2033 వరకు కాంగ్రెస్ పార్టీదే అధికారం : సీఎం రేవంత్ రెడ్డి

Publish Date:Jun 24, 2025

Advertisement

 

 

మంత్రుల పనితీరుపై ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి పీఏసీ సమావేశంలో అసంతృప్తి వ్యక్తం చేశారు. జిల్లాలను ఇన్‌ఛార్జ్ మంత్రులు పట్టించుకోవడం లేదన్నారు. రాష్ట్రంలో కాంగ్రెస్ పార్టీ బలోపేతానికి, ప్రభుత్వ కార్యక్రమాలను ప్రజల్లోకి సమర్థంగా తీసుకెళ్లేందుకు తీసుకోవాల్సిన చర్యలపై ఈ సమావేశంలో ప్రధానంగా చర్చించారు. త్వరలోనే మార్కెట్ కమిటీలు, దేవాలయ కమిటీలలో నామినేటెడ్ పోస్టుల భర్తీ ప్రక్రియను పూర్తి చేస్తామని సీఎం రేవంత్ రెడ్డి స్పష్టం చేశారు. అదేవిధంగా, జూబ్లీహిల్స్ అసెంబ్లీ నియోజకవర్గానికి జరగనున్న ఉప ఎన్నికకు పార్టీ శ్రేణులను ఇప్పటి నుంచే సమాయత్తం చేయాలని కాంగ్రెస్ నేతలకు ఆయన సూచించారు.


టీపీసీసీ చీఫ్ మహేశ్ కుమార్ గౌడ్ రచించిన ‘విధ్వంసం నుంచి వికాసం వైపు’ పుస్తకన్ని సీఎం రేవంత్ ఏఐసీసీ ఇన్‌ఛార్జ్‌ మీనాక్షి నటరాజన్, డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క ఆవిష్కరించారు. పదేళ్ల బీఆర్ఎస్ పాలనలో జరిగిన విధ్వంసాన్ని చక్కదిద్దుతూ రాష్ట్రాన్ని వికాసం వైపు కాంగ్రెస్ నడిపిస్తోందని.. సబ్బండ వర్గాలకు ఇచ్చిన అభయహస్తం హామీలను నెరవేరుస్తూ ఇంటింటా సౌభాగ్యం నిలిచేలా ఇందిరమ్మ రాజ్యాన్ని అందిస్తోందని తెలుపుతూ పుస్తకన్ని మహేశ్ కుమార్ గౌడ్  రచించారు. ఈ సందర్భంగా పీసీసీ నూతన ఉపాధ్యక్షులు, ప్రధాన కార్యదర్శులకు నియామక పత్రాలు అందజేశారు.  ఈ దేశంలో అధికారంలోకి వచ్చిన మొదటి ఏడాదిలోనే 60 వేల ప్రభుత్వ ఉద్యోగాలు కల్పించిన రాష్ట్రం ఏదైనా ఉందంటే అది కాంగ్రెస్ ప్రభుత్వం వల్లే సాధ్యమైందన్నారు. 


ఉమ్మడి రాష్ట్రంలో 1994 నుంచి 2004 వరకు తెలుగు దేశం పార్టీ, 2004 నుంచి 2014 వరకు కాంగ్రెస్ పార్టీ అధికారంలో ఉందని సీఎం చెప్పారు. ఆ తర్వాత తెలంగాణ రాష్ట్రం ఏర్పడ్డాక 2014 నుంచి 2023 వరకు బీఆర్ఎస్ రెండు సార్లు అధికారంలో ఉందని 2023 నుంచి 2033 వరకు పదేళ్లు కాంగ్రెస్ పార్టీ తప్పకుండా అధికారంలో ఉండబోతున్నదన్నారు. ఈ పదేళ్లు పార్టీ కోసం పని చేసే వారిని కాపాడుకునే బాధ్యత పార్టీ తీసుకుంటుందన్నారు. పదేళ్లు అధికారం నడిపించే వరకు నేను బాధ్యత తీసుకుంటా. ఆ తర్వాత పార్టీని అధికారంలోకి తీసుకువచ్చి నడిపించాల్సిన బాధ్యత పార్టీలోని యువతరం తీసుకోవాలని చెప్పారు.  ఎస్సీ వర్గీకరణలో దేశానికి తెలంగాణ ఆదర్శంగా నిలుస్తోంది. తెలంగాణ రైజింగ్ 2047 విజన్ డాక్యమెంట్ తీసుకువస్తున్నాం. త్వరలో డీలిమిటేషన్ జరగబోతున్నదని సీట్లు పెరగబోతున్నాయన్నారు. మహిళా రిజర్వేషన్లు రాబోతున్నాయి సీఎం రేవంత్‌రెడ్డి తెలిపారు.

By
en-us Political News

  
ఒడిశా బాలాసోర్‌లోని ఒక కళాశాలలో ఘోర విషాదకర ఘటన జరిగింది. గురువు లైంగిక వేధింపులకు భరించలేక ఓ విద్యార్థిని కాలేజిలోనే నిప్పంటించుకుంది.
నంద్యాల జిల్లా శ్రీశైలం హైదరాబాద్ ప్రధాన రహదారిపై భారీగా ట్రాఫిక్ జామ్ ఏర్పడింది. డ్యామ్ గేట్లను ఎత్తడంతో శ్రీశైలానికి భారీగా తరలివస్తున్నారు.
శ్రీకాళహస్తి మాజీ జనసేన ఇంచార్జ్ వినూత కోట డ్రైవర్ హత్య కేసులో నిందితుల ఫోటోలను పోలీసులు విడుదల చేశారు. శ్రీకాళహస్తి జనసేన ఇంచార్జ్ వినూత కోట, ఆమె భర్త చంద్రబాబుతో సహా శివకుమార్, షైక్ తాసాన్, గోపిలను చెన్నై పోలీసులు అరెస్ట్ చేశారు.
ఎంత పెద్ద రెడ్ బుక్ రాసిన లోకేష్ కూడా.. మేం చట్ట ప్రకారం మాత్రమే.. శిక్షిస్తామని చెబుతారు. బాబు కూడా జగన్ని జైల్లో పెట్టడం ఎంత సేపు? కానీ పెట్టాలని పెట్టడం మన అభిమతం కాదని అంటారు.
హర్యానా టెన్నిస్ క్రీడాకారిణి రాధికను చంపిన కేసులో అరెస్ట్‌యిన ఆమె తండ్రి దీపక్ యాదవ్ పశ్చాత్తాపానికి గురయ్యారు. ఆవేశంతో కుతురిపై కాల్పులు జరిపానని తనను ఉరితీయాలని పోలీసులను దీపక్ వేడుకున్నాట్లు ఆయన సోదరుడు విజయ్ తెలిపారు.
వైసీపీ నేత మాజీ మంత్రి పేర్ని నానిపై కేసు నమోదైంది. కృష్ణా జిల్లాలో జరిగిన వైసీపీ కార్యకర్తల సమావేశంలో నాని వివాదాస్పద వ్యాఖ్యలు చేసారని టీడీపీ నేత కనపర్తి శ్రీనివాసరావు ఫిర్యాదు మేరకు అవనిగడ్డ పోలీసులు కేసు నమోదు చేశారు.
గోదావరి జలాల పై రెండు తెలుగు రాష్ట్రాల మధ్య వివాదం రాజుకుంది .. ఈనేపథ్యంలో అందుబాటులో ఉన్న నీటిని వినియోగించుకునే పనిలో ఉభయ రాష్ట్రాలు నిమగ్నమయ్యాయి.. పట్టిసీమ ఎత్తిపోతల ద్వారా గోదావరి జలాలను కృష్ణా డెల్టాకు తరలించే ప్రయత్నాలను ఆంధ్రప్రదేశ్ ప్రారంభించింది.
కేంద్ర ప్రభుత్వం పలు రాష్ట్రాల్లోని నగరాలకు వివిధ కేటగిరీల్లో స్వచ్ఛ సర్వేక్షణ్ అవార్డులు ప్రకటించింది. అందులో భాగంగా ఆంధ్రప్రదేశ్‌లోని అయిదు మున్సిపల్ కార్పొరేషన్లకు అవార్డులు దక్కాయి. విశాఖపట్నం, రాజమండ్రి, విజయవాడ, తిరుపతి, గుంటూరు నగరాలు ఆ పురస్కారాలు దక్కించుకున్నాయి.
మాజీ మంత్రి వైఎస్ వివేకానంద రెడ్డి హత్య కేసులో ఏ 3 ముద్దాయి ఉమా శంకర్ రెడ్డి కి బెదిరింపు ఫోన్ వచ్చింది. ఈ మేరకు ఆయన పులివెందుల పట్టణ పోలీస్ స్టేషన్ లో ఇవాళ ఫిర్యాదు చేశారు.
కృష్ణాజిల్లా గుడివాడలో ఉద్రిక్తత పరిస్థితి నెలకొంది. పోటాపోటీ ఫ్లెక్సీలతో గుడివాడ పాలిటిక్స్ హీటెక్కింది. కుప్పంలో చంద్రబాబు గెలవరని గతంలో మాజీ మంత్రి కొడాలి నాని చేసిన సవాల్‌ను గుర్తు చేస్తూ తెలుగు దేశం పార్టీ నేతలు ఫ్లెక్సీలను ఏర్పాటు చేశారు.
ఏపీలో 590 మంది వేద పండితులు నిరుద్యోగులుగా ఉన్నారని.. వారికి నెలకు రూ.3 వేల భృతి ఇవ్వాలని నిర్ణయించినట్లు దేవాదాయశాఖ మంత్రి ఆనం రాంనారాయణరెడ్డి వెల్లడించారు.
అధికార కాంగ్రెస్ పార్టీకి ఉమ్మడి నల్గొండ జిల్లా కంచుకోట. అటువంటి ఆ జిల్లాలోని మునుగోడు నియోజక వర్గంలో మాత్రం జిల్లా మంత్రులకు ఎంట్రీ లేదంట. తన ఇలాకాలో జిల్లా మంత్రులకు ఎమ్మెల్యే కోమటిరెడ్డి రాజగోపాల్ ఎంట్రీ పాస్ ఇవ్వడం లేదంట. ఒక విధంగా చెప్పాలంటే నో ఎంట్రీ బోర్డు పెట్టేశారంట. ఆ నియోజకవర్గంలో పర్యటనకు జిల్లా మంత్రులే కాదు.. ఇతర మంత్రులు కూడా వెనకంజ వేస్తున్నారంట.
శ్రీకాళహస్తి జన సేన ఇంచార్జ్ వినుతకోట మాజీ డ్రైవర్ శ్రీనివాసులు అలియాస్‌ రాయుడి హత్య కేసులో సంచలన విషయాలు వెలుగులో వస్తున్నాయి.
 
Disclaimer:
All content included on this TeluguOne.com Portal including text, graphics, images, videos and audio clips, is the property of ObjectOne Information Systems Ltd. or our associates, and protected by copyright laws. The collection, arrangement and assembly of all content on this portal/ related channels is the exclusive property of ObjectOne Information Systems Ltd. or our associates and protected copyright laws.
 
You may not copy, reproduce, distribute, publish, display, perform, modify, create derivative works, transmit, or in any other way exploit any part of copyrighted material without permission from ObjectOne Information Systems Ltd or our associates.