ఢిల్లీలో సీఎం చిట్ ..పటలు

Publish Date:Jul 17, 2025

Advertisement

 

తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి, మరోమారు బీఆర్ఎస్ అధ్యక్షుడు కేసీఆర్,  కార్యనిర్వాహక అధ్యక్షుడు కేటీఆర్ తో పాటుగా, బీజేపీ సీనియర్ నాయకుడు, కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి టార్గెట్’గా విమర్శనా అస్త్రాలు సంధించారు. ఢిల్లీ పర్యటనలో ఉన్న ముఖ్యమంత్రి మీడియాతో ఇష్టాగోష్టిగా, మాట్లాడారు. ఈ సందర్భంగా,మాజీ ముఖ్యమంత్రి కేసీఆర్ కుటుంబం కడుపునిండా విషం పెట్టుకుని మాట్లాడుతోందని రేవంత్‌ రెడ్డి విమర్శించారు. కేసీఆర్‌ అసెంబ్లీకి వచ్చి రాష్ట్రప్రభుత్వానికి తగిన సూచనలు ఇవ్వాలని,ఆయన ఇచ్చిన స్వీకరించేందుకు సిద్ధంగా ఉన్నామని స్పష్టం చేశారు. అలాగే, ప్రతిపక్ష నాయకుడిగా కేసీఆర్, రాష్ట్ర ప్రయోజనలసధనకోసం ఢిల్లీ వెళ్లి కేంద్ర ప్రభుత్వంతో సంప్రదింపులు జరపవచ్చని అన్నారు. అలాగే, కేంద్రమంత్రి కిషన్‌రెడ్డి లేఖలు రాయడం కాదని, ప్రణాళికతో ముందుకు రావాలని సూచనలు చేశారు. మాజీ సీఎం కేసీఆర్ ను కాపాడేందుకు కేంద్రమంత్రి కిషన్ రెడ్డి ప్రయత్నిస్తున్నారని ఆరోపించారు. మరోవైపు రాష్ట్ర అభివృద్ధి కోసం కేంద్రంతో, కేంద్ర మంత్రి   కిషన్రెడ్డితో కలిసి పని చేసేందుకు సిద్ధంగా ఉన్నట్లు తెలిపారు.

అయితే అదే సమయంలో, మాజీ మంత్రి, బీఆర్ఎస్ కార్యనిర్వాహక అధ్యక్షుడు, కేటీఆర్’కు గట్టిగా చురకలు అంటించారు. ఆయనపై ఘాటైన విమర్శలు చేశారు. ముఖ్యమంత్రి ఢిల్లీ పర్యటనలపై వ్యంగ్య వ్యాఖ్యలు చేసిన, కేటీఆర్’ ను ఉద్దేశించి, రాష్ట్ర సమస్యల పరిష్కారం కోసం ఢిల్లీకి వెళ్లకుండా ఫామ్ హౌస్ కి వెళ్లాలా? అంటూ ఘాటైన కౌంటర్ ఇచ్చారు. అలాగే, కేటీఆర్’ పై,ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి చాలా తీవ్రమైన ఆరోపణలు చేసారు. కేటీఆర్ గంజాయి బ్యాచ్ అని.. అతని చుట్టూ ఉండేవాళ్లు డ్రగ్స్ తీసుకుంటారని ఆరోపించారు. డ్రగ్స్ తీసుకునే కేటీఆర్’తో తానేం మాట్లాడతానని ఎద్దేవా చేశారు. వైట్ ఛాలెంజ్ విసిరితే పారిపోయిన వ్యక్తి కేటీఆర్ అంటూ చురకలు అంటించారు. అలాగే, దుబాయ్‌లో మాజీ మంత్రి కేటీఆర్ స్నేహితుడు కేదార్ డ్రగ్స్ తీసుకుని చనిపోయాడని ఇందుకు సంబంధించిన ఫోరెన్సిక్ రిపోర్టును తెలంగాణకు తెప్పించినట్లు తెలిపారు. ఇదే సందర్భంలో ముఖ్యమంత్రి రేవంత్  రెడ్డి, ఫోన్ ట్యాపింగ్ అంశాన్ని ప్రస్తావించారు. బీఆర్ఎస్ ప్రభుత్వ హయాంలోలాగా తాము ప్రతిపక్ష నేతల ఫోన్లు ట్యాప్ చేయలేదని, చేయబోమని అన్నారు. 

మాజీ ముఖ్యమంత్రి కేసీఆర్ హయాంలో ఏం జరిగిందో వారి కుటుంబసభ్యులే బయటికి వచ్చి చెప్తున్నారని ఎద్దేవా చేసారు. అలాగే, కేసీఆర్ కుటుంబ కలహాల అంశాన్ని ముఖ్యమంత్రి వదిలి పెట్టలేదు. ప్రతిపక్షనేత పదవి ఇవ్వాలని కేసీఆర్‌ను ఆయన కుమారుడు, మాజీ మంత్రి కేటీఆర్‌ అడుగుతున్నారని, కేటీఆర్‌ కోరికను కేసీఆర్‌ ఒప్పకోవడం లేదని ముఖ్యమంత్రి అన్నారు. సొంత వివాదాలతోనే కేసీఆర్‌ కుటుంబానికి సరిపోతోందని,కేటీఆర్‌ నాయకత్వాన్ని కవిత ఒప్పుకోవట్లేదని తెలిపారు. ఉభయ తెలుగు రాష్ట్రాల మధ్య రగులుతున్న జల వివాదాలకు సంబంధించి ఢిల్లీలో ఉభయ రాష్ట్రాల ముఖ్యమంత్రుల నడుమ జరిగిన చర్చల విషయాన్ని ప్రస్తావిస్తూ ముఖ్యమంత్రి, రేవంత్ రెడ్డి తుమ్మిడిహట్టి ప్రాజెక్టు కోసం మహారాష్ట్రలో పర్యటిస్తానని తెలిపారు. ముఖ్యమంత్రుల సమావేశంలో మూడు అంశాలు పరిష్కారానికి వచ్చాయని తెలిపారు. బనకచర్ల సహా అన్ని అంశాలపై అధ్యయన కమిటీని వేశామని, కమిటీ పరిష్కరించలేని అంశాలపై ముఖ్య మంత్రుల స్థాయిలో మరో మారు చర్చిస్తామని చెప్పారు. 

నదుల అనుసంధానం కోసం కేంద్రం ప్రయత్నిస్తోందని, ఇచ్చంపల్లి నుంచి కావేరికి అనుసంధించాలనే ప్రతిపాదన ఉందని పేర్కొన్నారు. బీసీలకు 42శాతం రిజర్వేషన్ల అమలుపై తమకో వ్యూహం ఉందని రేవంత్ రెడ్డి తెలిపారు. 2018లో కేసీఆర్‌ పంచాయితీ రాజ్‌ చట్టంలో మార్పులు చేశారని, 50శాతం రిజర్వేషన్లు వద్దని చట్టంలో మార్పులు చేశారని, 2014 ముందు 34 శాతం ఉన్న రిజర్వేషన్లను 23 శాతానికి కుదించారని తెలిపారు. రిజర్వేషన్ల కుదింపును సవరిస్తూ ఆర్డినెన్స్ తీసుకొచ్చామని అన్నారు. ఆర్డినెన్సుపై అవగాహన లేకుండా చాలామంది మాట్లాడుతున్నారని ఆరోపించారు. ముస్లిం రిజర్వేషన్లు స్వాతంత్రం వచ్చినప్పటి నుంచే ఉన్నాయని, ముస్లింలకు బీసీ-ఇ గ్రూపులో రిజర్వేషన్లు ఉన్నాయని, బీజేపీ రాష్ట్రాల్లోనూ ముస్లింలకు రిజర్వేషన్లు అమలవుతున్నాయని చెప్పారు. గుజరాత్‌, యూపీ, మహారాష్ట్రలో ముస్లిం రిజర్వేషన్లు ఉన్నాయని గుర్తు చేశారు. బీజేపీ పాలిత రాష్ట్రాల్లో ముస్లిం రిజర్వేషన్లు ఎత్తేసిన తర్వాతే కిషన్‌రెడ్డి మాట్లాడాలని రేవంత్ రెడ్డి సూచించారు.


 

By
en-us Political News

  
సికింద్రాబాద్ లోని ఓ టెస్ట్ ట్యూబ్ బేబీ సెంటర్‌లో ఘరానా మోసం జరిగింది. పిల్లల కోసం ఆస్పత్రికి వచ్చిన మహిళకు భర్త కాకుండా మరో వ్యక్తి నుంచి వీర్యకణాలు సేకరించి, ఐవీఎఫ్‌ పద్ధతిలో ఆస్పత్రి సిబ్బంది పిండాన్ని అభివృద్ధి చేసినట్లు బాధిత మహిళ పోలీసులకు ఫిర్యాదు చేశారు.
ఏపీలో మావోయిస్టు అగ్ర దంపతులు సరెండర్ అయ్యారు. మావోయిస్ట్ పార్టీలో సుమారు 34 సంవత్సరాలు పైగా పని చేసిన సీనియర్ మావోయిస్టు జోరిగె నాగరాజు అలియాస్ కమలేశ్ ఆయన భార్య మేడక జ్యోతీశ్వరి అలియాస్ అరుణ ఆంధ్రప్రదేశ్‌లో పోలీసుల ఎదుట లొంగిపోయారు.
ఏపీ లిక్కర్ స్కామ్ కేసుకు సంబంధించి ఏపీ సిట్ అధికారులు హైదరాబాద్‌లో సోదాలు నిర్వహించారు. ఈ కేసులో నిందితుడు రాజ్ కసిరెడ్డి ఆఫీస్, భారతి సిమెంట్స్ కార్యాలయం, నానక్‌రామ్ గూడలోని చాణక్యకు చెందిన టీగ్రిల్ రెస్టారెంట్‌లో తనిఖీలు చేశారు.
తెలంగాణ జాగృతి సంస్థను రాజకీయంగా తీర్చిదిద్దేందుకు ఎమ్మెల్సీ కల్వకుంట్ల కవిత ప్రయత్నాలు మొదలు పెట్టారు. ఆగస్టు 6న ప్రొ.జయశంకర్ జయంతి సందర్భంగా రాష్ట్రవ్యాప్తంగా జంబో కమిటీలు వేయబోతున్నామని వెల్లడించారు.
బంగాళాఖాతంలో వాయుగుండం తీరం దాటింది. దీంతో ఏపీలోని కోస్తా జిల్లాలతో పాటు తెలంగాణకు వర్ష సూచన జారీ చేసింది వాతావరణ శాఖ. తేలికపాటి నుంచి మోస్తరు వానలు కురిసే అవకాశం ఉందని చెప్పింది.
అన్నవరం శ్రీ సత్యనారాయణ స్వామి దేవస్థానంలో ఇద్దరు అధికారులను సస్పెండ్ చేస్తూ ఆలయ ఈవో సుబ్బారావు శుక్రవారం ఆదేశాలు జారీ చేశారు. అంతేకాకుండా మరో ఐదుగురికి షోకాజు నోటీసులు ఇచ్చా
తెలంగాణలో పలు జిల్లాలకు హైదరాబాద్ వాతావరణ కేంద్రం అతి భారీ వర్ష సూచన చేసింది. ఇక, ఆదిలాబాద్‌, ఆసిఫాబాద్‌ జిల్లాల్లో భారీ నుంచి అతి భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని వాతావరణ శాఖ తెలిపింది.
ఓ వంక స్థానిక సంస్థల ఎన్నికలపై సందిగ్దత కొనసాగుతోంది. తెలంగాణ రాష్ట్ర హై కోర్టు ఆదేశించిన విధంగా సెప్టెంబర్ 30లోగా ఎన్నికల నిర్వహించడం సాధ్యమవుతుందా లేదా అనేది ఒకటైతే.. ఈలోగా 42 శాతం రిజర్వేషన్ వివాదం అటో ఇటో తేలుతుందా లేదా అనేది మరో చిక్కుముడి. నిజానికి.. హై కోర్టు విధించిన గడవులోగా ఎన్నికలు నిర్వహించం ఒక్కటే సమస్య అనుకుంటే అదసలు సమస్యే కాదు.
ప్రపంచంలో అత్యంత విశ్వసనీయ నేతగా భారత్ ప్రధాని నరేంద్రమోడీ మరోసారి టాప్‌లో నిలిచారు. అమెరికా ప్రెసిడెంట్‌గా రెండో సారి ఎన్నికైన డోనాల్డ్ ట్రంప్ విశ్వసనీయత ప్రపంచంలో ఎనిమిదో స్థానానికి పడిపోయింది.
బీఆర్‌ఎస్ వర్కింగ్ ప్రెసిండెట్ కేటీఆర్ అవగాహన లేకుండా మాట్లాడుతున్నారని ఎంపీ సీఎం రమేష్ ఆగ్రహం వ్యక్తం చేశారు. కేటీఆర్ చేసిన ఆరోపణలకు అనకాపల్లిలో మీడియా సమావేశంలో సీఎం రమేష్ సమాధానం ఇచ్చారు.
2024 ఎన్నికల ముందు మంగళవారం, అమావాస్య నాడు రాజమండ్రి సెంట్రల్ జైల్ ముందు కూటమి పై కీలక ప్రకటన చేశారు పవన్ కళ్యాణ్. అప్పట్లో అమావాస్య నాడు పవన్ చేసిన ఈ కూటమి ప్రకటనపై పులువురి నుంచి అభ్యంతరాలొచ్చాయి. కానీ ఫలితాల తర్వాత తేలింది ఏంటంటే పవన్ అమావాస్య సెంటిమెంట్ సూపర్ డూపర్ బంపర్ హిట్ అని.
వైసీపీలో పెద్ద సంక్షోభంలో కూరుకుపోతున్న సూచనలు కనిపిస్తున్నాయి. ఆ పార్టీలో పై నుంచి కింది దాకా సజ్జలపై తీవ్ర అసంతృప్తి పేరుకుపోతున్నది.తాడేపల్లి ప్యాలెస్ గుడ్ లుక్స్ లో ఉండటం వల్ల అది బహిర్గతం కావడం లేదని వైసీపీ నేతలే గుసగులాడుతున్నారు. అయితే మద్యం కుంభకోణంలో మిథున్ రెడ్డి అరెస్టు తరువాత ఆ పరిస్థితి చాలా వరకూ మారిపోయిందంటున్నారు.
ముఖ్యమంత్రి రేవంత్‌రెడ్డిపై అనుచిత వ్యాఖ్యలు చేసిన బీఆర్‌ఎస్ హుజురాబాద్ ఎమ్మెల్యే పాడి కౌశిక్ రెడ్డిపై కేసు నమోదైంది. బంజారాహిల్స్, రాజేంద్రనగర్. షాద్‌నగర్ పోలీసు స్టేషన్‌లో కాంగ్రెస్ శ్రేణుల ఫిర్యాదులతో బీఎన్ఎస్ 356(2),353(B)352 సెక్షన్ల కింద కేసు నమోదు చేశారు.
 
Disclaimer:
All content included on this TeluguOne.com Portal including text, graphics, images, videos and audio clips, is the property of ObjectOne Information Systems Ltd. or our associates, and protected by copyright laws. The collection, arrangement and assembly of all content on this portal/ related channels is the exclusive property of ObjectOne Information Systems Ltd. or our associates and protected copyright laws.
 
You may not copy, reproduce, distribute, publish, display, perform, modify, create derivative works, transmit, or in any other way exploit any part of copyrighted material without permission from ObjectOne Information Systems Ltd or our associates.