రైతు నాయకుడిగా మారిన రిటైర్డ్ డీజీపీ

Publish Date:May 23, 2025

Advertisement

 

కోకో గింజలు కొనుగోలు ధరపై రాష్ట్ర ప్రభుత్వం ఏలూరు కలెక్టరేట్ లో నిర్వహించిన ద్వైపాక్షిక చర్చలు పూర్తిగా విఫలమైనట్లు ఆంధ్రప్రదేశ్ కోకో రైతుల సంఘం రాష్ట్ర నాయకులు ప్రకటించారు. కోకో గింజలకు అంతర్జాతీయ మార్కెట్ ధర ఇవ్వకుండా మోసగిస్తున్న మోండలీజ్ కంపెనీ, ఇతర బహుళ జాతి కంపెనీల మోసాలకు నిరసనగా, రాష్ట్ర ప్రభుత్వ పరిష్కారాన్ని పూర్తిగా వ్యతిరేకిస్తూ ఏలూరు కలెక్టరేట్ ముందు కోకో రైతులు ధర్నా నిర్వహించారు.కోకో రైతులకు న్యాయం చేయాలని, అంతర్జాతీయ మార్కెట్ ధర ఇవ్వాలని, కార్పొరేట్ కంపెనీల మోసాలను అరికట్టాలంటూ పెద్ద ఎత్తున నినాదాలు చేశారు.

ఈ ధర్నానుద్దేశించి ఆంధ్రప్రదేశ్ కోకో రైతుల సంఘం రాష్ట్ర గౌరవాధ్యక్షులు, రిటైర్డ్ డిజిపి ఏ.బీ వెంకటేశ్వరరావు మాట్లాడుతూ గత మూడు నెలలుగా కోకో రైతులు పెద్ద ఎత్తున పోరాటం చేస్తున్నారని, గత వారం రోజులుగా పోరాటాన్ని ఉధృతం చేశారని చెప్పారు. రాష్ట్ర వ్యవసాయ శాఖ మంత్రి  అచ్చెన్నాయుడు, రాష్ట్ర గృహ నిర్మాణ శాఖ మంత్రి కొలుసు పార్థసారథి, ఎమ్మెల్యేలు, రాష్ట్ర ఉన్నతాధికారులు సమక్షంలో పెద్ద సంఖ్యలో వచ్చిన కోకో రైతులతో జరిపిన చర్చలకు భౌతికంగా రాకుండా  మోండలీజ్ కంపెనీ ప్రతినిధులు వీడియో కాన్ఫరెన్స్ లో మాట్లాడాన్ని తీవ్రంగా ఖండించారు. ఇది కంపెనీల లెక్కలేనితనమని విమర్శించారు. రైతులకు బిక్షం వేస్తున్నట్లుగా అంతర్జాతీయ మార్కెట్ లో కిలో కోకో గింజలకు రూ.880/- ఉంటే మోండలీజ్ కంపెనీ రూ.450/- కు మించి ధర ఇవ్వలేమని చెప్పడం దుర్మార్గమని, ఇది బహుళ జాతి కంపెనీల కుట్రలో భాగమని విమర్శించారు. 

రాష్ట్ర మంత్రులు ఎన్నిసార్లు ప్రశ్నించినా మోండలీజ్ కంపెనీ ప్రతినిధుల మొండితనంతో కూడిన సమాధానం హేతుబద్ధంగా లేదన్నారు. గత సంవత్సరం వరకు ఇంటర్నేషనల్ మార్కెట్ ప్రకారం ధర ఇచ్చిన కంపెనీలు ఇప్పుడు ఎందుకు ఇవ్వడం లేదని ప్రశ్నించారు. కస్టమ్స్, ఇతర గణాంకాలను పరిశీలిస్తే గత నెల 25న కిలో కోకో గింజలను ఇవే కంపెనీలు రూ.1074/- దిగుమతి చేసుకొన్నాయని వివరించారు. రాష్ట్ర ప్రభుత్వానికి చట్టపరమైన నియంత్రణ లేకపోవడంతో కంపెనీల ఇష్టారాజ్యంగా మారిందన్నారు. కంపెనీ కిలో కోకో గింజలను రూ.450/- లకు కొనుగోలు చేస్తుందని, రాష్ట్ర ప్రభుత్వం మరో రూ.50 కంపెనీకి ఇచ్చి రూ.500లకు కొనుగోలు చేస్తామని  రాష్ట్ర మంత్రులు ప్రకటించిన నిర్ణయాన్ని పూర్తిగా వ్యతిరేకిస్తున్నామని చెప్పారు. ఈ పరిష్కారాన్ని తిరస్కరిస్తున్నామన్నారు. బహుళ జాతి కంపెనీల మోసాలను అంతర్జాతీయ మీడియా ద్వారా ఎండగడతామని హెచ్చరించారు.

By
en-us Political News

  
జూబ్లీహిల్స్‌ బీఆర్ఎస్ ఎమ్మెల్యే మాగంటి గోపీనాథ్‌ దేవుడి దయతో కోలుకోవాలని మాజీ మంత్రి హరీశ్ రావు అన్నారు. గచ్చిబౌలిలోని ఏఐజీ హాస్పిటల్‌కు వెళ్లిన ఆయన గోపీనాథ్‌ ఆరోగ్యంపై ఆరా తీశారు. నిపుణులైన వైద్యలు ఎప్పటికప్పుడు జాగ్రత్తగా పర్యవేక్షిస్తున్నట్లు చెప్పారు
జూబ్లీహిల్స్‌ బీఆర్ఎస్ ఎమ్మెల్యే మాగంటి గోపీనాథ్‌ తీవ్ర అస్వస్థతకు గురయ్యారు. దీంతో ఆయన్ను వెంటనే గచ్చిబౌలిలోని ఏఐజీ ఆసుపత్రికి తరలించారు. గుండె సంబంధిత సమస్యతో అస్వస్థతకు గురైనట్టు గుర్తించిన వైద్యులు చికిత్స అందిస్తున్నారు.
విశాఖ రైల్వే జోన్ ఏర్పాటులో మరో ముందడుగు పడింది. సౌత్ కోస్ట్ రైల్వే జోన్ తొలి జీఎంగా సందీప్ మాథుర్ నియమితులయ్యారు. ఈ మేరకు రైల్వేశాఖ ఉత్తర్వులు జారీ చేసింది.
నాగర్ కర్నూలు ఎంపీ మల్లు రవి పైన క్రమశిక్షణ చర్యలు తీసుకోవాలని టీపీసీసీ అధ్యక్షులు మహేష్ కుమార్ గౌడ్‌కి ఏఐసీసీ తెలంగాణ ఇంచార్జి మీనాక్షీ నటరాజన్‌కి ఫిర్యాదు చేశారు
జూబ్లీహిల్స్ బీఆర్ఎస్ ఎమ్మెల్యే మాగంటి గోపీనాథ్ తీవ్ర అస్వ‌స్థ‌త‌కు గుర‌య్యారు.
తెలంగాణ మాజీ ముఖ్యమంత్రి కేసీఆర్ కుమార్తె, ఎమ్మెల్సీ కల్వకుంట్ల కవిత ఇందిరా పార్క్ వద్ద బుధవారం (జూన్ 4) చేపట్టిన ధర్నా వృధా అయ్యింది.
మావోయిస్టులకు మరో ఎదురుదెబ్బ తగిలింది. మావోయిస్టు అగ్రనేత కేంద్ర కమిటీ సభ్యుడు టెంతు లక్ష్మీనరసింహాచలం అలియాస్ సుధాకర్, ఛత్తీస్‌గఢ్‌ బీజాపూర్ జిల్లాలోని జాతీయ పార్క్ వద్ద జరిగిన ఎన్‌కౌంటర్‌లో మృతి చెందారు.
బెంగళూరు చిన్నస్వామి స్టేడియం తొక్కిసలాట ఘటనలో మృతి చెందిన 11 మంది కుటుంబాలకు ఆర్సీబీ పరిహారం ప్రకటించింది. రూ.10 లక్షల చొప్పున ఆర్ధిక సాయం అందించనున్నట్లు తెలిపింది.
వైసీపీ నాయకులు అధికారంలో ఉండగా చేసిన అరాచకాలు, దౌర్జన్యాలు, తప్పుల కారణంగా కేసుల బారిన పడుతున్నారు. అయితే అరెస్టులు, కేసుల ద్వారా ప్రజలలో సింపతీని గెయిన్ చేయవచ్చన్న భావనతతో కేసులకు ఎదురెడుతున్నారా అన్న అనుమానం కలగక మానదు అంబటి రాంబాబు వంటి వారి తీరు చూస్తుంటే.
ప్రతి ఒక్కరు మొక్కలు నాటాలని లేకపోతే భవిష్యత్‌లో ఆక్సిజన్‌ మాస్కులు పెట్టుకునే పరిస్థితి వస్తుందని మంత్రి పొన్నం ప్రభాకర్‌ అన్నారు. ప్రపంచ పర్యావరణ దినోత్సవం సందర్భంగా గోల్కొండ ఏరియా హాస్పిటల్లో మంత్రి మొక్కలు నాటారు.
వైసీపీ నేత కాకాణి గోవ‌ర్ధన్ రెడ్డి బెయిల్ పిటిషన్ వాయిదా పడింది. క్వార్ట్జ్‌ అక్రమ మైనింగ్ గిరిజనులను బెదిరించిన కేసులో అరెస్ట్ అయిన ఆయన నెల్లూరు ఐదో ఎస్సీ, ఎస్టీ అదనపు కోర్టులో పిటిషన్ దాఖలు చేశారు.
నవ్యాంధ్రప్రదేశ్ రాజధాని అమరావతికి ప్రతిష్ఠాత్మక సంస్థలు తరలి వస్తున్నాయి. తాజాగా మరో ప్రతిష్ఠాత్మ విద్య సంస్థ ఏర్పాటుకు లైన్ క్లియర్ అయ్యింది. అమరావతిలో న్యాయ విశ్వవిద్యాలయం లా యూనివర్శిటీ ఏర్పాటు కానుంది.
వైసీపీ నేత కాకాణి గోవ‌ర్ధన్ రెడ్డి బెయిల్ పిటిషన్ వాయిదా పడింది. క్వార్ట్జ్‌ అక్రమ మైనింగ్ గిరిజనులను బెదిరించిన కేసులో అరెస్ట్ అయిన ఆయన నెల్లూరు ఐదో ఎస్సీ, ఎస్టీ అదనపు కోర్టులో పిటిషన్ దాఖలు చేశారు.
 
Disclaimer:
All content included on this TeluguOne.com Portal including text, graphics, images, videos and audio clips, is the property of ObjectOne Information Systems Ltd. or our associates, and protected by copyright laws. The collection, arrangement and assembly of all content on this portal/ related channels is the exclusive property of ObjectOne Information Systems Ltd. or our associates and protected copyright laws.
 
You may not copy, reproduce, distribute, publish, display, perform, modify, create derivative works, transmit, or in any other way exploit any part of copyrighted material without permission from ObjectOne Information Systems Ltd or our associates.