తూ అదే విధంగా విమర్శలు చేసినప్పుడు మాత్రం వెంటనే స్పందించారు.
రాష్ట్ర రాజధానిలోఇందిరా పార్క్ వద్ద నేటి నుండి 36గంటల సమరదీక్షను నిర్వహించాలన్న పట్టుదలతో ఉన్న తెలంగాణా జేయేసీ నేతలు, పోలీసు ఆదేశాలను
నిర్విరామంగా సాగుతూ 117వ రోజుకు జేరుకొన్నచంద్రబాబు పాదయాత్ర ఈరోజు కృష్ణా జిల్లాలో పరిటాలకు చేరుకొంది. ముందు అనుకొన్న ప్రకారం అయితే ఈ రోజుతో ఆయన పాదయాత్ర ముగించాల్సి ఉంది. అయన కుటుంబ సభ్యులు, పార్టీ నేతలు మరియు వైద్యులు కూడా పాదయాత్ర ముగించమని కోరినప్పటికీ చంద్రబాబు తన పాదయాత్రను కొనసాగించడానికే నిశ్చయించుకొన్నారు.
తెలంగాణా జేయేసీ అద్వర్యంలో సికిందరాబాద్ లో ఇందిరా పార్క్ వద్ద 36గంటల సమరదీక్షకు అనుమతి కోరుతూ జేయేసీ నేతలు హోంమంత్రి సబితా ఇంద్రరెడ్డికి వినతిపత్రం సమర్పించగా, కొద్దిసేపటిలోనే వారికి అనుమతి నిరాకరిస్తున్నట్లు పోలీసుల నుండి వెంటనే లేఖ అందడంతో తెలంగాణావాదులు కిరణ్ కుమార్ రెడ్డి మీద, పోలీసుల మీద మండిపడ్డారు.





