ఇంతకీ ఉప ఎన్నికలు ఎప్పుడు?
Publish Date:Apr 20, 2012
Advertisement
రాష్ట్రంలో ఉప ఎన్నికలు ఎప్పుడు జరుగుతాయి? అనే అంశంపై ఆసక్తి నెలకొంది. కేంద్ర ఎన్నికల సంఘం చేసిన ప్రకటనలకి, రాష్ట్ర ఎన్నికల సంఘం చేసిన ప్రకటనలకి పొంతన లేకపోవడం ఇందుకు కారణం. దేశంలోంని ఖాళీ అయిన అన్ని స్థానాలకు కలిపి ఎన్నికలు నిర్వహిస్తామని, అందుకుగాను మొత్తం ఖాళీలు, ఆయజా రాష్ట్రాలలోని పరిస్థితుల గురించి తెలుసుకుంటున్నామని, వివరాలు అందిన తర్వాత ఉప ఎన్నికలు ఎప్పుడు నిర్వహించేది ప్రకటిస్తామని కేంద్ర ఎన్నికల సంఘం అధికారులు ప్రకటించగా, రాష్ట్ర ఎన్నికల అధికాని భన్వర్ లాల్ మాత్రం ఉప ఎన్నికలు రంగం సిద్ధం చేస్తున్నట్టు ప్రకటించారు. ఉప ఎన్నికలకు సంబంధించి ఏర్పాట్ల విషయంలో తెలుగుదేశంపార్టీ మాత్రమే ముందుంది. ఉప ఎన్నికలు జరగబోయే 18 స్థానాలకుగాను 16 స్థానాలలో అభ్యర్థులను ప్రకటించింది. సిపీఐ పార్టీతో పొత్తు పెట్టుకోవడానికి కూడా సిద్ధమైంది. వై.ఎస్.ఆర్. కాంగ్రెస్ పార్టీ తరపున తాజా మాజీ శాసనసభ్యులే అభ్యర్థులుగా వుంటారు. అయితే ఒకటి రెండు స్థానాల్లో మాత్రం తాజా మాజీ పోటీకి సిద్ధంగా లేరు. అదేవిధంగా తెలంగాణాలోని పరకాల స్థానం విషయంలో కూడా స్పష్టత లేకుండా వుంది. ఇక్కడ తాజా మాజీగా వున్న మాజీమంత్రి కొండా సురేఖ స్వతంత అభ్యర్థిగా రంగంలోకి దిగాలనుకొంటుంటే వై.ఎస్.ఆర్. పార్టీ నేతలు మాత్రం ఆమెను పార్టీ తరపున పోటీకి దించాలని, లేదంతే పార్టీకి కోస్తాలో పరువుపోతుందని ఆ పార్టీ ద్వితీయశ్రేణి నేతలు. అభిమానులు పట్టుబడుతున్నట్టు తెలిసింది. అధికారపార్టీ కాంగ్రెస్ లో పరిస్థితి మరింత గందరగోళంగా వుంది. ఉప ఎన్నికల అభ్యర్థులు ఎవరో ఇంకా నిర్థారణ కాలేదు. తక్షణం ఎన్నికలు జరిగినా లేదా మరో మూడు నెలలకు జరిగినా ఆఖరిక్షణం వరకు అభ్యర్థులు ఖరారయ్యే అవకాశం లేదనిపిస్తోంది. ఉప ఎన్నికలు జరిగే అన్ని స్థానాలు కాంగ్రెస్ పార్టీకి చెందినవి కావడం వల్ల ఒక స్థానంలో ఓడిపోయినా పార్టీకి నష్టమే. కాని వాస్తవ పరిస్థితులు చూస్తుంటే కనీసం ఒక స్థానంలో గెలిచే పరిస్థితి కూడా కనిపించడం లేదు. రాష్ట్రంలో నెలకొని వున్న అనేక పరిస్థితులకు తోడు అదనంగా ఉప ఎన్నికలు ఎప్పుడు జరుగుతాయి? అనే అంశంపై కూడా చర్చ కొనసాగుతోంది.
http://www.teluguone.com/news/content/chief-election-commission-of-india-24-13493.html
సుబ్రతో రాయ్ అరెస్ట్ ...
ఖరారైన రాష్ట్రపతి పాలన ...
రాష్ట్రపతి పాలనకే మొగ్గు ...
విఫలమైన 'టి' కాంగ్రెస్
చంద్రబాబు పాదయాత్ర ఈ నెల 31న పునఃప్రారంభ౦ కానుంది. ఫిబ్రవరి నాల్గోతేదీ వరకు విజయవాడలో కోనసాగనుంది. ఆరోగ్య కారణాల రీత్యా చంద్రబాబు 29, 30లలో కూడా విశ్రాంతి తీసుకోనున్నారని తెలుగుదేశం నాయకులు ప్రకటించారు.
తెలంగాణ కాంగ్రెస్ ఎంపీలు కేకే నివాసంలో భేటి అయ్యారు. తెలంగాణపై పార్టీ అధిష్టానం వైఖరిని వ్యతిరేకిస్తూ పార్టీ సభ్యత్వానికి, పదవులకు కూడా రాజీనామా చేసి అధిష్టానం పై ఒత్తిడి పెంచేందుకు రంగం సిద్దం చేస్తున్నారు. రాజీనామా లేఖలను పార్టీ అధ్యక్షురాలు శ్రీమతి సోనియా గాంధి పంపించనున్నారు. భేటి అనంతరం లేఖలను మీడియాకు విడుదల చేయనున్నారు.
తెలుగు సినీ ప్రియులను తన అందచందాలతో, అసమానమయిన నటనతో ఒక ఊపుఊపిన అందాల తార జయప్రద, ఆ తరువాత బాలీవుడ్ లోను ఒక వెలుగు వెలిగింది. తెలుగుదేశంపార్టీలో జేరి రాష్ట్ర రాజకీయాలలో పాల్గొన్నపటికీ, చంద్రబాబుతో పొసగక ఏకంగా డిల్లీ రైలెక్కి ఉత్తర ప్రదేశ్ రాష్ట్రంలో వాలిపోయింది.
జానారెడ్డికి బుద్ది ,జ్ఞానం ఉందా? తెలంగాణ ప్రత్యేక రాష్ట్ర ఏర్పాటు మీద కాంగ్రెస్ ప్రకటన కోసం ఇంకా వేచిచూద్దాం అంటాడా. కాంగ్రెస్ ప్రకటనలో ఇంకా నిజాయితీ ఉందన్న జానారెడ్డి మాటలను తెలంగాణ ప్రజలు విశ్వసించరు. ముఖ్యమంత్రి పదవికోసం జానారెడ్డి గోతికాడ నక్కలా ఎదురు చూస్తున్నాడు.
వైయస్సార్ కాంగ్రెస్ చేపట్టిన కోటి సంతకాల సేకరణపై తెలుగుదేశం పార్టీ తీవ్ర విమర్శలు గుప్పించిన ఆరు నెలలకి ఇప్పుడు తాపీగా ఆ పార్టీ నేతలు స్పందించడం చూస్తుంటే ఆ పార్టీ నాయకత్వలోపం మరోసారి బయట పడుతోంది.
చంద్రబాబు తెలంగాణా జిల్లలో పాదయాత్ర చేస్తునంత కాలం తన వైయస్సార్ కాంగ్రెస్ పార్టీని, తన నాయకుడు జగన్ మోహన్ రెడ్డిని అయన ఎంత తీవ్రంగా విమర్శించినా స్పందించని కొడాలి నాని, చంద్రబాబు ఇప్పుడు తన కృష్ణా జిల్లాలో పాదయాత్ర చేస్తూ అదే విధంగా విమర్శలు చేసినప్పుడు మాత్రం వెంటనే స్పందించారు.
రాష్ట్ర రాజధానిలోఇందిరా పార్క్ వద్ద నేటి నుండి 36గంటల సమరదీక్షను నిర్వహించాలన్న పట్టుదలతో ఉన్న తెలంగాణా జేయేసీ నేతలు, పోలీసు ఆదేశాలను
నిర్విరామంగా సాగుతూ 117వ రోజుకు జేరుకొన్నచంద్రబాబు పాదయాత్ర ఈరోజు కృష్ణా జిల్లాలో పరిటాలకు చేరుకొంది. ముందు అనుకొన్న ప్రకారం అయితే ఈ రోజుతో ఆయన పాదయాత్ర ముగించాల్సి ఉంది. అయన కుటుంబ సభ్యులు, పార్టీ నేతలు మరియు వైద్యులు కూడా పాదయాత్ర ముగించమని కోరినప్పటికీ చంద్రబాబు తన పాదయాత్రను కొనసాగించడానికే నిశ్చయించుకొన్నారు.
తెలంగాణా జేయేసీ అద్వర్యంలో సికిందరాబాద్ లో ఇందిరా పార్క్ వద్ద 36గంటల సమరదీక్షకు అనుమతి కోరుతూ జేయేసీ నేతలు హోంమంత్రి సబితా ఇంద్రరెడ్డికి వినతిపత్రం సమర్పించగా, కొద్దిసేపటిలోనే వారికి అనుమతి నిరాకరిస్తున్నట్లు పోలీసుల నుండి వెంటనే లేఖ అందడంతో తెలంగాణావాదులు కిరణ్ కుమార్ రెడ్డి మీద, పోలీసుల మీద మండిపడ్డారు.





