కాంగ్రెస్‌ పార్టీలో వ్యతిరేకత ఎదుర్కొన్నా : సీఎం రేవంత్ రెడ్డి

Publish Date:Feb 21, 2026

Advertisement

 

వికారాబాద్ జిల్లా అనంతగిరి హరితా రిసార్ట్‌లో తెలంగాణ, ఆంధ్రప్రదేశ్ రాష్ట్రాల డీసీసీ అధ్యక్షుల శిక్షణా తరగతులను సీఎం రేవంత్ రెడ్డి ప్రారంభించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ, కాంగ్రెస్‌తో పోటీ పడుతున్న ఏ రాజకీయ పార్టీ కూడా దేశ స్వాతంత్ర్యానికి ముందు పుట్టలేదని తెలిపారు. 141 సంవత్సరాల క్రితం ఆవిర్భవించిన కాంగ్రెస్ పార్టీ 140 కోట్ల భారత ప్రజలకు స్ఫూర్తిగా నిలిచిందన్నారు. దేశానికి స్వాతంత్ర్యం తీసుకువచ్చి దిశానిర్దేశం చేసిన పార్టీ కాంగ్రెస్ అని స్పష్టం చేశారు. వందేళ్ల చరిత్ర కలిగిన మరో పార్టీ సీపీఐ మాత్రమేనని పేర్కొన్నారు. ఏఐసీసీ చేపట్టిన ఈ శిక్షణా కార్యక్రమం ఎంతో ఉపయోగకరమని తెలిపారు.

దేశ స్వాతంత్ర్యానికి ముందు 140 ఏళ్ల క్రితమే కాంగ్రెస్ పార్టీ ఆవిర్భవించిందని గుర్తుచేశారు. దేశానికి స్వాతంత్ర్యం తెచ్చిన పార్టీ కాంగ్రెస్ అని అన్నారు. కాంగ్రెస్ తెచ్చిన స్వాతంత్ర్యం, ఇచ్చిన రాజ్యాంగాన్ని ఉపయోగించుకుని ఏర్పడిన కొన్ని పార్టీలు ఇప్పుడు “కాంగ్రెస్ ముక్త భారత్” అంటూ నినాదాలు చేస్తున్నాయని రేవంత్ విమర్శించారు. భారతదేశ ఆత్మగౌరవం గ్రామాల్లో ఉందని నమ్మే పార్టీ కాంగ్రెస్ అని చెప్పారు. రాజ్యాంగాన్ని రద్దు చేయాలని, సమూలంగా మార్చాలని కుట్రలు జరుగుతున్న ఈ సమయంలో ఈ శిక్షణా కార్యక్రమం మరింత ప్రాధాన్యత సంతరించుకుందని అన్నారు. డీసీసీ అధ్యక్షులు ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకోవాలని సీఎం సూచించారు.

వారసత్వంగా పదవులు పొందే అవకాశం ఉన్నప్పటికీ వైఎస్ షర్మిల అలా చేయలేదని పేర్కొన్నారు. మహాత్మా గాంధీ, జవహర్‌లాల్ నెహ్రూ దేశం కోసం జైలు శిక్షలు అనుభవించారని తెలిపారు. మహాత్మా గాంధీ బ్రిటిష్ వారికి వ్యతిరేకంగా పోరాడగా, స్వాతంత్ర్యం వచ్చిన తర్వాత భారతీయుల తూటాలకు ఆయనే బలయ్యారని గుర్తుచేశారు.
గాంధీ, ఇందిరా గాంధీ, రాజీవ్ గాంధీ దేశం కోసం ప్రాణత్యాగం చేశారని అన్నారు. దేశ సమగ్రత కోసం ఇందిరా గాంధీ, రాజీవ్ గాంధీ తమ ప్రాణాలు అర్పించారని చెప్పారు. రాజీవ్ గాంధీ ఆశయాల సాధన కోసం సోనియా గాంధీ త్యాగం చేసి కాంగ్రెస్‌కు అండగా నిలిచారని పేర్కొన్నారు. సౌకర్యంగా పదవులు పొందే అవకాశం ఉన్నప్పటికీ రాహుల్ గాంధీ 4000 కిలోమీటర్ల పాదయాత్ర చేసి ప్రజల్లోకి వెళ్లారని తెలిపారు.

వైఎస్ రాజశేఖర రెడ్డి పాదయాత్ర, ఆయన చేపట్టిన సంక్షేమ కార్యక్రమాలు, అభివృద్ధి పనులు కాంగ్రెస్ విజయాల్లో ప్రస్తావించాల్సినవని అన్నారు. వైఎస్ షర్మిల తెలంగాణలో 3000 కిలోమీటర్ల పాదయాత్ర చేసి, ప్రస్తుతం ఏపీలో పార్టీ కోసం కష్టపడుతున్నారని చెప్పారు. డీసీసీ అధ్యక్షులు జిల్లాలకు అధిపతులమని భావించవద్దని సూచించారు. విభేదించిన వారిని అణగదొక్కే ప్రయత్నం చేయవద్దని హెచ్చరించారు. తాను పీసీసీ అధ్యక్షుడిగా బాధ్యతలు స్వీకరించిన తర్వాత ప్రతి నాయకుడి ఇంటికి వెళ్లి మద్దతు కోరానని గుర్తుచేశారు. కలిసికట్టుగా పనిచేసినందువల్లే 2.5 శాతం ఓట్లున్న కాంగ్రెస్ పార్టీ 40 శాతం ఓట్లు సాధించి అధికారంలోకి వచ్చిందని తెలిపారు.

119 నియోజకవర్గాల్లో 42 లక్షల డిజిటల్ సభ్యత్వాలు నమోదు చేసినట్లు చెప్పారు. డీసీసీ అధ్యక్షులుగా కృషి చేసిన వారికి ఎమ్మెల్యేలుగా అవకాశాలు ఇచ్చామని, అనుబంధ విభాగాల్లో పనిచేసిన వారికి కార్పొరేషన్ పదవులు కల్పించామని తెలిపారు. డీసీసీ అధ్యక్షుల ప్రతి చర్యను పార్టీ పరిశీలిస్తుందని హెచ్చరించారు. కాంగ్రెస్‌లో ఎలాంటి కోటాలు లేవని, మెరిట్‌ కోటా మాత్రమే ఉంటుందని స్పష్టం చేశారు. డీసీసీ అధ్యక్ష పదవిని దుర్వినియోగం చేయవద్దని, పార్టీ విశ్వాసాన్ని దెబ్బతీయవద్దని సూచించారు.

అసెంబ్లీ ఎన్నికల్లో కాంగ్రెస్‌కు ప్రత్యర్థి పార్టీలతో 2 శాతం తేడా ఉండగా, అది పార్లమెంట్ ఎన్నికల్లో 4 శాతానికి, మున్సిపల్ ఎన్నికల్లో 12 శాతానికి పెరిగిందని వివరించారు. ఇది కార్యకర్తల శ్రమ, ప్రజల్లో ఉన్న నమ్మకం వల్ల సాధ్యమైందని చెప్పారు. దేశాన్ని, కాంగ్రెస్‌ను విడదీయలేమని, దేశ ఆత్మనే కాంగ్రెస్ అని అన్నారు. కాంగ్రెస్‌పై బీజేపీ కుట్రలు చేస్తోందని ఆరోపించారు. పార్లమెంట్‌లో రాహుల్ గాంధీకి మాట్లాడే అవకాశం ఇవ్వకుండా అడ్డుకుంటోందని, సోనియా గాంధీ, రాహుల్ గాంధీపై కేసులు పెట్టి అవమానిస్తున్నారని విమర్శించారు. మూడు తరాలు ప్రాణత్యాగం చేసిన గాంధీ కుటుంబానికి డబ్బుల అవసరమా అని ప్రశ్నించారు. రాజకీయంగా గాంధీ కుటుంబాన్ని అడ్డుకోవడానికే బీజేపీ ప్రయత్నిస్తోందని ముఖ్యమంత్రి అన్నారు.

దళితులు, మైనార్టీలు, బడుగు బలహీన వర్గాలు, పేదల గొంతును నొక్కే ప్రయత్నాలు జరుగుతున్నాయని ఆరోపించారు. 100 ఏళ్ల తర్వాత రాష్ట్రంలో కులగణన చేపట్టామని, ఎస్సీ వర్గీకరణ అమలు చేసి దేశానికి ఆదర్శంగా నిలిచామని తెలిపారు. సర్పంచ్ ఎన్నికల్లో 49.83 శాతం బీసీలు గెలిచారని, మున్సిపల్ ఎన్నికల్లో 63 శాతం ఓబీసీలు ఎన్నికయ్యారని వివరించారు. ఇది కాంగ్రెస్ వల్లే సాధ్యమైందని అన్నారు. పైరవీలు చేయకుండా ప్రజా సమస్యల పరిష్కారం కోసం పనిచేస్తే నాయకుల గౌరవం పెరుగుతుందని సూచించారు. తాను ఎప్పుడూ పైరవీల కోసం పనిచేయలేదని తెలిపారు. 16 ఏళ్లలో జెడ్పీటీసీ నుంచి సీఎం వరకు అడుగడుగునా కాంగ్రెస్ తనకు అవకాశం ఇచ్చిందని అన్నారు. రాష్ట్ర విభజన జరిగినప్పటికీ రెండు రాష్ట్రాల్లో కాంగ్రెస్ పార్టీ బలపడాలని ఆకాంక్షించారు. తెలంగాణ, ఆంధ్రప్రదేశ్ రెండూ కలిసి అభివృద్ధి చెందాలని రేవంత్ రెడ్డి పిలుపునిచ్చారు.

By
en-us Political News

  
ఆంధ్రప్రదేశ్ రాజకీయాలో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ (YCP) ప్రస్తుతం తీవ్రమైన వ్యూహాత్మక అయోమయంలో కొట్టుమిట్టాడుతోంది.
ఆంధ్రప్రదేశ్ రాజకీయాల్లో జూనియర్ ఎన్టీఆర్ (తారక్) రాజకీయ అరంగేట్రం గురించిన చర్చ
అమర్ రాజాకు కాలుష్య నియంత్రణ మండలి నిబంధనల పేరుతో నోటీసులు ఇవ్వడం, విద్యుత్ కనెక్షన్లు కట్ చేయడం వంటి చర్యలతో నాటి ప్రభుత్వం ఎలా ఇబ్బందులకు గురి చేసిందో.. పారిశ్రామిక వర్గాలు గుర్తుచేసుకుంటున్నాయి. ఏపీలో పుట్టి పెరిగిన ఒక ప్రతిష్టాత్మక సంస్థ, తన భవిష్యత్తు విస్తరణ, వృద్ధి ప్రస్థానం కోసం రాష్ట్రం దాటి వెళ్లాల్సిరావడంపై సర్వత్రా ఇప్పుడు మరోసారి చర్చ మొదలైంది.
వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ అధికారిక డిజిటల్ వేదికగా రూపొందించిన జగన్ 2.0 సూపర్‌యాప్‌ను వైసీపీ అధినేత జగన్‌ గురువారం తాడేపల్లిలోని పార్టీ కేంద్ర కార్యాలయంలో ఆవిష్కరించారు.
భీమవరం, కిర్లంపూడి లలో పర్యటించారు. రెండు చోట్లా కూడా గందరగోళ పరిస్థితులు నెలకొన్నాయి. ప్రజలలో పట్టు నిరూపించుకోవడానికి ఆయన చేపట్టిన ఏ పర్యటన అయినా సరే.. ఉద్రిక్తతలు, గందరగోళం మధ్యే సాగుతున్నాయి.
కిర్లంపూడి పోలీస్ స్టేషన్‌లో ఆయనతో పాటు మరికొందరు  వైసీపీ నేతలపై  పోలీసులు  ఎఫ్ఐఆర్ నమోదు చేశారు. ప్రభుత్వ నిబంధనల ప్రకారం విధుల్లో ఉన్న పోలీసు సిబ్బందిని అడ్డుకుని, వారిపై భౌతిక దాడికి దిగారనే ఆరోపణలపై ఈ చర్యలు తీసుకున్నారు. 
రేవంత్ రెడ్డి ప్రభుత్వానికి కౌశిక్ రెడ్డి ఒక ఛాలెంజ్ విసిరారు. కన్నెపల్లి పంప్ హౌస్ ద్వారా నీటిని వెంటనే ఎత్తిపోయాలని, ఆ నీటిని అన్నారం, సుందిళ్ల బ్యారేజీల మీదుగా ఎల్లంపల్లికి తరలించాలని డిమాండ్ చేశారు. ఒకవేళ ఆ విధంగా నీటిని ఎత్తిపోసే ప్రక్రియలో అన్నారం లేదా సుందిళ్ల బ్యారేజీలకు ఏవైనా నష్టాలు లేదా ప్రమాదాలు జరిగితే, దానికి పూర్తి బాధ్యత తమదేనన్నారు.
ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు, ఉప ముఖ్యమంత్రి కొణిదెల పవన్ కల్యాణ్.. ముద్రగడ సమాజానికి చేసిన సేవలను గుర్తించి ఈ గౌరవాన్ని కల్పించాలని నిర్ణయించారు. ఈ మేరకు అంత్యక్రియల ఏర్పాట్లను పర్యవేక్షించాలని, అన్ని రకాల ప్రభుత్వ మర్యాదలు లోటు లేకుండా చూడాలని ఉన్నతాధికారులను ప్రభుత్వం ఆదేశించింది.
ల్పపీడన ప్రభావంతో జులై మూడో వారంలో దేశవ్యాప్తంగా వర్షాలు మళ్లీ ఊపందుకోనున్నాయి. ముఖ్యంగా ఆంధ్రప్రదేశ్, తెలంగాణతో పాటు మధ్య భారతదేశం, తూర్పు రాష్ట్రాలలో విస్తారంగా వర్షాలు కురుస్తాయని భారత వాతావరణ శాఖ పేర్కొంది.
దేశ రాజధాని ఢిల్లీలోని జంతర్ మంతర్ వేదికగా సాగుతున్న ఈ వినూత్న నిరసన ప్రదర్శనలకు మెల్లిమెల్లిగా జనం ముఖం చాటేస్తున్నారు. పరీక్షల అవకతవకలపై కేంద్ర విద్యాశాఖ మంత్రి ధర్మేంద్ర ప్రదాన్ రాజీనామా డిమాండ్‌తో ప్రారంభమైన కాక్రోచ్ జనతా పార్టీ ఉద్యమం.. ఆరంభంలో లక్షలాది మంది యువతను ఆకర్షించింది. అయితే క్రమక్రమంగా జనాదరణ కోల్పోయి ఇప్పుడు జంతర్ మంతర్ వద్ద జరుగుతున్న ఆ పార్టీ నిరసనలు తూతూ మంత్రంగా మారాయి.
ఈ ఏడాది సెప్టెంబర్ లేదా అక్టోబర్ నెలల్లో స్థానిక ఎన్నికల జరిగే అవకాశం ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు, డిప్యూటీ సీఎం కొణిదెల పవన్ కళ్యాణ్ ఇప్పటికే తమ పార్టీ శ్రేణులకు సమాచారం అందించారు. ఈ క్రమంలోనే ఎన్నికల వ్యూహాలను పక్కాగా అమలు చేయడానికి కూటమి పార్టీల ముఖ్య నేతల కీలక సమావేశం బుధవారం జరగనుంది.
హరీష్ రావు ఇప్పుడు తన కుటుంబ వ్యాపారమైన మిల్చీ మిల్క్  విషయంలో తలెత్తుతున్న ప్రశ్నలకు, వెల్లువెత్తుతున్న విమర్శలకూ సమాధానం చెప్పుకోలేక సతమతమౌతున్నారు.
 
Disclaimer:
All content included on this TeluguOne.com Portal including text, graphics, images, videos and audio clips, is the property of ObjectOne Information Systems Ltd. or our associates, and protected by copyright laws. The collection, arrangement and assembly of all content on this portal/ related channels is the exclusive property of ObjectOne Information Systems Ltd. or our associates and protected copyright laws.
 
You may not copy, reproduce, distribute, publish, display, perform, modify, create derivative works, transmit, or in any other way exploit any part of copyrighted material without permission from ObjectOne Information Systems Ltd or our associates.