Publish Date:May 25, 2025
రాష్ట్ర నీటి అవసరాలు కాపాడటంలో ఈ ప్రభుత్వం విఫలమైంది.. గోదావరి – బనకచర్ల ప్రాజెక్టు వల్ల తెలంగాణకు తీవ్ర నష్టం వాటిల్లుతుందని మాజీ మంత్రి, సిద్దిపేట ఎమ్మెల్యే హరీశ్రావు పేర్కొన్నారు. బనకచర్ల ప్రాజెక్టుపై తెలంగాణ భవన్లో హరీశ్రావు మీడియాతో మాట్లాడారు. 200 టీఎంసీల గోదావరి జలాలు ఏపీ తరలించుకుపోయే కుట్ర జరుగుతుంది. తెలంగాణకు ఇంత జరుగుతుంటే సీఎం రేవంత్ రెడ్డి ఏం చేస్తున్నారు. గోదావరి – బనకచర్లకు ఒక్క అనుమతి లేకుండానే ఏపీ ముందుకు వెళ్తుంది.
కేంద్రం జుట్టు తన చేతిలో ఉందని చంద్రబాబు నిబంధనలు ఉల్లంఘిస్తున్నారు. ఉమ్మడి ఆంధ్రప్రదేశ్లో జరిగిన జలదోపిడీ.. కాంగ్రెస్ పాలనలో మళ్లీ మొదలైంది. నదీ పరివాహక ప్రాంతాల్లోని అన్ని రాష్ట్రాలు ఒప్పుకోవాలి. తెలంగాణ చేపట్టిన ప్రాజెక్టులకు చంద్రబాబు మోకాలు అడ్డుపెట్టారు. తెలంగాణ ప్రాజెక్టులు రద్దు చేయాలని కేంద్రానికి లేఖలు రాశారు. తెలంగాణ ప్రాజెక్టులు నిలిపివేయాలని ఏపీకి 20కి పైగా లేఖలు రాసింది. పాలమూరు, భక్తరామదాసు, డిండిపై చంద్రబాబు లేఖలు రాశారు అని హరీశ్రావు గుర్తు చేశారు.
By Teluguone
en-us
Political News
http://www.teluguone.com/news/content/cm-revanth-reddy-39-198662.html
ఐపీఎల్ 2025 ఫైనల్ పోరులో రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు (ఆర్సీబీ), పంజాబ్ కింగ్స్ జట్లు మధ్య జరిగే అహ్మదాబాద్ నరేంద్ర మోదీ స్టేడియం వద్ద వర్షం మొదలైంది.
ఐపీఎల్ 2025 ముగింపు వేడుకలు నేటి సాయంత్రం 6 గంటలకు అంగరంగ వైభవంగా ప్రారంభం కానున్నాయి. ఆపరేషన్ సిందూర్ విజయం నేపథ్యంలో భారత సాయుధ దళాలకు కృతజ్ఞతలు తెలుపుతూ బీసీసీఐ ఆధ్వర్యంలో ప్రత్యేక కార్యక్రమన్ని నిర్వహిస్తోంది.
గన్నవరం మాజీ ఎమ్మెల్యే, వైసీపీ సీనియర్ నాయకుడు వల్లభనేని వంశీని మళ్లీ విజయవాడ జిల్లా జైలుకు చేరుకున్నారు. ఆనారోగ్యం కారణంగా ఇటీవల వంశీకి కోర్టు మధ్యంతర బెయిలు మంజూరు చేసి మెరుగైన వైద్య చికిత్స అందించాల్సిందిగా ఆదేశించిన సంగతి తెలిసిందే.
తెలంగాణ కేబినెట్ సమావేశం జూన్ 5 మధ్యాహ్నం 3 గంటలకు ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి అధ్యక్షతన మంత్రివర్గ సమావేశం సచివాలయంలో నిర్వహించానున్నారు.
ఎట్టకేలకు ఫోన్ ట్యాపింగ్ కేసులో ఏ1 నిందితుడి విచారణ చేయడానికి సిట్ కి దారులు బార్లా తెరుచుకున్నాయి. ఇప్పటి వరకూ అంటే గత 14 నెలలుగా అమెరికాలో ఉన్న ప్రభాకర్ రావు వ్యవహారం, ఎన్నో మలుపుల మీద మలుపులు తిరిగి, ఆయన ఎట్టకేలకు హైదరాబాద్ వచ్చే వరకూ సాగింది.
ఐపీఎల్ 2025 ముగింపు దశకు వచ్చింది. మంగళవారం (జూన్ 3) సాయంత్రం రాయల్ చాలెంజర్స్ బెంగళూరు, పంజాబ్ కింగ్స్ జట్ల మధ్య ఫైనల్ తో ఐపీఎల్ విజేత ఎవరన్నది తేలిపోతుంది.
కన్నడ భాష తమిళం నుంచి పుట్టిందని కమల్ హాసన్ చేసిన వ్యాఖ్యలపై కర్ణాటక హైకోర్టు అసహనం వ్యక్తం చేసింది. కమల్ హాసన్ తన సినిమా థగ్ లైఫ్ జూన్ 05 న కర్ణాటకలో విడుదల కావడానికి ఎలాంటి అడ్డంకులు లేకుండా ఉండేందుకు చట్టపరమైన చర్యలు తీసుకోవాలని కర్ణాటక హైకోర్టును ఆశ్రయించారు.
కృష్ణాజిల్లా గుడివాడకు చెందిన అట్లూరి మౌనిక మిస్ అండ్ మిసెస్ తెలుగు యూఎస్ఏ అందాల పోటీల్లో ద్వితీయ స్థానం కైవశం చేసుకున్నారు.
ఆంధ్రప్రదేశ్ రాజధాని అమరావతి నిర్మాణంపై ఫోకస్ పెట్టిన ఏపీ ప్రభుత్వం హైరేంజ్లో ప్రణాళికలు వేస్తోంది. ఇప్పటికే 34వేల ఎకరాల భూమిని రైతుల నుంచి సమీకరించిన సంగతి తెలిసిందే. ఇప్పుడు మరోసారి 40వేల ఎకరాలు సేకరించాలని నిర్ణయించింది.
గుంటూరు జిల్లా తెనాలిలో వైసీపీ అధినేత జగన్ పర్యటనలో ఉద్రిక్తత నెలకొంది. గత వైసీపీ ప్రభుత్వంలో హత్యకు గురైన వ్యక్తిని పరామర్శించని జగన్ రౌడీ షీటర్లకు మద్దతిస్తున్నారని దళిత, ప్రజా సంఘాలు నిరసన తెలిపాయి.
ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడితో హీరో నాగార్జున భేటీ అయ్యారు. ఈ ఇరువురి భేటీ ఇరు రాష్ట్రాలలోనూ ప్రాధాన్యత సంతరించుకుంది. ఉండవల్లిలోని క్యాంపు కార్యాలయంలో సీఎం చంద్రబాబునాయుడిని హీరో నాగార్జున మంగళవారం (జూన్ 3) కలిశారు.
రాజేంద్ర ప్రసాద్ ఈ మధ్య తన కూతురు చనిపోయినప్పటి నుంచి ఇలా మారిపోయారా? అంటే అవుననే తెలుస్తోంది. మొన్న రాబిన్ హుడ్ సినిమా ఫంక్షన్లో డేవిడ్ వార్నర్ ని దొ*గ ము*కొడుకు అంటూ కామెంట్ చేసి ట్రోల్ అయ్యారు.
క్రికెట్ అభిమానుల్లో.. ఐపీఎల్ పైనల్ ఉత్కంఠ పెంచుతోంది. ఈసారి కప్ కొట్టేది.. రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరా.. పంజాబ్ కింగ్సా? అనేది మోస్ట్ ఇంట్రస్టింగ్గా మారింది. ఐపీఎల్ మొదలై 18 ఏళ్లు అవుతున్నా.. ఈ రెండు టీమ్లూ ఇప్పటివరకు ఒక్క టైటిల్ కూడా గెలవలేదు. కాబట్టి.. ఏ టీమ్ గెలిచినా.. కొత్త చరిత్ర సృష్టిస్తుంది.