కాంగ్రెస్‌ పార్టీలో వ్యతిరేకత ఎదుర్కొన్నా : సీఎం రేవంత్ రెడ్డి

Publish Date:Feb 21, 2026

Advertisement

 

వికారాబాద్ జిల్లా అనంతగిరి హరితా రిసార్ట్‌లో తెలంగాణ, ఆంధ్రప్రదేశ్ రాష్ట్రాల డీసీసీ అధ్యక్షుల శిక్షణా తరగతులను సీఎం రేవంత్ రెడ్డి ప్రారంభించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ, కాంగ్రెస్‌తో పోటీ పడుతున్న ఏ రాజకీయ పార్టీ కూడా దేశ స్వాతంత్ర్యానికి ముందు పుట్టలేదని తెలిపారు. 141 సంవత్సరాల క్రితం ఆవిర్భవించిన కాంగ్రెస్ పార్టీ 140 కోట్ల భారత ప్రజలకు స్ఫూర్తిగా నిలిచిందన్నారు. దేశానికి స్వాతంత్ర్యం తీసుకువచ్చి దిశానిర్దేశం చేసిన పార్టీ కాంగ్రెస్ అని స్పష్టం చేశారు. వందేళ్ల చరిత్ర కలిగిన మరో పార్టీ సీపీఐ మాత్రమేనని పేర్కొన్నారు. ఏఐసీసీ చేపట్టిన ఈ శిక్షణా కార్యక్రమం ఎంతో ఉపయోగకరమని తెలిపారు.

దేశ స్వాతంత్ర్యానికి ముందు 140 ఏళ్ల క్రితమే కాంగ్రెస్ పార్టీ ఆవిర్భవించిందని గుర్తుచేశారు. దేశానికి స్వాతంత్ర్యం తెచ్చిన పార్టీ కాంగ్రెస్ అని అన్నారు. కాంగ్రెస్ తెచ్చిన స్వాతంత్ర్యం, ఇచ్చిన రాజ్యాంగాన్ని ఉపయోగించుకుని ఏర్పడిన కొన్ని పార్టీలు ఇప్పుడు “కాంగ్రెస్ ముక్త భారత్” అంటూ నినాదాలు చేస్తున్నాయని రేవంత్ విమర్శించారు. భారతదేశ ఆత్మగౌరవం గ్రామాల్లో ఉందని నమ్మే పార్టీ కాంగ్రెస్ అని చెప్పారు. రాజ్యాంగాన్ని రద్దు చేయాలని, సమూలంగా మార్చాలని కుట్రలు జరుగుతున్న ఈ సమయంలో ఈ శిక్షణా కార్యక్రమం మరింత ప్రాధాన్యత సంతరించుకుందని అన్నారు. డీసీసీ అధ్యక్షులు ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకోవాలని సీఎం సూచించారు.

వారసత్వంగా పదవులు పొందే అవకాశం ఉన్నప్పటికీ వైఎస్ షర్మిల అలా చేయలేదని పేర్కొన్నారు. మహాత్మా గాంధీ, జవహర్‌లాల్ నెహ్రూ దేశం కోసం జైలు శిక్షలు అనుభవించారని తెలిపారు. మహాత్మా గాంధీ బ్రిటిష్ వారికి వ్యతిరేకంగా పోరాడగా, స్వాతంత్ర్యం వచ్చిన తర్వాత భారతీయుల తూటాలకు ఆయనే బలయ్యారని గుర్తుచేశారు.
గాంధీ, ఇందిరా గాంధీ, రాజీవ్ గాంధీ దేశం కోసం ప్రాణత్యాగం చేశారని అన్నారు. దేశ సమగ్రత కోసం ఇందిరా గాంధీ, రాజీవ్ గాంధీ తమ ప్రాణాలు అర్పించారని చెప్పారు. రాజీవ్ గాంధీ ఆశయాల సాధన కోసం సోనియా గాంధీ త్యాగం చేసి కాంగ్రెస్‌కు అండగా నిలిచారని పేర్కొన్నారు. సౌకర్యంగా పదవులు పొందే అవకాశం ఉన్నప్పటికీ రాహుల్ గాంధీ 4000 కిలోమీటర్ల పాదయాత్ర చేసి ప్రజల్లోకి వెళ్లారని తెలిపారు.

వైఎస్ రాజశేఖర రెడ్డి పాదయాత్ర, ఆయన చేపట్టిన సంక్షేమ కార్యక్రమాలు, అభివృద్ధి పనులు కాంగ్రెస్ విజయాల్లో ప్రస్తావించాల్సినవని అన్నారు. వైఎస్ షర్మిల తెలంగాణలో 3000 కిలోమీటర్ల పాదయాత్ర చేసి, ప్రస్తుతం ఏపీలో పార్టీ కోసం కష్టపడుతున్నారని చెప్పారు. డీసీసీ అధ్యక్షులు జిల్లాలకు అధిపతులమని భావించవద్దని సూచించారు. విభేదించిన వారిని అణగదొక్కే ప్రయత్నం చేయవద్దని హెచ్చరించారు. తాను పీసీసీ అధ్యక్షుడిగా బాధ్యతలు స్వీకరించిన తర్వాత ప్రతి నాయకుడి ఇంటికి వెళ్లి మద్దతు కోరానని గుర్తుచేశారు. కలిసికట్టుగా పనిచేసినందువల్లే 2.5 శాతం ఓట్లున్న కాంగ్రెస్ పార్టీ 40 శాతం ఓట్లు సాధించి అధికారంలోకి వచ్చిందని తెలిపారు.

119 నియోజకవర్గాల్లో 42 లక్షల డిజిటల్ సభ్యత్వాలు నమోదు చేసినట్లు చెప్పారు. డీసీసీ అధ్యక్షులుగా కృషి చేసిన వారికి ఎమ్మెల్యేలుగా అవకాశాలు ఇచ్చామని, అనుబంధ విభాగాల్లో పనిచేసిన వారికి కార్పొరేషన్ పదవులు కల్పించామని తెలిపారు. డీసీసీ అధ్యక్షుల ప్రతి చర్యను పార్టీ పరిశీలిస్తుందని హెచ్చరించారు. కాంగ్రెస్‌లో ఎలాంటి కోటాలు లేవని, మెరిట్‌ కోటా మాత్రమే ఉంటుందని స్పష్టం చేశారు. డీసీసీ అధ్యక్ష పదవిని దుర్వినియోగం చేయవద్దని, పార్టీ విశ్వాసాన్ని దెబ్బతీయవద్దని సూచించారు.

అసెంబ్లీ ఎన్నికల్లో కాంగ్రెస్‌కు ప్రత్యర్థి పార్టీలతో 2 శాతం తేడా ఉండగా, అది పార్లమెంట్ ఎన్నికల్లో 4 శాతానికి, మున్సిపల్ ఎన్నికల్లో 12 శాతానికి పెరిగిందని వివరించారు. ఇది కార్యకర్తల శ్రమ, ప్రజల్లో ఉన్న నమ్మకం వల్ల సాధ్యమైందని చెప్పారు. దేశాన్ని, కాంగ్రెస్‌ను విడదీయలేమని, దేశ ఆత్మనే కాంగ్రెస్ అని అన్నారు. కాంగ్రెస్‌పై బీజేపీ కుట్రలు చేస్తోందని ఆరోపించారు. పార్లమెంట్‌లో రాహుల్ గాంధీకి మాట్లాడే అవకాశం ఇవ్వకుండా అడ్డుకుంటోందని, సోనియా గాంధీ, రాహుల్ గాంధీపై కేసులు పెట్టి అవమానిస్తున్నారని విమర్శించారు. మూడు తరాలు ప్రాణత్యాగం చేసిన గాంధీ కుటుంబానికి డబ్బుల అవసరమా అని ప్రశ్నించారు. రాజకీయంగా గాంధీ కుటుంబాన్ని అడ్డుకోవడానికే బీజేపీ ప్రయత్నిస్తోందని ముఖ్యమంత్రి అన్నారు.

దళితులు, మైనార్టీలు, బడుగు బలహీన వర్గాలు, పేదల గొంతును నొక్కే ప్రయత్నాలు జరుగుతున్నాయని ఆరోపించారు. 100 ఏళ్ల తర్వాత రాష్ట్రంలో కులగణన చేపట్టామని, ఎస్సీ వర్గీకరణ అమలు చేసి దేశానికి ఆదర్శంగా నిలిచామని తెలిపారు. సర్పంచ్ ఎన్నికల్లో 49.83 శాతం బీసీలు గెలిచారని, మున్సిపల్ ఎన్నికల్లో 63 శాతం ఓబీసీలు ఎన్నికయ్యారని వివరించారు. ఇది కాంగ్రెస్ వల్లే సాధ్యమైందని అన్నారు. పైరవీలు చేయకుండా ప్రజా సమస్యల పరిష్కారం కోసం పనిచేస్తే నాయకుల గౌరవం పెరుగుతుందని సూచించారు. తాను ఎప్పుడూ పైరవీల కోసం పనిచేయలేదని తెలిపారు. 16 ఏళ్లలో జెడ్పీటీసీ నుంచి సీఎం వరకు అడుగడుగునా కాంగ్రెస్ తనకు అవకాశం ఇచ్చిందని అన్నారు. రాష్ట్ర విభజన జరిగినప్పటికీ రెండు రాష్ట్రాల్లో కాంగ్రెస్ పార్టీ బలపడాలని ఆకాంక్షించారు. తెలంగాణ, ఆంధ్రప్రదేశ్ రెండూ కలిసి అభివృద్ధి చెందాలని రేవంత్ రెడ్డి పిలుపునిచ్చారు.

By
en-us Political News

  
మావిగన్ ప్రతిపాదనతో జగన్ నెటిజనులకు ఒక ట్రోల్ మెటీరియల్ గా మారిపోయిన సంగతి తెలిసిందే. ఆ ప్రతిపాదనపై లెక్కలేనన్న మీమ్స్, సెటైర్లు నెట్టింట వెల్లువెత్తాయి. అయినా కూడా జగన్ తాను పట్టిన కుందేటికి మూడేకాళ్లన్న చందంగా మావిగన్ ను మించిన రాజధాని ఉండనే ఉండదన్నట్లు మాట్లాడుతున్నారు. అయితే ఇదే మావిగన్ ను ఆయన అధికారంలో ఉన్న ఐదేళ్ల కాలంలో ఎందుకు ముందుకు తీసుకురాలేదన్న ప్రశ్నకు మాత్రం జగన్ సమాధానం ఇవ్వడం లేదు.
కేరళలోని మొత్తం 140 అసెంబ్లీ స్థానాలకు, పుదుచ్చేరిలోని 30 స్థానాలకు రేపు ఒకేసారి ఓటింగ్ నిర్వహించనున్నారు. అలాగే అస్సాంలో 126 స్థానాలకూ కూడా ఒకే విడతలో పోలింగ్ జరగనుంది. గతంలో బహుళ విడతల్లో ఎన్నికలు జరిగినప్పటికీ, ఈసారి మాత్రం ఒకే విడతలో పోలింగ్ నిర్వహిస్తున్నారు.
సౌత్ కోస్ట్ రైల్వే జోన్ ఏర్పాటు నేపథ్యంలో విజయవాడలోని లోకో పైలట్ల గాలా(సికింద్రాబాద్) డిపోను తరలించకుండా విజయవాడలోనే కొనసాగించేలా తగిన చర్యలు తీసుకోవాలని ఆ డిపో సిబ్బంది మంత్రి నారా లోకేష్ ను కలిసి విజ్ఞప్తి చేశారు. విజయవాడ బోర్డును కొండపల్లి నుంచి మోటమర్రికి పెంచడం వల్ల గత 17 ఏళ్లుగా విజయవాడలో ఉన్న సికింద్రాబాద్(గాలా) డిపో ఉనికి సందిగ్ధంలో పడిందని, డిపోను మోటమర్రికి లేదా డోర్నకల్ కు తరలిస్తారనే ప్రచారంతో సుమారు 500 కుటుంబాలు ఆందోళన చెందుతున్నాయనే విషయాన్ని మంత్రి దృష్టికి తీసుకువచ్చారు.
తమిళనాడు అసెంబ్లీ ఎన్నికల సమరం తుది ఘట్టానికి చేరుకుంది.
సుదీర్ఘ రాజకీయ అనుభవం కలిగిన కిద్వాయ్, గాంధీ కుటుంబానికి అత్యంత సన్నిహితురాలిగా గుర్తింపు పొందారు. మోహ్సినా కిద్వాయ్ అంత్యక్రియలు ఢిల్లీలోని నిజాముద్దీన్ స్మశాన వాటికలో బుధవారం (ఏప్రిల్ 8) సాయంత్రం నిర్వహించనున్నట్లు కుటుంబ సభ్యులు తెలిపారు.
జగన్ చుట్టపుచూపుగా రాష్ట్రానికి వస్తున్నారు. అడపాదడపా పరామర్శలంటూ రోడ్ షోలు నిర్వహిస్తున్నారు. ఆ సమయంలో వినా మిగిలిన సమయంలో రాష్ట్రంలో వైసీపీ పరిస్థితి ఉనికి మాత్రంగానే మారింది. గత ఎన్నికలలో వైసీపీ కేవలం 11 స్థానాలలో మాత్రమే గెలిచిన సంగతి తెలిసిందే. ఆ గెలిచిన స్థానాలలో కూడా వెసీపీ స్తబ్దుగానే ఉంది. అయితే మచిలీపట్నంలో మాత్రం వైసీపీ హడావుడి ఒకింత ఎక్కువగా ఉంది.
ఉభయ గోదావరి జిల్లాలకు చెందిన జనసేన నేతలు ద్వారంపూడిపై చర్యల తీసుకోవాల్సిందే అని ఒత్తిడి తీసుకువస్తున్నారు. ఈ నేపథ్యంలోనే అవినీతి బండారాన్ని బట్టబయలు ప్రభుత్వం పకడ్బందీగా అడుగులు వేస్తున్నదని అంటున్నారు. రాష్ట్ర రైస్ మిల్లర్స్ అసోసియేషన్‌లో ద్వారంపూడికి ఉన్న పట్టును సడలించడం ద్వారా ఆయన ప్రాభవాన్ని తగ్గించాలని ప్రయత్నిస్తున్నారు.
ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడుపై అంబటి రాంబాబు అనుచిత వ్యాఖ్యలు చేశారన్న ఆరోపణలపై అంబటి రాంబాబును కొద్ది రోజుల కిందట గుంటూరు జిల్లా నల్లపాడు పోలీసులు అరెస్టు చేసి జైలుకు పంపారు. అయితే.. ఆ సమయంలో పోలీసు స్టేషన్‌లో తనను చిత్రహింసలకు గురిచేశారని ఆరోపిస్తూ అంబటి రాంబాబు తాజాగా హైకోర్టులో పిటిషన్ దాఖలు చేశారు.
మాజీ మంత్రులు హరీశ్ రావు, సబితా ఇంద్రా రెడ్డి, మాజీ ఎమ్మెల్యేలు మహేశ్ రెడ్డి, నరేందర్ రెడ్డి, వికారాబాద్ జిల్లా అధ్యక్షుడు మెతుకు ఆనంద్ వంటి నేతలను అక్రమంగా నిర్బంధించడం ప్రజాస్వామ్య విరుద్ధమని ఆగ్రహం వ్యక్తం చేశారు. రైతుల ఆవేదనను వినాల్సింది పోయి, వారికి మద్దతుగా వస్తున్న విపక్ష నేతలపై ఆంక్షలు విధించడం దారుణమన్నారు.
రిలే దీక్షకు మద్దతుగా గ్రామానికి చేరుకోవాలని ప్రయత్నించిన బీఆర్ఎస్ నేతలు, కార్య కర్తలను పోలీసులు మార్గ మధ్యలోనే నిలిపివేస్తూ వెనక్కి పంపించేశారు. దీంతో పరిగి పరిసర ప్రాంతాల్లో ఉద్రిక్తత నెలకొంది.
ఆంధ్రప్రదేశ్ ప్రజలందరికీ చారిత్రాత్మక విజయం సిద్ధించిన రోజిదని పేర్కొన్నారు. అమరావతి రైతుల త్యాగాలకు దక్కిన న్యాయమన్నారు. అమరావతి ఇప్పుడు కేవలం నగరం కాదు, మన ఆత్మగౌరవానికి ప్రతీక అని బాలకృష్ణ పేర్కొన్నారు.
జములమడుగులో ఊహించిన దానికంటే అత్యధికంగా అభివృద్ధి పనులు కొనసాగిస్తున్నామని వివరించారు. వైసిపి అధ్యక్షుడు పులివెందుల ఎమ్మెల్యే జగన్ రెడ్డి వైఖరిని తూర్పారబట్టారు.. ప్రజలను కన్ఫ్యూజ్ చేసి మేలు పొందాలని ప్రయత్నిస్తున్నారంటూ జగన్ పై విమర్శలు కురిపించారు. పకృతిలో పంచభూతాల కూడా తన అధీనంలోనే ఉన్నాయని చెప్పుకునే పెను భూతంగా ఆయన జగన్ రెడ్డిని అబివర్ణించారు.
ఈ కీలక పరిణామం నేపథ్యంలో సోషల్ మీడియా వేదికగా ముఖ్యమంత్రి స్పందిస్తూ.. ఐదు కోట్ల ఆంధ్రుల చిరకాల కోరిక నేడు నెరవేరిందని పేర్కొన్నారు. అమరావతి చట్టానికి ఆమోదం తెలిపి రాష్ట్ర భవిష్యత్తుకు భరోసానిచ్చిన రాష్ట్రపతి ద్రౌపది ముర్ముకు ఏపీ ప్రజల తరఫున ఆయన ప్రత్యేకంగా కృతజ్ఞతలు తెలియజేశారు.
 
Disclaimer:
All content included on this TeluguOne.com Portal including text, graphics, images, videos and audio clips, is the property of ObjectOne Information Systems Ltd. or our associates, and protected by copyright laws. The collection, arrangement and assembly of all content on this portal/ related channels is the exclusive property of ObjectOne Information Systems Ltd. or our associates and protected copyright laws.
 
You may not copy, reproduce, distribute, publish, display, perform, modify, create derivative works, transmit, or in any other way exploit any part of copyrighted material without permission from ObjectOne Information Systems Ltd or our associates.